మళ్ళీ ఏమైంది?
ఎవరో పిలిచారు నేలపైకి.ఒక్క నిముషం,
నిన్నొకసారి సర్దేసి వెళ్ళనీ.
మిగిలిన రెండు జాజిపూలనీ
దిండుమీదే వదిలేసి ఉంచనీ.కుంకుడు వాసన మబ్బుల్ని
మొహమంతా విసిరి
చెదురుమదురుగా నన్ను
కూనిరాగమై కురవనీ.ఆగిపొమ్మని అడిగిన ప్రతిసారీ
గుండెచాటున నిన్ను దాచుకుంటాను
ముద్దిస్తే ఏడుపెందుకో మాత్రం
ఎన్ని ముద్దులిచ్చినా చెప్పను.సగం దాహం ఎలానూ సరిపెట్టుకోనీదు,
ఒక్క నిముషం నీలో ఊపిరి ఆపేసుకోనీ.

రచయిత స్వాతికుమారి బండ్లమూడి గురించి:
స్వాతిగారి రచనలతో మూడు కవిత్వ పుస్తకాలను, అరసున్నా అనే కథా సంపుటిని ప్రచురించారు. హెమ్మింగ్వే రాసిన “ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ” ను తెలుగులోకి అనువదించారు. పొద్దు మరియు వాకిలి వెబ్ పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈవిడ రచనలను గడ్డిపోచలు బ్లాగ్ లో చదవవచ్చు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎకౌంటెంట్ గాను, ఉపాధ్యాయురాలిగాను పని చేస్తున్నారు.
... పూర్తిగా »