పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నాకు నచ్చిన పద్యం: ఒక వెచ్చని హెచ్చరిక గురించి Arif అభిప్రాయం:

    02/11/2015 7:26 am

    అద్భుతం. పద్యం యొక్క భావాన్ని వివరిస్తూనే కాలం, ప్రకృతి పట్ల మానవజాతికి వుండవల్సిన భాద్యతను చక్కగా తెలిపారు. ఓమర్ ఖయాము అనువాదం గూర్చి తెలిపినందుకు ధన్యవాదాలు.

  2. గీతులు గురించి వెల్లంకి శేషగిరి రావు అభిప్రాయం:

    02/07/2015 11:29 am

    చక్కని వ్యాసము. అభినందనలు

  3. గాయం గురించి pandu chalasani అభిప్రాయం:

    02/07/2015 11:16 am

    gaayapadina manasuke telusu aabaadha ela vuntundo.

    baavundi.

  4. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి kanakarajutunga అభిప్రాయం:

    02/07/2015 10:07 am

    పెద్దనవలె కృతి జెప్పిన పెద్దనవలె! అల్పకవిని పెద్దనా?
    ఎద్దనవలె మొద్దనవలె గ్రద్దనవలె కాకోదర కుందవరపు కవి చౌడప్ప

  5. జాషువా – పిరదౌసి గురించి Sasidhar Pingali అభిప్రాయం:

    02/06/2015 7:46 am

    చాలా చక్కని వ్యాసాన్ని అందించారు మానసగారూ. ధన్యవాదాలు.
    –శశిధర్ పింగళి

  6. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    02/05/2015 3:57 pm

    సత్యం చెంగవల్లి గారికి:

    ఈ వ్యాస కర్త రోహిణీప్రసాద్ గారు బ్రతికి ఉన్నట్టయితే, మీ స్పందనకి ఇంకా మంచి సమాధానం వచ్చేది! ఈ వ్యాసకర్త చెప్పినట్టు ఈ 6 పద్యాలు హిందూస్తానీ రాగాల్లోనే కూర్చబడ్డాయి.

    నాకు తెలిసిన వివరాలు నేను చెపుతా.

    1. నేనొక పూల మొక్క కడ నిల్చి: ఈ పద్యం మాండ్ రాగంలోనిదే! శివరంజని రాగానికి మాండ్ రాగానికి పోలికే లేదు. పాత సినిమా జయభేరి (అక్కినేని) లో “నీదాన నన్నదిరా, నిన్నే నమ్మిన చిన్నదిరా!” అన్న పాట మాండ్ రాగంలో బాణీ కట్టబడ్డదే!

    2. ఆయువు గల్గు: ఈ పద్యం మారుబిహాగ్ రాగం లో కట్టబడింది. కల్యాణి రాగంలాగా ఎందుకు అనిపిస్తుందో వ్యాసంలోనే చెప్పబడింది.

    3. గాలిని గౌరవింతుము: బసంత్ రాగం. పంతువరాళి అని అందుకు అనిపిస్తుందో నేను సరిగ్గా చెప్పలేను.

    4. ఊలు దారాలతో: మీరు అనట్టు ఇది పహాడి రాగమే! వ్యాసకర్త కూడా అదే చెప్పారు.

    5. మా వెలలేని ముగ్ధ: ఇది మిశ్ర శివరంజని రాగం. శివరంజని రాగం లో ఆరోహణ స, రి2, గ1, ప, ధ2, ని1, స. అలాగే అవరోహణ స, ని1, ధ2, ప, గ1, రి2, స. ఆన్న స్వరాలు వస్తే మిశ్ర శివరంజని అవుతుంది. బందిపోటు సినిమాలో ఘంటసాల బాణీ కట్టి పాడిన “వగల రాణివి నీవే” అన్న పాట ఈ కోవకు చెందిందే!

    6. బుద్ధ దేవుని: ఇది రాగేశ్రీ రాగంలో బాణీ కట్టబడింది. భాగేశ్రీ అనుకొనే అవకాశం ఉంది. రెండు రాగాల్లో గాంధారం మాత్రమే తేడా. రాగేశ్రీ లో తీవ్ర గాంధరం, భాగేశ్రీ లో కోమల గాంధారం వాడతారు. సారంగధర సినిమాలో “అన్నానా భామిని…” అన్న పాట రాగేశ్రీ లోను, మాయాబజార్ (పాత) సినిమాలో “నీ కోసమె నే జీవించునది…” అన్న పాట భాగేశ్రీ లో బాణీ కట్టబడ్డాయి.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి satyam changavalli అభిప్రాయం:

    02/05/2015 2:01 am

    నమస్కారమండీ! ఈ వెబ్ సైట్ చూశాక నాకు మహా సంతోషంగా వుంది.

    కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి “పుష్ప విలాపం-రాగాలతో సల్లాపం” వ్యాసం (సెప్టెంబర్,2009) లోని రాగాలగూర్చి మరొక ప్రముఖుని విశ్లేషణ ఇలా వుంది:

    – నేనొక పూలమొక్క కడ (శివరంజని)
    – ఆయువు గల్గు (కల్యాణి)
    – గాలిని గౌరవింతుము (పంతువరాళి/కామవర్ధిని)
    – ఊలు దారాలతో(పహిడి/యదుకులకాంభోజి)
    – మా వెలలేని(మార్వ)
    – బుధ్ధ దేవుని (భాగేశ్రీ) …

    నా వంటి పసి అభ్యాసకులకి కాస్త కన్ఫ్యూజన్!

  8. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి Pandu RV Kuchibhotla అభిప్రాయం:

    02/04/2015 5:45 pm

    హల్లో విష్ణుభొట్ల లక్ష్మన్నా! అసలు ఘంటసాల వారికీ బాలూకీ పోలికే లేదు. వెయ్యి జన్మలెత్తినా కాకి హంస కాజాలదు. నెత్తిన ఎర్ర చర్మం వుంది కదాయని కోడిపుంజు నెమలి కాజాలదు. బాలూ విషయంలో మీ అభిమానం మీ సొంత విషయం. ఘంటసాల కన్నా గొప్పయని ఇంకెవరో కూడా కూస్తున్నారు. ఇది బహుధా అభ్యంతరకరం ఆక్షేపణీయం. అబద్ధాలాడుతూ ఘంటసాల వారి గీతాలను సాలూరి వారికీ మహాదేవన్ గారికీ సత్యం రాఘవులూ తదితర ఘంటసాల వారి అసిస్టెంట్లకి అంటగట్టే ప్రయత్నం అటు చాపక్రింది నీరులాగ పాడుతా తీయగా స్వరాభిషేకం వంటి వేదికలపై బాలూ ఇటు నెట్ లో ఇటువంటి ఆర్టికిల్స్ ద్వారా మీలాంటి బాలూ భజన బృందాలూ కొనసాగిస్తోన్న అడ్డగోలు ప్రచారం నరకహేతువే కాగలదు. సుశీలమ్మ కన్నా జానకి గొప్ప గాయని అని కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్న బాలూ తెలుగు కళామతల్లిని ఘోరంగా అవమానిస్తున్నాడు.

  9. ఓహో యాత్రికుడా.. గురించి subramanyam అభిప్రాయం:

    02/04/2015 5:05 am

    సర్ — సాలురి పాటలు ఎక్కువగా అక్కినేని ఛిత్రాలకు వున్నవి, కారణము యేమిటి?

  10. నాకు బాగా నచ్చిన ఒక మంచి పద్యం గురించి kanakaraju tunga అభిప్రాయం:

    02/03/2015 8:51 am

    ఈ పద్యంను శ్రీపోతన చరిత్రము పుస్తకం (వానమామలై వరదాచార్యుల) కథ ప్రారంభం లో చదివినాను