కుబేరుని కొలువులో ఉండే యక్షుడు శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమవుతుంది. ఆకాశములోన మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్ళి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు.

కవితలో, మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని చాల శ్రద్ధతో, సృజనలోని దృశ్య, పద చిత్రాలు, మాటల ఎంపిక, వాటి కూర్పు, స్థానాల్ని గురించీ వివేకంతో వందలాదిగా నిర్ణయాలను తీసుకొని చేసేది. అందుకే ‘కవి పగలల్లా కూర్చుని ఒక కామా ఎక్కడ ఉంచాలో స్థిరంగా ఒక నిశ్చయానికొచ్చేడు,’ లాంటి పరాచికాలున్నాయి.

ఇక్కడ మీకు వినిపిస్తున్న ‘మేఘసందేశం’ సంస్కృత సంగీత రూపకం 1978లో బెంగుళూరు రేడియో కేంద్రం ద్వారా ప్రసారితమయ్యింది. అప్పట్లో రజనిగారు బెంగుళూరు స్టేషన్ డైరెక్టరుగా పనిచేసేవారు. దీని సంస్కృత రచన, సంగీత నిర్వాహణ చేసినది రజనిగారే. ఆయన గొంతును కూడా వినవచ్చు. యక్షునిగా ప్రధాన గాత్రధారి శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ.

ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది. తర్వాత అడవినిండా ఆ వెలుగు పడింది. కొంతదూరంలో ఒక ఎండిపోయిన చెట్టు మీద ఒక వింత జంతువు కూర్చుని, ఆ చెట్టుని తినేస్తూ ఉంది. ఆ జంతువు శరీరం నుండి సూర్యుడి నుంచి వచ్చేలాంటి వెలుగు వస్తూ ఉంది. ఇలాంటి జంతువుని ఇంతకు ముందు ఎవ్వరూ, బాఖా ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు.

పాత కాలువలో దిగి మెయిన్ రోడ్డుకి ఎక్కి చెరుకు దుకాణం, బాల పాండియన్ మిఠాయి దుకాణం, వేల్ విలాస్ స్వీట్స్ అండ్ హాట్స్ అన్నీ దాటి తెప్పోత్సవం జరిగే చోటుకి వెళ్ళి చేరేసరికి ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు. ఎక్కడ చూసినా ఇనుప తొప్పిలు ధరించిన రిజర్వ్ పోలీసులు చేతిలో లాటీకర్రలతో. చూస్తేనే భయంగా అనిపించింది.

మహర్వాటీ మహాద్వార తోరణంలో
పక్క పక్క ఆకులమై పలకరించుకొనే వరకూ
నింగీ నీరధీ కలుసుకుంటున్న
క్షితిజ నిశాంత నీలిమల మీద చెలీ!

తెలుగు జానపద వాఙ్మయంలో, తరతరాల తెలుగు స్త్రీల పాటల్లో అంతర్భాగమైపోయిన రామాయణ కథల పరిశీలనలో, మరొక స్త్రీల పాట ‘సీత గడియ‘పై వెల్చేరు నారాయణరావు వ్యాసం; ఈ శీర్షికా సంప్రదాయంలో భాగంగా కోలవెన్ను మలయవాసిని 2000 ఆగస్ట్, షికాగోలో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద, సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం వీడియో; ఒకే గీతాన్ని ఇద్దరు గాయకులు, చిదంబరం, పద్మావతి వేర్వేరు రాగమాలికలుగా పాడిన కనకప్రసాద్ శబ్ద రచన త్రిపురాంతకేశ్వరా!; టంగుటూరి సూర్యకుమారి పాడిన నిర్వాణ షట్కం అపురూపమైన ఆడియో, ఈ సంచికలో ప్రత్యేకతలు.


ఈ సంచికలో: ఇంద్రాణి, దమయంతి, కనకప్రసాద్‌, తఃతః, రవి, ఉదయకళల కవితలు; రోహిణీప్రసాద్ పిలూ రాగ పరిచయం; కొక్కొండ పంతులుగారిపై కృష్ణ మోహన రావు సాహిత్య వ్యాసం; పూర్ణిమ, సాయి బ్రహ్మానందం, శారద, మాధవ్, గౌరిల కథలు; బ్రహ్మానందం పుస్తక సమీక్ష, వేంకటేశ్వరరావు వ్యంగ్య రచన, గిరిధరరావు చెప్తున్న కథ నచ్చిన కారణం, కినిమా పత్రిక ముచ్చట్లు; కనకప్రసాద్, సురేశ్, బృందావనరావుల ధారావాహికా వ్యాసాలు…

సూర్యకుమారిగారు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాదు వచ్చినప్పుడు ఆకాశవాణివారి కేంద్రంలో ఈ ఆది శంకరుని రచనగా భావించబడే “నిర్వాణ షట్కం” (లేక నిర్వాణ శతకం) రికార్డింగు చేయబడింది. ఈ షట్కాన్ని సూర్యకుమారిగారే స్వరపరచుకున్నారు. ఇంగ్లాండులో ఆవిడ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోను పాడేవారు.

వెల్చేరు నారాయణరావుగారు మనకు ప్రసిద్ధ సాహితీ విమర్శకులుగా, విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కవి అని మనలో ఎక్కువమందికి తెలియదు. ఆయన వ్రాసిన మంచి కవితలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సంపుటంగా తీసుకురావాలని మేము సంకల్పించాము.

ఆ సంధియుగములో తెలుగు సాహిత్యములో ముగ్గురు హేమహేమీలు ఉండేవారు, వారు – కొక్కొండ వేంకటరత్నము పంతులు, కందుకూరి వీరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి. అందరూ చిన్నయ సూరి విధానమే అనుసరించారు. కాని వారి మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువ. ముగ్గురికీ మూడు పత్రికలు ఉండేవి.

2000 సంవత్సరం ఆగస్ట్ 18-19వ తేదీల్లో షికాగోలో జరిగిన రెండవ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో “సాహిత్యం – స్త్రీల చైతన్యం” అనే అంశం మీద డా. కోలవెన్ను మలయవాసినిగారి ప్రసంగం వీడియో ఇది. ఈ ప్రసంగంలో వారు సాహిత్యంలో ఉపేక్షిత పాత్రలైన అనసూయ-ప్రియంవద, ఊర్మిళ, శ్రుతకీర్తులను ప్రస్తావించారు.

ఆమెని గుర్తు పట్టగానే అక్కడున్న మిగతా స్త్రీలందరూ నిర్ఘాంత పోయారు. మెల్లిగా వారిలో వారు గుస గుసలు పెట్టుకున్నారు. “సిగ్గులేని మొహం”, “తగుదునమ్మా అంటూ వీధిలోకొచ్చింది” పెద్దగానే మాటలు వినపడటంతో ఆమె తలెత్తి చూసింది.