ఈ ప్రక్షేపణ చెరసాల నుంచి తప్పించుకుంటే
ఏమైపోతాను?
ఏమీ కాకుండా మిగిలిపోతానా?
అక్కడికీ వస్తాయా ఆ కళ్ళు?
శీర్షికలు సంచికలు
రెప్పపాటులో అంతా మారిపోయింది. తలలో విపరీతమైన పోటు. నలుగురు మనుషులు దిమ్మ దిమ్మ గుద్దినట్టు. నిలబడలేనితనం ఏదో ఆవహిస్తుండగా ఒక్కసారిగా ముందుకొరగబోయి తమాయించుకున్నాడు.
“నీ పెళ్ళాం గురిచ్చి తెలుసునన్నావుగా సారూ.”
“ఎందుకు తెలీదు?”
“సరే ఒక ప్రశ్న అడగతా వుండాను చెప్పు. నీ పెళ్ళానికి ఇష్టమైన రంగేంది? ఈ ప్రశ్నకు జవాబు చెప్తే నిన్ను వొదిలేస్తాను.”
కథలన్నీ జీవితాలనుంచి నడుచుకుంటూ వచ్చాయి కాబట్టి నిజాయితీగా ఉంటాయి. లోతైన పరిశీలనా దృష్టి ఉండటంతో దాదాపు అన్ని కథలలోనూ తాత్వికత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
బంగారానికి తావి అబ్బినట్టు, ఒక వృక్షశాస్త్రం చదువుకున్న వ్యక్తికి, ఆ శాస్త్రంపట్ల ఇచ్ఛుకత ఉన్న వ్యక్తికి, అదృష్టవశాత్తు వృత్తిపరంగా కూడా తాను చదువుకున్న జ్ఞానాన్ని ఉపయుక్తం చేసుకోగలిగే వెసులుబాటు కలిగి ఉండటం ఒక గొప్ప వరం.
దేవులపల్లి కృష్ణశాస్త్రి కవితలు స్వీయ గానం ఆకాశవాణి ప్రసారం
దేవులపల్లి కృష్ణశాస్త్రి రేడియో ప్రసంగం1954, కాకినాడ
సంగీతం, గానం: పాలగుమ్మి విశ్వనాధం సేకరణ: పరుచూరి శ్రీనివాస్ సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం గానం: నూకల చిన సత్యనారాయణ సేకరణ: పరుచూరి శ్రీనివాస్ సంగీతం: […]
గానం: ఓలేటి వెంకటేశ్వర్లు సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గానం: ఎన్. సిహెచ్. వి. జగన్నాథాచార్యులు సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గానం: ఆర్. ఛాయాదేవి సేకరణ: […]
వేణుకుంజం నాటకం లోని పాటలు – తెలుసా నా గుట్టు రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం: పాలగుమ్మి విశ్వనాధం గాత్రం: వింజమూరి లక్ష్మి వేణుకుంజం […]
సంగీతం: పాలగుమ్మి విశ్వనాథం
గాత్రం: పి. బి. శ్రీనివాస్
సేకరణ: పరుచూరి శ్రీనివాస్
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.
ఛాయ సాహిత్యోత్సవం — 2025. కొత్త కార్యాచరణను ముందడుగు వేయించే ఉత్సాహం ఇది. కొత్త గొంతుకలకు నెలవయ్యే వేదిక ఇది. రానున్న ఎన్నో ప్రయోగాలకిది ప్రారంభపదం.
తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్న కథలు ప్రతి సమాజంలోనూ ఉంటాయి. వారి సమాజంలోని ఆచార వ్యవహారాలను, వారు నమ్మే విలువలను కథలుగా చెప్పుకొనే పురాగాథలే వారి […]
పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.
ద్రౌపది కుమారులు ఐదుగురినీ కోల్పోయిందన్న వార్త నా చెవినపడ్డప్పుడు కూడా అదే జరిగింది. వెంటనే నా మనసు శాంతించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవాలి. ఆమె కడుపు మండిపోవాలి. ఆర్యావర్తంలో ముంచుకొచ్చిన ఈ పెనువిపత్తుకు బీజం వేసింది ఆమె అహంకారం కాదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ధగధగలాడే వజ్రాల కిరీటం ధరించి పట్టమహిషిగా సింహాసనం మీద నవ్వుతూ ఎలా కూర్చుంటుంది?
ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.
ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా తేవాలంటే. “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు. మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది. ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర ఆహార అభద్రతకు ప్రతీక. జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం, జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో ఆనందం ఉంది. రవీంద్రభారతిరంగస్థలంపై దొరకని ఆనందం.
భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది.