ఇజాలు రాసే వాళ్ళంతా వాటిని పాటిస్తారని హామీ ఏదీ లేదు. నా వరకూ నేను మానవ ప్రవృత్తిని, స్వభావాన్ని పరిశీలించడాన్ని చిత్రించడాన్ని ఇష్టపడతాను. మనుషుల సహజ స్వభావం ఎలా ఉంటుందో కథల్లో యదాతథంగా చిత్రించడానికే నా ప్రాధాన్యం. నేను రాసింది కూడా అవే!

ఈ అరుదైన యక్షగానం బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంగీతం కట్టి 1999 వేసవిలో విజయవాడ రేడియో కేంద్రం ద్వారా ప్రసారం చేసినది.

20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా అబ్బూరి రామకృష్ణరావుగారి పేరు తెలియకుండా వుండదు. శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని ప్రశంసించేవాడు.

మీరు కూసి ఒక కోడిని లేపండి
భుజంమీద ఒక రామచిలుకతో
ఉద్యోగానికి వెళ్ళండి
మీతో అల్లరి ఆటలాడే పిల్లితో కలిసి
ఒక మధ్యాహ్నం భోజనం చెయ్యండి

మూడువందల సంవత్సరాలకు పైగా సంఖ్యాగణిత శాస్త్రజ్ఞులకు కొరకరాని కొయ్యగా మిగిలిన ఫెర్మా చివరి సిద్ధాంతాన్ని, బ్రిటన్‌కు చెందిన సర్ ఏండ్రూ వైల్స్ మొదట 1993లోనే రుజువు చేసినప్పటికీ, అందులో ఒక లొసుగు కానవచ్చింది. రిచర్డ్ టేలర్ సహకారంతో అందులోని లొసుగులు సవరించి తిరిగి 1995లో ప్రచురించి శాస్త్రప్రపంచాన్ని ఇప్పటికి పూర్తిగా ఒప్పించాడు. ఎన్నో ఏండ్ల అకుంఠిత దీక్షతో అసాధ్యాన్ని సాధ్యం చేసిన వైల్స్ కృషికి ఫలితంగా గణితంలో నోబెల్ బహుమతితో సమానంగా గౌరవించబడే ఆబెల్ ప్రైజ్ ఈ ఏడాది ఆయనకు దక్కింది. ఈ సందర్భంగా ఎంతో క్లిష్టమైన ఆ సిద్ధాంతాన్ని, దాని నిరూపణ వెనుక ఉన్న కృషిని, చరిత్రనీ సరళంగా, అందరికీ అర్థమయ్యేలా వివరించే సాహసం చేసి కృతకృత్యులైన వేమూరి వేంకటేశ్వరరావు వ్యాసం – ఫెర్మా చివరి సిద్ధాంతం ఈసంచికలో; కేవలం సైన్స్ అభిమానులే కాక అందరూ చదవదగినది. ప్రొఫెసర్ వేమూరి కృషికి అభినందనలు.

సుప్రసిద్ఢ కథ పాతాళ భైరవికి గాను యోగ్యుడైన, అర్హుడైన కథానాయకుడు కావలెను. రూపములో, గుణములో, ధైర్యసాహసములలో, సత్ప్రవర్తనలో, ఇన్నినాళ్ళూ ఈ కథకు నాయకుడిగా ఉండి, ప్రజల మనసును చూరగొన్న తోటరాముడిని మరిపించి, మురిపించగలిగే దిట్టయి ఉండవలెను. యుక్తితో, శక్తితో మాయావి మాంత్రికుడిని మట్టి కరిపించి, రాజకుమారిని పరిగ్రహించి, పాతాళ భైరవి ఆశీస్సు…

గాలి సావిట్లోకొస్తే
ఎవరు చూడొచ్చేరు?
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.

[అవినేని భాస్కర్ బోధిచెట్టులో సగంచెట్టు (బోదిమరత్తిల్ పాదిమరం) అన్న అనువాద కవిత తమిళ మూలం; తమిళ్, తెలుగు లిపులలో. కొంజం తేనీర్ నిఱైయ వానం […]

గణిత ప్రపంచంలో మూడు శతాబ్దాలకి పైబడి పరిష్కారం లేకుండా ఉండిపోయిన అతి జటిలమైన సమస్య ఏదయ్యా అంటే అది ఫెర్మా కదాచిత్తుగా ప్రవచించిన ఒక అభిప్రాయం. ఎవరీ ఫెర్మా? ఏమిటా శిష్టాభిప్రాయం? ఈ సమస్య పరిష్కారం లేకుండా మూడు వందల ఏళ్ళు పైబడి ఎందుకు ఉండిపోయింది? చివరికి పరిష్కారం ఎలా దొరికింది?

ప్రియుని ప్రవాసవార్తను విన్నంతనే ఆమె తనువు కృశించినది. కన్నీరు నిరంతరముగా కారిపోయినది. ఆ వెళ్ళబోవుప్రియునితో అతనికి మిత్రములైనట్లుగా ఇవన్నియు బయలుదేరినవి. ఒక్క ప్రాణము మాత్రమే ఆమెలో మిగిలియున్నది. ఓప్రాణమా! నీవును నీకు మిత్రసమానులైన వారితో బోవక ఎందుకున్నావు? అని యామె ప్రశ్నించుచున్నది.

శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.

మల్లెపూలు కోసుకొచ్చి, ఒడిలో పోసుకొని, తల్లి దగ్గర కూర్చొని ఉంది కొత్త పెళ్ళికూతురు. ఒకో పువ్వుని తల్లికి అందిస్తూ ఉంటే ఆమె కూతురికి చక్కని వాలుజడ అల్లుతోంది. ఈ లోపున ఈయన వచ్చారు. ఇంకా కొత్త కదా, సిగ్గూ బిడియం పోలేదు. ఆయన్ని అలా చూసేసరికల్లా ఆ నవోఢకు ఏం చేయడానికీ పాలుపోలేదు. దగ్గరకి వెళ్ళాలా, అలాగే ఉండాలా, సిగ్గుతో పారిపోవాలా – ఏమీ తెలియక, ఏదో చేయాలన్న తొందరలో, దిగ్గునలేచి మునిగాళ్ళపై నిలుచుండిపోయింది.

తెలుగు వైయాకరణులు సాధురేఫను లఘురేఫ, శుద్ధరేఫ, మేలురా, గుండురా అని, బండి-ఱను అలఘురేఫ, శకటరేఫ, గౌరవరేఫ, పెద్దఱ, గురుఱ అని పలురకాల పేర్లతో ప్రస్తావించారు. బండి-ఱ లిపి రూపం రెండు బండి చక్రాలతో, మధ్యలో గీత ఇరు,సు లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బండి-ఱ అన్నారని మనం ఊహించవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం పరిశీలనగా చదివి, పరిశోధన చేసి పిహెచ్‌డీలు సంపాదించుకున్న విద్యార్థుల్లో కొందరినీ, తెలుగుదేశంలో ప్రామాణికమైన పరిశోధన చేసిన కొందరినీ, పిలిచి అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16-17 తేదీల్లో, అధ్యాపకులు వెల్చేరు నారాయణరావు, జాయ్స్ ఫ్లూకిగర్ ఒక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు సాహిత్య విమర్శ మీద కొత్త ఆలోచనలు ఆవిష్కరించడానికి పరిశోధన మార్గాలలో కొత్త పద్ధతులు అనుసరించడానికి, ఈ సంవృత సదస్సు ఉద్దేశించబడింది. అంతర్జాతీయంగా తెలుగు సాహిత్య విమర్శకి ప్రామాణిక స్థానం ఏర్పడడం, ప్రపంచ సాహిత్య విమర్శలో తెలుగు సాహిత్య విమర్శ ఒక భాగం కావటం ఈ సదస్సు వల్ల ఉద్దేశించిన ఫలితాలు. ఈ సదస్సుకు కావలసిన ఖర్చులన్నీ ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ప్రత్యేకమైన ఆచార్య పీఠం ఏర్పాటు చేసిన కొప్పాక కుటుంబం వాళ్ళే ఇచ్చారు. ఈ సదస్సులో చర్చల ఫలితంగా వ్యాసరచయితలు తమ వ్యాసాలను పరిష్కరించుకున్న తరువాత వాటినన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించాలని నిర్వాహకుల ఉద్దేశ్యం. అలా పుస్తకంగా రాకముందు ఆ వ్యాసాలను కొన్నింటిని అనువాదం చేసి ఈమాటలో ముందుగా వేయటానికి ఆయా వ్యాసరచయితలు అంగీకరించారు. వారికి మా కృతజ్ఞతలు.