దారి-
గరికపూల అంచులున్న
మెరిసే ఎండచీర.
నీడపింఛం విప్పి
గాలికి కాస్త
తలూపే చెట్టు.
అడ్డం అడ్డం ముందుభాగాన చెదిరిన వరసా? (3) ఇంటి ముందుభాగం వసారా. దాన్ని వాడుకలో వసార అంటాం. ఆధారంలో ఇచ్చిన వరసా చెదిరి వసార […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
శ్రీమతి వాలి ఉమాదేవి, వాలి హిరణ్మయీదేవి అనే పేరుతో 80వ దశకంలో విరివిగా కథలు వ్రాశారు. మంచి కథల రచయిత్రిగా పత్రికా పాఠకులకు చిరపరిచితులు. హిరణ్మయీదేవి గారు ఎప్పటినుంచో రాస్తున్నా, ఇటీవలి కాలంలో రాసిన 22 కథలతో స్వప్నసాకారం అనే వారి మొదటి సంపుటం లోని కథలకు ఒక సంక్షిప్త పరిచయం.
గడి నుడి-4కి చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చాయి. ఐతే తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. దాదాపు ఇరవైమంది పరిష్కారాలు పంపినా అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఇద్దరే: 1. శ్రీవల్లీరాధిక, 2. కె. వి. గిరిధరరావు. ఇద్దరికీ అభినందనలు!
A Cento verse created from the first lines of A Poem at the Right Moment for Velcheru Narayana Rao on the occasion of his 85th birthday that falls on February 1, 2017.
స్క్రిప్టు ఇంకా పూర్తిగా రాయబడలేదు. క్లయిమాక్సుని ఎలా ముగించాలో తెలియక సినేరిస్టులు (అంటే స్క్రీన్రైటర్లే. సినేరియోలు రాస్తారని అలా అనేవారు లెండి ఒకప్పుడు) తలలు పట్టుకున్నారు. అప్పటికే ముగ్గురి తలలు ఎగిరి పడ్డాయి కూడా. ఈ లోపల హీరోగారికి అసహనం పెరిగిపోతోంది.
రాత్రి నిద్ర పట్టేదాకా నా కళ్ళు బల్ల మీదున్నరజనీగంధ పూలనే చూస్తూ ఉండిపోతాయి. నాకేంటో అవి పువ్వులు కావని, అవన్నీ సంజయ్ ఎన్నోరకాల కళ్ళని, అవి నన్నే చూస్తున్నాయని, నా ఒంటిని నిమురుతున్నాయని, ప్రేమ కురిపిస్తున్నాయనీ భ్రమ కలుగుతుంది. అంతగా అన్ని కళ్ళు నన్ను చూస్తున్నాయనే కల్పన నన్ను సిగ్గులో ముంచుతుంది.
చెరువులోని చేపలన్నీ పట్టి
ఆకాశం వైపుకు వల విసిరినట్టు
పక్షుల గుంపులు.
నా గుండె ఎక్కడ చిక్కుకుందో-
వెనక్కిలాగే లోపే వల పైపైకిపోయింది
ఇప్పుడే ఇదే దృశ్యాన్ని– భార్య తన కమిలిన చేతిని సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు చూపించే సన్నివేశాన్ని– యథాతథంగా సాహిత్యంలోకి తేవడం ఎట్లా? దీన్ని డ్రమటైజ్ చేశామా, వాస్తవం పక్కకు పోతుంది; పోనీ ఉన్నది వున్నట్టు చెప్దామా, ఆ ఎఫెక్ట్ రాదు. అందుకే, సాహిత్యం చెప్పగలిగేది జీవితమంతటిది ఉండొచ్చు గానీ, జీవితం మొత్తం తన పూర్తి ముఖంతో సాహిత్యం లోకి వస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు.
అలయక సొలయక వేసట
నొలయక కరి మహెక్కరి తోడ నుద్దండత రా
హెక్త్రులు సంధ్యలు దిహెక్సంబులు
సలిపెన్ బోహెక్ రొక్క వేయి సంహెక్సరముల్.
(ఆడియో కథనంతో!)
జస్ట్ ఎ లిటిల్ థాట్,
ఎంత పెద్ద బరువు?
గుండె మోయలేనంతగా
ఇదా జీవితం అనిపించేంతగా…
శూన్యం నిజంగా శూన్యమేనా?!
మాధవరావు గుండె దడదడలాడింది. చేతులు వణికాయి. కణతలు నొక్కుకుపోతున్నట్టుగా ఫీలయ్యాడు. వొంటరితనం, ఎదురుగా రమణి, ఆమె చొరవ- ఇవన్నీ కలిసి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోమాట లేకుండా దగ్గరగా జరిగి ఆమెను కావలించుకొన్నాడు. రమణి కూడా గువ్వలా అతని చేతుల్లో ఇమిడిపోయింది. మాధవరావు ఆమె ముఖాన్ని తనకేసి తిప్పుకొని__
మంద్రమైన అనుభూతులవేవో లోకాల నుంచి
గాలుల్లాగా నాలోంచి నాలోకి వీచాయి
మధురమైన సంగీతమదేదో అమరంగా
నిలిపింది పురాస్మృతుల్ని ఒక గానంగా
మాటలు జూస్తే
మూటలు నిండుతయి
బతికిశెడ్డ దొరలమని
గాలిల కోటలు కడ్తరు సొక్కమైనోళ్ళు
శింపిరి గడ్డం మాశిన బట్టల కశీరు దూలాలు
సభలో అందరూ రాజుగార్ని ఆహ్వానించాక చర్చ మొదలైంది. సారాంశం ఏమిటంటే రాజు లైలీ మెరుపుదాడి చేసి ఎసర్హాడన్ని చంపేసి వదుల్చుకుంటే పీడ విరగడౌతుంది. దీనికి లైలీ ఒప్పుకోలేదు. “వద్దు. యుద్ధం మూలంగా జనక్షయం మన వల్ల ఎప్పుడూ మొదలు కాకూడదు. శాంతిదూతలుగా ఓ అయిదారుగుర్ని పంపించి ఎసర్హాడన్తో మంచిగా మాట్లాడి చెప్పి చూడమందాం. ఎంత కఠినాత్ముడైనా కాస్త మంచిగా మాట్లాడితే వింటాడన్న నమ్మకం నాకుంది.”
దేవుడు పని చెయ్యడు
భక్తుడు పని చెయ్యడు
నెత్తిన నెమలీక పెట్టుకుని ఒకరు
తాబేటి చిప్ప పట్టుకుని మరొకరు
బజారు తిరుగుతారిద్దరూ
దేవుడికీ భక్తుడికీ మధ్య రొమాన్స్ కవిత్వం
మీరా, రూమీ, అన్నమయ్య ఎవర్నేనా అడుగు
రూపుదిద్దుకునే భావాల
పసి పాదాలు
తెమ్మెరలై వచ్చి
తగులుతున్న ప్రతిసారీ
మరో జన్మెత్తుతున్న సంబరం
తెలుగు సాహిత్యములోగల పలు ప్రత్యేకతలలో ఉదాహరణము మిక్కిలి ప్రసిద్ధి యైనది. ఉదాహరణము అనగా ప్రతియొక విభక్తితో మూడు చొప్పున పద్యములు వ్రాసి చివర అన్ని విభక్తులతో ఒక పద్యమును వ్రాయుట. అంకితాంకముతో మొత్తము ఇరువదియాఱు పద్యములతో వ్రాయబడిన ఇట్టిది ఒక లఘుకావ్యము లేక క్షుద్రకావ్యము. ఇది చతుర్విధ కవితలలో మధుర కవిత వర్గమునకు చెందినది.