మూలఘటిక కేతన కవి, వ్యాకర్త, ధర్మశాస్త్రకర్త. తిక్కన మహాకవికి సమకాలికుడై ఆయనకు తన దశకుమారచరితము అనే దండి మహాకవి కావ్యపు తెలుగుసేతను అంకితమిచ్చి ఆయన మన్ననలు పొందిన కేతన ఇంత గట్టిగా తానే తెలుగుకు మొదటగా వ్యాకరణం రాస్తున్నాను అని చెప్పుకున్నాడు.
శీర్షికలు సంచికలు
కర్నూలు నవాబగు గులాం రసూలుఖానుగారి కోటను తనిఖీచేయగా రహస్యాయుధాగారము బయల్పడెను. అంతట ఆయనను పట్టుకొని పదచ్యుతుని చేసి తిరుచినాపల్లిలో ఖైదుచేసిరి. ఆతడక్కడ ఇంగ్లీషువారి మెప్పుకై క్రైస్తవ దేవాలయములో ప్రార్థనలకు హాజరగుట ప్రారంభించెను. అప్పుడొక వాహబీ ఫకీరతనిని వధించెను.
ఆయన ఆరోజు రాత్రి మూవీ చూడాలన్నాడు. పెద్దగా సినిమాలు చూడడు, ఏమయిందో మరి? ప్లే చేశాను. గుజారిష్. అక్కడేముందో మన జీవితాల్లోనూ అదే, ఏం చూస్తాం? అని తనే మధ్యలో ఆపి ‘నీకు కాలేజి లవ్ స్టోరీ ఏం లేదా?’ అన్నాడు. ‘పూర్తిగా చదివితే ఉండేదేమో’ అన్నాను. ఎందుకో ఆయన వైపు చూడలేదు. ‘ఉండి ఉంటే బాగుండేదా?’ అన్నాడు. ‘ఎవరూ? నాకు చెప్పు?’ నవ్వాడు.
సూరీడు మంచునీ
మంచు చెట్లనీ కప్పుకునుంటే
ఇంకా తెల్లారనట్టు మోసపోయాను.
పడవపువ్వుల్ని కుట్టుకుని
నది
ఇసకంచు చీర చుట్టేసుకుంది.
నిర్లక్ష్యంతోనో
అవసరం లేదనో
ఎడతెరిపి లేకుండా
పరుగులు తీస్తూ
చిటికెడు సమయాన్ని
వారి దోసిట్లో
ఆత్మీయంగా పోయలేని మనం
యదార్థతత్వాన్ని మోసపుచ్చేస్తూ
నకిలీ నవ్వులని నగిషీలుగా అద్దుకుంటూ
లోపలి ఆర్తిని అణచడం నేర్చుకుంటున్నప్పుడు
ఎప్పటి ఉనికినో పల్లవిగా చేసుకుంటూ
చీకటిలో నుండి సాంద్రంగా ఒక పాట మొదలవుతుంది.
కన్నీరు జారి చార కట్టడం
రెప్పల వెనుక మెలకువని
తట్టి నిద్ర లేపడం
లబ్డబ్లతో పెనవేసి చాచిన
చేతిని విదుల్చుకోవడం
శ్వాసల మధ్య నీరవాన్ని
గుర్తించి గౌరవించడం
ఈ కన్నీటిదీవి ఇప్పుడు
నా వాస్తవికత
ఈ దుఃఖసముద్రం
నా సహచరి
ఆ ఎడారులు
ఆ పక్షుల్లేని అరణ్యాలు
ఈ తలుపుల్లేని ఇల్లూ
ఇప్పుడిదే నా ప్రపంచం
పాతాళంలో పడి ఉన్న
పెళుసు లోహాన్ని నేను
గునపంతో తవ్వు
బురదంతా కడుగు
నిప్పుల కొలిమిలో
నిలువునా కాల్చు
తన పాటకు తానే పులకిస్తూ
ఎత్తుపల్లాలను ఏకం చేసే రాగంతో
ఈ గాలి.
స్వచ్ఛంగా
ఆనందంగా
హాయిగా ఎగిరే
ఈ పూల పిట్ట.
గాలికి ఊగుతున్న
పూవు నీడలోకి తప్పిపోవడానికి చూస్తూ
రహస్యం తెలిసింది నీకు అన్నాడు
నీలాకాశపు తెర వెనుకకు తప్పుకొంటూ
ఎండ కాసేటపుడు అన్నీ తెరుచుకుంటాయి
చీకటితో సహా అన్నాను
ఎంతో ఆర్తితో ప్రేమతో భక్తితో అలవోకగా ఆశువుగా హనుమంతుడి లీలాగానం చేసినట్టుండే ఈ స్వరం, ఈ గేయం తెలుగునాట సంగీతప్రియులకు చిరపరిచితమే. సినీ నేపథ్యగానమే గాక లలితసంగీతం లోనూ కృషి చేసి, సుందరకాండను పండిత పామర జనరంజకమైన గీతంగా అలతి పదాల్లో రాసి తానే బాణీ కట్టి ఆలపించిన ఆ గాయకుడు ఎమ్. ఎస్. రామారావుగా ప్రసిద్ది పొందిన మోపర్తి సీతారామారావు.
ఉపకారాలని అపకారాలని చేసే మహాసముద్రం నా స్నేహితుడు అనుకుంటాడా ముసలివాడు. జీవితం ఆ మహాసముద్రం లాంటిదేనని చెప్పకనే చెప్పే చిట్టిముత్యం లాంటి నవల ఇది. నీ పోరాటం నీదేనని, నీ అనుభవమే ఏనాటికైనా నీ తలుపు తట్టగల అదృష్టమనీ పాఠం చెప్పే నవల
1995లో తన ‘క్రాస్రోడ్స్’ కథాసంపుటి కోసం వడ్డెర చండీదాస్ రాసిన ముందుమాటను తాను పోగొట్టుకున్నానని, ఆ చేతిరాతప్రతి తిరిగి ఈమధ్యే దొరికిందనీ చెబుతూ సదాశివరావు ఇటీవల ఆ ప్రతిని, ఆయనే తీసిన చండీదాస్ ఫోటోని, మాతో మరికొందరు మిత్రులతో పంచుకున్నారు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
సి. కృష్ణవేణి, ఎన్. టి. రామారావు తాము సొంతంగా తీసిన సినిమాలలో ఎమ్. ఎస్. రామారావుకి పాడే అవకాశం ఇచ్చారు. ఏదయినా ఘంటసాల గాయకునిగా బలపడిన తరవాత ఎమ్. ఎస్. రామారావుకి అవకాశాలు తగ్గిపోయాయి అన్నది వాస్తవం.
అడ్డం మన భారతదేశం పార్వతీదేవికి సంబంధించినది. (5) సమాధానం: హైమవతము పంచతత్వాలు నశించడం. మరణం. (3) సమాధానం: పంచత్వం మిడుతల దండు (5) సమాధానం: […]
క్రితం సంచికలోని గడినుడి-51కి మొదటి ఇరవై రోజుల్లో పంతొమ్మిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-51 సమాధానాలు.
కనీవినీ ఎరుగని రీతిలో కొరోనా వైరస్ గతసంవత్సరం ప్రపంచమంతటినీ కుదిపివేసింది. ఎన్నో వ్యాపారాలను, వృత్తులను అతలాకుతలం చేసింది. ఏ పూటకాపూట సంపాదించుకునే ఎన్నో జీవితాలను రాత్రికి రాత్రి అయోమయంలోకి నెట్టింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాలకు పేదప్రజలు ఆటబొమ్మలేనని పాశవికంగా స్పష్టం చేసింది. దేశాల మధ్య, మనుష్యుల మధ్య కొత్త దూరాలు ఏర్పరచింది, కొత్త భయాలు సృష్టించింది. వెలివేత లాంటి జీవితంలో అశాంతికి, వేదనకూ గురి చేసింది. నిజానికి ఇట్లాంటి క్షణాల్లోనే మనిషి తనకు తానొక ప్రశ్నార్థకమై జవాబులు వెదుక్కునే ప్రయత్నం చేస్తాడు. తనకు నిజంగా కావలసినవి, అక్కర్లేనివీ బేరీజు వేసుకుంటాడు. బహుశా అందుకే సమాజంలోనూ ఏకాంతంలోనూ తమతమ విలువలు, బాధ్యతలు స్పష్టం చేసుకొని కొందరు మరింత మంచితనంతో ముందుకుసాగారు; మరికొందరు ఇదే సందర్భాన్ని తమ స్వార్థాన్ని, ఇతరుల పట్ల ద్వేషాన్ని సమర్థించుకొనేందుకు అనువుగా వాడుకున్నారు. ఆదినుండీ ఏ పరిస్థితిలోనయినా ఈ రెండు దారులూ ఉంటూనే ఉన్నాయి, ఏది ఎంచుకుంటామనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది. కళాకారులూ దీనికి అతీతం కాదు. నిజమైన కళాకారుడు ప్రతిబంధకాలతో నిస్పృహ చెందడు. పరిమితులు పెరిగేకొద్దీ తన కళను అపరిమితంగా సృష్టించుకునే దారులను అన్వేషిస్తాడు. కళను సామాజిక, సామూహిక ప్రభావాలకు ఆవలగా చూస్తాడు. తనదైన ఏకాంతంలో నుండి, తనవే అయిన అనుభవాలలో నుండి ఓ కొత్త చూపుతో కళాసృజనకు ఉద్యమిస్తాడు, ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. దృశ్య సంగీత మాధ్యమాలలో ఎందరో కళాకారులు ఈ కోవిడ్ కట్టుబాట్లనే తమ సృజనకు వేదికగా మార్చుకొని ప్రతిభను నిరూపించుకోవడం దానికదే ఓ స్ఫూర్తిసందేశం. కళాకారుడైనా, సామాన్య మానవుడైనా దిక్కుతోచని స్థితిలో కొత్త దిక్కు వెతుక్కుంటాడనేది మరొక్కసారి నిరూపించబడిన తరుణమిది. తెలుగు సాహిత్యానికి కోవిడ్ వంటి దుర్దశ కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి ఉన్నా, తెలుగు సాహిత్యకారులు ఎంచుకోవలసిన దారి ఎంచుకోకున్నా, ఇప్పుడు ఈ ఆశావహ దృక్పథమే మనకు మరింత అవసరం. ఈ కోవిడ్ ఏకాంతం తెలుగు కవిరచయితలలో ఏ కొత్త దారులు తెరిచిందో, తెలుగు సాహిత్యంలో ఏ ప్రభావం చూపిందో, అసలు చూపిందో లేదో కూడా మనకింకా తెలియదు. తెలుగునేలపై ప్రముఖులమనుకునే వారి ధోరణి షరా మామూలుగానే ఉన్నా, వాటికి భిన్నంగా కొందరు రచయితలు కొత్తదారి పడుతున్నారని, ఒంటరి దీపాలుగా ద్వీపాలుగా, వైవిధ్యమైన కథాకథనప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని సజీవంగా ఉంచేందుకు తమదైన కృషి చేస్తున్నారని మా ఎరుక. కారుమొయిలులా కొత్త వెలుగులను కమ్మేస్తున్న పాత ధోరణులను పక్కకు నెట్టి, సాహిత్యచర్చలు ఈ కొత్త కలాల గురించి కొనసాగాలి. జీవితం కొత్త అనుభవాలతో ఎలా మనల్ని బలోపేతం చేస్తోందో, తెలుగు సాహిత్యాన్నీ అదే రీతిన పరిపుష్టం చేసుకోవాలి. అదే మనం ఎంచుకోవలసిన దారి.
మనకు తూర్పు కనుమలు, పడమటి కనుమలు బాగా తెలుసు. కానీ, సముద్రంలో ఉన్న కనుమల గురించి తెలుసా? ఈ సముద్రకనుమలు బారుగా ఒకదానికొకటి అంటుకొని సముద్రగర్భంలో భూమి చుట్టూ వడ్డాణపు గొలుసుల్లా పాకివున్నాయి. అన్నీ కలుపుకొని వీటి పొడవు 40వేల మైళ్ళు.