నిగమశర్మ హోమాగ్నిని ఊదడట; కానీ విరహమనే జ్వరం యొక్క బాధతో వెచ్చని నిట్టూర్పులూరుస్తాడట. సంధ్యావందనం చేయడట; కానీ ఈర్ష్యాకషాయితలకు మాత్రం మక్కువతో నమస్కరిస్తాడట. వేద చర్చలలో ఔను-కాదు అనడు; కాని పెందలకడనే లేచి విటవాదములను తీరుస్తాడట.

తెలుగువాళ్ళకి దేన్ని ‘ఎక్కించా’లన్నా సినిమాలే శరణ్యం కనక శంకరాభరణం సినిమాలోని పాటలవల్ల శాస్త్రీయసంగీతానికి కొంత గ్లామర్ అబ్బింది. తద్వారా బ్రోచేవారెవరురా అనే కీర్తన కమాస్ రాగం లోనిదని చాలామందికి తెలిసింది.

మా ఊళ్ళో సాయిబులు పెద్దమ్మ, పెద్దనాన్నల సంతానంతో పెళ్ళి సంబంధాలు నెరపడం చూసి మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకొనేది. అయితే, ఉత్తరభారతీయులు మనం మేనమామ, మేనత్త కొడుకు, కూతుళ్ళతో మేనరికపు పెళ్ళిళ్ళు జరపడం చూసి అంతే ఆశ్చర్యపోతారు.

సినిమా పత్రికలంటే కేవలం సినిమా తారల ముచ్చట్లకే అని కాకుండా అప్పుడు కినిమాలో ‘మీ విజ్ఞానం’ అనే పేరుతో పాఠకులు అడిగిన సినిమా రంగపు టెక్నిక్స్ గురించిన ప్రశ్నలకి సమాధానాలిచ్చే శీర్షిక ఎంతో ప్రాచుర్యం పొందింది.

జేబున్నీసా ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు.

ఈమాట కోసం ప్రొ. మలయవాసినిగారు ప్రత్యేకంగా పాడి, రికార్డ్ చేసి పంపించిన అపురూప శబ్ద తరంగం ఊర్మిళాదేవి నిద్ర అనే ఈ జానపద గీతం.

పరుచూరి శ్రీనివాస్ అందిస్తున్న 1930లనాటి ఊర్మిళాదేవి నిద్ర పాట ఇది. ఈ పాట పాడిన శ్రీమతి బి. సుబ్బులు గురించి ఇంకే వివరాలు మాకు దొరకలేదు.

ప్రపంచ తెలుగు ప్రజలకు అభివందనం! జనవరి 5-7 తేదీలలో, ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహోత్సవానికి మీకందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాం.

కొత్తసంవత్సరం ప్రారంభంలో అనేకమైన తీర్మానాలు చేసుకోవటం ఆనవాయితీ. బరువు తగ్గుదామని, బీడీలు తాగటం మానేస్తానని, బడికో, గుడికో దానధర్మాలు చేస్తాననీ… రకరకాల ప్రతిజ్ఞలు చేసుకోవటం మనకి తెలియని విషయం కాదు. అయితే అది వ్యక్తిగతమని, ఈ మాట పత్రికనీ కొందరు, నవ్వచ్చు; మరికొందరు కామెంటేతర్లు వెటకారం చెయ్యవచ్చు.

పహాడీ హిందూస్తానీ రాగమే కాని, కర్నాటక విద్వాంసులు కూడా లలితగీతాల్లో ఈ పహాడీ రాగం వినిపిస్తూ ఉంటారు. బాలమురళి పాడిన అష్టపది రమతే యమునా, వోలేటి పాడిన గడచేనటే సఖీ వగైరాలు ఇందుకు ఉదాహరణలు.

ప్రతి సంవత్సరం కాకినాడ లోని ఇస్మాయిల్ మిత్రమండలి ఇచ్చే ఇస్మాయిల్ కవితా పురస్కారానికి గాను 2010 సంవత్సరంలో వచ్చిన ‘రెండో పాత్ర’ కవితా సంకలనం ఎంపికయ్యింది. కవి విన్నకోట రవి శంకర్.

ఒకేపేరు పెట్టుకున్న వ్యక్తులెందరో ఉన్నా, వారందరిలో ఏ రకంగా ఒకే లక్షణాలు కనిపించవో అలాగే, ఈ కథనాలన్నింటికి రామాయణమని పేరు ఉన్నా వాటి లక్షణ స్వభావాలు వేరువేరని చెప్పవచ్చు.

లేత మొగ్గల పెదవులు సుతారంగా విచ్చీవిచ్చకనే
పట్టెడు పరిమళంతో ఇంటినంతటినీ
సుగంధపు అలలపై ఉయ్యాలలూపుతుంది

బాలమురళి సంగీతంలో తాను కూర్చిన వివిధ గాన ప్రక్రియలని సూర్యకాంతి అనే పుస్తకంగా ప్రచురించారు. ఇందులో కేవలం సాహిత్యమే కాకుండా ప్రతీ రచనకీ స్వరాలు కూడా ఇచ్చారు.

వసంతము చైతన్యాన్ని చూపిస్తే, వర్షాకాలము జీవితములో ఉచ్ఛదశను చూపిస్తుంది. ఆకురాలు కాలము సంపూర్ణత్వాన్ని, తృప్తిని చూపిస్తే, శీతాకాలము తహతహను, నిరీక్షణను సూచిస్తుంది. ఈ ఋతువులకు అనుగుణముగా వసంతతిలకము, వనమయూరము, కనకప్రభ, వియోగిని వృత్తాలను యెన్నుకొన్నాను.

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పద్మలత కవితా సంకలనం “మరో శాకుంతలం” ఎంపికైంది. భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి పరిశోధనకు గాను బ్రౌన్ పురస్కారానికి కోరాడ మహాదేవ శాస్త్రి గారిని ఎంపిక చేసాము. పద్మలతతో మాటామంతీ.

నవ్వాడు త్రిలోచన్. “నీక్కూడా అలాగే అనిపించింది అని వాదించను. కానీ నీ ఫ్రెండు తన కుక్కనీ, నీ కుంటికుక్కనీ పోల్చిచెబుతుంటే నీ కళ్ళల్లో నేను న్యూనత చూశాను. మేము మప్పిన విలువలకింద నువ్వు నలిగిపోవడం ఇష్టం లేక, నువ్వు ఏడుస్తున్నా దాన్నెక్కడో వదిలేసొచ్చాను.”

కొన్ని మాండలికాలలో ఎనమండుగురు, తొమ్మండుగురు అన్న వాడకం ఉన్నా, ఆధునిక తెలుగు భాషలో ‘ఎనిమిది’ కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో ‘మంది’ చేర్చడమే ప్రమాణం. ప్రాచీన భాషలో ‘పదుగురు’ అన్న ప్రయోగం ఉండేది.