మాలతి గారి కథ మీదా, సౌమ్య గారి కథ మీదా నేను నాలుగు మాటలు రాయడాన, మాలతి గారు నన్ను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వారికి జవాబుగా ఇదిగో మరో ముక్క.
నచ్చిందనో నచ్చలేదనో ముక్తసరిగా చెప్తే, ప్చ్, నిర్మాణాత్మకంగా లేదు, అని పెదవి విరుస్తారు సంపాదకులు. ఇది ఇందుకు నచ్చింది, ఇది ఇందుకు నచ్చలేదు అని సామాన్య పాఠకుడు తన స్థాయికి తగ్గట్టుగా రాస్తే, పీకి పాకాన పెడుతున్నాడని కళెర్ర చేస్తారు రచయితలు. ఎలా చావడం?!
ఈ సందర్భంలో బూదరాజు రాధాకృష్ణ మన విమర్శ గురించి అన్న మాటలు ఆలోచించదగ్గవి: “గ్రంథానికి లేని విలువ దాని విమర్శకు రాదు; విమర్శకు లేని విలువ గ్రంథానికీ రాదు. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. ఈ రెంటికీ విడదీయరాని పరస్పర సంబంధముంది. ఒకటి పేలవమైతే రెండోది అప్రశస్తమవుతుంది. ఒకటి దురభిమానభూయిష్ఠమయితే రెండోది నిస్సారమవుతుంది. ఉన్నత సాహితీ సృష్టికి విమర్శలను తట్టుకొని పదికాలాల పాటు బతకాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉండాలి. ఉత్తమ విమర్శకు గుణదోష పరీక్షణ శక్తి కావాలి.”
అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి. నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా, కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు. వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి. ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈమాట లాంటి పత్రికలో ప్రచురించినందుకు రచయితలు గర్వపడొచ్చు. వాటిని కొందరు పాఠకులు మెచ్చుకున్నందుకు పొంగిపోవచ్చు. అది సహజమే. కాని విమర్శించిన సామాన్య పాఠకుల అమాయకత్వానికి జాలిపడకుండా, విమర్శలో తమ రచనలు ఇంకా పైస్థాయికి చేరే సూచనలుంటే స్వీకరించడం, లేకపోతే మర్యాదగా తిరస్కరించడం – అది బాధ్యతగల రచయితల విధి అని నాఉద్దేశం.
పద్యాన్ని చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించగల అవకాశం ఇంగ్లిష్ చదువులు చదువుకున్న ఇటీవలి వారందరి లోను అరుదుగానే వుంటోది మరి. ఇది మీ ఒక్కరి అనుభవమే కాదు. అయితే పూర్వ కవుల సాహిత్యానికి వ్యాఖ్యానాలు పండితులు రాసినవి వున్నాయి. అవి ఎక్కువగా “వావిల్ల” వారివి. వాటి కాపీలని మీరు సంపాదించుకోవచ్చు. వావిల్లవారివి పుస్తకాలు మళ్ళీ కొన్నింటిని కొనుక్కుందికి వీలుగ అందుబాటు లోకి తెస్తున్నారు. మీరు వాటిని సేకరించుకొగలిగితే మీ అంతట మీరే పెద్దన మనుచరిత్రని, రాయల ఆముక్తమాల్యదని కూడా స్వయంగా చదివి ఆనందించవచ్చు. కవిత్రయ మహాభారతాన్ని ఈమధ్యనే తి.తి.దే. వాళ్ళు ఒక 15 సంపుటాల్లో అర్ధ టీకాతాత్పర్య సహితంగా అచ్చువేసారు. మీరు వాటిని కొనుక్కొగలిగితే కవిత్రయ భారతాన్నికూడా స్వయంగానే అర్ధం చెసుకుందికి వీలుంది.
పింగళి సూరన “కళాపూర్ణోదయం” మీద కట్టమంచి రామలింగారెడ్డి గారి విశ్లేషణ వుంది. మీరు మీ ఆసక్తిని బట్టి వీటిని సేకరించుకుని వీలున్నప్పుడు చదువుకోగలిగితే పాత సాహిత్యం చదివి అర్ధం చేసుకొవటం మరీ అసాధ్యం కాదు అని మీకే తెలియగలదు. మీ ఇష్టాన్ని గమనించి, సంతోషంతో నాకు తెలిసిన విషయాలని మీకు చెబుతున్నాను.
మీ వ్యాసం చదవడం మొదలు పెట్టే ముందు నిడివి కొంచం భయం కలిగించినా, మొదలు పెట్టగానే సమయం తెలియలేదు. ఎత్తిన తల దించకుండా ఏకబిగిన చదివించింది మీ వ్యాసం. మీరు రాస్తున్న ఈ వ్యాస పరంపర ఎంతో ఆవశ్యకమైనదీ, స్ఫూర్తిదాయకమైదీ. తెలుగులో ఇటువంటి రచనలు ఇంకా చాలా రావాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు రాసే కామెంట్లు కూడా నేను ఆసక్తిగా చదువుతాను. ఇంగ్లీషులో పాప్యులర్ సైన్సు పుస్తకాలు నాకు చాలా ఇష్టం. తెలుగులో కూడా చిన్నప్పుడు కొన్ని చదివినా, అటువంటి పుస్తకాలు విరివిగా లేవనే నాకు అనిపిస్తుంది. మీరు ఇటువంటి అంశాలు ఎన్నుకుని సాధారణ పాఠకులకోసం పుస్తకాలు కూడా రాయాలి అని ఆశిస్తున్నాను.
తెలివైన విద్యార్థులకు ఖాళీ సమయాల్లో పాఠ్య, పాఠ్యేతర అంశాల్లో శిక్షణ ఇచ్చి విజయ సాధనకి తోడ్పడే ఒక కార్యక్రమాన్ని కొందరు మిత్రులు ఇటీవల చేపట్టారు. ఈమాటలోని ఇటువంటి వ్యాసాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అన్నాను. పిల్లలు ఇటువంటి వ్యాసాలు సొంతంగా చదివి ఆస్వాదించేలా చెయ్యడం ప్రస్తుతానికి మా లక్ష్యం అన్నారు. ఏది ఏమైనా ఇటువంటి రచనలు శాశ్వతంగా నిలిచి అనేకమందికి శాస్త్ర విషయాలపై ఆసక్తి రేకెత్తిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. ధన్యవాదాలు.
దాదాపు రెండేళ్ళ క్రితం, రచ్చబండలో ఈ పద్యం గురించి రాశాను: గొప్ప కవిత్వం రాయాలంటే గొప్ప కవిత్వం చదవాలన్నారు (తమ్మినేని అనుకుంటా); దానిని వచనానికి అన్వయించుకొని, శ్రీపాద “అనుభవాలూ – జ్ఞాపకాలూనూ” చదవడం మొదలెడితే “శారద రాత్రులు” పద్యం మీద ఆయన వ్యాఖ్యానం నన్ను కట్టేసింది. ఎవరన్నా వివరిస్తే తప్ప నాకై నాకు మన పాత పద్యాల్లోని కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియదు.
(కొడవటిగంటి కుటుంబరావుకి శ్రీపాద ఇచ్చిన సలహా: “ఆడవాళ్ళు మాట్లాడుకునేది వినవోయ్. అసలైన తెలుగు వస్తుంది.” పుస్తకభాషగా ఉన్న కుటుంబరావు రచనాధోరణి దానితో మారిపోయిందట! సౌమ్య గారు చెప్తున్న మాటలు నిజమయితే, శ్రీపాద పాతబడిపోయాడా అని అనుమానమేస్తుంది. ఆవిణ్ణి తప్పుపట్టడం లేదని మనవి.)
అప్పుడు గూడా రచ్చబండలో ముచ్చటించుకున్నాం – పాత్రలు ఇవే. మోహనరావు గారూ, కామేశ్వరరావు గారూ పాత సాహిత్యంలో (ఇతరేత్రా కూడా) ఉద్దండులు. సమగ్రమైన చక్కటి వ్యాసం రాసినందుకు JKM గారికి అభినందనలు.
“దళిత నవీన” పద్యం వివరణ మనోహరంగా ఉంది. కప్పల బెకబెకలలో ఉపనిష్ద్గానామృతం అతిశయోక్తి అనిపించింది. (మా ఇంటి వెనకాల ఉన్న చెరువులో కప్పలు పాడే సంగీతానికి ఇంట్లో ఫ్యాను మోత జత చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు.) వానా, వెన్నెలా కలిసిన మంచి ఇస్మాయిల్ కవిత “కప్పల నిశ్శబ్దం.”
మోహనరావు గారు పద్యాల గురించి రాసే కొన్ని వాక్యాలు – “పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది” – చదివితే నాబోంట్లకు చెవిటివాడి ముందర శంఖం ఊదినట్లుంటుంది. లైలా గారి లాంటి ప్రతిభావంతులు మాత్రం ఉత్తేజపడి ఠకీ మని ఓ కవిత అల్లేస్తారు! పాఠకుల్లో రకాలు అనేకం.
కామేశ్వరారావు గారు చెప్తేనే మధునాపంతుల వారి వ్యాసం చదివాను. “శారద రాత్రులు” అను ఉత్పలమాలలో చుట్టుకొని నన్నయ గంటము ఇక కదలలేదట! నన్నయ మొదటి ఉత్పలమాల “రాజుకులైక భూషణుడు” లోనూ చివరి ఉత్పలమాల “శారద రాత్రుల” లోనూ వెన్నెల ప్రస్తావనే అన్నారు. అది గూడా మంచి వ్యాసం.
ప్రతి కథా ఏదో సందేశం ఇవ్వాలని నేనూ ఆశించను కానీ, హాస్య రచనకి ప్రత్యేకమైన ఉద్దేశం లేనపుడు, భాషలో, సంభాషణలో చతురత అన్నా ఉండాలి. దయ్యాలూ, దేవుళ్ళూ, సిమెట్రీ, క్వాంటం థియరీ – ఇవేవీ నా బలహీనతలని గుర్తు తేలేదు – అన్వయించుకొని నవ్వుకోడానికి. పూజా, పూరీలకు మించి కథలో తెలుగు వాతావరణమే తక్కువనిపించింది. (తెలుగుతనం గురించి పెద్దగా తెలుసని కాదు. దేశం వదిలి పాతికేళ్ళవుతోంది. చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)
నాయకులు కలలోకి రావడమంటే గుర్తొచ్చింది. పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు” లో సీత భర్తకి ఇందిరా గాంధీ కలలోకొచ్చి దోశెలు తిన్న వైనం ఉంది. అది చదివి నవ్వకుండా ఉండలేము. అదీ ఇతరులవి మరి కొన్నీ, భార్గవీరావు గారు సంకలనించి “ఆహా … ఓహో! (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు)” క్రింద ప్రచురించారు. హాస్య రచనలంటే ఇష్టమున్నవాళ్ళు చదవదగ్గది.
నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂
IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.
సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.
వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.
నాకథ ఓపిగ్గా చదివినవారికీ, చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారికీ ధన్యవాదాలు.
సాయిలక్ష్మిగారూ, మీ అభిమానానికీ అభిప్రాయాలకీ చాలా సంతోషం అండీ. నాసంకలనం చదివినట్టు నేను విన్న సందర్భాలు చాలా తక్కువ. హనుమంతరావు గారూ, స్థూలంగా
కథ కానీ కవిత కానీ ఒక పాత్ర అనుభవించిన రసాన్ని, ఆనందం, దైన్యం, నిస్పృహ ఏదైనా కానీ – పాఠకుడిలో కలిగిస్తే ఆకథ రక్తికట్టేననుకుంటాను నేను.. (పెద్దవారు, మీకు తెలిసే వుంటుంది. తిరిగి చెప్తున్నందుకు క్షమించండి)
మీమాట నిజమే. ఆదిలో వున్న సముద్రపుహోరు చివరికి నీరు గారిపోయింది. కథలో ముఖ్యపాత్ర అనుభవం అదేనని చెప్పడమే ఈకథలో వావుద్దేశ్యం.
రవికిరణ్ గారూ, ఇది వ్యాసం అయితే పూర్వసిద్ధాంతాలూ, ఉపపత్తులూ, నిరూపణలూలాటి సరంజామా కావాలి. తదితర వచనరచనల్లో ఏది కథ, ఏది కాదు అన్నదానికి చాలా వాదాలూ, వివరణలూ వున్నాయి. అవన్నీ ఇక్కడ సాధ్యం కాదు.
చలనం చైతన్యానికి చిహ్నం. మొత్తం మానవాళి పురోభివృద్ధికి చలనం ముఖ్యం అన్నది నేను కూడా ఒప్పుకుంటాను.
అయితే ఒకమనిషి అనుభవం లెక్కలోకి రాదు అనడం న్యాయం కాదు. ఒక్కొక్క మనిషీ కూడితేనే మొత్తం మానవాళి అయింది.
మరొకవిషయం. ఈ కథలో ప్రధానపాత్ర యాంత్రికజగత్తులోని ఈతిబాధలకి వగచినా, వాటిని పూర్తిగా విసర్జించలేదు. ఈయాంత్రకజగత్తు సుడిగాలిలో సాంకేతిపరికజ్ఞానం అట్టే లేనివాళ్లూ, వారికి కలిగే అసౌర్యాలూ కూడా భాగమే. వీరిని కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడే టెక్నాలజీ విలువ సంపూర్ణంగా కొలవడం సాధ్యం అని చెప్పడానికే ఈకథ. ఇది కేవలం ఒక కోణం అనుకోండి, మీ కవితలో వ్యక్తీకరించిన స్థితి లోకంలో ప్రతిఒక్కరిస్థితీ కానట్టే. ఇదొక్కటే కోణం కాదు కానీ ఇది కూడా ఒక కోణమే.
మరోసారి థాంక్స్.
కథ వాతావరణం, సన్నివేశాలు, కళ్ళకు కట్టినట్లు సృష్టించి, రక్తి కట్టే భాషలో సంభాషణలు నడిపించి దిట్ట అనిపించుకున్నారు రానారె.
వరి అన్నం, దస్తా తెల్ల కాగితాలూ తీరని కోరికలయిన జీవితాలతో నాక్కాస్త అనుభవం ఉంది. రేడియో కింత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే, చాసో “ఎందుకు పారేస్తాను నాన్నా?” కన్నా మించి ఉండేది. కొత్తపాళీ గారిచ్చిన ఇతివృత్తానికి మరీ కట్టుబడి పోవడాన అలా సృష్టించాల్సొచ్చిందేమో.
చాసో రాసింది 1945లో. అరవై డెబ్భై ఏళ్ళ తర్వాత గూడా ఇలాంటి కథలొస్తున్నాయంటే, అది మన దేశ దౌర్భాగ్యం.
మార్పు లేని చోట మిగిలేది మురుగే. హిందూ మొగుడ్తో, కిరస్తానీ పాదరీతో, జిలుగు సాయిబుతో నేర్చిన పాఠాలే సంద్రాలి సంభాషణలేవో మాలతి గారు. అన్ని మార్పుల అనుభవాలే మీకు అక్షర సత్యాలుగా కనిపించాయేవో, వినిపించాయేవో. పనికి మాలినవని అనుకున్నా పురోగమనం అనేది సహజ పరిణామం. మీకూ, నాకూ పనికిరాకపోవచ్చు, కానీ ఇది మీ, నా పరిణామం మాత్రవే కాదు, మొత్తం మానవ జాతి పరిణామం, పురోగమనం. పదికాలాల పాటు నిలచిపోవటవనేది సాపేక్షవే తప్ప ఆబ్సల్యూట్ నిలచిపోవడవనేది కాదు. moving is moving up అనే భావనకి అర్థం లేదు. moving is moving అంతే. పైకా క్రిందకా, ప్రక్కకా కాదు. చలనం అనేది ప్రకృతి సహజం.
మీ కథ బాగుందో బాగలేదో కానీ, కథలాగా మాత్రం లేదు. మీ వ్యాసం విషయంలో హనుమంతరావు గారి అభిప్రాయంతో నేనేకీభవిస్తాను.
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/13/2008 11:22 pm
“తెలుగులో సాహిత్య విమర్శ”
మాలతి గారి కథ మీదా, సౌమ్య గారి కథ మీదా నేను నాలుగు మాటలు రాయడాన, మాలతి గారు నన్ను కూడా దృష్టిలో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వారికి జవాబుగా ఇదిగో మరో ముక్క.
నచ్చిందనో నచ్చలేదనో ముక్తసరిగా చెప్తే, ప్చ్, నిర్మాణాత్మకంగా లేదు, అని పెదవి విరుస్తారు సంపాదకులు. ఇది ఇందుకు నచ్చింది, ఇది ఇందుకు నచ్చలేదు అని సామాన్య పాఠకుడు తన స్థాయికి తగ్గట్టుగా రాస్తే, పీకి పాకాన పెడుతున్నాడని కళెర్ర చేస్తారు రచయితలు. ఎలా చావడం?!
ఈ సందర్భంలో బూదరాజు రాధాకృష్ణ మన విమర్శ గురించి అన్న మాటలు ఆలోచించదగ్గవి: “గ్రంథానికి లేని విలువ దాని విమర్శకు రాదు; విమర్శకు లేని విలువ గ్రంథానికీ రాదు. ఈ రెండూ అన్యోన్యాశ్రితాలు. ఈ రెంటికీ విడదీయరాని పరస్పర సంబంధముంది. ఒకటి పేలవమైతే రెండోది అప్రశస్తమవుతుంది. ఒకటి దురభిమానభూయిష్ఠమయితే రెండోది నిస్సారమవుతుంది. ఉన్నత సాహితీ సృష్టికి విమర్శలను తట్టుకొని పదికాలాల పాటు బతకాలనే ఆకాంక్ష బలవత్తరంగా ఉండాలి. ఉత్తమ విమర్శకు గుణదోష పరీక్షణ శక్తి కావాలి.”
అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి. నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా, కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు. వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి. ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి.
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించే ఈమాట లాంటి పత్రికలో ప్రచురించినందుకు రచయితలు గర్వపడొచ్చు. వాటిని కొందరు పాఠకులు మెచ్చుకున్నందుకు పొంగిపోవచ్చు. అది సహజమే. కాని విమర్శించిన సామాన్య పాఠకుల అమాయకత్వానికి జాలిపడకుండా, విమర్శలో తమ రచనలు ఇంకా పైస్థాయికి చేరే సూచనలుంటే స్వీకరించడం, లేకపోతే మర్యాదగా తిరస్కరించడం – అది బాధ్యతగల రచయితల విధి అని నాఉద్దేశం.
కొడవళ్ళ హనుమంతరావు
నన్నయ హంసగీతికలు గురించి rama bharadwaj అభిప్రాయం:
05/12/2008 9:59 pm
కొడవళ్ళ హనుమంతరావు గారు,
పద్యాన్ని చదివి అర్ధం చేసుకుని ఆస్వాదించగల అవకాశం ఇంగ్లిష్ చదువులు చదువుకున్న ఇటీవలి వారందరి లోను అరుదుగానే వుంటోది మరి. ఇది మీ ఒక్కరి అనుభవమే కాదు. అయితే పూర్వ కవుల సాహిత్యానికి వ్యాఖ్యానాలు పండితులు రాసినవి వున్నాయి. అవి ఎక్కువగా “వావిల్ల” వారివి. వాటి కాపీలని మీరు సంపాదించుకోవచ్చు. వావిల్లవారివి పుస్తకాలు మళ్ళీ కొన్నింటిని కొనుక్కుందికి వీలుగ అందుబాటు లోకి తెస్తున్నారు. మీరు వాటిని సేకరించుకొగలిగితే మీ అంతట మీరే పెద్దన మనుచరిత్రని, రాయల ఆముక్తమాల్యదని కూడా స్వయంగా చదివి ఆనందించవచ్చు. కవిత్రయ మహాభారతాన్ని ఈమధ్యనే తి.తి.దే. వాళ్ళు ఒక 15 సంపుటాల్లో అర్ధ టీకాతాత్పర్య సహితంగా అచ్చువేసారు. మీరు వాటిని కొనుక్కొగలిగితే కవిత్రయ భారతాన్నికూడా స్వయంగానే అర్ధం చెసుకుందికి వీలుంది.
పింగళి సూరన “కళాపూర్ణోదయం” మీద కట్టమంచి రామలింగారెడ్డి గారి విశ్లేషణ వుంది. మీరు మీ ఆసక్తిని బట్టి వీటిని సేకరించుకుని వీలున్నప్పుడు చదువుకోగలిగితే పాత సాహిత్యం చదివి అర్ధం చేసుకొవటం మరీ అసాధ్యం కాదు అని మీకే తెలియగలదు. మీ ఇష్టాన్ని గమనించి, సంతోషంతో నాకు తెలిసిన విషయాలని మీకు చెబుతున్నాను.
wish u best of luck.
rama.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు గురించి నాగమురళి అభిప్రాయం:
05/12/2008 2:38 am
హనుమంతరావు గారూ,
మీ వ్యాసం చదవడం మొదలు పెట్టే ముందు నిడివి కొంచం భయం కలిగించినా, మొదలు పెట్టగానే సమయం తెలియలేదు. ఎత్తిన తల దించకుండా ఏకబిగిన చదివించింది మీ వ్యాసం. మీరు రాస్తున్న ఈ వ్యాస పరంపర ఎంతో ఆవశ్యకమైనదీ, స్ఫూర్తిదాయకమైదీ. తెలుగులో ఇటువంటి రచనలు ఇంకా చాలా రావాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు రాసే కామెంట్లు కూడా నేను ఆసక్తిగా చదువుతాను. ఇంగ్లీషులో పాప్యులర్ సైన్సు పుస్తకాలు నాకు చాలా ఇష్టం. తెలుగులో కూడా చిన్నప్పుడు కొన్ని చదివినా, అటువంటి పుస్తకాలు విరివిగా లేవనే నాకు అనిపిస్తుంది. మీరు ఇటువంటి అంశాలు ఎన్నుకుని సాధారణ పాఠకులకోసం పుస్తకాలు కూడా రాయాలి అని ఆశిస్తున్నాను.
తెలివైన విద్యార్థులకు ఖాళీ సమయాల్లో పాఠ్య, పాఠ్యేతర అంశాల్లో శిక్షణ ఇచ్చి విజయ సాధనకి తోడ్పడే ఒక కార్యక్రమాన్ని కొందరు మిత్రులు ఇటీవల చేపట్టారు. ఈమాటలోని ఇటువంటి వ్యాసాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నేను అన్నాను. పిల్లలు ఇటువంటి వ్యాసాలు సొంతంగా చదివి ఆస్వాదించేలా చెయ్యడం ప్రస్తుతానికి మా లక్ష్యం అన్నారు. ఏది ఏమైనా ఇటువంటి రచనలు శాశ్వతంగా నిలిచి అనేకమందికి శాస్త్ర విషయాలపై ఆసక్తి రేకెత్తిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు. ధన్యవాదాలు.
నన్నయ హంసగీతికలు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/11/2008 6:52 pm
శారద రాత్రులు
దాదాపు రెండేళ్ళ క్రితం, రచ్చబండలో ఈ పద్యం గురించి రాశాను: గొప్ప కవిత్వం రాయాలంటే గొప్ప కవిత్వం చదవాలన్నారు (తమ్మినేని అనుకుంటా); దానిని వచనానికి అన్వయించుకొని, శ్రీపాద “అనుభవాలూ – జ్ఞాపకాలూనూ” చదవడం మొదలెడితే “శారద రాత్రులు” పద్యం మీద ఆయన వ్యాఖ్యానం నన్ను కట్టేసింది. ఎవరన్నా వివరిస్తే తప్ప నాకై నాకు మన పాత పద్యాల్లోని కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియదు.
(కొడవటిగంటి కుటుంబరావుకి శ్రీపాద ఇచ్చిన సలహా: “ఆడవాళ్ళు మాట్లాడుకునేది వినవోయ్. అసలైన తెలుగు వస్తుంది.” పుస్తకభాషగా ఉన్న కుటుంబరావు రచనాధోరణి దానితో మారిపోయిందట! సౌమ్య గారు చెప్తున్న మాటలు నిజమయితే, శ్రీపాద పాతబడిపోయాడా అని అనుమానమేస్తుంది. ఆవిణ్ణి తప్పుపట్టడం లేదని మనవి.)
అప్పుడు గూడా రచ్చబండలో ముచ్చటించుకున్నాం – పాత్రలు ఇవే. మోహనరావు గారూ, కామేశ్వరరావు గారూ పాత సాహిత్యంలో (ఇతరేత్రా కూడా) ఉద్దండులు. సమగ్రమైన చక్కటి వ్యాసం రాసినందుకు JKM గారికి అభినందనలు.
“దళిత నవీన” పద్యం వివరణ మనోహరంగా ఉంది. కప్పల బెకబెకలలో ఉపనిష్ద్గానామృతం అతిశయోక్తి అనిపించింది. (మా ఇంటి వెనకాల ఉన్న చెరువులో కప్పలు పాడే సంగీతానికి ఇంట్లో ఫ్యాను మోత జత చేస్తే తప్ప నాకు నిద్ర పట్టదు.) వానా, వెన్నెలా కలిసిన మంచి ఇస్మాయిల్ కవిత “కప్పల నిశ్శబ్దం.”
మోహనరావు గారు పద్యాల గురించి రాసే కొన్ని వాక్యాలు – “పందొమ్మిది ర-కారాలు, ఎనిమిది ల-కారాలు, ఏడు శసలు, ఆరు ప-కారాలు, త-కారాలు ఈ పద్యానికి ఒక ఊపునిస్తుంది” – చదివితే నాబోంట్లకు చెవిటివాడి ముందర శంఖం ఊదినట్లుంటుంది. లైలా గారి లాంటి ప్రతిభావంతులు మాత్రం ఉత్తేజపడి ఠకీ మని ఓ కవిత అల్లేస్తారు! పాఠకుల్లో రకాలు అనేకం.
కామేశ్వరారావు గారు చెప్తేనే మధునాపంతుల వారి వ్యాసం చదివాను. “శారద రాత్రులు” అను ఉత్పలమాలలో చుట్టుకొని నన్నయ గంటము ఇక కదలలేదట! నన్నయ మొదటి ఉత్పలమాల “రాజుకులైక భూషణుడు” లోనూ చివరి ఉత్పలమాల “శారద రాత్రుల” లోనూ వెన్నెల ప్రస్తావనే అన్నారు. అది గూడా మంచి వ్యాసం.
కొడవళ్ళ హనుమంతరావు
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/09/2008 10:51 pm
“ఇందిరా గాంధీ, నేనూ రెండు దోసెలూ!”
సౌమ్య గారూ,
ప్రతి కథా ఏదో సందేశం ఇవ్వాలని నేనూ ఆశించను కానీ, హాస్య రచనకి ప్రత్యేకమైన ఉద్దేశం లేనపుడు, భాషలో, సంభాషణలో చతురత అన్నా ఉండాలి. దయ్యాలూ, దేవుళ్ళూ, సిమెట్రీ, క్వాంటం థియరీ – ఇవేవీ నా బలహీనతలని గుర్తు తేలేదు – అన్వయించుకొని నవ్వుకోడానికి. పూజా, పూరీలకు మించి కథలో తెలుగు వాతావరణమే తక్కువనిపించింది. (తెలుగుతనం గురించి పెద్దగా తెలుసని కాదు. దేశం వదిలి పాతికేళ్ళవుతోంది. చదువుకున్న అమ్మాయిలు, తొక్కా, తోలూ, ఏహె లాంటి మాటలు వాడటం చదివి, ఔరా అనుకున్నాను.)
నాయకులు కలలోకి రావడమంటే గుర్తొచ్చింది. పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు” లో సీత భర్తకి ఇందిరా గాంధీ కలలోకొచ్చి దోశెలు తిన్న వైనం ఉంది. అది చదివి నవ్వకుండా ఉండలేము. అదీ ఇతరులవి మరి కొన్నీ, భార్గవీరావు గారు సంకలనించి “ఆహా … ఓహో! (ఆధునిక హాస్య వ్యంగ్య రచనలు)” క్రింద ప్రచురించారు. హాస్య రచనలంటే ఇష్టమున్నవాళ్ళు చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
లింకన్ తో ఓ రాత్రి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/07/2008 9:32 pm
“సత్యజిత్ రాయ్ ఎవరు”
నాకు సత్యజిత్ రాయ్ సాహిత్యంతో పరిచయం లేదు; డాన్ బ్రౌన్ ఎవరో తెలియదు. నీల్స్ బోర్ principle of complementarity గురించి కొంచం తెలుసు. ఈ కథ సారాంశం నాకర్థం కాలేదు. వింత మనుషులతో కాపురం/స్నేహం ఎలా ఉంటుందనా? దీనికి ప్రేరణ ఇచ్చిన రాయ్ సాహిత్యం చదువుదాం అన్న ఆసక్తి నాకు ఎంతమాత్రమూ కలగలేదు.
పోల్చి కించపరిచే ఉద్దేశం లేదు కాని, రాయ్ పుట్టినరోజన్నారు కనుక చెప్తాను. నిన్న రాత్రి ఎందుకో శ్రీపతి కథలు చదువుతుంటే, ఒకటి నన్ను గట్టిగా కదల్చింది. ఇవాళంతా నా ఆలోచనల్లోనే ఉంది. కథ పేరు, “సత్యజిత్ రాయ్ ఎవరు.” అది చదివి, నేను రాయ్ చిత్రాలు మరొకసారి చూడాల్సిన అవసరం ఉంది అని తీర్మానించుకున్నాను.
కొడవళ్ళ హనుమంతరావు
అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/05/2008 9:57 pm
Life and IT
మాలతి గారూ,
ఇవాళ సాయంత్రం మా అమ్మాయిని పార్కుకి తీసుకెళ్ళి ఓ చేత్తో దానిని ఉయ్యాలూపుతూ ఇంకో చేత్తో ఓ తెలుగు పుస్తకం పట్టుకొని చదువుతున్నా. అంతలో ఓ పెద్ద కంపెనీలో IT విభాగంలో పనిచేసే తెలుగాయన ఒకాయన పలకరించాడు. ఈ upgrades, patches తో చచ్చిపోతున్నామన్నాడు. “మీ బాధలు, మీ గాథలు / అవగాహన నా కవుతాయి!” అనుకున్నాను. 🙂
IT వాళ్ళ గతే అలా ఉంటే మిగిలినవాళ్ళు కంప్యూటర్లతో పడే అగచాట్లని ఊహించుకోగలను. కాని అవే ఈ కథకి మూలమయితే అవి ముఖ్య పాత్ర జీవితాన్నెలా ప్రభావితం చేశాయో చూపాలి – చెప్పడం కాకుండా.
సంగాలు జీవితం గురించి తెలిసినంత మాత్రం పధానపాత్ర గురించి తెలియలేదు. ముప్ఫై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నదనీ, కథలు రాస్తుందనీ, తెలియక ఓ డొక్కు ఉద్యోగంలో పడిందనీ తెలుసనుకోండి. కథ ఉత్తమ పురుష దృక్కోణంలో చెప్పడానికి ముఖ్యకారణం పాఠకులకి నమ్మకం పెంచడానికని విన్నాను. దీంట్లో “నేను” ఔట్సోర్సింగ్, ప్రపంచీకరణ, కంప్యూటర్ టెక్నాలజీ, తెలుగు భాషా దుస్థితి, శ్రీశ్రీ కవిత్వం, జీవిత పరమార్థం – ఇలా అనేక విషయాల మీద అభిప్రాయాలు చెప్పేటప్పటికి, మూడు పేజీల కథలో జీవితానికి చోటు తక్కువయి పాఠకుణ్ణి స్పందించే అవకాశం సన్నగిల్లింది.
వారసత్వపు హక్కుగా మిద్దె జీవితాన్ని అనుభవించలేకపోయానే అని వగచే విద్యావంతురాలి పట్ల సానుభూతి ఎలా పుడుతుంది? కూరలమ్ముకొని బ్రతికిన సంగాలుకి తన ‘డూటీ’ పట్ల నిర్లిప్తత లేదు. “నేను” కి తన ‘డూటీ’ ఒక శాపం. అలా ఎందుకు పరిణమించిందో చిత్రించక పోవడం, దాన్నుంచి విముక్తి లేనట్లు చిత్రించడం, ఈ కథలో లోపం.
కొడవళ్ళ హనుమంతరావు
అక్షరం పరమం పదం గురించి malathi అభిప్రాయం:
05/05/2008 11:56 am
నాకథ ఓపిగ్గా చదివినవారికీ, చదివి అభిప్రాయాలు వెలిబుచ్చినవారికీ ధన్యవాదాలు.
సాయిలక్ష్మిగారూ, మీ అభిమానానికీ అభిప్రాయాలకీ చాలా సంతోషం అండీ. నాసంకలనం చదివినట్టు నేను విన్న సందర్భాలు చాలా తక్కువ.
హనుమంతరావు గారూ, స్థూలంగా
కథ కానీ కవిత కానీ ఒక పాత్ర అనుభవించిన రసాన్ని, ఆనందం, దైన్యం, నిస్పృహ ఏదైనా కానీ – పాఠకుడిలో కలిగిస్తే ఆకథ రక్తికట్టేననుకుంటాను నేను.. (పెద్దవారు, మీకు తెలిసే వుంటుంది. తిరిగి చెప్తున్నందుకు క్షమించండి)
మీమాట నిజమే. ఆదిలో వున్న సముద్రపుహోరు చివరికి నీరు గారిపోయింది. కథలో ముఖ్యపాత్ర అనుభవం అదేనని చెప్పడమే ఈకథలో వావుద్దేశ్యం.
రవికిరణ్ గారూ, ఇది వ్యాసం అయితే పూర్వసిద్ధాంతాలూ, ఉపపత్తులూ, నిరూపణలూలాటి సరంజామా కావాలి. తదితర వచనరచనల్లో ఏది కథ, ఏది కాదు అన్నదానికి చాలా వాదాలూ, వివరణలూ వున్నాయి. అవన్నీ ఇక్కడ సాధ్యం కాదు.
చలనం చైతన్యానికి చిహ్నం. మొత్తం మానవాళి పురోభివృద్ధికి చలనం ముఖ్యం అన్నది నేను కూడా ఒప్పుకుంటాను.
అయితే ఒకమనిషి అనుభవం లెక్కలోకి రాదు అనడం న్యాయం కాదు. ఒక్కొక్క మనిషీ కూడితేనే మొత్తం మానవాళి అయింది.
మరొకవిషయం. ఈ కథలో ప్రధానపాత్ర యాంత్రికజగత్తులోని ఈతిబాధలకి వగచినా, వాటిని పూర్తిగా విసర్జించలేదు. ఈయాంత్రకజగత్తు సుడిగాలిలో సాంకేతిపరికజ్ఞానం అట్టే లేనివాళ్లూ, వారికి కలిగే అసౌర్యాలూ కూడా భాగమే. వీరిని కూడా లెక్కలోకి తీసుకున్నప్పుడే టెక్నాలజీ విలువ సంపూర్ణంగా కొలవడం సాధ్యం అని చెప్పడానికే ఈకథ. ఇది కేవలం ఒక కోణం అనుకోండి, మీ కవితలో వ్యక్తీకరించిన స్థితి లోకంలో ప్రతిఒక్కరిస్థితీ కానట్టే. ఇదొక్కటే కోణం కాదు కానీ ఇది కూడా ఒక కోణమే.
మరోసారి థాంక్స్.
పేరు గలవాడేను మనిషోయ్ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/04/2008 10:07 pm
కథ వాతావరణం, సన్నివేశాలు, కళ్ళకు కట్టినట్లు సృష్టించి, రక్తి కట్టే భాషలో సంభాషణలు నడిపించి దిట్ట అనిపించుకున్నారు రానారె.
వరి అన్నం, దస్తా తెల్ల కాగితాలూ తీరని కోరికలయిన జీవితాలతో నాక్కాస్త అనుభవం ఉంది. రేడియో కింత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే, చాసో “ఎందుకు పారేస్తాను నాన్నా?” కన్నా మించి ఉండేది. కొత్తపాళీ గారిచ్చిన ఇతివృత్తానికి మరీ కట్టుబడి పోవడాన అలా సృష్టించాల్సొచ్చిందేమో.
చాసో రాసింది 1945లో. అరవై డెబ్భై ఏళ్ళ తర్వాత గూడా ఇలాంటి కథలొస్తున్నాయంటే, అది మన దేశ దౌర్భాగ్యం.
కొడవళ్ళ హనుమంతరావు
అక్షరం పరమం పదం గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:
05/03/2008 7:52 pm
మార్పు లేని చోట మిగిలేది మురుగే. హిందూ మొగుడ్తో, కిరస్తానీ పాదరీతో, జిలుగు సాయిబుతో నేర్చిన పాఠాలే సంద్రాలి సంభాషణలేవో మాలతి గారు. అన్ని మార్పుల అనుభవాలే మీకు అక్షర సత్యాలుగా కనిపించాయేవో, వినిపించాయేవో. పనికి మాలినవని అనుకున్నా పురోగమనం అనేది సహజ పరిణామం. మీకూ, నాకూ పనికిరాకపోవచ్చు, కానీ ఇది మీ, నా పరిణామం మాత్రవే కాదు, మొత్తం మానవ జాతి పరిణామం, పురోగమనం. పదికాలాల పాటు నిలచిపోవటవనేది సాపేక్షవే తప్ప ఆబ్సల్యూట్ నిలచిపోవడవనేది కాదు. moving is moving up అనే భావనకి అర్థం లేదు. moving is moving అంతే. పైకా క్రిందకా, ప్రక్కకా కాదు. చలనం అనేది ప్రకృతి సహజం.
మీ కథ బాగుందో బాగలేదో కానీ, కథలాగా మాత్రం లేదు. మీ వ్యాసం విషయంలో హనుమంతరావు గారి అభిప్రాయంతో నేనేకీభవిస్తాను.