ఈ నవలలో కథ చిన్నదే. కానీ ఇది రేకెత్తించిన ఆలోచనలు కొత్తవి. అందులో ముఖ్యమైన విషయం నల్లజాతీయుల బానిసత్వం. బ్రిటన్లో అప్పటికి ఆఫ్రికన్ కాలనీల్లో బానిసత్వం ముమ్మరంగా ఉన్నప్పటికీ దానిపై తిరుగుబాట్లు, దాని నిషేధానికి పోరాటాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. అక్కడక్కడా కొందరు వ్యతిరేకించడం మినహా, సంఘటిత పోరాటాలేవీ అప్పుడు లేవు.
శీర్షికలు సంచికలు
ఏమవుతుంది నాకు? గిల్టీగా ఎందుకుంది, నా లోపల భయమెందుకు? మణి ఇదివరకటిలా లేదు. ప్రశ్నలు వేసినా నన్నేమి అనలేదు, నా వైపు చూసే అభావపు చూపు తట్టుకోలేకుండా ఉన్నా. ఉక్రోషంగా చెప్పాలనిపించింది భరణి నన్ను వెతుక్కుంటా వచ్చాడు నిన్ను చూసుకోమని అని. కాని చెప్పలేకపోయా. మనుషులు మన అవసరాలను చూసి, వాళ్ళ పనులు చేయించుకుంటారు. ప్రేమ స్నేహం ముసుగులో భరణి చేసిందేంటి?
“బావుంది. ఏడు ఎమిరేట్లు. ఎనభైవేలనుంచి ముప్ఫయిమూడు లక్షలదాకా జనాభా వ్యత్యాసాలు. రెండొందల ఏభై చదరపు కిలోమీటర్ల నుంచి అరవైవేల కిలోమీటర్ల దాకా భౌగోళిక వ్యత్యాసాలు. అసలు ఈ ఉమ్మడి కుటుంబం ఎలా బతుకుతోందీ? డబ్బుల విషయంలోనో సరిహద్దుల విషయంలోనో, హక్కులూ ఆధిపత్యాల విషయంలోనో గొడవలు పడరా వీళ్ళు?!”
నిద్ర తెలుస్తున్నా, సమయం చూడనంత
గాఢమైన ముడులు కునుకుకీ కట్టక
ఒంటిమీద ఉరేస్తాయి నన్ను,
నాలుగూ పదకొండు ఇక నిద్రపో అని నువ్వనే వరకూ.
కాలు ఆనించిన చోటు విమానాలు ఆగే చోటు. స్థలాలని కలుపుతూ, కాలాలని మారుస్తూ, నాగరికతలని కరెన్సీ నోట్లలా తర్జుమా చేయగలిగే పవిత్ర స్థలి. నువ్వు అక్కడే నిలబడివున్నా నీతో పాటు ఇదే కాలంలో ఇదే క్షణంలో జీవించిన, జీవిస్తున్న ఈ కోట్లకోట్లమంది సంబంధం లేని జనాల ఆటుపోట్లు, ఒకరినొకరు తోసుకుంటూ తప్పుకుంటూ వస్తూ పోతూ… ఇవ్వేమీ నిన్ను తాకే స్థితిలో నువ్వు లేవు.
రోహిణి చనిపోయి ఇరవై రోజులు దాటింది. పత్రికలో చదివి సమాచారం తెలుసుకున్నాను. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పట్లాగే ఇంటి తలుపు బిగించి ఉంది. నేను తలుపు తట్టగానే పక్కనున్న కిటికీ సగం తీసి చూసి ‘మీరా?’ అని అడిగి తలుపు తీసింది జయ. నేను లోపలికి వెళ్ళగానే తలుపు, కిటికీ మూసింది. ‘ఒక నెల రోజలుగా ఊర్లో లేను. నిన్ననే తెలిసింది విషయం’ అని అబద్ధమాడాను.
అక్కడ
రంగులేని రంగు
రూపంలేని రూపం
రుచిలేని రుచి
స్పర్శలేని స్పర్శ
శబ్దంలేని శబ్దం
వాసనలేని వాసన
నీకోసం ఎదురుచూస్తాయి
ఈ పధకం ప్రకారం బంధులుడు, అతని ముప్ఫై ఇద్దరు పిల్లలూ రహస్యంగా వెళ్ళి ఫలానా రాజ్యం సరిహద్దుల్లో జరగబోయే తిరుగుబాటు అణచాలి. అలా వాళ్ళు వెళ్ళినపుడు అక్కడ దాక్కున్న ప్రసేనజిత్తు సైన్యం ఈ బంధులుణ్ణీ, అతని పిల్లలనీ హతమారుస్తుస్తుంది వాళ్ళు నిద్రలో ఉండగా. అలా అతి బలవంతుడైన బంధులుణ్ణి పిల్లల్తో సహా వదిలించుకుంటే దరిద్రం వదులుతుంది ప్రసేనజిత్తుకి.
ధరణా కూర్చుని సాత్విక నిరోధము చేయుట భారతదేశములో అనాదిసిద్ధమైన సత్యాగ్రహ పద్ధతి. ఒకడింకొకనికన్యాయము చేసినయెడల అన్యాయమును పొందినవాడాయన్యాయము చేసినవాని వాకిట తిండి తినక, ఎండయనక వానయనక నిశ్చలముగా కూర్చుండి యుండును. దీనికే ధరణాకూర్పొనుటయందురు. ఇట్లు కూర్చుండి ప్రాణములను బాసినవాని యుసురాయింటివానికి గొట్టునని ప్రజలనమ్మకము.
రాజుగారివి గాడిద చెవులు అని మంగలికి తెలిసిపోయింది. మూడో కంటివాడికి ఈ రహస్యం తెలిసిందంటే తల తీయించేస్తానని మైడస్ మంగలిని బెదిరించేడు. రాచరహస్యం! రచ్చకెక్కితే కొంపలంటుకుపోవూ? కడుపులో దాచుకోలేక మంగలి కడుపు ఉబ్బిపోతోంది. ఎవ్వరికో ఒకరికి చెప్పాలి. తనకి తెలిసిన రహస్యాన్ని ఒక పుట్టలో ఊదేశాడు!
మీరు అడగవచ్చు ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానని. నా సమాధానం: ప్రకృతి ఎలాగో, బైబులూ అలాగే. ప్రతి పాఠకుడికీ అది ఒక్కొక్క కథ చెబుతుంది. అయితే, చదివే మనిషి మనిషికీ బైబుల్ మారిపోతుందా? అవును. బైబుల్ ద్వారా దేవుడు ఇద్దరు వ్యక్తులకు ఒకే సందేశాన్ని ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకని? ఎందుకంటే, ఏ వ్యక్తి చదువుతాడో ఆ వ్యక్తే స్ఫూర్తి.
డేగలే కనపడని
నియంతలకాలం
అంతా అసంయుక్త హల్లుల మయం
చట్రాల్లో బతికే మనుషులకి
చట్టాలు తెలుస్తాయేమో గాని
చిత్తాలు తెలియవు
వాటికెపుడు పోస్తావో
ఆ మార్మిక జీవాన్ని
ఎవరి గుండెలోనో
కంటితడిలోనో
పొర్లాడి వచ్చిన పుప్పొడిని
ఆ గదినిండా కుమ్మరిస్తాయి
వెంటనే దాన్నొక తేనెపట్టులా మార్చి
నువ్వు తాళం పెట్టేస్తావు
చీకటి రాత్రి చిక్కబడక ముందే
గ్రహపాటుగా నా గుండెనెండబెట్టుకుంటా.
చుక్కపొడుపు పొడిచేలోపే
ఏమరుపాటుగా నా ఆశలార్చుకుంటా.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఓలేటి వెంకటేశ్వర్లు పాడిన ‘కడచేనటే సఖియా’ చాలా మందికి తెలిసి ఉండవచ్చు. ఓలేటి పేరు వినగానే వెంటనే స్ఫురించే పాట. 12-13 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పించిన ఒక టి.వి. కార్యక్రమంలో మల్లాది బ్రదర్స్లో ఒకరైన రవికుమార్ పాడి బోలెడు ఆసక్తిని రేకెత్తించి కొత్త తరానికి కూడా పరిచయం చేసిన పాట.
అడ్డం ఈశానదిక్కున ఉన్నదుర్గాదేవి (5) సమాధానం: అపరాజిత సుదర్శన్ పట్నాయక్కు కావల్సిన ముడిసరుకు (3) సమాధానం: ఇసుక అనుగ్రహించు కృప ప్రతీక్షణము (4) సమాధానం: […]
క్రితం సంచికలోని గడినుడి-47కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-47 సమాధానాలు.
భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణభాగంలో, ప్రత్యేకించి తెలుగుభాషాప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన వేళ్ళూనుకుంటున్న సమయంలో వారికి మన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక విధివిధానాలను అర్థం అయేలా చెప్పి పరిపాలనాపద్ధతులకు సహకరించిన పండితులు, విద్యావేత్తలు అయిన స్థానికుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఉదాహరణకు, సి. పి. బ్రౌన్ గురించి మనకు తెలిసినంతగా, అతనికి ఇతోధికంగా సహాయం చేసిన తెలుగు పండితుల గురించి, వారి కృషి గురించి తెలీదు. కల్నల్ మెకంజీ పేరు మనం విన్నాం కాని అతనికి ఆ పేరు రావడానికి కారణమయిన కావలి సోదరుల గురించి వినలేదు. కలకత్తాలో విలియమ్ జోన్స్ సంస్కృత భాషను ప్రధానం చేసి ఇతర స్థానిక భాషలను పట్టించుకోని కారణంగా స్థానిక భాషలు మాట్లాడే వాళ్ళంతా బ్రిటిష్ వారి దృష్టిలో అధములు, తమ పురాచరిత్ర ఔన్నత్యానికి తగనివారుగానూ అయారు. అందుకు కొంత భిన్నంగా దక్షిణ భారతంలో ఆంగ్లేయులకూ స్థానికులకూ మధ్య సంబంధం మరికొంత సాదరసమభావనలతోను, విజ్ఞానం ఇచ్చిపుచ్చుకునేలానూ ఉంటూ వచ్చింది. అందువల్ల స్థానిక పండితులు, మేధావులు జాత్యహంకారపు నీడలోను, అధికారి-సేవకుడు వంటి అసమానమైన స్థితిలోనూ కూడా విజ్ఞానం రెండువైపులకూ పారే స్థితిని వీలైనంతగా నెలకొల్పుకున్నారు. వీరు స్థానిక సంస్కృతీసంప్రదాయాలను, సాహిత్యాన్ని బ్రిటీష్ వారికి నేర్పే క్రమంలో ఆ పురాచరిత్రను ఒక ఆధునికరూపంలో నమోదు చేయడమూ మొదలుపెట్టారు. ఇలా స్థానిక పండితులు, ఆధునికరూపాల్లో నమోదు చేసిన చరిత్ర వల్ల ఇప్పటిదాకా పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసిన మన చరిత్రను, సాంప్రదాయ సాహిత్యాలను అధునాతన పరిశోధనాపద్ధతులలో విశ్లేషించి అర్థం చేసుకోవడానికి కావలసిన వీలు ఇప్పుడు మనకుంది. వీరి కృషిని గమనించి, తద్వారా మరుగున పడ్డ మన నిజచరిత్రను మనం వెలికి తెచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నా ఇప్పటికీ తెలుగునాట చారిత్రకపరిశోధకులెవరూ వాటిని వినియోగించుకున్న దాఖలాలు లేవు. చారిత్రక సాహిత్యాన్ని పునః ప్రచురించడం, ఆ సాహిత్యానికి సందర్భోచితమైన వ్యాఖ్యానాన్ని అందించడం, వాటికి లోతైన దృష్టీ అధ్యయనం ఉన్న విమర్శకులతో ముందుమాట రాయించడం ద్వారా చరిత్రను ఒక కొత్త కోణం నుండి భావి తరాలకు పరిచయం చెయ్యడం ఏకాలానికాకాలం పునరావృతం కావలసిన ఒక అవసరం. ఆ అవసరాన్ని గుర్తెరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయో లేదో గమనించుకోవాల్సిన బాధ్యత సాహిత్యసమాజంలో ఉన్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరిదీ.
రామస్వామి తన కాలానికి మించిన ప్రతిభావంతుడు, ప్రయోజకుడు, వర్తక రహస్యాలు తెలిసినవాడు. బహుశా భారతదేశంలోనే మొదటి ప్రచురణకర్త. అతను చేసిన పనిని, ముఖ్యంగా దక్కను కవుల చరిత్రతో అతను సాధించిన పెద్ద మార్పుని మనం ఇప్పటికీ సరిగా గుర్తించలేదు. ఆ మార్పు ఫలితాన్ని ఇప్పటికీ మనం తెలియకుండానే కొనసాగిస్తున్నాం.