అనుపమకు స్కూల్ ఫైనల్ చదువుతుండగా కళ్ళు మండుతుంటే వేడి చేసిందేమో అనుకుంటే ఒకకన్ను పోయి, మరో కన్ను కూడా మసకేసి క్రమంగా పోయే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది. అన్నీ సక్రమంగా అమరివున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు జరగటం కష్టమైన రోజుల్లో ఒకలోపం ఉన్నప్పుడు పెళ్ళికావటం కష్టం అనే పరిస్థితులు ఆనాడు. సహజంగానే అనుపమని చూసుకునేందుకు పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకులు ఆమె చెల్లిని చేసుకుంటాననే రోజులు కూడా ఆనాడు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? ఇది ఆథెన్స్ నగరవీధులలో తిరుగుతూ ప్రజానీకాన్ని జవాబుల కోసం తడుముకునేలా చేసిన గ్రీకు తత్త్వవేత్త సోక్రటీస్ అడిగిన ప్రశ్నల లాంటి ప్రశ్న. ప్రతీవారికీ ఇబ్బంది కలిగించే ప్రశ్న. ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవలసిన చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏ విలువలకు లోబడి జీవించాలి? ఏ ఆదర్శాలకు నిలబడుతూ జీవించాలి? ఎలాంటి వ్యక్తిగా జీవించాలి? దేని కోసం పాటుపడాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలు ప్రతి మనిషికీ భిన్నంగా ఉంటాయి. ఆ జవాబులు ఏ మనిషికైనా వాళ్ళ మనసుల లోతులలోనుండే దొరకాలి, దొరుకుతాయి. ఈ రకమైన ఆత్మపరిశీలన చేసుకోని వ్యక్తి, సమాధానాలకై సంఘర్షణకు లోను కాని వ్యక్తి తనను తాను స్పష్టంగా, సంపూర్ణంగా అర్థం చేసుకోలేడు. తన పట్ల తనకే స్పష్టత లేని వ్యక్తికి తన చుట్టూ ఉన్న సమాజం పట్ల కూడా స్పష్టత ఉండదు. అటువంటి వ్యక్తిత్వంతో తన పట్ల తనకే లేని నిజాయితీ ప్రపంచం పట్ల చూపగల అవకాశమూ లేదు. ఎన్నో కోణాలనుంచి తనను తాను అర్థం చేసుకొని తన బలాలు, బలహీనతలు విచారించుకోలేని వ్యక్తి, ప్రపంచాన్ని కూడా అదే కురచ చూపుతో కొలిచే ప్రయత్నం చేస్తాడు. ఎంతో సంక్లిష్టమైన మానవజీవితాన్ని, సామాజిక చలనాన్ని కేవలం కామెర్ల ఒంటికంటితోటే చూస్తాడు. తన చూపే నిజమని బుకాయించుకుంటాడు. మంచి చెడు అన్న ఒక అత్యంత బలహీనమైన కొలమానం మాత్రమే ఇటువంటి మనిషికి వాడటం తెలిసిన పనిముట్టు అవుతుంది, ఆ మంచి చెడు అన్నవాటి నిర్వచనాల పట్ల ఏమాత్రం స్పష్టత లేకున్నా, అవి స్వార్ధాన్ని, సందర్భాన్ని పట్టి మారుతునే ఉన్నా. వీటిని దాటిన ఆలోచన, ఆ ఆలోచనకు కావలసిన పరిశ్రమ, ఆ పరిశ్రమకు తోడు కావల్సిన సహానుభూతి, జీవితానుభవం ఇవేమీ ఈ తరహా మనుషుల నుండి ఆశించలేము. అందుకే, నేను నా జీవితాన్ని ఎలా జీవించాలి? అన్న ప్రశ్న జోలికి ఈ సమాజంలో అత్యధికులు ఎప్పుడూ పోరు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న సమాజం నిర్ణయించిన నడతకు, నిర్దేశించిన విలువలకూ కట్టుబడి ఉండటంలో తృప్తిగా వుంటారు. సమూహంలో ఒకరుగా జీవిస్తారు. తోలుబొమ్మలలాగా సమాజం ఎలా ఆడిస్తే అలా ఆడతారు. వారి వలన మార్పు, అభ్యుదయం ఉండదు. సమాజచైతన్యం ఉండదు. కానీ ఇవి లేనిదే మనిషికి మనుగడ లేదు, ముందడుగు లేదు. తార్కికమైన వివేచన విచక్షణలు ఒక సంపూర్ణజీవితానికి అవసరమని, ఆత్మపరిశీలన చేసుకోని బ్రతుకు బ్రతుకే కాదని ఎన్నో శతాబ్దాల మునుపే ప్రతిపాదించిన ఆ సోక్రటీస్ ప్రశ్నలు ఇప్పటికీ మనమధ్య సజీవంగా, ఒక అవసరంగా ఉండటానికి కారణం ఇదే. ఈ రకమైన పరిశీలన సమాజపు నడతకు లోబడినవారికి అనవసరం అనిపించవచ్చు. కాని, సమాజంలో మార్పు కోరేవారికి, అభ్యుదయాన్ని ఆశించేవారికి, ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టం కావడం అవసరం. సంగీతసాహిత్య చిత్రలేఖనాది కళలను అభ్యసించే కళాకారులకు ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం అవసరం. తమకు సామాజిక బాధ్యత ఉన్నది అని నమ్మే తెలుగు రచయితలు ఈ రకమైన ప్రశ్నలతో తమను తాము పరిశీలించుకోవడం, తమ సాహిత్యాన్ని ఆ వివేచనతో సమీపించడం అత్యవసరం.

ఆ ఇంటి రోడ్డు మలుపు తిరిగి పుస్తకం తెరిచి చదువుకుంటూ బడి దారి నడుస్తున్నానా. చదివే కొద్దీ ఒళ్ళంతా భయం, తిమ్మిరి. సల్లాడం వేడిగా, బిర్రుగా. ఒక్కసారి పుస్తకం మూసిపడేసి మా స్కూలు వెళ్ళే అడ్డదారి పట్టా. మనిషినంతా అదోలా అయిపోయా. అక్కడంతా కంపచెట్లు ఎక్కువ. భయంలో కూడా ఏదో గమ్మత్తు ఉంది ఆ రచనలో.

పట్నాలు – ప్రేమలు: మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం.

డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్‌కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు.

సుందరి దగ్గరికి వచ్చి నిల్చుంది. అరవడం మొదలుపెట్టింది. నేను నాన్న కళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆయన కళ్ళు క్రూరత్వాన్ని, కోపాన్ని, పశ్చాత్తాపాన్ని ఏకకాలంలో చూపిస్తున్నాయి. నేను మాట్లాడకుండా ఉండడం గమనించిన సుందరి ఇంకా కోపంగా అరిచింది. నాన్న ఇప్పుడు ఉరిమి చూశాడు. ఆయన కళ్ళను చూసే ధైర్యంలేక నేను తలవంచుకున్నాను. ఒళ్ళంతా కరెంటు పాకుతున్నట్టు అనిపించింది. నాన్న కోపంగా లేచి నిల్చుని అరుస్తున్నాడు. సుందరి ఎడమవైపు నిలుచుని అరుస్తుంది.

ఆ గదిలో దీవాన్ వంటి దాని మీద తెల్లని పరుపు, పరుపుపై తెల్ల దిండు. పక్కన ఒక వార్నీష్డ్ చెక్కబల్ల, దానిమీద ఒక ఎర్రని పానాసోనిక్ టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఆ ఇంట్లో మనుషులు ఎవరూ కనబడేవారు కాదు. ఆ ఇంటిముందు నిలబడి నేను ఆ టేప్ రికార్డర్ కేసి ఇష్టంగా చూసేవాణ్ణి.

ఏం ఆశలని అడుగుతాడేమో అనుకున్నా. కానీ అడగలేదు. అతను మౌనంగా ఉండిపోవడం వెనుక నిరసన అర్థమవుతూనే ఉంది నాకు. వెళ్ళేదారిలో రోడ్ పక్కన కారు ఆపి మూర్తి టీ తెచ్చాడు. ఇద్దరం తాగాం. మూర్తి నా ఇష్టాయిష్టాలు ఒక్కటీ మర్చిపోకపోవడం ఎక్కడో కించిత్తు గర్వంగా అనిపించింది. కొద్దిగా మామూలు అయ్యాడు మూర్తి. నాలుగు గంటల ప్రయాణం. ఎర్రగొండపాలెం దగ్గరికి వచ్చాం.

ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళమ్మాయి బర్త్‌డే పార్టీకి రమ్మని. అతనికి వెళ్ళాలని లేక మీరు వెళ్ళిరండన్నాడు భార్యాపిల్లలను. జీవితంలో ఒక్క సరదాలేదు ఉత్త దద్దమ్మ అంటూ ఆవిడ సణిగింది, ఇప్పుడీ పిల్లలను తను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి వచ్చేసరికి. అబ్బా, డాడీ, యూ ఆర్ యూస్‌లెస్ అన్నారు తొమ్మిదీ, పదేళ్ళ కూతుళ్ళిద్దరూ. వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారపడి కళ్ళు మూసుకున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి ఏటా 50 లక్షల పాము కాట్లకి ప్రజలు గురి అవుతున్నారు. వీటిలో 27 లక్షలు విషసర్పాలు వేసే కాట్లు. దరిదాపు లక్షమంది మరణిస్తున్నారు. అమెరికాలో పాము కాట్ల వల్ల మరణించేది కేవలం ఐదు మందే! కానీ భారతదేశంలో వాటివల్ల ఏటా 58,000 చచ్చిపోతున్నారు. ఇది ప్రపంచ దేశాలలో ప్రథమ స్థానం!

పానవట్టం మీద
కిందనుంచి పైకి
పైనుంచి కిందికి
నీటి ఉత్థానపతనం

ప్రేమించడానికి పువ్వులెందుకు?
ఒంటినిండా దండలెందుకు?

తప్పించుకోడానికి సాధుజీవుల ముసుగేసుకుని
ఆకులు, అలములతో నోరు కట్టుకుంటారు
పొద్దుటి పోపు ఘాటుకు పొలమారిన గొంతులను
సంధ్యలో శృతి చేసుకుంటారు
అందుకే, నిగ్రహం విగ్రహం వదిలి
ఎప్పుడో నిమజ్జనమైపోయింది

ఇందులో ఎందరో మంచి మంచి స్నేహితులు, బంధువులు ఆత్మీయులుగా మారిన పరిచయస్తులు ఉన్నారు. చిన్న చిన్న సహాయాలు కూడా మర్చిపోని గొప్ప వ్యక్తులున్నారు. ప్రతిచోటా ఆదరించి అన్నం పెట్టిన తల్లులున్నారు, బీదరికంలో ఉంటూ కూడా. రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే ఇంటికి తీసికెళ్ళి సేదదీర్చిన ‘లఖ్నవీ అమ్మ’లున్నారు.

అధ్యయన శీలత లేక తమను మెచ్చుకునే వారిని చేరదీసి తాము రాసే అస్తవ్యస్త కవిత్వానికి హారతులు పట్టించుకునే వారికి ఈ పుస్తకం మింగుడు పడకపోవచ్చు. అక్కడక్కడ రఘుగారి శేషేంద్రపై మొగ్గు, కొన్ని దురుసు వాక్యాలు, కించిత్ ధిషణాధృతి చివుకు కలిగించవచ్చు.

బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలినప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. నాకు నేనే ఆసరా, మనసును స్వాధీన పరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమవుతుంది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన తెలుగు సాహిత్య సమావేశాలన్నింటిదీ ఇంచుమించు ఒకే మూస పద్ధతి. వీటికి సమావేశం ముఖ్యం, సాహిత్యం ఒక సాకు. అప్పుడప్పుడూ కొందరు సాహిత్య ప్రయోజనం కోసం కొంత ప్రయత్నించిన దాఖలాలున్నా, అధికశాతం సమావేశాల లక్ష్యం వేరు: సెల్ఫ్ ప్రమోషన్ కొన్నిటికి, కోటరీలు మరికొన్నిటికి; రచయితల ఎదుగుదల వేటిలోనూ భాగం కాదు. సాహిత్య బాంధవ్యాలు కేవలం సాహిత్యేతర అవసరాలకే అని కనిపిస్తూనే ఉంటుంది. ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని నిర్వహిస్తున్నారన్నది వారికి మాత్రమే తెలిసిన చిదంబర రహస్యం. నిర్వాహకులు సాహిత్యాభివృద్ధి కోసం జరుపుతున్నాం అని చెప్పుకొనే ఈ సభలు సాహిత్యం వాటివల్ల బాగుపడదు అని నిరూపిస్తూ ఉండడం ఒక వింత. ఏడాదికొకసారి ఉత్సవాలుగాను, వారం వారం ఉద్యమం చేసినట్లుగానూ సాహిత్య సమావేశాలు నిర్వహించేవాళ్ళు ఇప్పుడు తెలుగు సాహిత్య సమాజంలో వద్దన్నా కనపడతారు. ‘విభిన్నంగా’, ‘సౌహార్ద్ర వాతావరణంలో’ జరిపే ఈ సభలన్నిటిలోనూ వేదికను అలంకరించడానికి సాహిత్యపెద్దలు, విశిష్ట అతిథులు ఎలానూ ఉంటారు. ఈ కురువృద్ధులలో కొందరికి కనపడదు. కొందరికి వినపడదు. కొందరు చూడలేరు, వినలేరు. కొందరికి చూడాలని, వినాలనీ ఉండదు. మరికొందరు వక్తలు తాము మాట్లాడవలసిన పుస్తకాన్ని మొదటిసారి ఆ సభలోనే తిరగేస్తారు. ప్రధాన వక్తలు సైతం, మాటకీ మాటకీ పొంతన లేకుండా రచనను వదిలేసి రచయిత గురించి మాట్లాడతారు. అసందర్భంగా వాళ్ళ అనుభవాలను వల్లె వేస్తారు. కలిసి తిరిగిన తిరుగుళ్ళు, కలిసి పోయిన హోటళ్ళు, కలిసి తిన్న తిళ్ళు, పంచుకున్న టీ సిగరెట్‌లు – ఈ సోది లేని సాహిత్య సభలు తెలుగునాట అరుదు. స్నేహాల ప్రదర్శన, మాట్లాడవలసిన అంశం మీద స్పష్టత లేకపోవడం, రచన కన్నా రచయిత మీద దృష్టి పెట్టడం, సమయపాలన లేకపోవడం – స్థూలంగా ఇవీ ఈనాటి తెలుగు సాహిత్యసభల పోకడలు. సాహిత్య సభల్లో స్నేహం ఉండకూడదా? అంటే, కేవలం స్నేహం కోసమేనా సభ? అన్నది వెంటనే వచ్చే ప్రశ్న. ఈ సాహితీస్నేహాలు, ఈ సౌహర్ద్రత రచయితలకు నిజంగా అవసరమా? అందుకే, సమావేశం ముఖ్యం సాహిత్యం ఒక సాకు అనడం. ఇవేవీ లేకుండా రచయితలు ఒకచోట కూర్చొని నిక్కచ్చిగా సాహిత్యం గురించే మాట్లాడుకోలేరా? విమర్శను ఇచ్చిపుచ్చుకోలేరా? ఆమాత్రం చేతకాకపోతే రచయితలమని ఎందుకూ చెప్పుకోవడం? అందుకే, సాహిత్య సభలు ఎందుకు? అనే ప్రశ్న. ఈ ప్రశ్నకు నిజాయితీగా జవాబులు వెతకడం మొదలైతే, ఆ జవాబుల్లో నుండి – సాహిత్య స్నేహాల పరస్పర పొగడ్తల ప్రహసనాన్ని పక్కన పెడితే – నిజంగా సాహిత్యానికి ఉపకరించేవాటిని గమనించుకోవచ్చు. వాటిని మెరుగు పరుచుకునే ఆలోచన చెయ్యవచ్చు. మాట్లాడదలచిన అంశం మీద వక్తలు ముందుగానే ఒక వ్యాసం సిద్ధం చేసుకుని రావాలని, దానికి పత్రికలలో ప్రచురణార్హత ఉండాలని ఒక నియమం పెడితే, వేదికనెక్కడానికి ఉరికి వచ్చే ఉసియన్ బోల్టులందరూ వీల్‌ఛెయిర్ కోసం లైను కడతారు. తెలుగు నాట రచన అంటే ఏ రకమైన పరిశ్రమా అక్కర్లేని కళ అన్న అపోహ రచయితల్లో బలంగా ఉంది. ఇది వక్తలలోనూ ఉంది. ఇప్పుడు జూమ్, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా పుణ్యమా అని, సభావేదిక మీద నట్టుతూ నక్కుతూ పదాలకోసం తడబడుతూ ఈ వక్తలు చేసే అప్రస్తుత అప్రసంగాలు ప్రపంచమంతా పాకి తెలుగు సాహిత్యం వ్రాతలోనే కాదు ప్రసంగంలోనూ నేలబారు స్థాయికి పడిపోయిందని చాటి చెప్తున్నాయి. రచయితల రచనాకౌశలం మెరుగు పడటానికి ఉపయోగపడని ఏ సభ, సమావేశం అయినా వారికి హాని చేసేదే అని రూఢి చేస్తున్నాయి.

కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది.