పదడుగులేశి తలెత్తి సూస్తే, గుడి బెమ్మాండంగ కనిపించింది. విక్కీ అరిశినాడు, “తాతోవ్! అదో గుడి!” వాడి సంతోసాన్ని సూసి అన్వర్ తాతకి కొంచెం నిమ్మతైంది. “పదా. మనకి వణ్ణాలేశేవాళ్ళు వుండారా సూస్తాం.” అని గబగబా నడిశినారిద్దురూ. నిజ్జింగా శానామంది బక్తులుకి వణ్ణాలొండి వడ్డిస్తా వుండారక్కడ. కడుపు నిండా మెతుకు తిని ఎన్ని దినాలైందో, విక్కీ, తాతా లచ్చెనంగా బోంచేశినారు. వొస్తా పోతా వుండే జనాన్ని ఒక జాగాలో కూకోని సూస్తా వుంటే, టైమెట్లనో పూడేడ్శింది.
Category Archive: సంచికలు
రెండవ సర్గలో తొమ్మిదవ శ్లోకం నుండి పదిహేనవ శ్లోకం వరకూ తెలుగు ప్రతిపదార్థాల దగ్గిర నా చదువు కుంటుపడింది. రెండు క్రౌంచపక్షులు, రతిక్రీడలో పారవశ్యంతో ఆనందిస్తూ వుండగా ఒక బోయవాడు (నిషాదుడు) మొగ క్రౌంచపక్షిని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అది చూసి వాల్మీకి శోకించి ‘మానిషాద’ అని మొదలు పెట్టి బోయవాడిని శపిస్తాడు. ఈ శ్లోకం సంస్కృతసాహిత్యంలో మొట్టమొదటి శ్లోకంగా పరిగణిస్తారు.
మార్నింగ్ వాక్లో ఎదురు వచ్చేవాళ్ళకు విషెస్ చెప్పేటప్పుడు అందరిలాగానే అతను కూడా కళ్ళల్లోకి చూస్తాడు గానీ అతనితో కొన్ని రోజులుగా ఆ అలవాటు కొనసాగుతూండడం గూర్చి ఆమె కొద్దిగా సంకోచించి తల దించుకున్న రోజే ఎదురుగా వచ్చిన అతని మాటలు తనని దాటిన తరువాతే చెవిని చేరాయని గ్రహించి తల తిప్పి చూసేసరికి అతను వేగంగా పరుగెత్తుతూ కనిపించాడు. “పోటీలకి తయారయే వయసు మించిపోలేదా?” అనుకుని ఆశ్చర్యపోయింది.
చెమటలు కక్కుకుంటూ బయటకు పరిగెత్తాను. కాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మెలమెల్లగా నాలో తార్కిక చింతన తిరిగి మొదలై అంతా నా భ్రాంతేనని అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాను. గది లోపలికి వెళ్ళడానికి భయమేసింది. వరండాలోనే పడుకున్నాను. మా వీధి చాలా వెడల్పుగా ఉంటుంది. చక్కగా గాలి వీస్తుంది. అలసిపోయి ఉండటంతో నిద్రపోయాను. ఎదురింటి కుక్క వరండా కింద పడుకుని ఉంది.
ఆ గుడారం బయట కాపలా కాస్తూ, ఆ సంభాషణంతా వింటున్న ఓ భటుడు, ద్రోణుడు నిద్రకి ఉపక్రమించాడని నిర్థారించుకున్నాక, మెల్లగా గుడారం వెనకున్న అడవిలోకి నడిచాడు. కొంత దూరం వెళ్ళాక ఓ చోట ఆగి, చెయ్యి పైకెత్తి మెల్లగా ఈల వేయడం మొదలుపెట్టాడు. కొంత సేపటికి ఓ గద్ద రివ్వున ఎగురుకుంటూ వచ్చి అతడి చెయ్యి మీద వాలింది. దాన్ని సంతోషంగా నిమురుతూ, తన భుజానికున్న ఎర్ర తాయత్తుని తీసి దాని కాలికి కట్టాడు.
ఇట్లా ఉండగా జనవరి 12వ తేదీనాడు తెల్లవారి గుజరాతి పత్రికను తెరచినపుడు Demonetization శాననపు పిడుగు దొంగ వ్యాపారులు, లంచగొండులు అందరికీ సోకినట్లే అతనికి హఠాత్తుగా సోకెను. ‘500 రూ॥లకు పైన విలువగల నోట్లన్నీ రద్దు’ అనే పెద్ద అక్షరాల శీర్షిక కండ్లలో పడగానే పిలానికి తల తిరిగి కన్నులు చీకట్లు క్రమ్మెను. గుండెలు దడదడ లాడెను. శ్వాస నిలిచిపోయెను. చేతులు వణికి పత్రిక పడిపోయెను.
ఇండియాలో ఉన్న 1,500 మిలియన్ల జనాభాలో దరిదాపు 80 మిలియన్ల వయోజనులు అనగా (వయస్సు 20-79), నూరింట ఐదుగురు, మధుమేహం బారిన పడుతున్నారనిన్నీ, అందుకే ప్రపంచంలో ‘మధుమేహానికి ఇండియా ముఖ్యపట్నం’ అని ఇటీవల అనడం మొదలు పెట్టేరు! అతి రక్తపు పోటు విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది
భిక్షాటన, ముష్టి అనే ఈ రెండింటికి తేడా ఉంది. ప్రపంచంలో ఉన్నవన్నీ వదులుకుని, బతకడానికి కావాల్సినది మాత్రమే తీసుకునేది భిక్షాటన. ముష్టి అనేది ‘నాకింకా కావాలి’ అనుకుంటూ ఎంత ఉన్నా కూడబెట్టుకునేది. ముష్టివాడికి తన దగ్గిర డబ్బు ఉందా లేదా, అనేవన్నీ అనవసరం. ఆవురావుమని ఇచ్చినదంతా తీసుకోవడమే పని. ఈ ముష్టి ఎత్తేవాళ్ళు అత్యంత ధనవంతుల నుంచి అతి బీదవారి వరకూ ఉన్నారు. ముష్టి ఎత్తే సరుకు ఒకటే తేడా.
సంస్కృతములో మాఘునివలె, వేంకటాధ్వరివలె నొక ఆశ్వాసము నంతయు యమకాలంకారమయముగా చేసిన కవులు తెలుగులో నరుదుగా నున్నారు. అట్టివారిలో చంద్రికాపరిణయప్రబంధకర్త యగు సురభిమాధవరాయలు ముఖ్యుఁడు.ఇతఁడీ ప్రబంధములోని చతుర్థాశ్వాసమునంతయు యమకాలంకార మయము చేసినాడు.
మాట్లాడకు
ప్రపంచం యోగనిద్రలో
మలిగింది
ఉత్తరదిక్కున
అరోరా బొరియాలిస్
మేల్కొంటోంది.
నింగికి తెలియకుండా
కొన్ని నక్షత్రాలను
తలగడ కింద దాచేదాన్ని
జాబిలి చూడకుండా
గుప్పెట నిండా
వెన్నెలను నింపుకుని
రుమాలులో మూటగట్టేదాన్ని
పులియని రొట్టెల పండుగ ముంచుకొచ్చెను
ఇక ప్రథమ ఫలముల పండుగ తప్పనిసరి కాగా
తదుపరి బూరల పండుగను సందడి కూడా ఆయెను.
ఆపైన, ప్రాయశ్చిత్తార్థ దినమునకు తావులేక
పస్కా పండుగకూ తెర తీయబడెను
ఆశీర్వాద పండుగలు అనివార్యమయ్యెను.
గాలివాటపు జీవనం.
ఆడంబరాల హోరు,
యవ్వనం మెఱుఁగులు
చెరిగిపోయే మెరుపులు.
సమయజ్ఞానంతో
బిరాన ఎంచుకో నీదైన క్షణం.
ఈ కథలో ఇద్దరు మగవాళ్ళూ హెమింగ్వే రెండు రూపాలు. ఏ మాత్రం అడవి జంతువుకు బెదరని, స్త్రీ ని నిక్కచ్చిగా అంచనా వేయగల విల్సన్లో ఒక హెమింగ్వే ఉంటాడు. మృత్యుభయం వదలనివాడు, క్షణక్షణం తన స్త్రీ ముఖకవళికలను గమనిస్తుండే బలహీనుడు, భార్య ఎంత ప్రమాదకరురాలో తెలిసీ ఆమె లేనిది తనకు జీవితం లేదని అనుకునే నిస్సహాయుడు ఫ్రాన్సిస్ లోనూ రచయిత పూర్వానుభవాల ఛాయలు లేకపోలేదు.
మనం సాధారణంగా ఇగ్నోర్ చేసే వ్యక్తులు, పరిసరాలు అంటే ఒక చిన్న ఆడపిల్ల, ఒక చిన్న ఊరిలో ప్రాథమిక పాఠశాల, రిటైర్డ్ సేల్స్మన్ – ఇలాంటి వారి జీవితాలని జాగ్రత్తగా చూసి, ఆమె వారి గురించి వ్రాసింది. ఆమె వాళ్ళ జీవితాలను సీరియస్గా తీసుకుంది. అందువల్ల, ఒక్కొక్కసారి వారి పాత్రలు వారి కంటే పెద్దవిగా, ఘనంగా కనిపిస్తాయి. అది, కాల్పనిక సాహిత్యంలో మన్రో చేసిన గొప్ప పని. నిజం చెప్పాలంటే, ఆవిడ రాసిన ప్రతి ఒక్క కథా ఒక నవలగా మలచవచ్చు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
కళాసృజన ఒక ప్రవాహం. అన్ని పాయలనూ కలుపుకుంటూ, కొత్త మార్గాలను అన్వేషిస్తూ సాగే నిరంతర ప్రయాణం. ఏ కళాకారుడూ శూన్యంలోనుంచి కొత్తకళను సృష్టించలేడు. ఈ ప్రపంచాన్ని మన ప్రాచీనులనుంచి, సమకాలీనుల దాకా ఎందరో ఎన్నో రకాలుగా విశ్లేషించారు, విశ్లేషిస్తున్నారు, ఎవరెవరు ఎన్నివిధాలుగా పరిశీలిస్తున్నారో ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుంటున్నారు. కళలయినా, తత్త్వచింతనయినా, శాస్త్రపాఠాలయినా ముందు అప్పటిదాకా ఇతరులు కూడబెట్టిన అనుభవజ్ఞానాన్ని నేర్చుకొని, దానికి తమ వంతు జోడించడమే సిసలయిన అభ్యుదయం. శిల్పులు, చిత్రకారులు, సంగీతకారులు, శాస్త్రజ్ఞులు – ఇలా ఏ కళలో రాణించాలనుకునే వారైనా, ముందు ఆ కళలో ఉన్న మెళకువలను, పద్ధతులను, పరిశోధనలనూ గమనిస్తారు. అప్పటిదాకా వచ్చిన విభిన్న ధృక్పథాలను, విప్లవాలనూ చదువుతారు, విద్యలా అభ్యసిస్తారు. ఇలా విస్తారంగా ఆ చరిత్రను ఆకళింపు చేసుకొని, ఆ విజ్ఞానంతో తమ కళను మరింత మెరుగు పరుచుకుంటారు. సాహిత్యమూ నిజానికి ఇలాగే ఎదగాలి. కానీ దురదృష్టవశాత్తూ తెలుగులో రచయితలకు చదవడం, నేర్చుకోవడం అన్నది ఎందుకో పడదు. వారిలో తమకు తెలిసింది చెప్పాలన్న తపన తప్ప, తమకు తెలియనిది తెలుసుకోవాలన్న తృష్ణ కాని, తాము చెప్పే తీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చు అన్న ఆలోచన, పరిశ్రమ కానీ ఒక పట్టాన కనపడవు. ఎక్కువ పుస్తకాలు చదివితే, ఆయా రచయితల ప్రభావం తమ మీద పడిపోతుందని, తమకంటూ సృష్టించుకున్న శైలి ఏదో పాడైపోతుందన్న అపోహల్లో మగ్గిపోతూ ఉంటారు. ఇవి నిజంగా అపోహలో కుంటిసాకులో చెప్పడం కూడా కష్టమే. భిన్నంగా రాయాలన్న తపనను అర్థం చేసుకోవచ్చు కానీ తామే భిన్నమన్న భ్రమలో బ్రతికే తత్వాన్ని – అజ్ఞానమో, అహంకారమో – ఎలా అర్థం చేసుకోగలం! సాహిత్యపు మౌలికప్రయోజనం ఏమిటంటే అది ప్రపంచాన్ని వేరేవాళ్ళ కళ్ళతో చూడనిస్తుంది. ఇది పాఠకులకే కాదు, రచయితలకూ వర్తిస్తుంది. నచ్చిన దృక్పథాన్ని, నచ్చనిదానినీ కూడా సమాపేక్షతో చూడలేనివారు మంచి రచయితలు కాలేరని; ప్రతీ సమస్యకూ తక్షణ, తాత్కాలిక తీర్పులు ఉండవని; తప్పూ ఒప్పులకు ఆవల సందర్భమూ అవసరమూ అనేవి కూడా ఉంటాయని రచయితలు కేవలం విస్తారంగా చదవగలగడం ద్వారానే నేర్చుకోగలరు. మానవజీవితపు సంక్లిష్టతను అర్థం చేసుకోగలరు. ప్రపంచంలో ఏ మూలలోనైనా ఏ మనిషికైనా దొరికేవి అవే కొన్ని సత్యాలు, విలువలు, ఆదర్శాలు అనే మెలకువలోకి రాగలరు. చెప్పదలచుకున్న విషయాన్ని లోతుగా కూలంకషంగా అర్థం చేసుకొని, దానికి సరిపోయిన కథనాన్నివ్వగలరు. రచనను విజయవంతంగా పాఠకులకు చేర్చగలరు. ఈ సాధన, నైపుణ్యత, వివేచన, విజ్ఞానం, విశ్లేషణ ఇవన్నీ రచయితలకు తప్పక ఉండవల్సిన పరికరాలు. ఇవేమీ లేకుండా సహజాతంగానో, అభ్యాసపూర్వకంగానో కేవలం చదివించగల వాక్యం వ్రాయడం అలవడినంత మాత్రాన ఎవరూ మంచి రచయితలు కాలేరు. రకరకాల సాధనాలతో ప్రస్తుతం నిండుగా ఉండాల్సిన తెలుగు రచయితల సంచీలలో శుక్లాలు కమ్మిన ఒంటికంటి కలం ఒక్కటే పనిముట్టుగా కనిపిస్తోంది. తరువాతి తరాలకు సాహిత్యకారులు చివరికి ఏది చేయకూడదో చెప్పే ఉదాహరణలుగా మాత్రమే మిగిలిపోవడం కనిపిస్తోంది.
క్వెన్క నుంచి గుయాకీల్ 250 కిలోమీటర్లు. మధ్యలో ఒకచోట విరామం కోసం ఆగాం, అంతే. అంతా కలసి ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టింది. దారంతా వర్షం – బయట అసలేమీ కనిపించనంత వర్షం. క్వెన్క వదిలీ వదలగానే రోడ్డు ఆండీస్ పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సాగింది.
అసలు కవిత్వమూ, గానమూ వేర్వేరు కళలు. పద్యమూ, రాగమూ ఈ వేర్వేరు కళలకి సంబంధించినవి కాబట్టి అవీ వేర్వేరే గాని చేరిక గలవి కావు. “సంగీతమపి సాహిత్యం సరస్వత్వాః కుచద్వయం” అంటే రెండూ ఎప్పుడూ కలిసే వుండాలి అనే అర్థము కాదేమో అంటాను. రాగానికి సాహిత్యం లేదు, మిలిటరీ బ్యాండుకి లేదు, శ్రీకృష్ణుని వేణుగానానికీ లేదు. అలాగే గద్యలో రాగం లేదు. ఏకవీర, మాలపల్లి నవలల్లో గొప్ప కవిత్వము ఉంది. రాగము లేదు.
వీడుకోలు సమయంలో నవ్వుతూ నవ్విస్తూ బాగానే నటించావు. బండి కదిలాకే ఇక నటించాల్సిన అవసరం లేకపోయింది. గుండెల్లో తడి కాస్త ముఖంలోంచి ఆవిరవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఓ రెండుసార్లు లేచి మొహం కడుక్కొని వచ్చావు. ఇదంతా చూసి చూడనట్లు చూస్తునే వున్నాడు నీ ఎదుటి సీట్లో కుర్రాడు. ఆ అంట కత్తెర క్రాఫ్ వాడు. నీలాంటి దుస్తులే వేసుకున్నవాడు. చెలిమి చేసే ప్రయత్నంలో ఊర్లు, పేర్లు కలబోసి భయ్యా అంటూ వరస కూడా కలిపాడు.