సంజీవ దేవుల సౌహార్దము జగమెరిగినదే. గురు శుశ్రూషా ఫలం మన రాతల్లో, చేతల్లో కనిపించాలి కానీ మాటల్లో కాదు. రచయితగా వేలూరి వారు వివరణ ఇచ్చుకొనే అవసరమే లేదు. కారణం, వారు, ఈ అనువాదం చేయలేదు. అంతే గాక నేను వారి ఆంగ్ల మాతృక చదవలేదు, కాబట్టి నేను ‘వెల్లబుచ్చిన’ అభిప్రాయాలు కేవలం ప్రస్తుత అనువాదానికే పరిమితం.ఇక పోతే,
రచయితలకు సూచనలు అన్న విభాగంలో
“మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. “
శుభం, ఈ వ్యాసాన్ని సంపాదకులు సమీక్షించారా ?? [ఈ వ్యాసం Poems in Pigment అనే ఇంగ్లీషు వ్యాసం కొన్ని సవరణలతో అనువదించబడి మొదట 1995లో తానా తెలుగు వెలుగులో ప్రచురించబడింది. కొత్తగా మార్పులూ చేర్పులూ చేసిన వ్యాసం ఈమాటలో ఇప్పుడు ప్రచురించాము – సం]
సమీక్షంచడమే, కాదు, మార్పులు చేర్పులు కూడా చేశారు, సంతోషం,
వ్యాసానికి ఒక పఠనీయత అవసరం లేదా ??పారిభాషిక పదాల విషయంలో జాగ్రత్త అవసరంలేదా ?? వాక్యాలకు ఒక అన్వయం ఉండొద్దా ??అనువాదం ఎలా వికటించినా పాఠకులు భరించ వలసిందేనా??
వ్యాసకర్తలు సంపాదకులే అయినప్పుడు పాటించవలసిన సమీక్షా ప్రమాణాలు మారతాయా ?? ఈ మాట సంపాదక మండలి మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలివి.
రామాయణంలో పిడకల వేట :
“1950ల చివరలో ప్రముఖ జీవసాంఖ్య* శాస్తవేత్త సర్ జె. బి. ఎస్. హాల్డేన్ అప్పట్లో కలకత్తా నుండి వెలువడుతుండిన ప్రముఖ ఆంగ్లపత్రిక స్టేట్స్మన్లో ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన ఉత్తరంలో తెలుగుభాషకు ఇతర భాషలతో ఒదిగే అద్భుతగుణం వుందని విపరీతంగా పొగిడాడు. అక్కడితో ఆగక తెలుగు భాషకు భారతదేశంలో జాతీయభాష కావటానికి అవసరమైన అన్నిఅర్హతలు ఉన్నాయని రాశాడు.” (*సాంఖ్యక అని ఉండాలి, సాంఖ్యము షట్ దర్శనాల్లో ఒకటి, సాంఖ్యక శాస్త్రం అంటే Statistics )
అతకని హాల్డేన్ ఉదంతంతో వ్యాసాన్ని ఆరంభించారు, బాగానే ఉంది, తెలుగు గురించి హాల్డేన్ కు ఏమి తెలుసో , ఎలా తెలుసో అన్నీ ఊహపోహలే, ఇంత కథ నడిపే ముందు, హాల్డేన్ తెలుగు భాష గురించి
ఏమన్నాడో రచయితకు తెలుసా?? తెలుసే అనుకుందాం, ఆ విషయాన్ని, పాద పీఠికలో పాఠకులకుతెలియజేయడం రచయిత కనీస ధర్మం.
“You cannot keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps, Telugu accepts them more easily than any other Indian
language and this will certainly help to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering.”
– J.B.S.Haldane, THE HINDU (27-4-1958) ( ఈ లేఖ పూర్తి పాఠం గవరసాన గారి దగ్గర ఉన్నట్టు తెలుసా చర్చలో చదివినట్టు గుర్తు.)
పై అభిప్రాయం వెలుగులో పాఠకులే హాల్డేన్ ఉద్దేశితార్థాన్ని గ్రహించగలరు.
జాతీయ భాష విషయంలో భారత రాజ్యాంగం సరిగా చదవని వారు తరచూ పప్పులో కాలు వేస్తుంటారు. మన రాజ్యాంగం ప్రకారం హిందీ జాతీయ భాష కాదు, కేంద్ర స్థాయిలోని అధికార భాష మాత్రమే.రాజ్యాంగ
పరంగా ,ఇంగ్లీషుకు కూడా అదే స్థాయి ఉంది. ఇక , రాజ్యాంగంలో జాతీయ భాషే నిర్వచితం కానప్పుడు భారత దేశానికి ఏ భాషైనా జాతీయ భాష ఎలా కాగలదు.?? హాల్డేన్ అంతటి శాస్త్రవేత్త ఇంత చిన్న విషయంలో పొరబడతాడనుకోను. ఇటీవల , గుజరాత్ న్యాయస్థానం ఈ విషయమై చక్కని తీర్పు కూడా ఇచ్చింది. ఒక వేళ లింకు పని చేయకపోతే, సారాంశం:
The court observed, “Normally, in India, majority of the people have accepted Hindi as a national language and many people speak Hindi and write in Devanagari script but there is nothing on record to suggest that any provision has been made or order issued declaring Hindi as a national language of the country.”
“However, in the constitution, Hindi was declared as an official language and not a national language..”
“The court in its order said Part XVII of the Constitution deals with Official Language. Under Article 343, official language of the Union has been prescribed, which includes Hindi in Devanagari script and English.”
వ్యాసానికి, హరికథకు తేడా ఉంది. జనరంజన కోసం హరిదాసు పిట్టకథలు చెబుతాడు. వ్యాసకర్తకు ఆ స్వేచ్చ లేదు, వ్యాసం నేలమీద నడవ వలసిందే. అంతేకాక, వ్యాసకర్త,ఎక్కడ అవసరమైతే అక్కడ ఆధారాలను ఇవ్వవలసిందే. ఆలోచనల్లో ఒక శాస్త్రీయ పంథా లేనిదే వ్యాసరచన కష్టం, కాబట్టే, తెలుగు నాట కవులు, కథకులు అధికం, వ్యాసకర్తలు, విమర్శకులు బహు సకృతు. ఇక జాలింతును.
సురేశ్ గారు:
అక్షరాలను పలకటంలో వస్తున్న మార్పుల వలన భాష స్వరూపం మారటం ఒకటయితే – భక్తి కార్యక్రమాల్లో చాలా మంది బక్తులే టీవీలో. వస్తువులనూ గుణాలనూ క్రియలనూ సైతం చెప్పే మాటలూ మరొక భాషా ప్రభావంతో మారిపొవటం అనేది అసలు భరించలేని ఇంకొక విషయం. చక్కని ‘కుడి’ ,ఎడమ’ లాంటిమాటలు గూడా ఇప్పుడు వాడకం లొ లేవు . ‘లెఫ్ట్ తీసుకో’ ఉంది; ‘ఎడమ వైపు తిరుగు’ లేదు. యేదైనా వస్తువు కాలక్రమంలో కనుమరుగయితే ఆ నామవాచకం పోవటం (రాచిప్పలా) అర్థం చేసుకొగలం. కానీ కుడి ఎడమలు కూడా పోతే?
ఇళ్ళల్లో ‘వంటిల్లు’ లేదు కిచెనే. కత్తిరించడం, కొయ్యడం పోయి ‘కట్ చెయ్యడం’ సర్వ సాధారణమై పొయింది. తెలుగు టీ వీ లొ వంటల కార్యక్రమాలలొ వస్తున్న అప్రాచ్యమైన తెలుగు కొక ఉదాహరణ –
“వాటర్ యాడ్ చెయ్యండి”
ఈ పరిస్థితి తెలుగును ప్రాథమిక విద్యా స్థాయిలో తప్పనిసరి చేస్తే మారుతుందని అనుకోగలమా? ఈ పరిస్థితి ని ఎలా మార్చేది?
ఆసక్తి కలిగించే విషయమే తహ తహ గారూ !! “పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి. అక్కడికి అదే పదివేలు.
సురేశ్ !! మీ వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి. క్లుప్తంగా ఉంటాయి. సూటిగా ఉంటాయి. విషయ ప్రధానంగా ఉంటాయి. ఉద్వేగ రహితంగా ఉంటాయి. ముఖ్యంగా చదువుతున్నప్పుడు నాకు బాగుంటాయి. తెలుగు వాక్యాలు ఇలా రాస్తే బాగుంటుంది అని అనుకునేలా ఉంటాయి. నా అభినందనలు అందుకోండి అందుకు. ఇంతకీ మీ జవాబు నాకు చాలా బాగా అనిపించింది. థాంక్యూ!
నాకు ఒక విషయం స్పష్టపడలేదు ఇంకా. బహుశా మీరు చెప్పే ఉంటారేమో. నేనే ఇంకా సరిగా ఆలోచించాలేమో. ఏమంటే, తమిళం ద్రవిడ భాషా వర్గమే కదా?? అచ్చులు పలకడంలో తెలుగు తమిళాల మధ్య వస్తున్న అడ్దంకి ఎందుకని వస్తోందీ అన్నది మరికొంచెం వివరించాలి మీరు. నేను వ్యాకరణాల విషయంలో కొంచెం మొద్దు అమ్మాయిని అనుకుని కాస్త శ్రధ్ధగా చెప్పండి 🙂
“వెదజల్లెడు” అన్న పదాన్ని “వెదజల్లడు” అని యెం యెస్ ఎందుకని అనవలసి వచ్చిందీ పాడుతున్నప్పుడు? ఇలాంటివి ఇతర తమిళ గాయనీ గాయకులు పాడినప్పుడూ చాలా మనం గుర్తించవచ్చును. అప్పుడు అక్కడ అన్నమయ్య వాడిన పదం తాలూకు అర్ధమే పూర్తిగా మారిపోవడం లేదా?? ఈ గొడవ ఏంటి? దీనికి పరిష్కారం లేనే లేదా?
తెలుగుకి పూర్తిగా ద్రావిడ భాషా స్వభావం అబ్బలేదని అనుకుందామా?? తమిళంలో పరుషాలు లేవు సరళాలు తప్ప అన్న ఒక్క పరిమితికీ, వాళ్ళు తెలుగుని పలకవలసి వస్తే తమిళానికి ఉచ్చారణని మార్చుకుని పాడడానికీ మధ్య ఉన్న తార్కిక సంబంధం గురించి చెప్పండి. ఇదీ నాకింకా తెలియాలి.
మీరు “థ” , “ధ” ల ఉదాహరణని ఇస్తే నాకు మరొకటి గుర్తొచ్చింది. ఏమంటే వేంకటాచలపతి అన్న పేరు ఉందనుకుందాం లేదా అలాంటిది మరొకటి. పోనీ మన గుడిపాటి వెంకట చలం గారి పేరే తీసుకుందాం ఉదాహరణకి. ఆయన్ని మనం “చలం” గా సంభావిస్తాం కదా? ఈ అలవాటు భాష పట్ల మరీ పట్టు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ కూడాను. చలం అన్నది తప్పు. అచలం అని అనాలి సంధిని విడదీసి. కానీ అక్కడ అందరూ “చలపతి” లే! “అచలపతి” లు లేరు. ఇది మరో వింత 🙂 ఇలా భాష కల్పించే సరదాలూ, తమాషాలూ బోలెడు.
అసలు ప్రపంచంలో ఏ లోపం లేని కథ ఉందా? ఒక వేళ అలాటిది ఉంది అని మీకనిపిస్తే, అది మీరు చెప్పగలిగితే, అందులో లక్షల లోపాలు చూపించగలవాళ్ళు మీకు దొరుకుతారు. అసలు ఆ కథ చెప్పిన తీరు మంచో, చెడో, జుగుప్సో, భీబత్సమో ఎదైతే అది, కథాంశం వ్యవస్థ లోని దోపిడీ గురించి అని మీకు కానీ, ఈ వ్యాసం వ్రాసిన రావుగారికి కానీ అనిపించలేదా? నిజంగానే నాకు ఇది ఆశ్చర్యం కలిగించింది. వ్యాసంలో వెలువరించిన అభిప్రాయాన్ని, మీ అభిప్రాయాన్ని ఖండించే విద్వత్తు నాకు లేదు కానీ మంచి శక్తివంతమైన విమర్శలు చెయ్యగలవారు తమ శక్తిని, ఒక కథలోని దోషాలని ఎత్తి వాటిని ఎక్కువ వెలుగులోకి తీసుకు వచ్చే కంటే అందులో ఏ మాత్రం మంచి ఉంది అనిపిస్తే దానిని విశ్లేషించి మరింతగా పదిమందిలోకి తీసుకురాగలిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇది కూడా మీకు నచ్చకపోతే నన్ను మన్నించగలరు.
పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
సురేశ్ గారు, తిక్కన ఎఱ్ఱాప్రగడల కాలమునుండి థ అక్షరాన్ని ధ గా పలకడము ఉన్నదనుకొంటాను. థ, ధ లకు, ద-ధ లకు నన్నయ, తిక్కనల కాలమునుండి ప్రాస చెల్లుతుంది. అన్ని వర్గాక్షరములకు (ఉదా. బ-భ, గ-ఘ, ఇత్యాదులు) ఇలాటి ప్రాస చెల్లక పోయినా థ-ధ, ద-ధ లకు మాత్రము ఇట్టి ప్రాసను ఆ కాలమునుండి కవులు అంగీకరించారు. దీనికి కారణము ఉచ్చరణ మాత్రమే అని నా అభిప్రాయము. అప్పకవి, వేంకటరమణకవి తమ లక్షణగ్రంథాలలో దీనిని పేర్కొన్నారు. వీటికి ఉదాహరణములు ఆంధ్రమహాభారతములో లభ్యము. విధేయుడు – మోహన
సంస్కృతము, తెలుగు వేర్వేరు భాషాకుటుంబాలకు చెందినవి కాబట్టి వాటి వర్ణనిర్మాణంలో తేడాలు ఉండటం సహజం. ణ, ళ వంటి మూర్ధన్య అక్షరాలు మూల ఇండో-యూరోపియన్ లో లేవు. మూర్ధన్య అక్షరాలు, దంతమూలీయ అక్షరాలు (ఱ) ద్రావిడ భాషల ప్రత్యేకత. ఇండో-యూరోపియన్ భాషలలో అల్పప్రాణాలకు, మహాప్రాణాలకు తేడా స్పష్టం. ఆ తేడా ద్రావిడ భాషలలో లేదు. ద్రావిడ భాష అచ్చులలో ఎ, ఏ, ఒ, ఓ ల మధ్య తేడా ఉంది. ఇండో-ఆర్యన్ భాషలలో లేదు (మూల ఇండో-యూరోపియన్ లో ఉండేదని ఒక వాదం). ద్రావిడ భాషలలో సంయుక్తాక్షరాలు పరిమితం: ద్విత్వాక్షరాలు, వర్గ అనునాసికాలకు గ, జ, డ, ద, బ లతో సంయుక్తాక్షరం ఏర్పడటం మాత్రమే కనిపిస్తుంది. ఇండో-యూరోపియన్ భాషలలో క్లిష్టమైన సంయుక్తాక్షర సమూహాలు కనిపిస్తాయి: స్త్ర, ప్ర, ష్ట్ర వంటి ఒత్తులు సర్వసాధారణం.
తెలుగు వర్ణనిర్మాణం గురించి నేను 2007 లో పొద్దు పత్రికలో రాసిన ఈ వ్యాసాలు చూడండి:
“ళ” ని “ల” గా, “ణ” ని “న” గా పలకడం ప్రాఙ్నన్నయ్య కాలంనుండి వస్తున్న తెలుగు సంప్రదాయమే. మూల ద్రావిడంలోని “అణ్ణ”, “మణ్ణు”, “కణ్ణు” లను మనం ఎప్పటి నుండో “అన్న”, “మన్ను”, “కన్ను” అని పలుకుతున్నాం. అలాగే, ఉల్లము, లోపల అన్న పదాలకు ద్రావిడ ధాతువు ఉళ్-, ఒళ- (లోపలకు తమిళంలో ఉళ్ళ అని, కన్నడలో ఒళగె అని అంటారు). పళ్ళ- అన్న మూల ద్రావిడ పదం తెలుగులో పల్లము అయింది. ఉళి తెలుగులో ఉలి (chisel) అయ్యింది. బండి “ఱ” సంగతి సరేసరి.
“ప్రవాహినీ భాషా”అన్నారు కదా. భాష నిరంతరం మారుతూనే ఉంటుంది. పెద్దన కాలంనాటి భాష నన్నయ్యకు నచ్చదు. జంధ్యాల పాపయ్య శాస్త్రి భాష పెద్దనకు నచ్చదు. మనం వాడుతున్న భాష మన తాతలకు నచ్చదు. వచ్చే తరం మాట్లాడే భాష మనకు నచ్చదు.
పెళ్ళి పెల్లి గానూ,కళ్ళు కల్లు గానూ, ఇళ్ళు(బహువచనం) ఇల్లు గానూ కాలక్రమేణా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనంటారా అంటే కాదనే చెబుతాను. ఈ ధ్వని మార్పులు ఎంత భాషాత్మకమో (linguistic), అంత సామాజికం (sociological) కూడానూ. ధ్వని పరిణామాలను మెజారిటీ ఒప్పుకోనిదే భాషలో భాగం అయిపోవు కదా? ఈ ధ్వని మార్పులకు మెజారిటీ అనిష్టతను, తిరస్కృతిని చూపిస్తే, ఆ ధ్వని పరిణామం అందరికీ ప్రామాణికం కాకుండా ఆగిపోతుంది. ‘ళ’ ‘ల’ ల వినిమయంపై అనిష్టతను వ్యక్తం చేస్తూ మీరు రాసిన టపా ద్వారా మీ వంతు సామాజిక బాధ్యతను మీరు నిర్వర్తించారనే నా అభిప్రాయం.
ఈ రకమైన వ్యతిరేకత లేకుండా ఈ మధ్య తెలుగులో వచ్చిన ధ్వని పరిణామాలలో ఒకటి: థ > ధ గా మారటం. తెలంగాణలో పుట్టి పెరిగిన నేను హైదరాబాదుకు వచ్చిన మొదటి రోజుల్లో నా కోస్తాంధ్ర మిత్రులందరు కధ (kadha instead of katha), రధము (radhamu instead of rathamu), విశ్వనాధం (viSwanaadham instead of viSwanaatham) అంటూ ఉంటే వినలేకపోయేవాడిని. పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
ఏ ధ్వని పరిణామమైనా ప్రామాణికుల అంగీకారం లేనిదే భాషలో భాగమైపోదు. మన దురదృష్టంకొద్ది తెలుగు భాష ప్రామాణికతను వితర్కించి, నిర్ణయించే వ్యవస్థ మనకు లేదు. తెలుగు భాషా ప్రయోగాలను ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే పండిత వర్గంకానీ, ప్రామాణికమైన ఆధునిక నిఘంటువులుగాని మనకు లేవు. బలమైన సామాజిక, రాజకీయ సంకల్పం లేకపోతే 21వ శతాబ్దంలో తెలుగు వంటి ఆంగ్లేతర భాషల మనుగడ సందేహాస్పదమేనని David Crystal వంటి భాషావేత్తలు కంఠశోష పెడుతున్నా, పట్టించుకొనే నాథుడే లేడు. ముఖ్యంగా, ప్రాథమిక స్థాయిలో తెలుగు విద్యా బోధనను ఐచ్ఛికం చేయడం తెలుగు భాష మనుగడకు గొడ్డలిపెట్టు అని నా అభిప్రాయం.
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన
Thank you for writing this article. It is most interesting and inspiring. I am the Managing Editor of a Journal on the Classical Dances of India, Nartanam. We have been looking for articles on Music for Dance and the two stalwarts about whom you have written have made great contributions towards dance music. Hope you will share your email id or telephone number so that we can get in touch with you to explore the possibility of a detailed article on the above mentioned lines.
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
07/16/2012 3:49 pm
సంజీవ దేవుల సౌహార్దము జగమెరిగినదే. గురు శుశ్రూషా ఫలం మన రాతల్లో, చేతల్లో కనిపించాలి కానీ మాటల్లో కాదు. రచయితగా వేలూరి వారు వివరణ ఇచ్చుకొనే అవసరమే లేదు. కారణం, వారు, ఈ అనువాదం చేయలేదు. అంతే గాక నేను వారి ఆంగ్ల మాతృక చదవలేదు, కాబట్టి నేను ‘వెల్లబుచ్చిన’ అభిప్రాయాలు కేవలం ప్రస్తుత అనువాదానికే పరిమితం.ఇక పోతే,
రచయితలకు సూచనలు అన్న విభాగంలో
“మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. “
శుభం, ఈ వ్యాసాన్ని సంపాదకులు సమీక్షించారా ??
[ఈ వ్యాసం Poems in Pigment అనే ఇంగ్లీషు వ్యాసం కొన్ని సవరణలతో అనువదించబడి మొదట 1995లో తానా తెలుగు వెలుగులో ప్రచురించబడింది. కొత్తగా మార్పులూ చేర్పులూ చేసిన వ్యాసం ఈమాటలో ఇప్పుడు ప్రచురించాము – సం]
సమీక్షంచడమే, కాదు, మార్పులు చేర్పులు కూడా చేశారు, సంతోషం,
వ్యాసానికి ఒక పఠనీయత అవసరం లేదా ??పారిభాషిక పదాల విషయంలో జాగ్రత్త అవసరంలేదా ?? వాక్యాలకు ఒక అన్వయం ఉండొద్దా ??అనువాదం ఎలా వికటించినా పాఠకులు భరించ వలసిందేనా??
వ్యాసకర్తలు సంపాదకులే అయినప్పుడు పాటించవలసిన సమీక్షా ప్రమాణాలు మారతాయా ?? ఈ మాట సంపాదక మండలి మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలివి.
రామాయణంలో పిడకల వేట :
“1950ల చివరలో ప్రముఖ జీవసాంఖ్య* శాస్తవేత్త సర్ జె. బి. ఎస్. హాల్డేన్ అప్పట్లో కలకత్తా నుండి వెలువడుతుండిన ప్రముఖ ఆంగ్లపత్రిక స్టేట్స్మన్లో ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన ఉత్తరంలో తెలుగుభాషకు ఇతర భాషలతో ఒదిగే అద్భుతగుణం వుందని విపరీతంగా పొగిడాడు. అక్కడితో ఆగక తెలుగు భాషకు భారతదేశంలో జాతీయభాష కావటానికి అవసరమైన అన్నిఅర్హతలు ఉన్నాయని రాశాడు.”
(*సాంఖ్యక అని ఉండాలి, సాంఖ్యము షట్ దర్శనాల్లో ఒకటి, సాంఖ్యక శాస్త్రం అంటే Statistics )
అతకని హాల్డేన్ ఉదంతంతో వ్యాసాన్ని ఆరంభించారు, బాగానే ఉంది, తెలుగు గురించి హాల్డేన్ కు ఏమి తెలుసో , ఎలా తెలుసో అన్నీ ఊహపోహలే, ఇంత కథ నడిపే ముందు, హాల్డేన్ తెలుగు భాష గురించి
ఏమన్నాడో రచయితకు తెలుసా?? తెలుసే అనుకుందాం, ఆ విషయాన్ని, పాద పీఠికలో పాఠకులకుతెలియజేయడం రచయిత కనీస ధర్మం.
“You cannot keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps, Telugu accepts them more easily than any other Indian
language and this will certainly help to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering.”
– J.B.S.Haldane, THE HINDU (27-4-1958) ( ఈ లేఖ పూర్తి పాఠం గవరసాన గారి దగ్గర ఉన్నట్టు తెలుసా చర్చలో చదివినట్టు గుర్తు.)
పై అభిప్రాయం వెలుగులో పాఠకులే హాల్డేన్ ఉద్దేశితార్థాన్ని గ్రహించగలరు.
జాతీయ భాష విషయంలో భారత రాజ్యాంగం సరిగా చదవని వారు తరచూ పప్పులో కాలు వేస్తుంటారు. మన రాజ్యాంగం ప్రకారం హిందీ జాతీయ భాష కాదు, కేంద్ర స్థాయిలోని అధికార భాష మాత్రమే.రాజ్యాంగ
పరంగా ,ఇంగ్లీషుకు కూడా అదే స్థాయి ఉంది. ఇక , రాజ్యాంగంలో జాతీయ భాషే నిర్వచితం కానప్పుడు భారత దేశానికి ఏ భాషైనా జాతీయ భాష ఎలా కాగలదు.?? హాల్డేన్ అంతటి శాస్త్రవేత్త ఇంత చిన్న విషయంలో పొరబడతాడనుకోను. ఇటీవల , గుజరాత్ న్యాయస్థానం ఈ విషయమై చక్కని తీర్పు కూడా ఇచ్చింది. ఒక వేళ లింకు పని చేయకపోతే, సారాంశం:
The court observed, “Normally, in India, majority of the people have accepted Hindi as a national language and many people speak Hindi and write in Devanagari script but there is nothing on record to suggest that any provision has been made or order issued declaring Hindi as a national language of the country.”
“However, in the constitution, Hindi was declared as an official language and not a national language..”
“The court in its order said Part XVII of the Constitution deals with Official Language. Under Article 343, official language of the Union has been prescribed, which includes Hindi in Devanagari script and English.”
వ్యాసానికి, హరికథకు తేడా ఉంది. జనరంజన కోసం హరిదాసు పిట్టకథలు చెబుతాడు. వ్యాసకర్తకు ఆ స్వేచ్చ లేదు, వ్యాసం నేలమీద నడవ వలసిందే. అంతేకాక, వ్యాసకర్త,ఎక్కడ అవసరమైతే అక్కడ ఆధారాలను ఇవ్వవలసిందే. ఆలోచనల్లో ఒక శాస్త్రీయ పంథా లేనిదే వ్యాసరచన కష్టం, కాబట్టే, తెలుగు నాట కవులు, కథకులు అధికం, వ్యాసకర్తలు, విమర్శకులు బహు సకృతు. ఇక జాలింతును.
తమ్మినేని యదుకుల భూషణ్.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తః తః అభిప్రాయం:
07/16/2012 3:14 pm
సురేశ్ గారు:
అక్షరాలను పలకటంలో వస్తున్న మార్పుల వలన భాష స్వరూపం మారటం ఒకటయితే – భక్తి కార్యక్రమాల్లో చాలా మంది బక్తులే టీవీలో. వస్తువులనూ గుణాలనూ క్రియలనూ సైతం చెప్పే మాటలూ మరొక భాషా ప్రభావంతో మారిపొవటం అనేది అసలు భరించలేని ఇంకొక విషయం. చక్కని ‘కుడి’ ,ఎడమ’ లాంటిమాటలు గూడా ఇప్పుడు వాడకం లొ లేవు . ‘లెఫ్ట్ తీసుకో’ ఉంది; ‘ఎడమ వైపు తిరుగు’ లేదు. యేదైనా వస్తువు కాలక్రమంలో కనుమరుగయితే ఆ నామవాచకం పోవటం (రాచిప్పలా) అర్థం చేసుకొగలం. కానీ కుడి ఎడమలు కూడా పోతే?
ఇళ్ళల్లో ‘వంటిల్లు’ లేదు కిచెనే. కత్తిరించడం, కొయ్యడం పోయి ‘కట్ చెయ్యడం’ సర్వ సాధారణమై పొయింది. తెలుగు టీ వీ లొ వంటల కార్యక్రమాలలొ వస్తున్న అప్రాచ్యమైన తెలుగు కొక ఉదాహరణ –
“వాటర్ యాడ్ చెయ్యండి”
ఈ పరిస్థితి తెలుగును ప్రాథమిక విద్యా స్థాయిలో తప్పనిసరి చేస్తే మారుతుందని అనుకోగలమా? ఈ పరిస్థితి ని ఎలా మార్చేది?
మీ ఆలొచన దయచేసి చెపుతారా?
తః తః
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
07/16/2012 2:42 pm
ఆసక్తి కలిగించే విషయమే తహ తహ గారూ !! “పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి. అక్కడికి అదే పదివేలు.
సురేశ్ !! మీ వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి. క్లుప్తంగా ఉంటాయి. సూటిగా ఉంటాయి. విషయ ప్రధానంగా ఉంటాయి. ఉద్వేగ రహితంగా ఉంటాయి. ముఖ్యంగా చదువుతున్నప్పుడు నాకు బాగుంటాయి. తెలుగు వాక్యాలు ఇలా రాస్తే బాగుంటుంది అని అనుకునేలా ఉంటాయి. నా అభినందనలు అందుకోండి అందుకు. ఇంతకీ మీ జవాబు నాకు చాలా బాగా అనిపించింది. థాంక్యూ!
నాకు ఒక విషయం స్పష్టపడలేదు ఇంకా. బహుశా మీరు చెప్పే ఉంటారేమో. నేనే ఇంకా సరిగా ఆలోచించాలేమో. ఏమంటే, తమిళం ద్రవిడ భాషా వర్గమే కదా?? అచ్చులు పలకడంలో తెలుగు తమిళాల మధ్య వస్తున్న అడ్దంకి ఎందుకని వస్తోందీ అన్నది మరికొంచెం వివరించాలి మీరు. నేను వ్యాకరణాల విషయంలో కొంచెం మొద్దు అమ్మాయిని అనుకుని కాస్త శ్రధ్ధగా చెప్పండి 🙂
“వెదజల్లెడు” అన్న పదాన్ని “వెదజల్లడు” అని యెం యెస్ ఎందుకని అనవలసి వచ్చిందీ పాడుతున్నప్పుడు? ఇలాంటివి ఇతర తమిళ గాయనీ గాయకులు పాడినప్పుడూ చాలా మనం గుర్తించవచ్చును. అప్పుడు అక్కడ అన్నమయ్య వాడిన పదం తాలూకు అర్ధమే పూర్తిగా మారిపోవడం లేదా?? ఈ గొడవ ఏంటి? దీనికి పరిష్కారం లేనే లేదా?
తెలుగుకి పూర్తిగా ద్రావిడ భాషా స్వభావం అబ్బలేదని అనుకుందామా?? తమిళంలో పరుషాలు లేవు సరళాలు తప్ప అన్న ఒక్క పరిమితికీ, వాళ్ళు తెలుగుని పలకవలసి వస్తే తమిళానికి ఉచ్చారణని మార్చుకుని పాడడానికీ మధ్య ఉన్న తార్కిక సంబంధం గురించి చెప్పండి. ఇదీ నాకింకా తెలియాలి.
మీరు “థ” , “ధ” ల ఉదాహరణని ఇస్తే నాకు మరొకటి గుర్తొచ్చింది. ఏమంటే వేంకటాచలపతి అన్న పేరు ఉందనుకుందాం లేదా అలాంటిది మరొకటి. పోనీ మన గుడిపాటి వెంకట చలం గారి పేరే తీసుకుందాం ఉదాహరణకి. ఆయన్ని మనం “చలం” గా సంభావిస్తాం కదా? ఈ అలవాటు భాష పట్ల మరీ పట్టు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ కూడాను. చలం అన్నది తప్పు. అచలం అని అనాలి సంధిని విడదీసి. కానీ అక్కడ అందరూ “చలపతి” లే! “అచలపతి” లు లేరు. ఇది మరో వింత 🙂 ఇలా భాష కల్పించే సరదాలూ, తమాషాలూ బోలెడు.
రమ.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి mkrao అభిప్రాయం:
07/16/2012 2:15 pm
ఆదిత్య గారు,
అసలు ప్రపంచంలో ఏ లోపం లేని కథ ఉందా? ఒక వేళ అలాటిది ఉంది అని మీకనిపిస్తే, అది మీరు చెప్పగలిగితే, అందులో లక్షల లోపాలు చూపించగలవాళ్ళు మీకు దొరుకుతారు. అసలు ఆ కథ చెప్పిన తీరు మంచో, చెడో, జుగుప్సో, భీబత్సమో ఎదైతే అది, కథాంశం వ్యవస్థ లోని దోపిడీ గురించి అని మీకు కానీ, ఈ వ్యాసం వ్రాసిన రావుగారికి కానీ అనిపించలేదా? నిజంగానే నాకు ఇది ఆశ్చర్యం కలిగించింది. వ్యాసంలో వెలువరించిన అభిప్రాయాన్ని, మీ అభిప్రాయాన్ని ఖండించే విద్వత్తు నాకు లేదు కానీ మంచి శక్తివంతమైన విమర్శలు చెయ్యగలవారు తమ శక్తిని, ఒక కథలోని దోషాలని ఎత్తి వాటిని ఎక్కువ వెలుగులోకి తీసుకు వచ్చే కంటే అందులో ఏ మాత్రం మంచి ఉంది అనిపిస్తే దానిని విశ్లేషించి మరింతగా పదిమందిలోకి తీసుకురాగలిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇది కూడా మీకు నచ్చకపోతే నన్ను మన్నించగలరు.
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి indrani Palaparthy అభిప్రాయం:
07/16/2012 1:41 pm
నాగరాజు రవీందర్ గారు:
తప్పకుండా.నాకు ఏమీ అభ్యంతరం లేదు.
ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:
07/16/2012 1:38 pm
పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
సురేశ్ గారు, తిక్కన ఎఱ్ఱాప్రగడల కాలమునుండి థ అక్షరాన్ని ధ గా పలకడము ఉన్నదనుకొంటాను. థ, ధ లకు, ద-ధ లకు నన్నయ, తిక్కనల కాలమునుండి ప్రాస చెల్లుతుంది. అన్ని వర్గాక్షరములకు (ఉదా. బ-భ, గ-ఘ, ఇత్యాదులు) ఇలాటి ప్రాస చెల్లక పోయినా థ-ధ, ద-ధ లకు మాత్రము ఇట్టి ప్రాసను ఆ కాలమునుండి కవులు అంగీకరించారు. దీనికి కారణము ఉచ్చరణ మాత్రమే అని నా అభిప్రాయము. అప్పకవి, వేంకటరమణకవి తమ లక్షణగ్రంథాలలో దీనిని పేర్కొన్నారు. వీటికి ఉదాహరణములు ఆంధ్రమహాభారతములో లభ్యము. విధేయుడు – మోహన
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/16/2012 12:26 pm
రమ గారు,
సంస్కృతము, తెలుగు వేర్వేరు భాషాకుటుంబాలకు చెందినవి కాబట్టి వాటి వర్ణనిర్మాణంలో తేడాలు ఉండటం సహజం. ణ, ళ వంటి మూర్ధన్య అక్షరాలు మూల ఇండో-యూరోపియన్ లో లేవు. మూర్ధన్య అక్షరాలు, దంతమూలీయ అక్షరాలు (ఱ) ద్రావిడ భాషల ప్రత్యేకత. ఇండో-యూరోపియన్ భాషలలో అల్పప్రాణాలకు, మహాప్రాణాలకు తేడా స్పష్టం. ఆ తేడా ద్రావిడ భాషలలో లేదు. ద్రావిడ భాష అచ్చులలో ఎ, ఏ, ఒ, ఓ ల మధ్య తేడా ఉంది. ఇండో-ఆర్యన్ భాషలలో లేదు (మూల ఇండో-యూరోపియన్ లో ఉండేదని ఒక వాదం). ద్రావిడ భాషలలో సంయుక్తాక్షరాలు పరిమితం: ద్విత్వాక్షరాలు, వర్గ అనునాసికాలకు గ, జ, డ, ద, బ లతో సంయుక్తాక్షరం ఏర్పడటం మాత్రమే కనిపిస్తుంది. ఇండో-యూరోపియన్ భాషలలో క్లిష్టమైన సంయుక్తాక్షర సమూహాలు కనిపిస్తాయి: స్త్ర, ప్ర, ష్ట్ర వంటి ఒత్తులు సర్వసాధారణం.
తెలుగు వర్ణనిర్మాణం గురించి నేను 2007 లో పొద్దు పత్రికలో రాసిన ఈ వ్యాసాలు చూడండి:
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం
“ళ” ని “ల” గా, “ణ” ని “న” గా పలకడం ప్రాఙ్నన్నయ్య కాలంనుండి వస్తున్న తెలుగు సంప్రదాయమే. మూల ద్రావిడంలోని “అణ్ణ”, “మణ్ణు”, “కణ్ణు” లను మనం ఎప్పటి నుండో “అన్న”, “మన్ను”, “కన్ను” అని పలుకుతున్నాం. అలాగే, ఉల్లము, లోపల అన్న పదాలకు ద్రావిడ ధాతువు ఉళ్-, ఒళ- (లోపలకు తమిళంలో ఉళ్ళ అని, కన్నడలో ఒళగె అని అంటారు). పళ్ళ- అన్న మూల ద్రావిడ పదం తెలుగులో పల్లము అయింది. ఉళి తెలుగులో ఉలి (chisel) అయ్యింది. బండి “ఱ” సంగతి సరేసరి.
“ప్రవాహినీ భాషా”అన్నారు కదా. భాష నిరంతరం మారుతూనే ఉంటుంది. పెద్దన కాలంనాటి భాష నన్నయ్యకు నచ్చదు. జంధ్యాల పాపయ్య శాస్త్రి భాష పెద్దనకు నచ్చదు. మనం వాడుతున్న భాష మన తాతలకు నచ్చదు. వచ్చే తరం మాట్లాడే భాష మనకు నచ్చదు.
పెళ్ళి పెల్లి గానూ,కళ్ళు కల్లు గానూ, ఇళ్ళు(బహువచనం) ఇల్లు గానూ కాలక్రమేణా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనంటారా అంటే కాదనే చెబుతాను. ఈ ధ్వని మార్పులు ఎంత భాషాత్మకమో (linguistic), అంత సామాజికం (sociological) కూడానూ. ధ్వని పరిణామాలను మెజారిటీ ఒప్పుకోనిదే భాషలో భాగం అయిపోవు కదా? ఈ ధ్వని మార్పులకు మెజారిటీ అనిష్టతను, తిరస్కృతిని చూపిస్తే, ఆ ధ్వని పరిణామం అందరికీ ప్రామాణికం కాకుండా ఆగిపోతుంది. ‘ళ’ ‘ల’ ల వినిమయంపై అనిష్టతను వ్యక్తం చేస్తూ మీరు రాసిన టపా ద్వారా మీ వంతు సామాజిక బాధ్యతను మీరు నిర్వర్తించారనే నా అభిప్రాయం.
ఈ రకమైన వ్యతిరేకత లేకుండా ఈ మధ్య తెలుగులో వచ్చిన ధ్వని పరిణామాలలో ఒకటి: థ > ధ గా మారటం. తెలంగాణలో పుట్టి పెరిగిన నేను హైదరాబాదుకు వచ్చిన మొదటి రోజుల్లో నా కోస్తాంధ్ర మిత్రులందరు కధ (kadha instead of katha), రధము (radhamu instead of rathamu), విశ్వనాధం (viSwanaadham instead of viSwanaatham) అంటూ ఉంటే వినలేకపోయేవాడిని. పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
ఏ ధ్వని పరిణామమైనా ప్రామాణికుల అంగీకారం లేనిదే భాషలో భాగమైపోదు. మన దురదృష్టంకొద్ది తెలుగు భాష ప్రామాణికతను వితర్కించి, నిర్ణయించే వ్యవస్థ మనకు లేదు. తెలుగు భాషా ప్రయోగాలను ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే పండిత వర్గంకానీ, ప్రామాణికమైన ఆధునిక నిఘంటువులుగాని మనకు లేవు. బలమైన సామాజిక, రాజకీయ సంకల్పం లేకపోతే 21వ శతాబ్దంలో తెలుగు వంటి ఆంగ్లేతర భాషల మనుగడ సందేహాస్పదమేనని David Crystal వంటి భాషావేత్తలు కంఠశోష పెడుతున్నా, పట్టించుకొనే నాథుడే లేడు. ముఖ్యంగా, ప్రాథమిక స్థాయిలో తెలుగు విద్యా బోధనను ఐచ్ఛికం చేయడం తెలుగు భాష మనుగడకు గొడ్డలిపెట్టు అని నా అభిప్రాయం.
సురేశ్.
ఉరుము ఉరిమి… గురించి మోహన అభిప్రాయం:
07/15/2012 11:44 am
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/15/2012 9:12 am
అవునండి! అందరిళ్ళల్లో జరిగే సంగతే..కథ గా రాశాను. నచ్చి నందుకు సంతోషం గా వుంది.
కృతజ్ఞతలతో ..
-ఆర్.దమయంతి.
88 ఏళ్ళ యువకులు గురించి Madhavi Puranam అభిప్రాయం:
07/15/2012 9:08 am
Dear Shri Rohini Prasad garu:
Thank you for writing this article. It is most interesting and inspiring. I am the Managing Editor of a Journal on the Classical Dances of India, Nartanam. We have been looking for articles on Music for Dance and the two stalwarts about whom you have written have made great contributions towards dance music. Hope you will share your email id or telephone number so that we can get in touch with you to explore the possibility of a detailed article on the above mentioned lines.
Best Regards
Madhavi Puranam