మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.

సాలూరి రా.రా భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పువుంది. నిరాడంబరజీవి.

వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది.

శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని గుర్తుంచుకోవటానికి ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది విద్యార్థులకు రాగస్వరూపాన్ని సులభంగా నేర్పాలని చేసిన ప్రయత్నం. వెంటనే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, విశ్వనాథన్, వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.

ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.

ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్, కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది.

అంత హాయిగా, ధారాళంగా, మంచి విషయ పరిజ్ఞానంతో కబుర్లు చెప్పే మనుషుల్ని నేను చాలా తక్కువ మందిని కలిశాను. దేశ స్వాతంత్ర్యోద్యమం గురించి, 1925-1960ల మధ్య కాలం నాటి సాంస్కృతిక జీవనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పేవారు. ఇంక ఆ కాలం నాటి నాటక, సంగీత ప్రపంచం గురించయితే చెప్పనక్కరలేదు.

అనాదిగా స్త్రీని ఎన్నో రకాలుగా చిత్రకారులు చిత్రిస్తున్నారు. అయితే, ఏ చిత్రం స్త్రీ అంతరంగాన్ని కూడా చూపిస్తుంది, ఏ చిత్రం స్త్రీని కేవలం ఒక విలాసవస్తువుగానే గమనిస్తుంది, చిత్రకళా చరిత్రలో స్త్రీ మూర్తి చిత్రానికి ఉన్న విశిష్టత ఏమిటి — వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన సచిత్ర వ్యాసం ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి; భారతీయ సాహిత్యంలో వాస్తవికత పాశ్చాత్య సాహిత్య విమర్శకు ఎందుకు అందదో సత్య మొహంతితో ముఖాముఖీ-1: సాహిత్యంలో వాస్తవిక వాదం భరణి కొల్లిపర అనువాదం; సుమతీ శతకం వలస పాలన వల్ల ఒక నీతి శతకంగా మన సంస్కృతిలో ఎలా మార్పు చెందిందో వివరిస్తున్న వెల్చేరు నారాయణ రావు వ్యాసంతెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం ఈ సంచికలో ప్రత్యేకం.


ఇంకా: మూలా సుబ్రహ్మణ్యం, జాన్ హైడ్ కనుమూరి, స్వాతికుమారి బండ్లమూడి, తః తః కవితలు; గౌరీ కృపానందన్, జయప్రభ కథలు; మెలికముగ్గులలో గణితశాస్త్రపు ముడులు విప్పదీసే జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; భాసుని సంస్కృత నాటకం ప్రతిమ నుంచి ఒక సన్నివేశం; పాలగుమ్మి విశ్వనాథానికి లలిత సంగీత నివాళి — పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న అపురూపమైన ఆడియోలు; నాకు నచ్చిన పద్యం, కథ నచ్చిన కారణం…

సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి రాలేదు. తెలుగు గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా.

వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.

చుట్టు పక్కలంతా దీపాలు వెలిగినప్పుడు,
కొండెక్కలేని ఒత్తి రెపరెపలు లీలగా…
అతనికి ఉన్నపళాన బెంబేలౌతుంది
‘వెళ్ళొస్తా’ అనడానికి తడారిన నోరు పెగలదు.
వయసు తరుముతున్నవాడిలా
చకచకా, ఒక్క విసురుతో
మెట్లపైకి దూకి పలాయిస్తాడు…

పుప్పొడి అనే కవితలో పంక్తుల సంఖ్య ఆఱు మాత్రమే. కాని అది చదివినప్పుడు కలిగిన అనుభూతి అపారమైనది. 25 సంవత్సరాలకు ముందు కార్ల్ సేగన్ మనమంతా, అంటే ఆ ఆకాశము, అందులోని ఎన్నో పాలవెల్లులు, మన సౌర కుటుంబము, దానిలోని మన భూమి, అందులో అన్ని జీవజాలాలు అంతా ఆ ఖగోళ బీజము నుండి పుట్టిన అణువులు అని చెప్పిన మాట స్మృతిలో నిద్దుర లేచింది.

చుక్కలను తాకకుండ వాటి చుట్టు ముగ్గుపొడితో, తడి పిండితో చిత్రవిచిత్రములైన ఆకారములను సృష్టించుటకు వీలవుతుంది. వీటిని మెలిక ముగ్గులు లేక మువ్వల ముగ్గులు అంటారు. వీటిని జాగ్రత్తగా వేసినప్పుడు ఇందులో ముడులు కనబడుతాయి. ఇవి త్రాటితో లేక త్రాళ్ళతో నేసిన తివాచీలలా కూడ ఉంటాయి. ఇవియే నిజమైన మెలిక ముగ్గులు.

సహజీవన మంటే
అడుగునున్నవా
ళ్ళరుపులు లేకుండా
అడుక్కుంటూ
అడుక్కు, అడుక్కు
మరీ మరీ అడుక్కు
-మరీ మరీ అడక్కు-
ఉండిపోవటం

మూలభారత కథలో దుష్యంతుడు కొద్ది గడియల సేపు మాత్రమే కణ్వాశ్రమంలో ఉండి శకుంతలను లోబరుచుకొని – కణ్వ మహర్షి వచ్చేలోగా వెళ్ళిపోతాడు. కాళిదాసు నాటకంలో దుష్యంతుడు మున్యాశ్రమంలో కొన్ని రోజులుండి, మునులకు రాక్షస బాధ లేకుండా చేసి, శకుంతలతో ప్రణయ కథ నడిపి వెళ్ళిపోతాడు. పిన వీరన దుష్యంతుణ్ణి చాలా రోజులు అక్కడ వుంచి – ప్రణయానికీ విరహానికీ, చంద్రోదయ వర్ణనకూ, యుద్ధ వర్ణనకూ – అన్నిటికీ అవకాశం ఆ సమయంలో కల్పించుకున్నాడు.

కథ అని అనిపించుకోటానికి ఒక రచనకి ఉండవలసిన సహజమైన లక్షణాలు మనకి, పాశ్చాత్యులకీ ఒకటే! ఆ మాట కొస్తే, కథకి ఉండే లక్షణాలు, పాశ్చాత్యుల దగ్గిరనుంచే మనం నేర్చుకున్నాం. కాని, ఆ లక్షణాలని ఒక బిగువైన చట్రంలో బంధించి కథని చూడటం, విమర్శించడం మనం ఇంకా మానేయలేదు. అంతే కాకుండా, కథ లక్షణాలుగా మనం భావిస్తూ, ప్రచారం చేస్తున్నవి బాగా పాతపడిన పద్ధతులని మనం తెలుసుకోవడం అవసరం.