సుబ్రహ్మణ్యం గారు,
బావుంది మీ కవిత. చదివాక నా ముందు నుండి కూడా ప్రపంచం, కంప్యూటరు మాయమైపోయాయి. ఎక్కణ్ణుంచో.. తియ్యటి నీరు! ఇక మీ ఏటి ఒడ్డుకు రావాలి.. ఇంకింత తియ్యటి నీరు కోసం!
దేశమంటే మట్టి కాదన్న’ గురజాడ తో పూర్తిగా ఏకీభవించ లేకపోయిన నాలాంటి వాళ్ళలో కొందరికయినా దేశకాలాలకూ (మాతృ) భాషకూ తెలివి తేటలకూ సంబంధం ఉంటుంది అన్న అభిప్రాయం ఉంటుందని నేననుకుంటున్నాను.
ఇందులో తెలివితేటల విషయంలో భాష ప్రమేయం ఎలా ఉంటుంది అన్నదాని నిర్ధారించటానికి కొలమానాలు ఎవరైనా భాషాశాస్త్ర వేత్తలు గానీ మానసిక శాస్త్ర వేత్తలు గానీ వీళ్ళ కూడికలు గానీ ఏమైనా చేశాయా లేదా అన్నది నాకు తెలీదు . నిజానికి నాకు మాతృ భాష అన్నదాన్ని నిర్వచించడం ఎలాగో కూడా తెలియదు. ఒక పోలీసు అధికారి శ్రీ రాములు గారు అనుకుంటాను రెండు సంవత్సరాల క్రితం రేడియోలో తెలుగు మృత భాషల్లో చేరి పోగలదన్న విషయం గురించి ప్రసంగిస్తూ తను శ్రీకాకుళం జిల్లా లో ఓక మారు మూల గ్రామానికి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు ఒక ముసలావిడ “ఏం నాయనా ఏమిటి ప్రాబ్లం, మారెజీ కొచ్చావు మీల్సు చేయకుండా వెళ్లి పోతున్నావు” అన్నారని (ఆవేదనతో) చెప్పారు . తెలుగు భాషాకోశం బాగానే విస్తరించిందన్న నిజం తెలిసింది .
నే ను రాస్తున్న ( రాసుకుంటున్న) ‘నోటికి నూటెనిమిది’ లోంచి
కోడి స్టవ్వు మీద కుక్కయి పోయింది
టేస్టు చేయ మంద్రు టెలివిజనుల
నవ్వు ఏడ్పు వచ్చు నాకొక్క సారిగా
*****
తిమ్మి రెడ్డి గారు
నమస్తే
“మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.” అనటం మీకు భావ్యమా సారూ?
అందరూ నేలమీద నడిస్తే ఇక లోలోకాల్ని చూపించేదెవరు సారు?
మూలా గారి శైలి అంతఃసౌందర్యాలను పట్టిచూపుతుంది.
ఆయన అలానే రాస్తారు బహుశా ఎప్పటకీ.
నేల మీదకు చూడండి, నింగిని కూడా పట్టించుకోండి, చమటను తడమండి, రక్తాన్ని చిందించండి అంటే పాపం ఆయనేమైనా పచారీ కొట్టా కావలసింది కట్టివ్వటానికి?
వైద్యుల్లో స్పెషలిస్టులలానే కవుల్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు కదా. మీకు నేల కవిత్వం కావాలనుకొంటే, ఆంధ్రదేశంలో నేలబారు కవులకేం కొదవలేదు.
ఆయన్ని అలానే రాయనిద్దాం. ఇలా రాయి అలా రాయి అని అనకుండా ఉండటమే మంచిదేమో. ఆయనకీ మనకీ కూడా.
బొల్లోజు బాబా
koteswararao గారికి
ఒక నవ్వూసు [‘నవ్వూసు’ జొక్ కు -నేను చేశానని నేననుకుటున్న- తెలుగు]
చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివినది జ్ఞాపకానికొస్తున్నది.
ఒక స్కూళ్ళ ఇన్స్పెక్టరు ఒక బళ్ళో ఒక తరగతిలో తెలుగు ఉపాధ్యాయుని సమక్షం లోనే పిల్లలను పరీక్షిస్తున్నాడు.
“హరిశ్చంద్రు డెవరు?”
పిల్లలు ఆనందంగా ముక్త కంఠంతో “NT రామారావు.”
“తప్పు, మీకు హరిశ్చంద్రు డెవరో గూడా తెలియదు.”
ఆ తెలుగు పంతులు గారందుకుని “పిచ్చి వెధవల్లారా ఆమాత్రం తెలియదూ, హరిశ్చంద్రుడు SV రంగారావు.”
స్కూళ్ళ ఇన్స్పెక్టరు కోపంతో ఊగి పోతూ “అయితే మీకూ తెలియదు, హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీ రామమూర్తి.”
చాలా సరళంగా, చాలా లోతైన సమస్యను ఈ కథ చూపిస్తోంది. తమ జీవితంలో ప్రత్యమ్నాయ విలువలని ఆచరించిన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అవే విలువల్ని ఒక సంప్రదాయం లాగా పాటించాలా? సమాజం పిల్లలకు నేర్పుతున్న విలువల ఒరవడిలో వాళ్ళని వెళ్ళనివ్వాలా? తమ జీవితాల్లో ఎదురైన సమస్యల నుంచి పిల్లలను రక్షించే ప్రయత్నంలో సమాజానికి లొంగిపోవడం నేర్పించాలా? సులువైన సమాధానాలు లేని ప్రశ్నలను క్లుప్తంగా లేవనెత్తి ‘ఇంత మౌనానికీ, ధ్యానానికీ’ వదిలేయడం రచయిత చేసిన మంచి పని.
మీ అనువాదం బాగా వచ్చింది. వ్యాసం నిడివి ఎక్కువైనందుకేమో అక్కడక్కడ కొన్ని భాగాలు వదిలేసినట్లున్నారు (అనువాద పద్ధతులపై ఆలోచనలు, ముగింపు భాగంలో కొంత…)
మీ అనువాదమూ, మూలమూ చదివాక ఆరుద్ర రాసిన ‘రాముడికి సీత ఏమవుతుంది’ చదివాను.రామానుజన్ వ్యాసం కన్నా ఆరుద్ర పుస్తకమే నచ్చింది నాకు.ఒక మౌలిమైన విభేదం: రామానుజన్ వ్యాస వస్తువు రామాయణ కథన వైవిధ్యాల పరిశీలన. సాహిత్యకారుడి దృష్టికోణం ఆయనది. ఆరుద్ర లక్ష్యం రామాయణ పాత్రల పుట్టుపూర్వోత్తరాలని సామాజిక పరిణామాల నేపథ్యంలో పరిశీలించటం.చారిత్రిక పరిశోధకుడి దృక్పథం ఆయనది.
నాకు ఇంకా అంతు పట్టని విషయం – ఈ వ్యాసానికి చరిత్రకూ ఉన్న సంబంధం ఏవిటని! ఇంగ్లీషు వ్యాస శీర్షిక (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) సూచించినట్లు వ్యాసకర్త ప్రధాన ఉద్దేశ్యం: అనువాద పద్ధతుల పరిశీలన. దేశ కాల సమాజాల ప్రభావాలూ, కథకుడి దృక్కోణమూ, కథనాన్ని ఎంతో వైవిధ్యవంతం చేస్తాయని వివరించే ఈ వ్యాసం చరిత్ర విద్యార్థుల కన్నా సాహిత్య విద్యార్థులకు ఎక్కువ ఉపయుక్తమవుతుందేమో…
ఈ వ్యాసాన్ని పాఠ్యాంశాలలోంచి తొలగించాలని పట్టు పట్టడం ఖచ్చితంగా తప్పే,అసహిష్ణు రాజకీయాల కారణంగా జరిగినదే. అయితే, మూడేళ్ళ క్రితం ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం వెనకాల కూడా నాన్-అకడమిక్ ప్రోద్బలాలలున్నాయని అనుకుంటాను.
రాముడికి సీత చెల్లెలవుతుందనో లేక రావణుడినో, లక్ష్మణుడినో సీత మోహించిందనో ఎవరైనా రాస్తే నొచ్చుకునే వాళ్ళు ఉన్నారనే అనుకుంటాను. వాళ్లందరూ మత రాజకీయాల వాళ్ళు కారేమో. చిక్కెక్కడా అంటే కొన్ని వందల ఏళ్ళుగా రామాయణ మహాభారతాల స్థూల కథలు ఆదర్శీకరించబడి, మన సమాజానికి నైతికతా నిర్దేశం చేసే స్థాయిని సంపాదించుకున్నాయి. ఆ ఆదర్శీకృత కథనానికి విరుద్ధమైన కథనాన్ని వినిపించి ఒప్పించటం అంత సులభం కాదు. ఆరుద్ర కన్నా, రామానుజన్ కన్నా చాగంటి కోటేశ్వర రావుకే ఆదరణ ఎక్కువని నేననుకుంటాను.
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి రవి వీరేల్లి అభిప్రాయం:
12/18/2011 1:10 pm
సుబ్రహ్మణ్యం గారు,
బావుంది మీ కవిత. చదివాక నా ముందు నుండి కూడా ప్రపంచం, కంప్యూటరు మాయమైపోయాయి. ఎక్కణ్ణుంచో.. తియ్యటి నీరు! ఇక మీ ఏటి ఒడ్డుకు రావాలి.. ఇంకింత తియ్యటి నీరు కోసం!
శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
12/17/2011 10:48 am
రంగయ్యగారు: మీరడిగిన బుర్రకథ నాజర్ గారు పాడింది. నాకొక e-mail రాయండి. sreeni @ gmx.de ఆ పాట పంపుతాను.
Regards, Sreenivas
నాకు నచ్చిన పద్యం: హనుమంతుని నీతిబోధ గురించి TADEPALLI అభిప్రాయం:
12/16/2011 2:27 pm
చా లా ……. బాగున్నది
//తా. రత్నాకర్//
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి TahaTaha అభిప్రాయం:
12/16/2011 10:01 am
దేశమంటే మట్టి కాదన్న’ గురజాడ తో పూర్తిగా ఏకీభవించ లేకపోయిన నాలాంటి వాళ్ళలో కొందరికయినా దేశకాలాలకూ (మాతృ) భాషకూ తెలివి తేటలకూ సంబంధం ఉంటుంది అన్న అభిప్రాయం ఉంటుందని నేననుకుంటున్నాను.
ఇందులో తెలివితేటల విషయంలో భాష ప్రమేయం ఎలా ఉంటుంది అన్నదాని నిర్ధారించటానికి కొలమానాలు ఎవరైనా భాషాశాస్త్ర వేత్తలు గానీ మానసిక శాస్త్ర వేత్తలు గానీ వీళ్ళ కూడికలు గానీ ఏమైనా చేశాయా లేదా అన్నది నాకు తెలీదు . నిజానికి నాకు మాతృ భాష అన్నదాన్ని నిర్వచించడం ఎలాగో కూడా తెలియదు. ఒక పోలీసు అధికారి శ్రీ రాములు గారు అనుకుంటాను రెండు సంవత్సరాల క్రితం రేడియోలో తెలుగు మృత భాషల్లో చేరి పోగలదన్న విషయం గురించి ప్రసంగిస్తూ తను శ్రీకాకుళం జిల్లా లో ఓక మారు మూల గ్రామానికి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు ఒక ముసలావిడ “ఏం నాయనా ఏమిటి ప్రాబ్లం, మారెజీ కొచ్చావు మీల్సు చేయకుండా వెళ్లి పోతున్నావు” అన్నారని (ఆవేదనతో) చెప్పారు . తెలుగు భాషాకోశం బాగానే విస్తరించిందన్న నిజం తెలిసింది .
నే ను రాస్తున్న ( రాసుకుంటున్న) ‘నోటికి నూటెనిమిది’ లోంచి
కోడి స్టవ్వు మీద కుక్కయి పోయింది
టేస్టు చేయ మంద్రు టెలివిజనుల
నవ్వు ఏడ్పు వచ్చు నాకొక్క సారిగా
*****
తఃతః
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
12/15/2011 8:40 am
తిమ్మి రెడ్డి గారు
నమస్తే
“మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.” అనటం మీకు భావ్యమా సారూ?
అందరూ నేలమీద నడిస్తే ఇక లోలోకాల్ని చూపించేదెవరు సారు?
మూలా గారి శైలి అంతఃసౌందర్యాలను పట్టిచూపుతుంది.
ఆయన అలానే రాస్తారు బహుశా ఎప్పటకీ.
నేల మీదకు చూడండి, నింగిని కూడా పట్టించుకోండి, చమటను తడమండి, రక్తాన్ని చిందించండి అంటే పాపం ఆయనేమైనా పచారీ కొట్టా కావలసింది కట్టివ్వటానికి?
వైద్యుల్లో స్పెషలిస్టులలానే కవుల్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు కదా. మీకు నేల కవిత్వం కావాలనుకొంటే, ఆంధ్రదేశంలో నేలబారు కవులకేం కొదవలేదు.
ఆయన్ని అలానే రాయనిద్దాం. ఇలా రాయి అలా రాయి అని అనకుండా ఉండటమే మంచిదేమో. ఆయనకీ మనకీ కూడా.
బొల్లోజు బాబా
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి telangana అభిప్రాయం:
12/15/2011 2:26 am
బాగుంది సార్ సెట్.
thank you
http://www.telanganatng.blogspot.com
కినిమా మాసపత్రిక: హాస్యనటుల అనుభవాలు గురించి TahaTaha అభిప్రాయం:
12/12/2011 7:22 am
koteswararao గారికి
ఒక నవ్వూసు [‘నవ్వూసు’ జొక్ కు -నేను చేశానని నేననుకుటున్న- తెలుగు]
చాలా కాలం క్రితం ఒక పత్రికలో చదివినది జ్ఞాపకానికొస్తున్నది.
ఒక స్కూళ్ళ ఇన్స్పెక్టరు ఒక బళ్ళో ఒక తరగతిలో తెలుగు ఉపాధ్యాయుని సమక్షం లోనే పిల్లలను పరీక్షిస్తున్నాడు.
“హరిశ్చంద్రు డెవరు?”
పిల్లలు ఆనందంగా ముక్త కంఠంతో “NT రామారావు.”
“తప్పు, మీకు హరిశ్చంద్రు డెవరో గూడా తెలియదు.”
ఆ తెలుగు పంతులు గారందుకుని “పిచ్చి వెధవల్లారా ఆమాత్రం తెలియదూ, హరిశ్చంద్రుడు SV రంగారావు.”
స్కూళ్ళ ఇన్స్పెక్టరు కోపంతో ఊగి పోతూ “అయితే మీకూ తెలియదు, హరిశ్చంద్రుడు అద్దంకి శ్రీ రామమూర్తి.”
అనుభవం గురించి V. Rajiv అభిప్రాయం:
12/12/2011 2:24 am
చాలా సరళంగా, చాలా లోతైన సమస్యను ఈ కథ చూపిస్తోంది. తమ జీవితంలో ప్రత్యమ్నాయ విలువలని ఆచరించిన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అవే విలువల్ని ఒక సంప్రదాయం లాగా పాటించాలా? సమాజం పిల్లలకు నేర్పుతున్న విలువల ఒరవడిలో వాళ్ళని వెళ్ళనివ్వాలా? తమ జీవితాల్లో ఎదురైన సమస్యల నుంచి పిల్లలను రక్షించే ప్రయత్నంలో సమాజానికి లొంగిపోవడం నేర్పించాలా? సులువైన సమాధానాలు లేని ప్రశ్నలను క్లుప్తంగా లేవనెత్తి ‘ఇంత మౌనానికీ, ధ్యానానికీ’ వదిలేయడం రచయిత చేసిన మంచి పని.
సా విరహే తవ దీనా గురించి ellanti అభిప్రాయం:
12/12/2011 1:55 am
This is wonderful article worth reading by those who like old classics from Telugu movies most of which are in Sanskrit like Sa virahe.
I can’t type in telugu yet. But hoepfully one day I will. Please check ellanti.wordpress.com for variety of topics related to Telugu and history.
Special thanks to both authors. They are so blessed they can understand Sanskrit. I don’t understand Sanskrit and would love to.
మూడు వందల రామాయణాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
12/11/2011 3:17 am
సురేశ్ గారికి
మీ అనువాదం బాగా వచ్చింది. వ్యాసం నిడివి ఎక్కువైనందుకేమో అక్కడక్కడ కొన్ని భాగాలు వదిలేసినట్లున్నారు (అనువాద పద్ధతులపై ఆలోచనలు, ముగింపు భాగంలో కొంత…)
మీ అనువాదమూ, మూలమూ చదివాక ఆరుద్ర రాసిన ‘రాముడికి సీత ఏమవుతుంది’ చదివాను.రామానుజన్ వ్యాసం కన్నా ఆరుద్ర పుస్తకమే నచ్చింది నాకు.ఒక మౌలిమైన విభేదం: రామానుజన్ వ్యాస వస్తువు రామాయణ కథన వైవిధ్యాల పరిశీలన. సాహిత్యకారుడి దృష్టికోణం ఆయనది. ఆరుద్ర లక్ష్యం రామాయణ పాత్రల పుట్టుపూర్వోత్తరాలని సామాజిక పరిణామాల నేపథ్యంలో పరిశీలించటం.చారిత్రిక పరిశోధకుడి దృక్పథం ఆయనది.
నాకు ఇంకా అంతు పట్టని విషయం – ఈ వ్యాసానికి చరిత్రకూ ఉన్న సంబంధం ఏవిటని! ఇంగ్లీషు వ్యాస శీర్షిక (Three Hundred Ramayanas: Five Examples and Three Thoughts on Translation) సూచించినట్లు వ్యాసకర్త ప్రధాన ఉద్దేశ్యం: అనువాద పద్ధతుల పరిశీలన. దేశ కాల సమాజాల ప్రభావాలూ, కథకుడి దృక్కోణమూ, కథనాన్ని ఎంతో వైవిధ్యవంతం చేస్తాయని వివరించే ఈ వ్యాసం చరిత్ర విద్యార్థుల కన్నా సాహిత్య విద్యార్థులకు ఎక్కువ ఉపయుక్తమవుతుందేమో…
ఈ వ్యాసాన్ని పాఠ్యాంశాలలోంచి తొలగించాలని పట్టు పట్టడం ఖచ్చితంగా తప్పే,అసహిష్ణు రాజకీయాల కారణంగా జరిగినదే. అయితే, మూడేళ్ళ క్రితం ఈ వ్యాసాన్ని పాఠ్యాంశంగా ఉంచాలని తీసుకున్న నిర్ణయం వెనకాల కూడా నాన్-అకడమిక్ ప్రోద్బలాలలున్నాయని అనుకుంటాను.
రాముడికి సీత చెల్లెలవుతుందనో లేక రావణుడినో, లక్ష్మణుడినో సీత మోహించిందనో ఎవరైనా రాస్తే నొచ్చుకునే వాళ్ళు ఉన్నారనే అనుకుంటాను. వాళ్లందరూ మత రాజకీయాల వాళ్ళు కారేమో. చిక్కెక్కడా అంటే కొన్ని వందల ఏళ్ళుగా రామాయణ మహాభారతాల స్థూల కథలు ఆదర్శీకరించబడి, మన సమాజానికి నైతికతా నిర్దేశం చేసే స్థాయిని సంపాదించుకున్నాయి. ఆ ఆదర్శీకృత కథనానికి విరుద్ధమైన కథనాన్ని వినిపించి ఒప్పించటం అంత సులభం కాదు. ఆరుద్ర కన్నా, రామానుజన్ కన్నా చాగంటి కోటేశ్వర రావుకే ఆదరణ ఎక్కువని నేననుకుంటాను.
శ్రీనివాస్