శ్రీశ్రీ గురించి ఈ పొగడ్తలు చూసినప్పుడల్లా, అదే ఆశ్చర్యం కొత్తగా మళ్ళీ మళ్ళీ కలుగుతూ వుంటుంది.
అక్టోబరు 29, 2012 నాటి ఆంధ్రభూమి సాహితీ పేజీలో, మణి మేఖల గారి, “శ్రీశ్రీని మోసే వీర భక్తులూ…. ఆలోచించండి!” వ్యాసం చూడండి మరి కొన్ని వివరాలకి. ఈ వారం ఎ. రజాహుస్సేన్ రాసిన వ్యాసం కూడా చూడండి ఆంధ్రభూమిలో. శ్రీశ్రీ రాసిన గొప్ప కవిత్వానికి ఎలా మెప్పుదలలు లభిస్తాయో, అలాగే ఆయన రాసిన చెత్తకీ, చేసిన చెత్త పనులకీ విమర్శలు లభిస్తాయి.
శ్రీశ్రీ రాసిన “అనంతం” పుస్తకం విషయంలో రంగనాయకమ్మ గారు రాసిన ఉత్తరం, దానికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన అవక తవక జవాబూ, దానికి రంగనాయకమ్మ గారి స్పందనా – ఈ విషయాలన్నీ, రంగనాయకమ్మ గారు రాసిన, “మానవ సమాజం (నిన్నా – నేడూ – రేపూ)” పుస్తకంలో వున్నాయి (పేజీలు: 231-233). శ్రీశ్రీ, ‘అనంతం’ పేరుతో ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో 1975 నించీ చాలా కాలం పాటు ‘ఆత్మ కధ’ రాశారు. అందులో ఒక వారం శ్రీశ్రీ రాసిన విషయాలు చూసి, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక లోనే నవంబరు 1, 1975 సంచికలో ఒక ఉత్తరం రాశారు. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు జనవరి 25, 1976 సంచికలో వచ్చింది. ఆ జవాబు చూసి, రంగనాయకమ్మ గారు మళ్ళీ ఫిబ్రవరి 8, 1976 సంచికలో ఇంకో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాల్లో, శ్రీశ్రీ చేసిన వ్యభిచారం గురించీ, శ్రీరంగ నీతుల గురించీ, మార్క్సిస్టు పేరుతో చేసే మోసాల గురించీ ప్రశ్నలున్నాయి. వాటికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన దొంగ జవాబు ప్రస్తావనా, ఆ జవాబుపై వచ్చే ప్రశ్నలూ, అన్నీ వున్నాయి. “అనంతం” పుస్తకంలో, మణి మేఖలు గారు ప్రస్తావించిన వాటి కన్నా ఘోరమైన విషయాలు వున్నాయి. “పాఠకులందరూ తెలివి తక్కువ వాళ్ళూ, ఏం రాసినా, ఏం చేసినా అడగరూ, పైపెచ్చు భక్తితో గొప్ప భజన చేస్తారూ” అనే ధీమా ఈ పుస్తకంలో అడుగడుగునా కనబడుతుంది.
రాతల్లో మాత్రమే అభ్యుదయాన్ని చూపుతూ, ఆచరణలో దాన్ని పట్టించు కోకుండా వుండే రచయితలకూ, కవులకూ భజనలు దొరుకుతాయేమో గానీ, నిజమైన గౌరవం మాత్రం దొరకదు. వారిని పాఠకులు కల కాలం నమ్మరు. వారు ఎంత గొప్ప గొప్ప విషయాలను చెప్పినా సరే, చెప్పిన విషయాలను వారే పాటించ నప్పుడు, “గొప్ప చెప్పారులే, గొప్ప గొప్ప కవితాత్మక పద్ధతుల్లో, ఎవరూ కని పెట్టని విషయాలని!” అని తీసి పారేయాలనిపిస్తుంది. రాసే వారికి చేతలు ఎంత ముఖ్యమో అర్థం కాకపోతే, ఈ అగౌరవాలు తప్పవు.
కథ చాల బాగుంది. అవును, సుబ్బారావు గారు చెప్పినట్టు మెచ్చుకుంటే బాగుండేది. కాని మెచ్చుకోడు. ఆ పాత్ర స్వభావం అలాంటిది. రచయితకు ధన్యవాదాలు, చక్కని ముగింపు.
శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/14/2012 5:52 pm
శ్రీశ్రీ గురించి ఈ పొగడ్తలు చూసినప్పుడల్లా, అదే ఆశ్చర్యం కొత్తగా మళ్ళీ మళ్ళీ కలుగుతూ వుంటుంది.
అక్టోబరు 29, 2012 నాటి ఆంధ్రభూమి సాహితీ పేజీలో, మణి మేఖల గారి, “శ్రీశ్రీని మోసే వీర భక్తులూ…. ఆలోచించండి!” వ్యాసం చూడండి మరి కొన్ని వివరాలకి. ఈ వారం ఎ. రజాహుస్సేన్ రాసిన వ్యాసం కూడా చూడండి ఆంధ్రభూమిలో. శ్రీశ్రీ రాసిన గొప్ప కవిత్వానికి ఎలా మెప్పుదలలు లభిస్తాయో, అలాగే ఆయన రాసిన చెత్తకీ, చేసిన చెత్త పనులకీ విమర్శలు లభిస్తాయి.
శ్రీశ్రీ రాసిన “అనంతం” పుస్తకం విషయంలో రంగనాయకమ్మ గారు రాసిన ఉత్తరం, దానికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన అవక తవక జవాబూ, దానికి రంగనాయకమ్మ గారి స్పందనా – ఈ విషయాలన్నీ, రంగనాయకమ్మ గారు రాసిన, “మానవ సమాజం (నిన్నా – నేడూ – రేపూ)” పుస్తకంలో వున్నాయి (పేజీలు: 231-233). శ్రీశ్రీ, ‘అనంతం’ పేరుతో ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో 1975 నించీ చాలా కాలం పాటు ‘ఆత్మ కధ’ రాశారు. అందులో ఒక వారం శ్రీశ్రీ రాసిన విషయాలు చూసి, రంగనాయకమ్మ గారు ఆ పత్రిక లోనే నవంబరు 1, 1975 సంచికలో ఒక ఉత్తరం రాశారు. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు జనవరి 25, 1976 సంచికలో వచ్చింది. ఆ జవాబు చూసి, రంగనాయకమ్మ గారు మళ్ళీ ఫిబ్రవరి 8, 1976 సంచికలో ఇంకో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాల్లో, శ్రీశ్రీ చేసిన వ్యభిచారం గురించీ, శ్రీరంగ నీతుల గురించీ, మార్క్సిస్టు పేరుతో చేసే మోసాల గురించీ ప్రశ్నలున్నాయి. వాటికి శ్రీశ్రీ దాటవేతలతో ఇచ్చిన దొంగ జవాబు ప్రస్తావనా, ఆ జవాబుపై వచ్చే ప్రశ్నలూ, అన్నీ వున్నాయి. “అనంతం” పుస్తకంలో, మణి మేఖలు గారు ప్రస్తావించిన వాటి కన్నా ఘోరమైన విషయాలు వున్నాయి. “పాఠకులందరూ తెలివి తక్కువ వాళ్ళూ, ఏం రాసినా, ఏం చేసినా అడగరూ, పైపెచ్చు భక్తితో గొప్ప భజన చేస్తారూ” అనే ధీమా ఈ పుస్తకంలో అడుగడుగునా కనబడుతుంది.
రాతల్లో మాత్రమే అభ్యుదయాన్ని చూపుతూ, ఆచరణలో దాన్ని పట్టించు కోకుండా వుండే రచయితలకూ, కవులకూ భజనలు దొరుకుతాయేమో గానీ, నిజమైన గౌరవం మాత్రం దొరకదు. వారిని పాఠకులు కల కాలం నమ్మరు. వారు ఎంత గొప్ప గొప్ప విషయాలను చెప్పినా సరే, చెప్పిన విషయాలను వారే పాటించ నప్పుడు, “గొప్ప చెప్పారులే, గొప్ప గొప్ప కవితాత్మక పద్ధతుల్లో, ఎవరూ కని పెట్టని విషయాలని!” అని తీసి పారేయాలనిపిస్తుంది. రాసే వారికి చేతలు ఎంత ముఖ్యమో అర్థం కాకపోతే, ఈ అగౌరవాలు తప్పవు.
జె. యు. బి. వి. ప్రసాద్
కిటికీ గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
11/14/2012 12:27 pm
Twitst in the tail!!
నువ్వే నేననీ… గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
11/14/2012 12:13 pm
heart-wrenchingly beautiful; but, why are beautiful stories often impractical?
శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి kishore kumar kagitha అభిప్రాయం:
11/14/2012 6:09 am
శాస్త్రి గారు, మీరు చాలా చక్కగా శ్రీశ్రీ గురించి వివరించారు . థాంక్స్. మనం ఎప్పటికి మరచి పోలేని కవి శ్రీశ్రీ.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి kavita అభిప్రాయం:
11/13/2012 11:37 pm
కథ చాల బాగుంది. అవును, సుబ్బారావు గారు చెప్పినట్టు మెచ్చుకుంటే బాగుండేది. కాని మెచ్చుకోడు. ఆ పాత్ర స్వభావం అలాంటిది. రచయితకు ధన్యవాదాలు, చక్కని ముగింపు.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి sastry అభిప్రాయం:
11/13/2012 10:16 pm
కధ చెప్పిన తీరు మనసుకు హత్తుకునేలా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే సందేశం నాకు ఈ కధలో కనిపించిన సందేశం.
ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం గురించి K PARANDHAMAIAH అభిప్రాయం:
11/13/2012 11:16 am
THANK YOU FOR YOUR GOOD INFORMATION AND STRONG MESSAGE ABOUT AP FINE ARTS.
ఈమాట గురించి గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:
11/13/2012 3:12 am
‘ఈమాట’ కి దీపావళి శుభాకాంక్షలు. – డా. బండి సత్యనారాయణ. విశాఖపట్నం.
స్వప్న సుందరి గురించి kesava kumar అభిప్రాయం:
11/12/2012 5:15 am
చాల బాగుంది.
ఈమాట గురించి గురించి DR. BANDI SATYANARAYANA అభిప్రాయం:
11/11/2012 9:49 am
అయ్యా, మీ “ఈ మాట” గురించి ఇప్పుడే నెట్లో చూశాను. అద్భుతం.