డాలీ జూమ్ షాట్ పద్ధతిలో ప్రధాన వస్తువు నుంచీ జూమ్ అవుట్(Zoom out) అవుతూ దృశ్యీకరించడానికి అనువైన పద్యం ఇది. త్రివిక్రముడిని స్థిరంగా ఉంచి, సూర్యబింబాన్ని ప్రధాన వస్తువుగా తీసుకుని, జూమ్ అవుట్ చేస్తూ పోతే – పెద్ద ఛత్రంగా వున్న సూర్యబింబం, క్రమక్రమంగా క్రిందకు దిగుతూ శిరోరత్నం, చెవి పోగు, కంఠాభరణం…చివరగా పాద పీఠం అవుతుంది.

“లల్లేశ్వరి తత్వం శాశ్వతమైనది. దాని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం, ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు,” నాన్న బదులు పలికాడు. “అందుకే నా అనుసృజన ఎప్పటికీ అసంపూర్ణమే!”

. కన్నడంలో ‘మంకుతిమ్మన కగ్గ’ వెలువబడి ఎనిమిది దశాబ్దాలే దొర్లినవి. అయినా ఇలాంటి మహాగ్రంథం కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉన్న తెలుగునాట సాహితీప్రియులకి అందలేదంటే అది ఉభయభాషల బాంధవ్యానికే తీరని తలవంపు.

సైనికదళాల్లోని వృత్తి వాతావరణాన్ని గురించిగానీ, యూనిఫారం ధరించిన వారి జీవన విధానాల గురించిగానీ ప్రజాబాహుళ్యంలో తెలిసింది చాలా తక్కువ కావడం వల్లనే ఇటువంటి కొన్ని అపోహలు చలామణీ అవుతున్నాయి.

తెలుగువారికి, మధుమేహం గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తం ఒక వరం. మూర్తిగారు అన్నీ కూలంకషంగా చర్చించారు, అసలు మధుమేహం అంటే ఏమిటి అని మొదలుపెట్టి, క్లోమగ్రంథి ఎలా పనిచేస్తుంది, మధుమేహంలో రకాలు, అది మనకి వచ్చాక కలిగే లక్షణాలు, వచ్చినట్టు నిర్ధారించి కనుక్కోవడానికి చేసే పరీక్షలు, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వచ్చేముందు పూర్వదశ ఎలా ఉంటుంది, మధుమేహం దారిలో పెట్టడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఏయే మందులు ఉన్నాయి, అవి ఎవరికి ఎలా పనిచేస్తాయి, ఎవరు వాడకూడదు అనేవన్నీ 35 ఛాప్టర్లుగా విడగొట్టి చెప్పారు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ!

తెలుగు నేలమీద సాహితీ సమావేశాలు కొత్త కాదు. 1975లో మొదలు పెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలనుండి అమెరికానుండి వచ్చే ప్రవాసాంధ్రుల సాహితీ సమావేశాల దాకా […]

కానీ ఒక్కసారి కృష్ణశాస్త్రి కవిత్వంలోనికి గాని మనం తొంగి చూసినట్లయితే అది నిత్యనవీనమని ఆ కవిత్వం నిత్యవసంతమని ఆ పువ్వులు ఎప్పటికీ వాడవని ఆ కవిత్వాన్ని మనం సమీపించకపోవడం ఒక్కటే మనం ఆ కవిత్వం తాలూకు వెలుగుకి దూరం కావడానికి కారణమని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక్కసారి ఆ కవిత్వాన్ని పునఃపరిశీలించడం ద్వారా, ఆ కవిత్వాన్ని చేరడం ద్వారా, ఆ కవిత్వానికి కైమోడ్చడం ద్వారా మనం మరొకసారి ఆ మహాకవికి నివాళిని అర్పించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఈ వ్యాససమర్పణ.

తెలుగు రచయితలు చలం, గోపీచంద్‌వంటివారు క్రమేపి ఆధ్యాత్మికత వైపు, ఆశ్రమజీవనం వైపు వెళ్లారు. కానీ వారి ఆధ్యాత్మిక రచనలు వివాదాస్పదం కాలేదు. అయితే భైరప్పలో వచ్చిన మార్పు ఆధ్యాత్మికమైనది కాదు, మతపరమైనది కాదు, రాజకీయపరమైనది; చారిత్రక వాస్తవికతను అర్థం చేసుకోవడంలో వచ్చిన మౌలిక మార్పు. ‘ఆవరణ’ నవల దీనికి స్పష్టమైన ఉదాహరణ.

‘మనిషైతే మనసుంటే, కనులు కరగాలిరా! కరిగి, కరుణ కురియాలిరా! కురిసి, జగతి నిండాలిరా!’ అన్న మానవతావాదం ఆ కలానిది. ‘వాడ వాడల వాడే! జాడలన్నిట వాడే! ఇంటి ముంగిట వాడే! ఇంటింటిలో వాడే!’ అని దైవాన్ని అన్నిచోట్లా చూస్తూ ‘అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది’ అని విశదీకరించింది ఆ కలమే.

నాకు తెలిసేనాటికే ఆయన కవిత్వంలో సువర్ణమేరుశిఖరాన్ని అధిరోహించి, యుగనేతగా గౌరవపదాన్ని అలంకరించినవారు. అప్పటికే గొంతు మూగపోయింది. రవీంద్రుని 1927లో కలుసుకొన్ననాటి అనుభూతులను పదేపదే నెమరువేసుకొనేవారు. కాళిదాసు, భవభూతి, షెల్లీ, కీట్సు, బైరన్, తమ తండ్రి పినతండ్రులు, రాయప్రోలు, అబ్బూరి అంటే ఉపాసనతో కూడిన ఆరాధనాభావం ఉండేది.

ఇవన్నీ నన్నయ్యకన్న ముందు ఆవిర్భవించినవే. ఇక మిగిలినది చమత్కార మొక్కటే. అది తెలుగువారికి దక్కింది. ‘చమత్కారచంద్రిక ద్వారా విశ్వేశ్వరుడు దానిని సాధించి మనముందు నిలిపాడు. పరిణామక్రమంలో ప్రకృతవ్యాసంలో మనం అలంకారశాస్త్రానికి తమదైన వరివస్యను అందించిన తెలుగువారి గురించి-తెలుగువారి గ్రంథాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు.

ఆ విధంగా అతడి దాంపత్యజీవితం అపహాస్యం పాలై, దుఃఖాంతమయింది. ఆమె దూరం కావడం పిరాండెలోకు జీవితకాలమంతా దుర్భరమైంది. ఆమె జ్ఞాపకాలను దూరంచేసుకోవడానికి, అతడు ఆ ఊరు కూడా వదిలి మరో చోటికి కదిలిపోయాడు.

5000 మీటర్ల ఎత్తున ఎత్తుపల్లాలను దాటుకుంటూ నడవడం అంటే మాటలు కాదు. వేసే ప్రతి అడుగూ అదనపు సంకల్పశక్తిని కోరే సమయమది. ప్రతి నాలుగు అడుగులకూ ఒకసారి ఆగి, గుక్కతిప్పుకుని ముందుకు సాగవలసి వచ్చే సమయమది. ఎంత అనుభవం ఉన్న ట్రెకర్లయినా ఆచి తూచి అడుగులు వేసే ప్రాంతమది.