మంచం అంచుకు జరిగి ఇంకోవైపు తిరిగి పడుకున్నా. నా గుండె చప్పుడు నాకే పెద్దగా వినిపిస్తుంది. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. తన చేతులు నెమ్మదిగా వెనుక నుంచి నా చుట్టూ చుట్టుకున్నాయి. బలంగా తనలోకి అదుముకుంది. మెడపైన తను పెడుతున్న ఒక్కొక్క ముద్దులో కొద్దిగా కొద్దిగా నా విచక్షణ కరిగిపోయింది. గుండె ఇంకా పెద్దగా కొట్టుకుంది. చిన్నపాటి పెనుగులాట లోపల వీగిపోయింది. ఒక్కసారిగా తనవైపు తిరిగి ముద్దు పెట్టుకున్నా.
Category Archive: సంచికలు
అప్పుడు చూశాను ఆయన్ని. ఆయనకి ఎనభై ఏళ్ళంటే నమ్మడం కష్టం. అరవై యేళ్ళ మనిషిలా ఉన్నాడు. చక్కటి ముఖం – అందులో తేజస్సు. నన్ను చూడగానే కూర్చోబెట్టి ఆప్యాయంగా మాటలు మొదలుపెట్టాడు. “మా ఆవిడ…” ఎదురుగా సోఫాలో కూర్చున్న ఆవిడని చూపేడు. “షీ ఈజ్ ఫ్రమ్ మదురై. తమిళియనే అయినా తెలుగు కూడా బాగా నేర్చుకుంది…” ఆయన ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. కాసేపు కూర్చొని విన్నాను – మర్యాద కోసం.
కథ చెప్పుకోవడంలో ఎదురయ్యే సమస్యేమిటో, వాళ్ళు వెంటనే పసిగట్టగలిగారు. కొత్తగా ఒక కథను చెప్పడం మొదలుపెడితే మనచేతనే సృష్టించబడ్డ పాత్రధారులు పునఃసృష్టితో దేవుళ్ళుగా మారి ఎప్పుడు మళ్ళీ కథ లోపలికి ప్రవేశిస్తారో మనం ఖచ్చితంగా చెప్పలేం. వాళ్ళు మనల్ని చూసి నవ్వి, చేతులతో సైగ చేసి, మారీచుడిలా ఆశ చూపి కుట్ర చేసి ఎటో దూరంగా తీసుకెళ్ళిపోతారు. చిట్టచివరికి కుట్ర బయటపడేసరికి మనం సెలవు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతుంది.
మంచం మీంచి చూస్తున్న పాపకు తెరిచివున్న తలుపులో నుంచి, మసక చీకట్లో ఏదో రాచుకుంటున్న శబ్దంతో గుట్టుగా ఒక ఆకారం అటూ ఇటూ నెమ్మదిగా తిరగడం కనపడుతోంది. ఇప్పుడు సరిగా కనపడుతోందది; క్రమేపీ బూడిద రంగు మచ్చలా మారి చుట్టూ వున్న చీకట్లో కలిసిపోయింది. రాచుకుంటున్న శబ్దం ఆగిపోయింది. దగ్గర్లో చెక్క నేల కిర్రుమన్న శబ్దం. దూరాన మళ్ళీ అదే శబ్దం… అంతా నిశ్శబ్దం. ఆ ఆకారం న్యాన్యా అని అర్థమైంది. న్యాన్యా వ్రతంలో ఉంది.
ఆ వస్తువులన్నిటిని క్షిప్ర అంతకు ముందు కూడా చూసింది. కానీ ఇప్పుడు అవి మరీ కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తార భర్త వాటన్నిటిని క్షణంలో బయట పారేస్తాడేమో. తార తన హృదయంలో ఎన్నో అవమానాలను పెట్టుకొని భరించింది. ‘ఒకరోజున ఇవన్నీ సర్దుతాను అనుకుంటాం. కానీ, వాటిని అలాగే వదిలి ఎకాయెకిన చెప్పాపెట్టకుండా ఈ లోకాన్ని వదులుతాం.’ తార పార్థివశరీరం ముందు నిలబడగానే క్షిప్రకు ఈ ఆలోచన మనసులో మెదిలింది.
తెరచిన కిటికీ దగ్గర
ఎదురు చూస్తూ వుంటాను
నడికట్టు కట్టుకోకుండా,
దుస్తులు వదులుగా.
ఆ చిరుగాలులు తేలిగ్గా ఈ
పల్చని బట్టలు ఎగరగొట్టగలవు.
మిగిల్చే శూన్యాలను లెక్కగడితే
కూలిన మనిషీ
విరిగిన చెట్టూ రెండూ ఒక్కటే
మనిషి సంగతేమో కానీ
నేల ప్రతి ప్రార్థనా వింటుంది
ఎక్కడినుంచి చేదుకుందో పచ్చదనాన్ని
చిగురై కళ్ళు తెరిచింది
కొలనులో జాబిలిని
అందుకుందామని
కొమ్మ వంగుతుంది
ఆశల నది పారుతూనే ఉంటుంది
ఎక్కడ ఆనకట్ట వేయాలో
తెలుసుకోవడంలోనే ఉంది
కిటుకంతా
దీర్ఘ వృత్తాకార కక్ష్యల మార్గం
పళ్ళెం నిండా పర్వతాల ఆకృతి
దేహమంతా తీయని కన్నులు
మన్ను ఒక ముక్కగా
మిన్ను ఇంకో ముక్కగా గల
రెండు చందమామల సంగమం
నేను పాడాలనుకున్నది
ఒక్కగానొక్క పాట!
నూతిలోకి జారి
కావులో కూరుకుపోయే నీటిపిల్లిలా*
గొంతు దాటనీయవు
ఒడ్డు చేరనీయవు
రవీంద్ర సాహిత్యంలో అడుగడుగడునా పిల్లల లోకంలోని అభూతకల్పనలు, అద్భుత సాహసాలు కనబడతాయి. ప్రాచీన గాథలెన్నో సరికొత్త రూపురేఖలతో పలకరిస్తాయి. రాకుమారులు, రాకుమార్తెలు, ఇచ్ఛాపూరణ్ ఠాకురాణీలు, నిద్రాదేవతలు, అప్సరసలు, యక్షులకు కొదవలేదు. కుట్రలు కుతంత్రాలు మంత్రాంగాలు, గూడు పుఠాణీలు, వాటిని భగ్నం చేసే చాతుర్యం కలిగిన కథానాయకుల ప్రస్తావన సంగతి సరేసరి.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
అడ్డం కాళ్ళకు ధరించే అలంకార విశేషం సమాధానం: అందియ వింత వెదురుగడ పరిణాహం సమాధానం: వింగడం దుకాణం వంక వెళితే సంకేతస్థలం సమాధానం: కందువ […]
క్రితం సంచికలోని గడినుడి-91కి మొదటి ఇరవై రోజుల్లో ముప్పై మంది సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
ఈ సంచికలో కొత్త గడినుడి లేదు. గడినుడిని మరింత ఆసక్తికరంగా చేయడానికి కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాము. అసౌకర్యానికి క్షమాపణలు.
గడి నుడి-91 సమాధానాలు.
తెలుగులో ప్రస్తుతం స్థూలంగా రెండు రకాల కవులున్నారు. ఒకరు తమను తాము సామాజిక చైతన్యంతో అభ్యుదయవాదులుగా ఊహించుకుంటూ రచనలు చేసేవారు. రెండవవారు, తమ తమ ఆంతరంగిక, ప్రాకృతిక జగత్తులోనుండి కవిత్వం వ్రాసుకునేవారు. చిత్రంగా, ఈ రెండు కోవలకు చెందినవాళ్ళు ఒకరి కవితలను ఒకరు ప్రశంసించడం కనపడదు. వారికి వీరు కవులుగా వీరికి వారిది కవిత్వంగా అనిపించదేమో. కవులు అని ఎవరిని అనాలి? కవిత్వం వ్రాసిన వాళ్ళని అనాలి. అప్పుడు వాళ్ళ రచనలో మనం ఏం చూడాలి? వస్తువులో, అభివ్యక్తిలో కొత్తదనం, భావం, అనుభూతి సాంద్రత – ఒక్కమాటలో, కవిత్వాన్ని చూడాలి. తమ అనుభవాలను, ఆవేశాలను కవిత్వంగా మార్చదలచినవాళ్ళు ఆ పని నేర్పుగా చెయ్యగలిగితే అది వేరే సంగతి. కానీ ఏదో ఒక భావజాలానికో భావుకతకో చెందాలనే ఆరాటంలో, తమ అభ్యుదయాన్ని లేదా అనుభూతిని ప్రకటించుకోవాలన్న తొందరలో వ్రాసేవి కృతకమైన రాతలు, కవితలు కావవి. అంటే, కవిత ఎత్తుగడతో సంబంధం లేకుండా ప్రయత్నపూర్వకంగా చొప్పించే భావుకత, వెలిబుచ్చే ఆవేశం కవితని బలోపేతం చెయ్యవు. మరొకలా చెప్పాలంటే, నిజాయితీ లేమి కవితలను నిర్జీవం చేస్తుంది. ఒక కవిత/రచన పాఠకులను చదివించలేకపోతే, ఆలోచించనీయకపోతే, వారు దానితో కాసేపైనా మమేకం కాలేకపోతే, ఎవరికోసమైతే వ్రాశారో వారితో సహా ఎవ్వరికీ అందకుండా అది ఒక వ్యర్థప్రయత్నంగా మిగిలిపోతుంది. అసహనం, ఆవేశం, అనురాగం, సున్నితత్వం–ఇవేమీ తప్పులు కాదు, కవులకు రచయితలకూ ఉండకూడనివీ కావు. కాని, ఒక రచనకు ఇవి ముడిసరుకులు మాత్రమే. వీటిని కథగా కవితగా మలచాలంటే పరిశ్రమ కావాలి. రచయిత చూపు పక్కకు చెదరకుండా, రచన ఆసాంతం ఆ బిగి సడలకుండా ఉండాలి. తనకు తెలిసినదల్లా, తాను అనుభవించినదల్లా చెప్పాలనే అత్యుత్సాహం, ఒకే అంశం మీద నిలబడి మాట్లాడలేని అసహనం వదలాలి. అట్లా మాట్లాడేందుకు తగిన సరుకు పోగుచేసుకునేందుకు కృషి చేయాలి. ఎందుకంటే సమస్య ఎంత జటిలమైనదయినా, అనుభూతి ఎంత లోతయినదయినా అది పాఠకుల దగ్గరకు చేరకపోతే ఆ రచనకు విలువ లేదు. కవితలో కేవలం స్పందనే కాదు, అది ప్రకటించడంలో కొంత వివేచన కూడా ఉండాలి. ఆ వివేచన ఊతంగానే పాఠకుడు రచనను, రచన పాఠకుడిని పట్టుకుని ఉండగలిగేది. ప్రస్తుత తెలుగు సమాజంలో కవిత్వానికి విలువ తగ్గిపోయింది, కవులంటే హేళన పెరిగిపోయిందీ కవిత్వాభిమానులు లేకనో, కవిత్వాభిరుచి పోయో కాదు. కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని మోస్తున్నవారు, కవులమని చెప్పుకుంటూ అకవిత్వాన్ని ప్రచురిస్తున్నవారు ఇందుకు కారకులు. తాము వ్రాసిందంతా కవిత్వమనుకునే వారి వెర్రి ధోరణి దీనికి కారణం. కవిత్వం వ్రాయాలీ అంటే ముందు కవిత్వం చదవడం నేర్చుకోవాలి. ఒక కవితను కూలంకషంగా చదివి విశ్లేషించగలగాలి. దానిలోని లోతుపాతులు బేరీజు వేయగలగాలి. కవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా, భావస్ఫోరకంగా ప్రకటించగలిగాడో లేదో, తన ఆశయంలో కృతకృత్యుడు కాగలిగాడో లేదో గమనించగలగాలి. ఇలాంటి శ్రమతో మాత్రమే ఏది ఏ స్థాయి కవిత్వమో బోధపడుతుంది. కనుక కవులారా, మీరు వ్రాసిన ఏ కవితనయినా అందులో వస్తువు కొత్తదనం ఏమాత్రం, పోలికలలో కొత్తవి ఎన్ని, అభివ్యక్తిలో నవ్యత ఎంత, అన్న మూడు ప్రశ్నలతో సరి చూసుకోండి. కవిత్వానికి కొలమానాలు ఉండవు లాంటి మాటలు ఉట్టి అపోహలు. అవి బలిమి ఉన్న కవిత్వాలకు. మీరు భేషుగ్గా మీ మీ కవిత్వాలను కొలిచి చూసుకోండి. మీ కవిత్వం ఏదో ఒక స్థాయికి తూగే దాకా మిమ్మల్ని మీరు కవులు అని చెప్పుకోవడానికి సంశయించండి. కవిత్వాన్ని కొలవగల తూనికరాళ్ళు లేకపోలేదు, గుర్తుంచుకోండి.
ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.
సాయంత్రం కాగానే రాత్రంతా బాగా చదవాలని ఒకరికొకరం ప్రమాణాలు చేసుకుని మిద్దె మీద చేరేవాళ్ళం. పుస్తకాలు ఇక తెరుద్దాము అనుకుంటుండగానే కొత్తగా పెళ్ళయిన జంటలు, పెళ్ళి పాతబడిన జంటలు కూడా వారి వారి మేడల మీదికి దిండూ పరుపులతో సహా ఎక్కేవారు. వారికి మేము కనపడేవాళ్ళం కాదు. వాళ్ళు మాకు కనపడేవారు.
2019లో ఒక అభిప్రాయవేదికని నిర్వహించిన అమెరికన్ పాత్రికేయుడు బ్రెట్ స్టీవెన్, విలా కేథర్ని డానల్డ్ ట్రంప్కు ఆంటీడోట్గా పేర్కొన్నాడు. అమెరికాను గొప్ప దేశంగా చేసే లక్షణాలేమిటో విలా నవలలు చెబుతాయని విమర్శకులు ప్రశంసించారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు విలా కేథర్ని చదవాలను గుర్తుచేశాయని అన్నా తప్పులేదు.
కీర్తనల్ని వాగ్గేయకారులు పాడుతూనే రచిస్తున్నారు. త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసూ తమ కీర్తనల్ని పాడేశారు గాని, సాహిత్యం ముందు కట్టుకుని స్వరములు వేరే కట్టుకోలేదు. అంటే, కీర్తనలోని రాగం అసలుతో చేరే బయటపడుతోందని నా అభిప్రాయం. కీర్తనలోని రాగం పుట్టుకతోనే ఉంది. అల్లాగే పద్యాలతో చేరి రాగాలు రావడము లేదు. వివరంగా మనవి చేస్తున్నా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రాగంలో పద్యాల్ని పాడుకున్నట్లు చెప్పేను.