కొంపెల్ల గారూ !! మీ ప్రశ్నకి గొర్తి బ్రహ్మానందం గారు ఏమని జవాబు చెప్తారో వింటాను. అంతకు ముందు నావి కొన్ని సందేహాలూ.. సమర్ధింపులూ.. వివరణలూ.. విబేధాలూను:)
మనకున్న భక్తి సాహిత్యం చాలా గొప్పది. మీరన్నట్టూ భక్తి అంతస్సూత్రమ్ ఏ భక్తి రచనకైనా !! ఆ భావం లోని గాఢత వల్లనే దానికి ప్రాశస్త్యం వచ్చేది. దానికి ప్రత్యేకతా తెలిసేదీ. బాలమురళీ గారి అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నది. త్యాగ రాజు కీర్తనల లోని సాహిత్యం గురించి బాల మురళీనే కాదు అలా అభిప్రాయ పడిన వారు ఎందరో ఉన్నారు. మనం భక్తి రసాన్నీ సాహిత్య బలాన్నీ కట్టకలిపి ఆలోచించకూడదు కదా?? భక్తి భావం వేరు, వ్యక్తీకరణలో ఆయన ఎన్నుకున్న సాహిత్య విధానం వేరు. సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం.
అన్నమయ్యకి ఇవాళ పేరు వచ్చీసింది గనక ఆయన రాసిన వాటిని భక్తిగా ఒప్పీసుకుని సరే అని అనే దశకి వచ్చేరేమో భక్తులు నాకు తెలీదు. కానీ, త్యాగయ్య రాసిన లాంటి పదాలు కావు అన్నమయ్యవి. అది మీకు అర్ధం కావాలంటే విపులంగా వారిద్దరి రచనలనీ కలిపి పరిశీలించి చూడండి.
మనకి భాష చాలా పరిమితM; అందరూ కవులే!! అలాకాక మనం ఇంకొకలా మాట్లాడడానికి భాష చోటు ఇవ్వదు. కవితా సామగ్రి అని ఒకటి ఉంటుంది. సామగ్రి అని నేను అంటున్నప్పుడు భాషా పరంగా వ్యక్తం అయ్యే స్పందనని కలుపుకునే అంటున్నాను. ఈ స్పందన కవితాలక్షణాలతో ఎక్కువ వ్యక్తమ్ అయిన పదాలు అన్నమయ్యవి కాగా ..కేవలం భక్తి భావానికి మాత్రమే పరిమితమైనవి త్యాగయ్యవీ, రామదాసువీను. అదే భక్తిని జయదేవుడూ అన్నమయ్యా ఆ సరిహద్దుని దాటించి వారి భావ ప్రకటనని విశాలం చేసుకున్నారు. త్యాగయ్యా రామదాసు చేసుకోలేదు. చేసుకోదలచలేదా? చేసుకోలేకపోయారా? అన్నది చెప్పడానికి వాళ్ళు మన మధ్య లేరు గనక వారి రచనల ఆధారంగా గనక మనం చూస్తే, వాళ్ళ మార్గం వేరని మాత్రం చెప్పగలం. సాహిత్య ప్రమాణాలన్నవి ఏ సాహిత్యానికైనా వర్తిస్తాయి. దానికి మినహాయింపులు ఉండవు. కానీ, పోనీ ఉండవు. త్యాగయ్య కీర్తనలలోని భక్తి మనసుకి హాయిని ఇస్తుంది. అందులో సందేహం లేదు. కానీ సాహిత్యం ఇచ్చే సుఖం మీకు అందులో దొరకదు. అది దొరకాలీ అంటే మీరు అష్టపదులని వినాలి. అన్నమయ్య సంకీర్తన వినాలి. మనసుని అనేకానేక భావోద్రేకాలకి గురిచేయగల లక్షణం వీరి రచనలకి ఉన్నట్టుగా త్యాగరాజు గారి సాహిత్యానికి లేదు. అవి సంగీతం కోసం రాయబడినవి. బహుశా త్యాగయ్య గారి లక్ష్యం కూడా సాహిత్యం కాకపోయి ఉండవచ్చు. ఆయన సంగీతం లోంచి రాముడిని కొలిచినవాడు. ఆయన ఈ లక్ష్యానికి అనువైన సాహిత్యాన్ని వాడుకున్నాడే గాని సాహిత్యం ఆయన ఎన్నుకున్న ముఖ్య మార్గం మాత్రం కాదని ఆయన రచనలు స్పష్టం గానే చెబుతాయి. తప్పని సరిగా సాహిత్యపు విలువలు వేరైనవి సుమా! వాటి ఆధారం గానే దీనికన్నా ఇది బాగుంది అని మనం చెప్పగలిగేది. అభిరుచి అన్నది ఒకటి ఉంటుంది కదా? పిడుక్కీ బియ్యానికీ ఒకే కొలమానాలుండవు ఆ వ్యక్తి మనకి ఎంత ఇష్టమైన వారైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా! సాహిత్యపు విలువ వలననే “ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను.. భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా?” అన్న పదం అంతగా కొనియాడబడింది.
ఊహా భాషా ఉపమా ముప్పేటలుగా కలిసి సాగే రచనకీ అది కొరవడినరచనకీ చాలా తేడా ఉంటుంది మరి. అయితే త్యాగయ్య రచనలకి ఉన్న విలువ ఏమిటన్న ప్రశ్న ఉంటుంది. అవి భక్తితో నిండినవి గనక భక్తితో పాడుకున్నప్పుడు ఉపయోగపడతాయి. సంగీతం కలిసి ఉన్నందువలన సంగీతప్రియులని అలరిస్తాయి. కానీ సాహిత్యమ్ అంటే అది వేరే ప్రమాణమే!!
ఇంక బాలమురళీ అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నదే అయినా.. అసలవి సాహిత్యమా అన్నది ముఖ్య ప్రశ్న. అవి సాహిత్యం అయితే అప్పుడు వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన రాసిన వాటిల్లో ఎక్కడా ఆ వాసనలు లేవు. ఆయన గొప్ప గాయకుడు అన్నదే నిలుస్తుంది. ఇంక ఆయన కవి కావాలని అనుకున్నాడు అని మనకి అర్ధమవుతుంది.
రమగారు, డాక్టర్ సాళ్వ కృష్ణమూర్తిగారి అనువాదమును Tunes of Divinity సంకీర్తన లక్షణము అనే పేరితో Institute of Asian Studies, Madras 1990లో ప్రచురించారు. ఇది రెండు భాగాల పుస్తకము. దీని మొదటి భాగాన్ని రెండు మారులు scan చేసారు (రెండవ మారు స్కాన్ చేసిన దానిని రెండవ భాగము అనుకొన్నారేమో). ఒకే భాగాన్ని రెండు సారులు స్కాన్ చేసిన పుస్తకాన్ని ఇక్కడ pdf రూపములో డవున్లోడ్ చేసికొన వచ్చును –
భక్తయినా, రక్తయినా దాని భావం వెలువడేది భాషతోనే! భక్తి రంగరించినంత మాత్రాన అది గొప్ప సాహిత్యం కాదు. పోతన భాగవతంలోనూ ఉన్నదదే! కానీ చెప్పే విధానంతో కొత్తగా అనిపిస్తాయి. భలేగా చెప్పారే? అనుకుంటాము. ఉదాహరణకి, “నీ దాసుడిగా నన్ను కనికరించు” అనడానికీ, “బంటు రీతి కొలువియ్య వయ్య రామా?” అని చెప్పడానికీ తేడా వుంది. రెండో దానిలో భావుకత ఉంది. సొగసైన భాష కనబడుతుంది. పాటగా విని ఆనందించడంలో సంగీతం వుంది. వరస బావున్నంత మాత్రాన గొప్ప పాటగా నిలిచిపోదు. దానికి సాహిత్యం తోడు కావాలి. పదే పదే ఆస్వాదించడానికి అది ఆస్కారమివ్వాలి. త్యాగరాజు భక్తి పాటలే కట్టినా, ఆయన కృతుల్లో శబ్దాలంకారాలున్నాయి. మంచి మంచి సమాసాలున్నాయి. కేవలం భక్తి మీదా, సంగీతం మీదే ఆయన శ్రద్ధ చూపలేదు. భాషని కూడా పట్టించుకున్నాడు. అది నాకు బాలమురళిగారి రచనల్లో కనిపించలేదు. అంతమాత్రాన బాలమురళీ గొప్ప విద్వాంసుడు కాదని నా వుద్దేశ్యం కాదు. సంగీతం విషయంలో ఆయన అపర త్యాగరాజే! ఎవరికీ అందులో సందేహం లేదు. రాదు కూడా!
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”
సాయి గారు,
త్యాగరాజ కృతులలో భక్తే ప్రధానం. అదే ఆయన ఎన్నుకున్న మార్గం. చేతకాక కాదు. (నిజానికి అందరు వాగ్గేయకారుల కృతులలో నూ ఇదే పరమప్రయోజనం). సాహిత్య పరంగా చూసినా కొన్ని కృతులు “జగదానందకారకా”, “బాల కనకమయ చేల” మొదలైనవి ఎన్నో కనిపిస్తాయి. త్యాగరాజ సాహిత్యం అంతా రామ మయం, ఇంకొక రామాయణం. అందంగా అనిపించడానికి , “భలే వేసారు ఇక్కడ ఈ పదాల కూర్పు” అనిపించుకోడానికి చేసిన ప్రయోగాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోతన గారి అంత్యానుప్రాస ప్రయోగ్రం ఎక్కువగా త్యాగరాజ కృతులలో కనిపిస్తుంది. ఎన్నో కావ్యాలు, కీర్తనలు అనేకమంది ప్రభువుల మీద, వారి భార్యల మీద, వారి ప్రేమికుల మీద రచించారు, సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నవి, రాగాలపరం గా వినసొంపుగా ఉండేవి. కాని అవేవి నిలబడలేదు. భారతీయ సంగీతానికి లక్ష్యం పరమాత్మని అందుకోవడమే. దానికి నవవిధ భక్తి ని ప్రమాణం గా తీసుకున్న వారి కృతులే అజరామరం గా నిలుస్తాయి. ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు మొదలైనవి. కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా, భక్తి లేనిది కేవలం వ్యర్ధమే….
బాలమురళి గారి గానం నాకెంతో ఇష్టం. కొన్ని కీర్తనలు భావం ఎరిగి ఆయన పాడినట్లు ఇంక ఎవరూ పాడ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన కృతులు కూడా చాల బాగుంటాయి, బాలమురళి గారు కేవలం భక్తే కాకుండా విప్లవం, స్ఫూర్తి కూడా జోడించాను అన్నారు. నిజానికి వెతికితే త్యాగరాజ కృతులలో అవి కూడా కనిపిస్తాయి. “యజ్ఞాదులు సుఖమనువారాల” , “తెలియలేరు రామ”, మొదలైనవి. భక్తి ప్రధానం గా ఉండి మిగిలినవి అంతర్లీనం గా ఉంటె అది గొప్ప సంగీత సాహిత్యం అవుతుంది. కేవలం సాహిత్య విలువల కోసం ఒకరి కీర్తన కంటే ఇంకొకరిది బాగుంది అని, వీరి కృతులలో కంటే వీరి కృతులలో సాహిత్యం బాగుంది అని ఎలా అనగలం?
రహమతుల్లాగారూ, చిరు చిరు నగవుల, నీ చరణ కమలాన, పదవే పోదాము గౌరీ, రామయ తండ్రీ మొదలైన పాటలని వినిగాని రాగం చెప్పలేనండీ. మొదటి రెండూ విన్న గుర్తులేదు. మూడోది పహాడీగాని, మాండ్గాని కావచ్చు.
కాస్త చాదస్తంగా అనిపిస్తుందేమోగాని కొంతవరకూ కీబోర్డ్స్ వాయించడం వచ్చినవారికి కొన్నిపాటలకి స్వరాలో, కొన్ని సందేహాలకి సమాధానాలో ఇస్తే బావుంటుందేమో.
రచయితలకు సూచనలు గురించి lakshmi అభిప్రాయం:
11/10/2011 3:16 pm
Dear sir,
emaaTa patrika chaalaa baagundi. manchi patrikanu andistunna meeku naa abhinandanalu. mee patrikaku nenu kadha pampaalante gmail loe telugulo type cheasi attachment file gaa pampavachchaa. dayacheasi telupagalaru..
lakshmi madhav
mysore
[Yes. You can send a Telugu file as an attachment in gmail – Eds.]
మూడు వందల రామాయణాలు గురించి sanjay అభిప్రాయం:
11/10/2011 10:39 am
సురేశ్ కొలిచాల గారు,
ఏమీ అనుకోనంటే వ్యాసం కన్నా మీ కామెంటు (సౌమ్య గారికి రిప్లై) అద్భుతం!
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:
11/10/2011 3:21 am
కొంపెల్ల గారూ !! మీ ప్రశ్నకి గొర్తి బ్రహ్మానందం గారు ఏమని జవాబు చెప్తారో వింటాను. అంతకు ముందు నావి కొన్ని సందేహాలూ.. సమర్ధింపులూ.. వివరణలూ.. విబేధాలూను:)
మనకున్న భక్తి సాహిత్యం చాలా గొప్పది. మీరన్నట్టూ భక్తి అంతస్సూత్రమ్ ఏ భక్తి రచనకైనా !! ఆ భావం లోని గాఢత వల్లనే దానికి ప్రాశస్త్యం వచ్చేది. దానికి ప్రత్యేకతా తెలిసేదీ. బాలమురళీ గారి అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నది. త్యాగ రాజు కీర్తనల లోని సాహిత్యం గురించి బాల మురళీనే కాదు అలా అభిప్రాయ పడిన వారు ఎందరో ఉన్నారు. మనం భక్తి రసాన్నీ సాహిత్య బలాన్నీ కట్టకలిపి ఆలోచించకూడదు కదా?? భక్తి భావం వేరు, వ్యక్తీకరణలో ఆయన ఎన్నుకున్న సాహిత్య విధానం వేరు. సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం.
అన్నమయ్యకి ఇవాళ పేరు వచ్చీసింది గనక ఆయన రాసిన వాటిని భక్తిగా ఒప్పీసుకుని సరే అని అనే దశకి వచ్చేరేమో భక్తులు నాకు తెలీదు. కానీ, త్యాగయ్య రాసిన లాంటి పదాలు కావు అన్నమయ్యవి. అది మీకు అర్ధం కావాలంటే విపులంగా వారిద్దరి రచనలనీ కలిపి పరిశీలించి చూడండి.
మనకి భాష చాలా పరిమితM; అందరూ కవులే!! అలాకాక మనం ఇంకొకలా మాట్లాడడానికి భాష చోటు ఇవ్వదు. కవితా సామగ్రి అని ఒకటి ఉంటుంది. సామగ్రి అని నేను అంటున్నప్పుడు భాషా పరంగా వ్యక్తం అయ్యే స్పందనని కలుపుకునే అంటున్నాను. ఈ స్పందన కవితాలక్షణాలతో ఎక్కువ వ్యక్తమ్ అయిన పదాలు అన్నమయ్యవి కాగా ..కేవలం భక్తి భావానికి మాత్రమే పరిమితమైనవి త్యాగయ్యవీ, రామదాసువీను. అదే భక్తిని జయదేవుడూ అన్నమయ్యా ఆ సరిహద్దుని దాటించి వారి భావ ప్రకటనని విశాలం చేసుకున్నారు. త్యాగయ్యా రామదాసు చేసుకోలేదు. చేసుకోదలచలేదా? చేసుకోలేకపోయారా? అన్నది చెప్పడానికి వాళ్ళు మన మధ్య లేరు గనక వారి రచనల ఆధారంగా గనక మనం చూస్తే, వాళ్ళ మార్గం వేరని మాత్రం చెప్పగలం. సాహిత్య ప్రమాణాలన్నవి ఏ సాహిత్యానికైనా వర్తిస్తాయి. దానికి మినహాయింపులు ఉండవు. కానీ, పోనీ ఉండవు. త్యాగయ్య కీర్తనలలోని భక్తి మనసుకి హాయిని ఇస్తుంది. అందులో సందేహం లేదు. కానీ సాహిత్యం ఇచ్చే సుఖం మీకు అందులో దొరకదు. అది దొరకాలీ అంటే మీరు అష్టపదులని వినాలి. అన్నమయ్య సంకీర్తన వినాలి. మనసుని అనేకానేక భావోద్రేకాలకి గురిచేయగల లక్షణం వీరి రచనలకి ఉన్నట్టుగా త్యాగరాజు గారి సాహిత్యానికి లేదు. అవి సంగీతం కోసం రాయబడినవి. బహుశా త్యాగయ్య గారి లక్ష్యం కూడా సాహిత్యం కాకపోయి ఉండవచ్చు. ఆయన సంగీతం లోంచి రాముడిని కొలిచినవాడు. ఆయన ఈ లక్ష్యానికి అనువైన సాహిత్యాన్ని వాడుకున్నాడే గాని సాహిత్యం ఆయన ఎన్నుకున్న ముఖ్య మార్గం మాత్రం కాదని ఆయన రచనలు స్పష్టం గానే చెబుతాయి. తప్పని సరిగా సాహిత్యపు విలువలు వేరైనవి సుమా! వాటి ఆధారం గానే దీనికన్నా ఇది బాగుంది అని మనం చెప్పగలిగేది. అభిరుచి అన్నది ఒకటి ఉంటుంది కదా? పిడుక్కీ బియ్యానికీ ఒకే కొలమానాలుండవు ఆ వ్యక్తి మనకి ఎంత ఇష్టమైన వారైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా! సాహిత్యపు విలువ వలననే “ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను.. భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా?” అన్న పదం అంతగా కొనియాడబడింది.
ఊహా భాషా ఉపమా ముప్పేటలుగా కలిసి సాగే రచనకీ అది కొరవడినరచనకీ చాలా తేడా ఉంటుంది మరి. అయితే త్యాగయ్య రచనలకి ఉన్న విలువ ఏమిటన్న ప్రశ్న ఉంటుంది. అవి భక్తితో నిండినవి గనక భక్తితో పాడుకున్నప్పుడు ఉపయోగపడతాయి. సంగీతం కలిసి ఉన్నందువలన సంగీతప్రియులని అలరిస్తాయి. కానీ సాహిత్యమ్ అంటే అది వేరే ప్రమాణమే!!
ఇంక బాలమురళీ అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నదే అయినా.. అసలవి సాహిత్యమా అన్నది ముఖ్య ప్రశ్న. అవి సాహిత్యం అయితే అప్పుడు వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన రాసిన వాటిల్లో ఎక్కడా ఆ వాసనలు లేవు. ఆయన గొప్ప గాయకుడు అన్నదే నిలుస్తుంది. ఇంక ఆయన కవి కావాలని అనుకున్నాడు అని మనకి అర్ధమవుతుంది.
రమ.
ఒక (అ)నాగరిక ఆనందం గురించి nArAyaNa అభిప్రాయం:
11/09/2011 9:49 pm
రామకృష్ణ గారు,
మీరు చెప్పినది కూడా బాగుంది.
ఐతే ఇందులో గతంలోకి పోతున్న భావనతో కాక;
భూమి మీది ప్రకృతిని ఒక అడవిలో సంచరిస్తున్న మనిషిగా
అనుభూతి పొందుతూ వ్రాయడంతో
నాగరికం అనాగరికం రెండింటి కలయికను చెప్పాలని
శీర్షికను అలా ఎంచుకున్నాను.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి మోహన అభిప్రాయం:
11/09/2011 9:22 pm
రమగారు, డాక్టర్ సాళ్వ కృష్ణమూర్తిగారి అనువాదమును Tunes of Divinity సంకీర్తన లక్షణము అనే పేరితో Institute of Asian Studies, Madras 1990లో ప్రచురించారు. ఇది రెండు భాగాల పుస్తకము. దీని మొదటి భాగాన్ని రెండు మారులు scan చేసారు (రెండవ మారు స్కాన్ చేసిన దానిని రెండవ భాగము అనుకొన్నారేమో). ఒకే భాగాన్ని రెండు సారులు స్కాన్ చేసిన పుస్తకాన్ని ఇక్కడ pdf రూపములో డవున్లోడ్ చేసికొన వచ్చును –
విధేయుడు – మోహన
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి బ్రహ్మానందం అభిప్రాయం:
11/09/2011 9:09 pm
పరంజ్యోతి గారూ,
భక్తయినా, రక్తయినా దాని భావం వెలువడేది భాషతోనే! భక్తి రంగరించినంత మాత్రాన అది గొప్ప సాహిత్యం కాదు. పోతన భాగవతంలోనూ ఉన్నదదే! కానీ చెప్పే విధానంతో కొత్తగా అనిపిస్తాయి. భలేగా చెప్పారే? అనుకుంటాము. ఉదాహరణకి, “నీ దాసుడిగా నన్ను కనికరించు” అనడానికీ, “బంటు రీతి కొలువియ్య వయ్య రామా?” అని చెప్పడానికీ తేడా వుంది. రెండో దానిలో భావుకత ఉంది. సొగసైన భాష కనబడుతుంది. పాటగా విని ఆనందించడంలో సంగీతం వుంది. వరస బావున్నంత మాత్రాన గొప్ప పాటగా నిలిచిపోదు. దానికి సాహిత్యం తోడు కావాలి. పదే పదే ఆస్వాదించడానికి అది ఆస్కారమివ్వాలి. త్యాగరాజు భక్తి పాటలే కట్టినా, ఆయన కృతుల్లో శబ్దాలంకారాలున్నాయి. మంచి మంచి సమాసాలున్నాయి. కేవలం భక్తి మీదా, సంగీతం మీదే ఆయన శ్రద్ధ చూపలేదు. భాషని కూడా పట్టించుకున్నాడు. అది నాకు బాలమురళిగారి రచనల్లో కనిపించలేదు. అంతమాత్రాన బాలమురళీ గొప్ప విద్వాంసుడు కాదని నా వుద్దేశ్యం కాదు. సంగీతం విషయంలో ఆయన అపర త్యాగరాజే! ఎవరికీ అందులో సందేహం లేదు. రాదు కూడా!
-బ్రహ్మనందం
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Paramjyothi Kompella అభిప్రాయం:
11/09/2011 3:52 pm
“త్యాగరాజు కృతుల్లో భక్తి తప్ప ఇంకేవీ ఉండదు. నేను దానికి భిన్నంగా కృతుల్లో కవిత్వం జోడించాను. విప్లవ సందేశాలు జతచేసాను. స్ఫూర్తి సందేశాలు నింపాను,” అంటూ తన రచనలపై ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారాయన.”
సాయి గారు,
త్యాగరాజ కృతులలో భక్తే ప్రధానం. అదే ఆయన ఎన్నుకున్న మార్గం. చేతకాక కాదు. (నిజానికి అందరు వాగ్గేయకారుల కృతులలో నూ ఇదే పరమప్రయోజనం). సాహిత్య పరంగా చూసినా కొన్ని కృతులు “జగదానందకారకా”, “బాల కనకమయ చేల” మొదలైనవి ఎన్నో కనిపిస్తాయి. త్యాగరాజ సాహిత్యం అంతా రామ మయం, ఇంకొక రామాయణం. అందంగా అనిపించడానికి , “భలే వేసారు ఇక్కడ ఈ పదాల కూర్పు” అనిపించుకోడానికి చేసిన ప్రయోగాలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోతన గారి అంత్యానుప్రాస ప్రయోగ్రం ఎక్కువగా త్యాగరాజ కృతులలో కనిపిస్తుంది. ఎన్నో కావ్యాలు, కీర్తనలు అనేకమంది ప్రభువుల మీద, వారి భార్యల మీద, వారి ప్రేమికుల మీద రచించారు, సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నవి, రాగాలపరం గా వినసొంపుగా ఉండేవి. కాని అవేవి నిలబడలేదు. భారతీయ సంగీతానికి లక్ష్యం పరమాత్మని అందుకోవడమే. దానికి నవవిధ భక్తి ని ప్రమాణం గా తీసుకున్న వారి కృతులే అజరామరం గా నిలుస్తాయి. ఒక అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురందరదాసు మొదలైనవి. కవిత్వం ఎంత గొప్పగా ఉన్నా, భక్తి లేనిది కేవలం వ్యర్ధమే….
బాలమురళి గారి గానం నాకెంతో ఇష్టం. కొన్ని కీర్తనలు భావం ఎరిగి ఆయన పాడినట్లు ఇంక ఎవరూ పాడ లేరేమో అని అనిపిస్తుంది. ఆయన కృతులు కూడా చాల బాగుంటాయి, బాలమురళి గారు కేవలం భక్తే కాకుండా విప్లవం, స్ఫూర్తి కూడా జోడించాను అన్నారు. నిజానికి వెతికితే త్యాగరాజ కృతులలో అవి కూడా కనిపిస్తాయి. “యజ్ఞాదులు సుఖమనువారాల” , “తెలియలేరు రామ”, మొదలైనవి. భక్తి ప్రధానం గా ఉండి మిగిలినవి అంతర్లీనం గా ఉంటె అది గొప్ప సంగీత సాహిత్యం అవుతుంది. కేవలం సాహిత్య విలువల కోసం ఒకరి కీర్తన కంటే ఇంకొకరిది బాగుంది అని, వీరి కృతులలో కంటే వీరి కృతులలో సాహిత్యం బాగుంది అని ఎలా అనగలం?
పహాడీ రాగం అందాలు గురించి Sunny అభిప్రాయం:
11/09/2011 11:52 am
“కోయీ నహీ హై ఫిర్ భి హై ముఝ్ కో క్యా జానే కిస్ కా ఇంతజార్” అన్న లతా పాట కూడానా? ఇది భలే తాళమ్ లో ఉంటుంది.
పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
11/09/2011 10:08 am
రహమతుల్లాగారూ, చిరు చిరు నగవుల, నీ చరణ కమలాన, పదవే పోదాము గౌరీ, రామయ తండ్రీ మొదలైన పాటలని వినిగాని రాగం చెప్పలేనండీ. మొదటి రెండూ విన్న గుర్తులేదు. మూడోది పహాడీగాని, మాండ్గాని కావచ్చు.
కాస్త చాదస్తంగా అనిపిస్తుందేమోగాని కొంతవరకూ కీబోర్డ్స్ వాయించడం వచ్చినవారికి కొన్నిపాటలకి స్వరాలో, కొన్ని సందేహాలకి సమాధానాలో ఇస్తే బావుంటుందేమో.
పహాడీ రాగం అందాలు గురించి nrahamthulla అభిప్రాయం:
11/09/2011 2:32 am
రోహిణీప్రసాద్ గారూ, సినిమా పాటలలో రాగాలను ఎలా గుర్తుపట్టాలో తెలిసేలా చేస్తున్న మీకృషి అభినందనీయం.నాకు రాగాలు తెలుసుకోవాలని కుతూహలం.సుబ్బరామన్ గారు పహాడీని మరుపురాకుండా చేశారు. చిరు చిరు నగవుల,నీ చరణ కమలాన,పదవేపోదాము గౌరీ,రామయ తండ్రీ…లాంటి పాటలలో పహాడి ఉందా?