ఇట్టి స్థితిలో నాంగ్లేయులకీ ప్రజలలో నెట్టి పలుకుబడియుండును? భయము వల్ల నేర్పడిన భక్తియేగాని ప్రేమవలన నేర్పడిన విశ్వాసము లేదు. తమ అధికారమును సంపదను హరించి తమ్ము నాశనము చేసిన ఈ ఆంగ్ల ప్రభుత్వము నీ ప్రజలు ప్రేమింతురా? తమ గౌరవమును తీసివేసి అధోగతిలోనికి దింపినవారిని వీరు మన్నింతురా?
Category Archive: వ్యాసాలు
క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి నవలను తమ ప్రధాన సాహిత్యమాధ్యమంగా చేసుకుని, ప్రపంచ భాషలన్నిటిలోనూ నవలా సామ్రాజ్యంలో మహిళలు తమ బావుటా ఎగరేశారు. అలాంటి నవలారచయిత్రులను సాహిత్య చరిత్రలు ఎలా గుర్తించాయి? వారు ఎలా జీవించారు? వారు ఏం రాశారు? సమకాలీన సాహిత్య సమాజం వారిని ఎలా చూసింది? వారి రచనల్లో ఇప్పుడు కూడా చదివి, తెలుసుకుని ఆనందించగల విషయాలేవైనా ఉన్నాయా?
“ఎమిరేట్స్కి స్వాగతం! మొత్తానికి రెండేళ్ళు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి.” నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్ళు పట్టేసింది. క్రమక్రమంగా వెనకబడిపోయిన దుబాయి ప్లాను. ఢిల్లీకీ దుబాయ్కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్ళు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాటగలిగాను.
ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు.
ఈ సన్యాసులు చేసిన యుద్ధవిధానమును పరిశీలించినచో అది ధర్మయుద్ధమేయని తేటపడగలదు. లోకసంగ్రహముకొరకును మతధర్మములను రక్షించుటకును మ్లేచ్ఛులను ప్రతిఘటించి ధర్మసంస్థాపనము చేయుటలో మహానుభావులైన సన్యాసులు కూడా రాజులకు తోడ్పడినట్లు మనదేశ చరిత్రలో కొన్నియుదాహరణములున్నవి.
పాశ్చాత్యులు హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలతో వ్యాసుడు రాసిన భారతాన్ని పోలుస్తారు. కేవలం ఉపరితలం మీద కనిపించవచ్చేమో కానీ లోతుగా పరిశీలిస్తే ఈ పోలిక సరికాదు. హోమర్ రాసిన ఇలియడ్, ఆడిస్సిలు రెండింటికంటే భారతం రెట్టింపుకి మించి పొడుగు ఉంటుంది! భారత యుద్ధం మానవుల అత్యాశ వల్ల జరిగితే ట్రాయ్ యుద్ధం దేవతల చెలగాటాల వల్ల జరుగుతుంది.
మహమ్మదీయులీదేశమునకు వచ్చిన కొలదికాలములోనే మారిపోయిరి. ఈ దేశమునకు వచ్చిన ముసల్మానులు క్రౌర్యమును మతావేశమును వీడి సాత్వికులైరి. ఈ దేశములోని ఇస్లాము, విదేశములలోని ఇస్లాముకు భిన్నమైన మతముగా మార్పుజెందినది. అది భారతీయ సంస్కృతిని పొంది జాతీయ మతముగా మారినది. ఈ దేశపు మహమ్మదీయులు మనోవాక్కాయకర్మములగు భారతీయులుగనేయుండిరి.
ఐతే, ఏ దుర్ముహూర్తాన శ్రీశ్రీ సంపాదకుడంటే నాకింపారెడు భక్తి కలదు అని వెటకరించాడో, అది ఆయనకు ఏ అనుభవం అయో, కాకో, సరదాకో చెప్పాడో కాని అది పట్టుకుని కర్రసాము చేయడం ఒక అలవాటయింది కవులకూ రచయితలకూ. అసలే సాహిత్య విమర్శ మనకు మృగ్యం. అలాంటప్పుడు నేను రాసింది దిద్దడానికి నువ్వెవరు అనడం రానురానూ ఏ విమర్శనూ తీసుకోలేకపోవడానికి దారి తీసింది.
చెన్నపట్నం తూర్పు కోస్తాలో చాలా ముఖ్యమైన రేవుపట్నంగానుండేది. దేశంలో అన్నిప్రాంతాలలోను తయారైన మేలురకం నూలుబట్టలు రంగు అద్దకాలు ఇంకా తూర్పుదేశాల సరుకులు ఈ రేవునుండి సీమకు ఎగుమతి అయ్యేవి. పాండుచేరిలోని ఫ్రెంచి వర్తకులు తమ ముద్దవెండిని అమ్మడానికి చెన్నపట్నంలోని వెండిబంగారు షరాబు వర్తకుల ద్వారా వ్యాపారం జరిగించేవారు. సెంట్ ఆండ్రూస్ చర్చి ఫాదరీలు ఈ బేరాలు జరిగించేవారు.
గ్రీకు పురాణ గాథలలో అస్తవ్యస్త పరిస్థితి నుండి సృష్టి జరిగిన విధానం, సంతానోత్పత్తి కొరకు ఆది జంట ఏర్పడిన విధానాలలోని ఆచార వ్యవహారాలు చూస్తే కాసింత ఆశ్చర్యం, కాసింత జుగుప్స పుట్టుకొస్తాయి. ఇటీవలి కాలంలో డార్విన్ ప్రవచించిన పరిణామ సృష్టివాదం బలం పుంజుకొనక పూర్వపు రోజులలో మానవుడి పుట్టుక గురించి మనకి ఉన్న అవగాహన పూజ్యం.
ఇట్లు వంగరాష్ట్రములోను మనరాష్ట్రములోను కూడా ముందుగా విద్యాభివృద్ధి కొరకు ప్రారంభమయిన ప్రచారము ఆందోళనము తరువాత స్వధర్మ రక్షణముకొరకును అటుతరువాత పరిపాలనములో గల అన్యాయములను బాపుటకొరకును అటుపిమ్మట రాజ్యాంగ సంస్కరణముల కొరకును చేయబడిన రాజకీయోద్యమముగా పరిణమించెను.
తన తండ్రి యూరెనస్ శాపం ఏ విధంగా పరిణమిస్తుందో అనే భయంతో క్రోనస్ తన సంతానాన్ని మింగేసి తన కడుపులో బంధిస్తాడు. కానీ రేయా పన్నుగడ పన్ని జూస్ స్థానంలో ఒక రాయికి దుప్పటి గుడ్డ చుట్టబెట్టి క్రోనస్కి ఇస్తుంది. ఆ రాయిని క్రోనస్ మింగేస్తాడు. ఈ విధంగా క్రోనస్ కడుపులోకి జూస్ వెళ్ళకుండా రక్షణ పొందుతాడు.
భారతదేశ ప్రభుత్వమున మిషనరీల పలుకుబడి హెచ్చెను. అంతట గవర్నరులు ప్రభుత్వసభ్యులు కలెక్టర్లు జడ్జీలు వీరికి సర్వవిధములైన సాయములను జేయుచు వీరిని ప్రోత్సహింపసాగిరి. క్రైస్తవులైనవారి కుద్యోగములిచ్చుట ప్రారంభించిరి. దేశీయుల మతముతో జోక్యము కలిగించుకొనమనియు మతవిషయకమైన విచక్షణచూపమనియు కుంఫిణీవారు వాగ్దానము చేసియున్నను అందుకు విరుద్ధముగా ప్రవర్తింపసాగిరి.
జూస్ని పోలిన వ్యక్తి ఇంద్రుడు. హిందూ పురాణాలలోని దత్తాత్రేయ పురాణం ప్రకారం కశ్యపుడు దక్షప్రజాపతి యొక్క ఎనమండుగురు కూతుళ్ళని పెళ్ళి చేసుకుంటాడు. వీరిలో పెద్ద కూతురు అదితికి పుట్టిన వారిలో ఆదిత్యులు పన్నెండుమంది. జూస్ పన్నెండుగురు ఒలింపియనులలో ఒకడైతే, ఇంద్రుడు పన్నెండుగురు ఆదిత్యులలో ఒకడు.
చిత్రానికి బలం ఆంబోతు, పీడిత గుర్రం, దిష్టిబొమ్మల్లా మనుషులు–ఇవన్నీ క్రూరమైన వక్రీకరణల నుండి ఉద్భవించాయి. ఈ రూపాల్లో పికాసో ప్రజా అరాచకాలకీ , దురాక్రమణకీ ఆత్మాశ్రయసమానత చూపించాడు. గ్వెర్నికా అత్యంత విషాదార్థాలకి, సామూహిక అవివేకతకి ప్రత్యేక ప్రతీక. మరో రకంగా చెప్పాలంటే, ఇది దాదాపు ఒక సైకాటిక్ డ్రాయింగ్.
క్రోనస్ కుతంత్ర బుద్ది కలవాడు, అత్యంత భయంకరమైనవాడు. తల్లి గాయాకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగల సమర్ధుడు. క్రోనస్ ఒక రాత్రి యూరెనస్ మీదకి లంఘించి అతని జననాంగాలని తల్లి ఇచ్చిన కొడవలితో నరికేసి వాటిని సముద్రంలో విసిరేస్తాడు. ఆ జననాంగాల నుండి స్రవించిన స్రావములతో ఒక రకం రాక్షసులు, జలకన్యలు, తదితరులు పుట్టుకొస్తారు.
శ్రీహర్షుడు కేవలం కవి మాత్రమే కాదు. గొప్ప శాస్త్రపండితుడు కూడా. అది నైషధంలో అడుగడుగునా కనబడుతుంది. అతని కావ్యంలో ధ్వని, శ్లేషాదుల్ని గ్రహించాలంటే పాఠకుడు కేవలం సాహిత్యంలోను, భాషలోను నిష్ణాతుడైతే చాలదు. అతని గ్రంథగ్రంథుల్ని విప్పాలంటే చాలా శాస్త్రవిషయాల్ని కూడా తెలిసినవాడై ఉండాలి. వాటిని మథించి సాధించే ప్రతిభగలవాడై ఉండాలి. ఒక్కొక్కసారి, శ్లోకాల సాధారణమైన అర్థం తెలుసుకోడానికే ఇతరశాస్త్రాల ప్రవేశం కావాలి.
1841 సంవత్సరం ఏప్రియలు 14వ తేదీన మదరాసు కాలేజి హాలులో మదరాసు యూనివర్సిటి ప్రారంభోత్సవము ఎల్ఫిన్స్టన్ప్రభువు అధ్యక్షతక్రింద జరిగెను. ఆసభకు 1500మంది పౌరులు వచ్చిరి. అంతమంది నేటివు ప్రజలు అదివరకెన్నడును ఏ సందర్భమునను చెన్నపట్టణమున సమావేశమై యుండలేదు. ఈ విద్యావిధానమును గూర్చి ప్రజలలో అంత యుత్సాహముండెనని కనపడెను.
ఫోనులు రాజ్యమేలే ఈ రోజుల్లో ఉత్తరాలేమిటండీ అంటే, ‘ఉత్తరమే నా ఆయుధం. చూస్తూ వుండండి రిప్లయ్ వస్తుంది’ అనేవారు. ఆశ్చర్యం! అలాగే సమాధానాలు కూడా వస్తూ వుండేవి. యే పుస్తకం కావాలన్నా ఆ పుస్తకం ఆయన షాపులో వుంటే సరే, లేదంటే యెక్కడుందో వెతికి సాధించి ఆయనకు అందజేసేదాకా ఒంటి కాలిమీద వుండేవారు.
1820లో మదరాసు స్కూలుబుక్కు సొసయిటీకి సదరు కోర్టు ఇంటర్ప్రిటరగు శ్రీ వెన్నెలకంటి సుబ్బారావుగారు ఇంగ్లిషులో నొక దీర్ఘమైన లేఖ వ్రాసి ఈ దేశమునందు పాఠశాలలను సంస్కరించి ఆంగ్లేయవిద్యను వ్యాపింప జేయుడని ప్రభుత్వమువారిని కోరియుండిరి. ఈ లేఖ ఈ సొసైటీ వారి ప్రథమ నివేదికలో 1823లో ప్రకటింపబడినది.