పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. బండలు గురించి మంథా భానుమతి అభిప్రాయం:

    11/03/2017 2:22 am

    చాలా చాలా బాగుంది నూతన కథా వస్తువు. ఇంతవరకూ పొగబండి కథలు అని రైల్వే ఉద్యోగాలు అందులో కథలు ఓలేటి శ్రీనివాస భానుగారు రాశారు. కానీ ఎయిర్ లైన్స్ కథలు నువ్వే రాస్తున్నావు కృష్ణవేణీ. బండల మీద బుల్లి బుల్లి కథలు… మనస్తత్వాలు… చక్కగా వివరించావు. చివరి మలుపు కూడా బాగుంది. అభినందనలు.

  2. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Raghavendra అభిప్రాయం:

    11/02/2017 9:59 pm

    అనువాదం అని చూసి చదువుతూ దశాబ్దాలక్రితం రాసినదేమో అని ఊహిస్తూ వచ్చాను. చివరలో ఈఏడాదే చేసిన ప్రసంగమని తెలిసి నిరుత్సాహం కలిగింది. తెలుగు/ తమిళ భాషలలో ధ్వన్యేకత కలిగి సమానర్ధకాలుకాని పదాలనేకం. విచారము అంటే సంతాపం పొందటమనే స్ఫురిస్తుంది. విచారణ క్రియావాచకం. విచారణా భాష అనివాడుంటే మేలుగా ఉండేది.

  3. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    11/02/2017 5:00 pm

    ఈ ఉపన్యాసం చదువుతుంటే వివక్ష అనేది కేవలం కుల వ్యవస్థలో మాత్రమే ఉన్నదన్న భావన కలిగితే అది పాఠకుల తప్పు కాదనుకుంటాను. క్రమానుగత భేదం కులానికి మాత్రమే పరిమితం కాదని చెప్పాల్సి రావడం విచారకరం. అది అన్ని జీవుల్లోను, అన్ని ప్రాంతాల్లోను, అన్ని సమాజాల్లోను, అన్ని కాలాల్లోను, అన్ని రకాలుగానూ వర్ధిల్లుతున్నదే. ఇది మను సృష్టి కాదు. సృష్టిలోనే అంతర్గతం. కాకపోతే ఎప్పుడూ పడ్డవాడికి పైవాడిని చూస్తే ఒళ్ళు మండడం సహజం. పడ్డవాడు వాడి క్రిందవాడికి అదే మర్యాద చేస్తాడు. ప్రతి క్షణం తనని తాను అద్దంలో చూసుకుంటూ బ్రతకడం ఆదర్శమేనేమో గానీ, ఆచరణలో అసంభవం. చరిత్రలో అహం ప్రదర్శించని వ్యక్తిని చూపించి అప్పుడు ఈ ఉపన్యాసం ఇస్తే బాగుండేది!

  4. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి desikachary అభిప్రాయం:

    11/02/2017 2:25 pm

    This political article, which has no literary merit whatseoever, has no place in a ‘literary’ magazine like eemata. The editors will do a better service by removing it.

  5. ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    11/02/2017 11:16 am

    గణములను గుర్తు పెట్టుకోవడానికి మరొక mnemonic:

    ఆది మధ్యావసానేషు యరతాయాంతి లాఘవం
    భజసా గౌరవం యాంతి మనౌతు గురులాఘవం

    దీనర్థం:

    య, ర, త గణాలకు వరుసగా మొదట, మధ్యన, చివర (1, 2, 3 స్థానాలలో) లఘువులు ఉంటాయి. తక్కినవి గురువులు.

    భ, జ, స గణాలకు వరుసగా మొదట, మధ్యన, చివర (1, 2, 3 స్థానాలలో) గురువులు ఉంటాయి. తక్కినవి లఘువులు.

    మ గణం లో అన్నీ గురువులే. న గణం లో అన్నీ లఘువులే.

    ఈశ్లోకం గుర్తుపెట్టుకుంటే కాగితం లేకుండానే గణాలను తెలుసుకోవచ్చు.

    భవదీయుడు,

    ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.

  6. Nails గురించి Srinivas అభిప్రాయం:

    11/02/2017 10:24 am

    మార్కాపురమూ, ప్రకాశమూ అంటున్నారు కానీ యాస అంతా ఎందుకో వేరేగా (ఉత్తరాంధ్ర?) వినిపిస్తున్నాది.

  7. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/02/2017 8:37 am

    @మల్లికార్జున్,
    ‘తెలుగులో రాయవలిసిన పని ఎప్పుడూ పడలేదు’ అన్నాను నా మొదటి కథ కామెంట్లో. అంతే. తెలుగుదాన్నేగా?
    ‘వరసగా ‘ఎక్కడ? రెండున్నరేళ్ళల్లో ఎనిమిదోదే.
    బాగుందన్నందుకు థేంక్యూ.

    @సురేష్ వెంకట్ గారూ,
    థేంక్యూ నచ్చినందుకు.

  8. బండలు గురించి Suresh Venkat అభిప్రాయం:

    11/02/2017 5:50 am

    హ హ …సరదాగా సాగింది కధ .. చాలా బాగా రాశారు

  9. బండలు గురించి Mallikarjun అభిప్రాయం:

    11/02/2017 5:43 am

    తెలుగు పరిచయం లేదంటూనే.. తెలుగులో వరుసగా కథలు రాసేస్తున్నారు. వెరీ గుడ్.
    కథ బాగుంది. 🙂

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి రవి అభిప్రాయం:

    11/02/2017 3:38 am

    మంచి వ్యాసం. చక్కగా ఉంది.

    దక్షిణ భారతానికి చెందినవాడుగా పరిగణింపబడే దండి మహాకవి రాసిన దశకుమారచరిత్ర (సా.శ. 650-750) లో మొదటిసారి మనకు సంస్కృత కావ్య సాహిత్యంలో గజాననుని భగవంతుని రూపంగా ‘హస్తివక్త్రో భగవాన్’ అని వర్ణించడం మనకు కనిపిస్తుంది. దక్షిణాదికే చెందిన వాడైన బాణుని హర్షచరిత్రలో (7వ శతాబ్దం) మాత్రం ఇంకా ‘అయమశివ సహచరో వినాయకః’ అన్నదాన్ని వినాయకుడు అయం-అశివ-సహచర, అంటే అశుభకారకుడైన సహచరునిగానే వివరిస్తారు.

    దండి కన్నా బాణభట్టు పురాతనుడని సాధారణంగా సంస్కృత సాంప్రదాయం. ఆ పక్షంలో గణేశుని ప్రస్తావించిన మొదటి కవి బాణభట్టు కాగలడు. దండికి పూర్వీకుడు భారవి. ఆయన రచన కిరాతార్జునీయంలో గణేశుని ప్రస్తావన ఉందా అని గమనించాల్సి ఉంది.

    కాళిదాసుకు పూర్వీకుడైన భాసుడి నాటకంలోని “స్కందుని” ప్రస్తావనను, అమరకోశాన్ని వదిలేశారు. బహుశా వ్యాసవిస్తరభీతి తోనేమో అని అనుకుంటాను.

    మాఘంలో గణేశుని ప్రస్తావన మొదటి సర్గ ౬౦ వ శ్లోకంలో వస్తుంది.

    విలాసినీవిభ్రమదన్తపత్రికా విధిత్సయా నూనమనేన మానినా |
    నా జాతు వైనాయక మేక ముద్ధృతం విషాణ మద్యాపి పునః ప్రరోహతి ||

    దశకంఠుడు (రావణాసురుడు) ఒక సందర్భాన వినాయకుని కొమ్ము పెరికికొని పోయి, తన భార్యలకు దంతపు కమ్మలను చేయించుకున్నాడు. అప్పటి నుండి అతనికి కొమ్ములు మొలవక ఒంటికొమ్ము వాడాయెను.

    పైని వినాయకుని ఒంటికొమ్ము ప్రస్తావనకు మల్లినాథసూరి (సర్వంకష) వ్యాఖ్య ఇలా ఉంది. “ఏతదన్యథా కథం గజాననస్యైకదంతత్వ మిత్యుత్ప్రేక్ష్యతే నూన మితి.” ( ఇది అలా కాక మరేవిధంగా గజాననునికి ఒంటికొమ్ము వచ్చిందని ఖచ్చితంగా చెప్పగలమని మాఘకవి ఉత్ప్రేక్ష్య చేస్తున్నాడు).

    గజాననుడు భారతరచన కోసం తన కొమ్మును ఖండించుకుని ఏకదంతుడు/వక్రతుండుడుగా అవతరించాడని నేడు మనం చెప్పుకుంటున్న కథ. ఈ కథ మల్లినాథసూరి కాలం (పదమూడవ శతాబ్దానికి ఈవల) నాటికి కూడా ప్రాచుర్యం పొందినట్టు లేదు బహుశా!

    11వ శతాబ్దానికి చెందిన నేపాలీ బౌద్ధగ్రంథం ధర్మకోశసంగ్రహంలో పైకథకు కొంత మార్పులు కనిపిస్తాయి. దశక్రోధులలో ఒకరైన విఘ్నాంతకుడిని చూసి వినాయకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తే, విఘ్నాంతకుడు గణేశుని దంతాలలో ఒక దంతాన్ని పెరికివేస్తాడు. అప్పుడు మదమణిగిన వినాయకుడు తన బుద్ధి తెచ్చుకొని సిద్ధిదాతగా, శుభప్రదాతగా బౌద్ధదేవతలలో ఒకడుగా మారిపోతాడు

    వ్యాసంలో పైన పేరాలో పేర్కొన్న బౌద్ధ గాథ మాఘుని శిశుపాల వధమ్ లోని దశకంఠుని వృత్తాంతానికి నకలేమో అని పరిశీలించాల్సి ఉంది. లేదూ ఈ రెండు ఉదంతాలకూ మూలం మరేదైనా ఉందా? యేమో!

    ~6 వ శతాబ్దం వరకూ ఏ సాహిత్యంలోనూ ఊసేలేని గణేశుడు, తర్వాత ~యాభై/వంద యేళ్ళ కాలంలో అంత త్వరగా, ఉన్నట్టుండి, గణాధిపతిగా మారి కవుల రచనలలో ఎలా భాగమయ్యాడో ఆశ్చర్యమైన విషయం. బహుశా ఆ సమయంలో గణేశునికి సంబంధించిన ఏదో పురాణ రచన ప్రజలలో బలంగా చొచ్చుకొని పోయి ఉండాలి. లేదా ఏదో సామాజిక ధార్మిక విప్లవం లాంటిది జరిగుండాలేమో.

    చక్కని వ్యాసం. Dry subject ను ఆకర్షణీయంగా వ్రాయడం సులభం కాదు. మరోసారి అభినందనలు.