ఏం వాగుతున్నావురా? దేవుడంటే అనంతం కదా? అలా మెళ్ళో వేలాడదీసుకుని ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోయేవాడు దేవుడెలా ఔతాడు? ఒళ్ళు కొవ్వెక్కి నిజానిజాలు తెలియక మాట్లాడుతున్నావు కాబోలు. విను, దేవుడంటే మా బ్రహ్మ ఒక్కడే. ఆయనే ఈ సృష్టి అంతట్నీ సృజించి లయం చేస్తూ ఉంటాడు. ఆయన్ని గుర్తుంచుకోవడానికి అనేకానేక గుళ్ళూ, గోపురాలు కట్టాం. ఓ సారి గంగాతీరం పోయి చూసిరా.
శీర్షికలు సంచికలు
బాణాసురుడు ఒక విపరీత మనస్తత్వం కలిగినవాడు. ఇతను బలిచక్రవర్తి కుమారుడు. బహుశా యితని చిన్నతనంలోనే తండ్రి పాతాళానికి వెళ్ళిపోయాడేమో! ఇతని చిన్నతనం గురించి అంతగా తెలియదు కాని కొంత పెద్దవాడయ్యాక గొప్ప శివభక్తుడవుతాడు. ఒకనాడు శివుడు కుమారస్వామిని వాత్సల్యంతో దగ్గరకు తీసుకోడం చూసిన బాణునికి సంతోషమూ విచారమూ ఒకేసారి కలుగుతాయి. తన తండ్రి ఉండుంటే తనని కూడా అలా లాలించేవాడు కదా అనుకొంటాడు.
నీ మీద నేనొక పద్యం
నీ వీపు పలక మీదో
చన్నుల గుండ్రాల మీదో
మొదలుబెట్టి నప్పుడు
నువ్వు తెచ్చిపెట్టుకున్న
బడాయి బింకం
సడలిపోతుంది
నిద్రిస్తున్న రహదారిని లేపి
కృతజ్ఞతలు చెప్పాలని ఉందినిద్రాభంగమైన
ఆ ప్రశాంతతను గమనించాలని ఉంది
నీ వాసన వేసే చీకటి
నీ ఒంటరితనపు
మేలి ముసుగు కప్పుకుని
నీ ముందు
కూర్చున్న చీకటి
చిన్న చీకటి
ఇక అప్పుడు, నా మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నన్ను దగ్గరకి లాక్కుంటే, మంచు రాలి కాలం వొణికే వేళల్లో, ఎవరో చివ్వున ఒక నెగడును రగిలించిన కాంతి-
మరి అప్పుడే ఎక్కడో గూ గూ మని పావురాళ్ళ కువకువలు
మరి బ్రతికే ఉన్నామా మనం, అప్పుడు?
నువ్వు పరాకుగా ఒంటరిగా సంచరిస్తున్నప్పుడు, నీ ఇంటి పెరట్లోనో
రద్దీ వీధులలోనో ఒక హస్తం నిన్ను తాకి వెళ్ళి పోతుంది. అప్పుడే ఉతికి
ఆరవేసిన వస్త్రం గాలికి కదిలి ఇంత తడిని నీ ముఖాన చిమ్మినట్టు-
మరి ఇంతకూ
సంధ్యా సమయంలో, కలువ పూల చుట్టూ గుమికూడి
ఒక బిందువులోకిపునర్యానం
అవుతున్న
ఆ వలయాలను చూశావా నువ్వు?
ఆ ఉద్యానవనంలో రాలతాయి తన కనురెప్పలు అశ్రువులతో
అచ్చంగా గాలి లేక వడలి, నీ అరచేయి తాకగానే
కోటులోనే విడివడి రాలిపోయిన పూరేకుల వలే-
ఉద్యోగ పర్వంలో మనోహరమైన కథ లేదు. అసలీ పర్వంలో కథకు ప్రాధాన్యం మిక్కిలి తక్కువ. ఉపాఖ్యానాలను తొలగించి చూస్తే దీనిలోని ప్రధాన కథావస్తువు ద్రుపద పురోహితుని, సంజయుని, కృష్ణుని రాయబారాలే. ఇంతమంది ఒకే విషయాన్ని చెప్పితే అది పునరుక్తి అవుతుంది. అలా పునరుక్తి కాకుండా, ఉత్కంఠ కలిగిస్తూ విషయ వివరణ చేయటం లోనే కవిబ్రహ్మ ప్రతిభ, అనన్య సామాన్యమైన వస్తు సంవిధాన నైపుణ్యం మనకు గోచరిస్తాయి.
గృహమును, దేహమును చక్కగా నలంకరించుకొని, చెలికత్తెలతో నాయకుని గుణగణములను ముచ్చటించుచు, అతని రాకకై ఎదురుచూచునట్టి వాసకసజ్జిక, అతడెంత కాలమునకును రాకపోవుటచే నుత్కంఠాపూరితయై, అతని విరహమును సహింపలేక విరహోత్కంఠిత యగును.
మోహన రాగంలోని తీవ్ర (అంతర) గాంధారానికి బదులుగా కోమల (సాధారణ) గాంధారాన్ని వాడటం వల్ల ఏర్పడే శివరంజని రాగఛ్చాయలో కనిపించే అనూహ్యమైన మార్పు ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే!
ఈ సంచికలో వినిపిస్తున్న పాటలు సుమారు 1915-1924 మధ్య కాలంలో రికార్డు కాబడినవి. అంటే రికార్డయిన తొలి ‘తెలుగు’ పాటలు!
నిదుర విడిన మొదలు
చిదురులు పది వేలు
నిలుకడ మూగ వలె
నిలచిన మన్నారు
పట్రాయని సంగీతరావు గారు ఈమాట పాఠకులకు సుపరిచితమే. 1930-40 ప్రాంతంలో, సాంస్కృతిక కేంద్రంగా విజయనగరం గురించిన ఆయన జ్ఞాపకాలను ఈ సంచికలో మీరు వింటారు.
అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, […]
!!!ఈమాట రచయితలకూ పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
ఈమాట సజీవంగా సగర్వంగా 17వ ఏడులోకి అడుగు పెట్టింది. మీ సహాయసహకారాలు ఆదరాభిమానాలు లేకుండా ఇది ఎంతమాత్రమూ సాధ్యమయేది కాదు. అందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాం. అయితే ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నడవవలసిన దారి అంతా ముందే ఉన్నది. అందువల్ల, మారుతున్న కాలంతో పాటు మారుతూ కొత్త తరాల రచయితలనూ, పాఠకులనూ ఈమాట సాహితీప్రయాణంలో సహగాములను చేయడానికి, ఈమాట అందరికీ మరింత చేరువ కావడానికీ ప్రయత్నిస్తున్నాం. అదే సమయంలో సాహిత్యాన్ని సాహిత్యంగానే మననీయాలనే మా ఆశయాన్ని, మేము నమ్మిన సాహిత్యపు విలువలను కాపాడుకోవడానికి, సాహిత్యధోరణుల పాతకొత్తల మేలు కలయికగా ఈమాటను నడపడానికీ కృషి చేస్తున్నాం. సాహిత్యస్పందన తక్షణమూ, తాత్కాలికమూ అయి ఆవేశకావేషాలు రగిలించే జాతిమతవాద రాజకీయధోరణుల ప్రాబల్యానికి పనిముట్టు కాదనీ కారాదనీ మా నమ్మకం. ఆహ్లాదాన్నీ ఆలోచననీ కలిగించే సృజనాత్మక సాహిత్యంతో పాటు, విశ్లేషణాత్మక విమర్శావ్యాసాలను ప్రోత్సహించడం ద్వారా సాహిత్య చర్చలకు దోహదం చేయాలనీ, ఈమాట అందుకు ఒక చక్కటి వేదిక కావాలనీ మా కోరిక, మా ప్రయత్నమూ. ఈ దిశగా ఈమాట ప్రయాణం మీ తోడ్పాటు, ప్రోత్సాహం లేకుండా ఇప్పటిదాకా జరగలేదు. ఇకముందూ జరగదు. మీ ఆశీస్సులు, మీ సహకారం ఇకముందూ ఈమాటకు ఉంటాయని ఆశిస్తూ, ఉండాలని ప్రార్థిస్తూ, ఈమాట నిర్వహణలోనూ, ఆశయాలలోనూ ఏమాత్రమూ రాజీ పడమని హామీ ఇస్తూ, మీ అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.
అందరూ గోతిలో పడిపోయి గోల పెడుతున్నారనుకుంటే ఆయన లాంటి వాళ్ళకి ఒక తృప్తి. జనాన్ని పిల్చి ‘ఇదిగో చూడండి. పాపం వీడు గోతిలో వున్నాడు. కష్టాల్లో వున్నాడు. అమాయకుడు. ఎలా బ్రతకాలో కూడా వీడికి తెలియదు. నేనే వీడిని కనిపెట్టి చేరదీసి జీవితాన్ని బాగుచేసుకోవడమెలాగో నేర్పిస్తున్నాను,’ అని చెప్పుకోవడం సరదా. ఎందుకంటే బాధల్లో బలహీనతల్లో వున్న వారి గురించి చెప్పుకుంటేనే కదా ఆయనలాంటి వాళ్ళకి పేరూ ప్రఖ్యాతి. ఒకళ్ళని ఉద్దరిస్తున్నామంటేనే కదా వాళ్ళకి ప్రత్యేకత!
కేవలం దుఃఖాలకీ ఆనందాలకీ తప్ప అసలైన కళా ప్రదర్శనలకి వేటికీ నిన్ను స్టేజీ ముందర కూర్చోబెట్టలేకపోయానని నాకు విచారంగా వున్నది – ఇప్పుడే కాదు, ఎప్పటినించో! నవ్వకు – నా ఖర్మ కాలి ఇలా మంచానికి బందీ నయి కళ్ళు మూతలు పడినప్పుడే నాకు సంగీతమూ, నృత్యమూ ఏవీ రావు అని గుర్తుకొచ్చి బాగవగానే ఈసారి తప్పకుండా నేర్చుకోవాలని అనిపించేది. తరువాత లేస్తానా, అదేమిటో, వాటి విషయమే పూర్తిగా మర్చిపోతాను. పోనీ, ఫాతిమాకి అవేమైనా వచ్చా?
ఆ రోజు రాత్రి తీర్థయ్యకు మళ్ళీ అదే కల వచ్చింది. చౌరంగీ రస్తాకు రెండువైపులా లక్షల సంఖ్యలో జనం నిలబడి ఉన్నట్టూ, వాళ్ళంతా రాతివిగ్రహాలై నిశ్చలంగా నిలబడినట్టూ, దారికి రెండువైపులా పెద్దపెద్ద తెల్లటి నియాన్ దీపాలు వెలుగుతున్నట్టూ! ఆ దారంతా రక్తం! అక్కడ నిలబడి ఒక నడివయస్సు స్త్రీ ఛాతీని రెండు చేతులతో బాదుకుంటూ, ప్రవీర్! ప్రవీర్! అంటూ విలపిస్తోంది. ఆమె విరగబోసుకున్న పొడుగాటి జుట్టు ముఖం మీద పడుతోంది.