ఉన్నట్టుండి నా ఎడమచెవి తీవ్రంగా మండినట్లు ఒక భావన అనిపించింది. ఎందుకా మంట? ఏమిటా కథ? అని లోకంలోకి వచ్చి చూస్తే, మా లెక్కల మాష్టారు నా చెవి పట్టుకుని మెలి తిప్పుతున్నాడు. ‘వెధవా, చెప్పిన లెక్క చెయకపోగా పైగా నన్ను ఎగతాళి చేస్తున్నావుట్రా? లే రాస్కల్? లే!’ నాకు ఏమీ అర్థం అవలేదు.

ప్రతీవారం ఒక రోజు అపార్ట్‌మెంట్ మెట్లన్నీ కడిగే నియమం ఒకటి ఉంది. కొన్ని ఏళ్ళ వరకు ఇది ప్రతీ శుక్రవారం రాత్రి జరిగే తంతు. ఎదుగుతున్న వయస్సులో అలా మెట్లు కడిగే దృశ్యాన్ని చూస్తే అనాలోచితంగా ఆనందపు రవ్వలు ఎగిసేవి లోపలెక్కడో… వచ్చే వారాంతపు సెలవులని ఊహించుకుంటూ. ఇన్నేళ్ళ తరవాత అదే దృశ్యాన్ని చూస్తే ఇవాళ గురువారమే. ఏళ్ళు గడుస్తుంటే అక్కడక్కడే మార్పు చెందుతున్న జీవిత చిహ్నాలు.

నేను అన్నాను: నువ్వు నిశ్చింతగా కూర్చున్నావు. లే, అంటరానితనాన్ని నిర్మూలించు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమని కలిగించు. హిందువులు తమలో తాము మతం గురించి కొట్టుకుంటూ ఉంటారు. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ వగైరా కులాలన్నింటిని ఒకటి చేయండి. హిందూ ముస్లిములని కలపండి. లోకంలో శాంతి నెలకొనేలా ప్రయత్నాలు చేసేస్తే, ఆ పైన అందరం కలిసి ఆరాముగా జీవితాన్ని గడుపుదాం.

ఒకరోజు రాత్రి పొడుగాటి హాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ జంపకాన పరిచి, కొన్ని తలగడలు పడేసుకుని పడుకున్నాం. నూనె మరకలతో కనీసం గలీబులైనా లేని ఆ తలగడల అందం చూసి తీరాలి. పైన ముదురు రంగు గుడ్డ, లోపలేమో గడ్డ కట్టిన దూది ఉండలుగా పైకి కనిపిస్తూ ఉండేది. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా ఆటలాడిన పిల్లలం తలగడ మీద తల ఆనీ ఆనగానే నిద్రలో పడేవాళ్ళం. అవి రాళ్ళలా ఉంటే మాత్రం ఎవడిక్కావాలి గనక?

ఆ రోజంతా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆయనలాంటి చక్కని మాటకారిని నేను చూడలేదు. కాలక్షేపం, తత్వం, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం అని ఒక అంశంనుండి మరో అంశానికి జంప్ చేస్తూ! జేమ్స్ బాండ్‌లాగా కార్ నుండి హెలికాప్టర్‌కి ఎగిరి, ఆక్కణ్ణుండి బోట్‌లోకి దూకి, ఒడ్డుచేరుకుని, అక్కణ్ణుంచి బైక్ ఎక్కి వేగంగా వెళ్ళిపోతున్నట్టు. ఆ రోజునుండి వారానికి మూడు రోజులైనా ఆయన్ని కలవడానికి వెళ్ళేవాణ్ణి. పుస్తకాలు ఇచ్చేవారు.

పార్టీ ఐపోయింది, గుంపు చెదిరిపోతూంది. ఇంకో రెండు నిమిషాలు గడిస్తే, తలుపు తోసుకుని బైటపడితే చాలు, విముక్తి. ఆశ్చర్యంగా ఇద్దరం ఒకేసారి బరువు తలుపు హేండిల్‌పై మోపిన చెయ్యి, స్తంభించిన నా ఊపిరి, బైట అతడు నాకు తొడిగే కోట్, సవరించే కాలర్, మర్యాదగా తీసి పట్టుకున్న కేబ్ డోర్, తలుపులో పడకుండా సర్దే స్కర్ట్. నా చెయ్యేనా అతడిని కేబ్ లోకి లాగింది, నేనేనా కేబ్ డ్రైవర్‌కి నా హోటల్ అడ్రస్ చెప్పింది, అతనా?

అబద్ధాలాడకూడదు. నిజఁవే. కాని, మనసులో ఉన్నవన్నీ చెప్పకూడదు అని ఈమధ్యనే తెలిసింది. అందులోనూ, అమ్మా బామ్మా లాంటివాళ్ళతో. నాకు ఏఁవిటో బాగోలేదు. నాకు ముసురు పట్టింది అని చెప్పేననుకో. ఇంక చూడు రాద్ధాంతం చేస్తారు. దిష్టి తీస్తారు. తాయెత్తు కడతామంటారు. ఆంజనేయస్వామి బిళ్ళ గొలుసు మెళ్ళో వేస్తామంటారు. అందుకని అబద్ధం ఆడొచ్చు!

వీధి చివర మలుపు అంచున వున్న దీపస్తంభపు తీగ గాలి ఊయల వూగుతుండగా దానిని వేళ్ళ మధ్య ఉన్న నా కలంతో చలన స్తంభన విద్యకు కట్టుచేసి కాగితంలోకి చేర్చడంలో వున్న మహదానందాన్ని నేను మరెక్కడా పొందలేదు. నాకు ఊహ ఎరిగిననాటి నుండి ఇప్పుడు ఇంతవాణ్ణి అయ్యాకా కూడా నా జీవితంలో నేను బొమ్మ వేయకుండా వున్న ఒక్క రోజు లేదు.

ఆ మాట మరి దేనికో తగిలినట్టయిన రంగారెడ్డిలో మళ్ళీ తెలియని భయం ప్రవేశించింది. తెలియకుండానే జేబు మోస్తున్న బరువు స్పృహలోకి వచ్చింది. ఊహల్లో ఉన్నదాన్ని వాస్తవంలోకి తేవడానికి తను పెట్టుకున్న గడువు మరీ దగ్గరగా ఉందేమో. కాలేజీలో చేయలేని ధైర్యం క్యాంపులో మాత్రం వస్తుందా? ఇది కొంత ఇన్‌ఫార్మల్‌గా ఉండగలిగే జాగా కావడంతో ఎక్కువ వీలు ఉంటుందనిపించింది.

గూఢచారి కోడిపెట్ట: యాజమాన్యం ఎప్పుడూ పనివారిమీద ఒక కన్నేసి ఉంచాలి. కేవలం వారితో సమర్థవంతంగా పని చేయిస్తే సరిపోదు. వారి మెదడులోనూ ఖాళీలుంచకూడదు. అలా ఖాళీ ఉండి, పనివారికి ఆలోచనలొచ్చినప్పుడల్లా చరిత్రలో ఏం జరిగిందో, యాజమాన్యం వారికి తెలుసు. అందుకే వారి ఆలోచనల్లో ఎప్పుడూ కుట్ర గురించిన భయాలుంటూనే ఉంటాయి.

తనంతే. భావోద్వేగాలు నియంత్రించుకోలేదు. ఏవైనా ప్రకృతి ఉత్పాతాలు, ప్రమాదాలు, కరోనా కాలంలో వలస జీవుల వెతలు, మరణాలు… టీవిలో చూస్తే ఏడ్చేస్తుంది. ఎవరి కష్టాలు చూసినా ఏదో ఆందోళన. పెళ్ళి అప్పటి కన్నా ఇప్పుడు చాలా నయం. మందులేవైనా రాసిస్తారా అనడిగేవాడిని మా డాక్టర్‌ని. మీ ప్రేమే మందు అనేవారాయన. తన గురించి ఆయనకి పూర్తిగా తెలుసు.

చివరికి ఒకరోజు పిల్లయింటివాళ్ళు వచ్చి లగ్నపత్రికలు కూడా రాసుకొని పోయారు. అయ్యో! ఆ రోజు మేళం శబ్దం విని నా పంచప్రాణాలు పోయాయి. కామేశ్వరయ్యరుకు యెలా ఉందో, మీనాక్షి మనసు ఎంత తల్లడిల్లిందో, రుక్మిణి ఎలా సహించిందో! అంతా ఈశ్వరునికే తెలుసు. నాగరాజన్‌కు పిసరంత కూడా దయ, పశ్చాత్తాపం లేకుండా పోయింది కదా అని నేను యేడవని రోజు లేదు.

కాసేపటికి ఒక పడవ నెమ్మదిగా అటువైపు వచ్చి గుడిసె ముందున్న కొబ్బరి చెట్లకు సమీపంలో ఆగింది. దాని ఆశలు మళ్ళీ చిగురించాయి. ముందుకాళ్ళ మీద సాగిలపడి, తోక ఊపుతూ ఆవలించింది. పడవలోంచి ఒకడు కొబ్బరి చెట్టెక్కి, ఒక కొబ్బరి బోండాం కోసుకొని నీళ్ళు తాగి, దొప్పల్ని నీళ్ళలో విసిరేసి, పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. కుక్క నిరాశతో చూస్తూ ఉండిపోయింది.

నాకున్న కల్పనా సామర్థ్యమంతా, విజిటింగ్ కార్డులని తయారు చెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.

‘ఘర్షణలు ఆ ప్రాంతం పొలిమేరలు దాటలేదు’ అంటే మనుషులు నరుక్కోవడం, ఆస్తులు తగలెట్టడం లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకలేదు, అని. మరది యంత్రాంగం పనిజేయడం వల్లా లేకపోతే తంత్రాంగం ఊరుకోవడం వల్లా అన్నది తెలీదు; ఎవరికీ, ఎప్పటికీ!

ఆడవాళ్ళ నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది, ప్రతీదానికి ఏడుస్తూనే ఉంటారు అంటారు మొగాళ్ళు. నిజఁవే. ఆడవాళ్ళకి అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఏడుపు రాదు. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! మొగవాళ్ళు అందుకే ఏడవరు. బుర్రే పని చేస్తుందట వాళ్ళకి. గుండె కాదు!

గోపాల కామత్ కొట్లో కుప్పన్న బాకీ ఏటికేడాదీ పెరుగుతూ పోయి వెయ్యి దాటేసింది. అప్పుడప్పుడు గోపాల కామత్ పంపే మనిషి కుప్పన్న ఇంటికి పోయి డబ్బు కట్టమని అడగటం అందరికీ తెలుసు. అప్పన్న భట్ట గోపాల్ కొట్లోనే కాదు, మఠం కౌలు కూడా ఏడాది చివర్లో పైసా కూడా బాకీ లేకుండా తీర్చేస్తాడు. మఠం నుంచి కౌలు వసూలుకు వచ్చే మనిషికి అప్పన్న భట్ట ఇంట్లో సకల మర్యాదలూ దక్కుతాయి కూడా.

తులసి అక్క కాలం చేసిందని తెలిసింది. ఏ జబ్బూ లేని, ప్రాణం ఉన్న రాయిలా నిక్షేపంగా ఉండేది. అక్క అంటే దూరపు చుట్టరికమే అయినా, వయసులో అంతరం ఉన్నా మనసుకి దగ్గరే. కొడుకులిద్దరూ ఒకడు ఇంగ్లాండ్ నుండి, మరొకడు అమెరికా నుండి వచ్చేశారట. నాలుగు రోజులైంది. మళ్ళీ దినం రోజు దేనికైనా కుదురుతుందో లేదో. మనసు ఆగక వెంటనే బయలుదేరిపోయాను.

రోషన్‌తో నేను మాట్లాడితే, గులాబ్‌కు నన్ను నరికేయాలనిపిస్తుంది. గులాబ్‌తో మాట్లాడటం ఆయేషాకు నచ్చదు. ఆమెకు ఒక నగ తీసిస్తే, యీమె ఒక నగ పగలగొడుతుంది. ఈమెకు వొక పట్టు రవికె కొనిస్తే, ఆమె ఒక రవికెను చింపేస్తుంది. ఈ విధంగా అన్నిట్లో ఆ ముగ్గురూ పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తూ నా ప్రాణం తీస్తున్నారు. ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా, నా జీవితం మొత్తం వీళ్ళ వల్ల నరకమయిపోయింది.

ఇవాళ బామ్మ నోట మరోమాట విన్నా. ‘నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. వాడు బుర్రకి ఎక్కించుకోడ్రా!’ అని బుచ్చిబాబుగారితో అన్నాది. బుచ్చిబాబుగారు మూడుమేడల వీధిలో చివారి ఇంట్లో ఉంటారు. బామ్మ దగ్గరికి వచ్చే అందరి లాగానే ఈయనా తన గోడు చెప్పుకోడానికి వస్తూ ఉంటాడు. వాడెవడో బుర్రకు ఎక్కించుకోడట!