eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16453
ఛందోధర్మము
గురించి ravikiran timmireddy అభిప్రాయం:
08/30/2008
8:13 pm
సత్యన్నారాయణ గారు,
జీవితాన్ని చిత్రించడం సాహిత్యవంటే, జీవితంలో కల్పన లేదని కాదండీ. బతుకులో వాస్తవవెంత నిజవో, కల్పనా అంతే అవసరం. కల్పనే లేకపోతే మన బాల్యంలో వొక అత్యద్భుతవైన కలని, ఆ కలతో మమైకవైపోయిన ఆ బతుకుని పారేసుకోవడవే కదా. కల్పనా, కలే లేకపోతే యవ్వనం ఎంత నిస్సారంగా నీరుకారిపోతుందో మీకు తెలీదా, నాకు తెలీదా. నేలనొదిలి కొన్నిసార్లు పగటి కలల్లో ప్రయాణం అనుభవం లేని మనిషంటూ ఎవరైనా వుంటారా. జీవితాన్ని చిత్రించడవంటే ఎక్కాలతోపాటూ, ఏడేడు సముద్రాల అవతలనున్న మార్రిచెట్టు తొఱ్ఱలో చిలక గురించి కూడా చెప్పటం అండీ. అందుకని లెక్కల మాస్టారు ఎంత నిజవో, ఎగిరే గుర్రవెక్కిన రాకుమారుడు జీవితంలో అంత అవసరవే. మరందుకని బతుకంటే, నవ్వులూ, ఏడ్పులూ మాత్రవే కాదండీ, కలలూ, కల్పనలూ కూడా వుంటాయని మనవి.
హనుమంత రావుగారు, సాయి గారు,
వొకవేళ సరైన ఆస్తిపాస్తులుండి, బతుకులో పోషణకోసం రాజీపడవలసిన అవసరం లేకపోతే, అప్పుడు ఆ రచయితలు తప్పులు చేస్తే వాళ్ల రచనలకి ఆ తప్పులంటుతాయా? కడుపులో చల్లకోసవైనా, ఒంట్లో వేడి కోసవైనా తప్పు, తప్పే కదండీ. ఐతే తప్పు చేసిన వాళ్ళకీ, తప్పు చేసే వాళ్ళకీ బతుకులో కష్టం, సుఖం అనుభవించే అర్హత లేదా? ఆ అనుభవాన్ని చెప్పుకునే అవకాశం వాళ్లకి లేదా? మనుషులుగా వాళ్ళని మనం నెత్తిన పెట్టుకుని తిరగక్కరలేదు, కానీ కవులుగా, రచయితలుగా, కళాకారులుగా వాళ్ల సృష్టిని కించపచవలసిన అవసరం వుందా? వొక వేళ వాళ్ల ఒళ్ళు కొవ్వెక్కే తప్పులు చేసున్నా, ఆ తప్పుల్ని వాళ్ళ రచనలకి ఆపాదించాల్సిన అవసం వుందా? చండీ దాసు గారికున్నంత ధైర్యం లేని రచయితలు, బలహీనులు, వ్యసనపరులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, రాజకీయనాయకులు (?) వీళ్ళెవరికీ కస్టాన్నీ, సుఖాన్నీ, ఏడుపుని, నవ్వునీ, కన్నీళ్ళనీ, ప్రేమనీ, నిజాన్ని, కల్పన్నీ, వాళ్ళు నమ్మిన నిజాన్నీ (వాళ్లకది ఆచరణ సాద్యం కాకపోవచ్చు) కాగితం పైన పెట్టే అర్హత లేదా.
బాబ్జీలు గారూ, జయప్రభ గారూ,
నా కవితపై మీ స్పందన కి , ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
గత కొద్ది వారాలుగా ఇండియా లో Whirlwind tour లో ఉండటం వల్ల ఈమాట చూడలేకపోయాను.
జయప్రభ గారూ,
“జలపాత(స్నాన)పు ఖడ్గచాలనానికి” వెరవని వాళ్ళు , మంచు గాలి వణుకు కి జడుస్తారంటారా?! 🙂
బాబ్బాబు, నా సందేశం లోని చివరి పేరాని ఏరి పారేసి మిగిలినవి చదువుకుందురూ. మీకు పుణ్యం వుంటుంది. అక్కడ కాస్తంత కవి హృదయాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నించాను. క్షమించండి. 🙂
హనుమంతరావు గారు ఇలా అన్నారు:
“సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.”
దీనితో నేను ఏకీభవిస్తున్నాను. నేను సాధారణ పాఠకుణ్ణే. ఆస్కర్ వైల్డ్ ఏకవాక్యాలు (one-liners) నాకు బాగా నచ్చేవి. ఆ తర్వాత అతని జీవిత చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం తెచ్చి చదివితే తెలిసింది అతన్ని రెండు సంవత్సరాలు అప్పట్లో ఒక చెప్పుకోదగని నేరానికి చెరసాలలో పెట్టారని.
అది చదివి హతాశుణ్ణయ్యాను. కానీ అతని వాక్యాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. అతని నేరం (?) ఏమాత్రమూ నచ్చదు. 🙂
ఈ బాదరాయణ సంభంద బాంధవ్యాలేమిటో కాని, ఒక్కమాట నిజం. మనకోసమంటూ లేదా మనమెలా ఉన్నామో అని ఒక్కసారన్నా ఆలోచించేవాళ్ళే మనవాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. మన అవసరానికి అప్పటికప్పుడు మనదగ్గరికి వచ్చేవారే మనకి సహాయకులు గాని, మన సహాయం అడిగితే మటుకు ఎవ్వరైనా కాదనేవారే.
ఈ కథ లో నైనా ఆ సమయంలో అండ్రియా , హార్లీ , ఇంకో తెల్ల జంట అక్కడికి వచ్చారు కాబట్టి ఆ సమయంలో సహాయకంగా చేయి అందించగలిగారు కాని, లేకపోతే వాళ్ళు కూడా అక్కరికి రాని మిత్రులే కదా!
” నమ్మితే ప్రాణాలైనా ఇస్తాము, నమ్మడమేరా కష్టం
ముక్కుసూటిగా ఉన్నది చెప్తాము నచ్చకుంటే మీ ఖర్మం
కష్టమొచ్చిన కన్నీరొచ్చిన
చెదరని కదలని ఇంధ్రధనుస్సులం మేమే ఇండియన్స్ ”
అన్నది గుర్తోస్తోంది. కథలో ‘మన ‘ అనుకొనేవాళ్ళని విలన్ గా(అక్కరకి రాని నేస్తం గా) చూపించడం కొంచం బాధగానే ఉంది.
మీ పురోహితుడి ఉదాహరణ నాకర్థం కాలేదు. కుటుంబరావుది ఉద్యోగధర్మమూ, శ్రీశ్రీది మరొకటీనా? ఎలా? ఇద్దరూ బతుకుతెరువు కోసం తమ నమ్మకాలతో కొంత రాజీపడినట్లుంది. మహాకవులూ, మేధావులూ కూడా రాజీ పడితే ఎలా? అని ధర్మజీవులడగొచ్చు. కాని, రాజీపడకపోతే, మన సమాజంలో అలాంటి నమ్మకాలున్నవాళ్ళకి సరయిన ఆస్తిపాస్తులుంటే తప్ప ఇల్లు గుల్లవచ్చు. ఏం? ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా? అంటే, ఏమో, అది కడుపులో చల్ల కదలని నాలాంటి వాళ్ళు చెప్పడం ధర్మం కాదు.
పరిమితమైన నా సాహితీ పరిధిలో చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెవ్వరూ లేరు – చలం తప్ప.
మీరు “సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు,” అన్నారు. మీరే సమర్థించిన ప్రసాదు గారి ఆక్రందన – ప్రజలు వేర్వేరుగా తూకం వేస్తున్నారనే గదా?
హంసలంటే చలసాని ప్రసాద్ రాసిన “అనంతం” ముందుమాట గుర్తొచ్చింది: “ఏ ముసుగులూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు శ్రీశ్రీ. … మింగలేని చేదునిజాలూ, వినలేని సంగతులూ, చూడలేని దృశ్యాలూ … ఏదిఏమయినా ప్రజలు హంసల లాంటివారు…”
సామాన్య పాఠకులకి హంసలతో కాస్తో కూస్తో చుట్టరికం లేకపోతే, అనంతం వెలువడిన పాతికేళ్ళ తర్వాత కూడా మహాప్రస్థానం ఎందుకు నిలుస్తుంది?
సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.
(నేనీ లాంగ్ వీకెండ్ ని సద్వినియోగపరచుకుంటే, వచ్చే వారం అలాంటి ఒక ద్రష్ట గురించి నా కంప్యూటింగ్ వ్యాసంలో చదవచ్చు. విషయం, సందర్భం, మన రచయితలతో పోల్చదగ్గది కాదు కాని నేను పైన అన్న దానికి ఓ ఉదాహరణ.)
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/29/2008
2:01 pm
పామర్తి గారూ,
ఇక్కడ ఏ రచయితనీ చీల్చి చండాడడం లేదు. ప్రశ్నించే వాళ్ళ పీక నొక్కడం లేదు. సీమ సినిమాల్లో లాగా కత్తులు నూరడం లేదు. అందులో తప్పేమిటి? ఎవర్ని ఎవరూ తూలనాడడం లేదు. నీకేం తెలీదు, నే చెప్పేది విను అన్న ధోరణి అంతకన్నా లేదు. “ప్రకర్ష” పేరుతో ఎదుటి వాళ్ళని చులకనగా చూడ్డం లేదు. ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు గిరి దాటకుండా చెబుతున్నారంతే! ఉద్వేగాలూ, ఉద్రేకాలు అంతకన్నా లేవు :)- ఒకవేళ ఎవరైనా “చెయ్యి” జారితే, సంపాదకుల కత్తెర చూసుకుంటుంది. కాబట్టీ, ద్వారకానగరము దారి బట్టీ అన్నట్లుగా చర్చించుకో వచ్చు. :)-
జీవితాన్ని చిత్రించడం మాత్రమే సాహిత్యం అయితే జేకే రౌలింగ్ రాతలు సాహిత్యం కాదు. అవి అభూతకల్పనలు కనుక. అదే విధంగా కథాసరిత్సాగరమూ, పంచతంత్ర కథలూ కూడా సాహిత్యం కావు. ఎక్కడైనా జంతువులు మాట్లాడతాయా? ఆలోచించి మనుష్యుల్లా వ్యవహరిస్తాయా?
మనము ఆచరించేదే కథల్లో రాయాలని తీర్మానించుకుంటే అవి మన చేతులకి మనమే తొడుక్కున్న సంకెళ్ళవుతాయి.
కథలు కల్పితాలు. ఆత్మ కథలు కల్పితాలు కారాదు. ఈ రెంటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఆత్మ కథల్లో రచయితల జీవితాలను చిత్రించడం జరుగుతుంది. నిజాన్నీ, నిజాయితీని ప్రదర్శించడం జరుగుతుంది. నమ్మకాలూ, సందేహాలూ తెలియజేయబడుతాయి. అలా జరగని పక్షంలో అవి విమర్శనార్హాలవుతాయి.
కొడవటిగంటి గారు ప్రతి బేతాళ కథ అంతంలోనూ “కల్పితం” అని రాసేవారు. కావాలంటే పాత చందమామలు తిరగవేయండి. తర్వాత భావ్యమని అనిపిస్తే విమర్శించండి. అంతే కాదు. చందమామలో వచ్చిన ఏ ఒక్క కథనూ తనదిగా చాటుకున్నట్లు లేదు.
ఆత్మకథలకు ఉండాల్సిన లక్షణాలను ఇతర సాహిత్య రచనలకు ఆపాదించవలసిన అవసరం లేదు. ఇతర సాహిత్యం అన్నది ఈ విశాల ప్రపంచంలో “జీవితాన్ని చిత్రీకరించడం” అన్న కుగ్రామపు పరిధి లోపల చెర బాధననుభవించనక్కర్లేదు. ఈ విధి కి బలికానవసరంలేదు.
కథలన్నవి, రాసే వారి నమ్మకాలకు అనుగుణంగా లేక పోయినా పర్వాలేదు. వాస్తవికతకి దూరంగా ఉన్నా పర్లేదు. మీరందరూ నిజాయితీ, నీతి, అవినీతి అని రచయితల విషయంలో బాధపడటం అవసరం లేని పనిగా నాకు తోస్తున్నది.
ఈ రచయిత శ్రీరంగ నీతులు బోధిస్తున్నాడు (కథల్లో). చాలా మంచి పాటలు పాడేస్తున్నాడు. వీడి జీవిత చరిత్రని తవ్వుదాం. అవినీతిని బట్టబయలు చేద్దాం. వాణ్ణి కపటవేషధారి అని నిరూపించి వీధి మధ్యలోకి ఈడ్చి చీల్చి చెండాడుదాం. భ్రష్టుడనిపించుదాం. ధ్వజస్తంభానికి కొరత వేద్దాం అనే లాంటి ఉద్రేక పూరిత మాటలు సబబుగా గోచరించట్లేదు.
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ
ఛందోధర్మము
గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/29/2008
6:06 am
హనుమంత రావు గారూ,
మీరు
“చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.” అని రాసారు. చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెంత మందున్నారు? కాకపోతే సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు.
అలాగే రచయితలందరూ నీతీ, నిజాయితీ మడిబట్ట కట్టుకొని రచనలు చేస్తారని నేనుకోను. చెప్పే సిద్దాంతాలకీ, నీతులకీ, తాను చేసే పనులకీ పొంతన లేకుండా ఉంటే రచయిత నిజాయితీ మీద నమ్మకం ఎలా కలుగుతుంది?
మీరు కుటంబరావు గారి ఉదాహరణ చెప్పారు. మీరు చెప్పినట్లుగా కుటుంబరావు గారికీ ఓ కుటుంబం ఉంది. దాని పోషణా బాధ్యతా ఉంది. అందుకోసం పత్రికా సంపాదకులుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలని పక్కనబెట్టి, ఆయనకప్పగించిన పనిని అద్భుతంగా చేసారు. కాదనను. ఆయన మీద నమ్మకంతో ఓ బాధ్యత అప్పగిస్తే, ఇంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరన్నట్లుగా చేసి చూపించారు. అది ఆయనకి పనిమీదుండే గౌరవాన్ని చూపిస్తుంది.
( తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తాయన. ఆయన నా అభిమాన కథకుల్లో ఒకరు. )
ఇక్కడ నాదో ఉదాహరణ. ఓ నాస్తికుడు దేవాలయ బోర్డులోనో, లేదా దానికి సంబందించిన ఓ పనికో నియమింప బడి, అది చేయచ్చు. దాన్నెవరూ ప్రశ్నించరు. కానీ అదే వ్యక్తి పురోహితుడిగా ఉద్యోగం చేస్తూ, నేను దేవుణ్ణి నమ్మను కానీ పౌరోహిత్యం నా జీవనాధారం అంటే ఎవరూ ఏం చేయలేరు. కాకపోతే అదేమిటి ఇంత విరుధ్ధంగా వుందా వ్యక్తిత్వం అనిపించడం సహజం. అలాంటప్పుడే నిజాయితీ అనేది బయటకొస్తుంది. కాదంటారా?
నేనేమీ ధర్మవ్యాధుళ్ళాంటి వాణ్ణి కాను. అందువల్ల నాకూ మామూలు పాఠకుల్లాగే అనిపిస్తుంది.
రాత్రి పీకల వరకూ పీతల్లా తాగి తెల్లారేసరికి మంచి మంచి రచనలు చేయచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. తాగుబోతు రాసాడంటూ ఆ రచన్ని అరేబియా సముద్రంలో విసిరేయను. ఎవరి అలవాట్లు వాళ్ళవి అనూరుకుంటాను. నా దృష్టిలో అలవాట్లూ వేరు. వ్యక్తి త్వం వేరు. మంచిగా రాస్తే చదివి ఆనందిస్తాను. కానీ -ఆ రచయితే “తాగడం తప్పు, దీనివల్ల ప్రజలకి మంచిది కాదంటూ నీతి వాక్యాలు వాళ్ళ రచనల్లో చుట్టేసేడనుకోండి. అప్పుడే చిర్రెత్తుకొస్తుంది. అలాంటి రచయితంటే నాకు గౌరవం లేదు. అదే నాకున్న అభ్యంతరం.
నాకు నమ్మకం లేని విషయాలు నేనాచరించలేను. నా పిల్లలకీ చెప్పలేను. నేను నమ్మే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా జీవిస్తూ, అవి వాళ్ళకి నూరిపోయను. ( కమ్యూనిష్టు సిద్ధాంతాలను నమ్ముతూ, బి జె పి లో పనిచేయలేను :)- )
మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే చేస్తాను.
ఇదేం కథండీ బాబూ ! కాకపోతే మాలాంటి మగ మహారాజులకి వంట చెయ్యమని చెప్పే కథ రాస్తారా? ఎంత మీరు ఎక్సర్ సైజ్ అని వంక పెట్టి రాస్తే మాత్రం, అది మాలాంటి పురుషాహంకారులని ఏ మాత్రం మార్చలేదు, హ్వహ్వహ్వ ! భూషణ్
ఛందోధర్మము గురించి ravikiran timmireddy అభిప్రాయం:
08/30/2008 8:13 pm
సత్యన్నారాయణ గారు,
జీవితాన్ని చిత్రించడం సాహిత్యవంటే, జీవితంలో కల్పన లేదని కాదండీ. బతుకులో వాస్తవవెంత నిజవో, కల్పనా అంతే అవసరం. కల్పనే లేకపోతే మన బాల్యంలో వొక అత్యద్భుతవైన కలని, ఆ కలతో మమైకవైపోయిన ఆ బతుకుని పారేసుకోవడవే కదా. కల్పనా, కలే లేకపోతే యవ్వనం ఎంత నిస్సారంగా నీరుకారిపోతుందో మీకు తెలీదా, నాకు తెలీదా. నేలనొదిలి కొన్నిసార్లు పగటి కలల్లో ప్రయాణం అనుభవం లేని మనిషంటూ ఎవరైనా వుంటారా. జీవితాన్ని చిత్రించడవంటే ఎక్కాలతోపాటూ, ఏడేడు సముద్రాల అవతలనున్న మార్రిచెట్టు తొఱ్ఱలో చిలక గురించి కూడా చెప్పటం అండీ. అందుకని లెక్కల మాస్టారు ఎంత నిజవో, ఎగిరే గుర్రవెక్కిన రాకుమారుడు జీవితంలో అంత అవసరవే. మరందుకని బతుకంటే, నవ్వులూ, ఏడ్పులూ మాత్రవే కాదండీ, కలలూ, కల్పనలూ కూడా వుంటాయని మనవి.
హనుమంత రావుగారు, సాయి గారు,
వొకవేళ సరైన ఆస్తిపాస్తులుండి, బతుకులో పోషణకోసం రాజీపడవలసిన అవసరం లేకపోతే, అప్పుడు ఆ రచయితలు తప్పులు చేస్తే వాళ్ల రచనలకి ఆ తప్పులంటుతాయా? కడుపులో చల్లకోసవైనా, ఒంట్లో వేడి కోసవైనా తప్పు, తప్పే కదండీ. ఐతే తప్పు చేసిన వాళ్ళకీ, తప్పు చేసే వాళ్ళకీ బతుకులో కష్టం, సుఖం అనుభవించే అర్హత లేదా? ఆ అనుభవాన్ని చెప్పుకునే అవకాశం వాళ్లకి లేదా? మనుషులుగా వాళ్ళని మనం నెత్తిన పెట్టుకుని తిరగక్కరలేదు, కానీ కవులుగా, రచయితలుగా, కళాకారులుగా వాళ్ల సృష్టిని కించపచవలసిన అవసరం వుందా? వొక వేళ వాళ్ల ఒళ్ళు కొవ్వెక్కే తప్పులు చేసున్నా, ఆ తప్పుల్ని వాళ్ళ రచనలకి ఆపాదించాల్సిన అవసం వుందా? చండీ దాసు గారికున్నంత ధైర్యం లేని రచయితలు, బలహీనులు, వ్యసనపరులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, రాజకీయనాయకులు (?) వీళ్ళెవరికీ కస్టాన్నీ, సుఖాన్నీ, ఏడుపుని, నవ్వునీ, కన్నీళ్ళనీ, ప్రేమనీ, నిజాన్ని, కల్పన్నీ, వాళ్ళు నమ్మిన నిజాన్నీ (వాళ్లకది ఆచరణ సాద్యం కాకపోవచ్చు) కాగితం పైన పెట్టే అర్హత లేదా.
మంచులో తడిసిన ఉదయం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
08/30/2008 5:42 pm
బాబ్జీలు గారూ, జయప్రభ గారూ,
నా కవితపై మీ స్పందన కి , ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
గత కొద్ది వారాలుగా ఇండియా లో Whirlwind tour లో ఉండటం వల్ల ఈమాట చూడలేకపోయాను.
జయప్రభ గారూ,
“జలపాత(స్నాన)పు ఖడ్గచాలనానికి” వెరవని వాళ్ళు , మంచు గాలి వణుకు కి జడుస్తారంటారా?! 🙂
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
08/30/2008 5:31 am
సాయి గారికి:
బాబ్బాబు, నా సందేశం లోని చివరి పేరాని ఏరి పారేసి మిగిలినవి చదువుకుందురూ. మీకు పుణ్యం వుంటుంది. అక్కడ కాస్తంత కవి హృదయాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నించాను. క్షమించండి. 🙂
హనుమంతరావు గారు ఇలా అన్నారు:
“సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.”
దీనితో నేను ఏకీభవిస్తున్నాను. నేను సాధారణ పాఠకుణ్ణే. ఆస్కర్ వైల్డ్ ఏకవాక్యాలు (one-liners) నాకు బాగా నచ్చేవి. ఆ తర్వాత అతని జీవిత చరిత్రకు సంబంధించిన ఒక పుస్తకం తెచ్చి చదివితే తెలిసింది అతన్ని రెండు సంవత్సరాలు అప్పట్లో ఒక చెప్పుకోదగని నేరానికి చెరసాలలో పెట్టారని.
అది చదివి హతాశుణ్ణయ్యాను. కానీ అతని వాక్యాలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. అతని నేరం (?) ఏమాత్రమూ నచ్చదు. 🙂
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ
సాయము శాయరా డింభకా! గురించి ramani అభిప్రాయం:
08/30/2008 3:50 am
ఈ బాదరాయణ సంభంద బాంధవ్యాలేమిటో కాని, ఒక్కమాట నిజం. మనకోసమంటూ లేదా మనమెలా ఉన్నామో అని ఒక్కసారన్నా ఆలోచించేవాళ్ళే మనవాళ్ళు. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలను. మన అవసరానికి అప్పటికప్పుడు మనదగ్గరికి వచ్చేవారే మనకి సహాయకులు గాని, మన సహాయం అడిగితే మటుకు ఎవ్వరైనా కాదనేవారే.
ఈ కథ లో నైనా ఆ సమయంలో అండ్రియా , హార్లీ , ఇంకో తెల్ల జంట అక్కడికి వచ్చారు కాబట్టి ఆ సమయంలో సహాయకంగా చేయి అందించగలిగారు కాని, లేకపోతే వాళ్ళు కూడా అక్కరికి రాని మిత్రులే కదా!
” నమ్మితే ప్రాణాలైనా ఇస్తాము, నమ్మడమేరా కష్టం
ముక్కుసూటిగా ఉన్నది చెప్తాము నచ్చకుంటే మీ ఖర్మం
కష్టమొచ్చిన కన్నీరొచ్చిన
చెదరని కదలని ఇంధ్రధనుస్సులం మేమే ఇండియన్స్ ”
అన్నది గుర్తోస్తోంది. కథలో ‘మన ‘ అనుకొనేవాళ్ళని విలన్ గా(అక్కరకి రాని నేస్తం గా) చూపించడం కొంచం బాధగానే ఉంది.
మనీప్లాంట్: అనువాద కథలు గురించి ramani అభిప్రాయం:
08/30/2008 3:24 am
చక్కటి సమీక్ష.. పుస్తకం చదవాలని ఆసక్తి కలుగుతోంది.
ఛందోధర్మము గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
08/29/2008 11:43 pm
సాయి గారికి,
మీ పురోహితుడి ఉదాహరణ నాకర్థం కాలేదు. కుటుంబరావుది ఉద్యోగధర్మమూ, శ్రీశ్రీది మరొకటీనా? ఎలా? ఇద్దరూ బతుకుతెరువు కోసం తమ నమ్మకాలతో కొంత రాజీపడినట్లుంది. మహాకవులూ, మేధావులూ కూడా రాజీ పడితే ఎలా? అని ధర్మజీవులడగొచ్చు. కాని, రాజీపడకపోతే, మన సమాజంలో అలాంటి నమ్మకాలున్నవాళ్ళకి సరయిన ఆస్తిపాస్తులుంటే తప్ప ఇల్లు గుల్లవచ్చు. ఏం? ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా? అంటే, ఏమో, అది కడుపులో చల్ల కదలని నాలాంటి వాళ్ళు చెప్పడం ధర్మం కాదు.
పరిమితమైన నా సాహితీ పరిధిలో చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెవ్వరూ లేరు – చలం తప్ప.
మీరు “సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు,” అన్నారు. మీరే సమర్థించిన ప్రసాదు గారి ఆక్రందన – ప్రజలు వేర్వేరుగా తూకం వేస్తున్నారనే గదా?
హంసలంటే చలసాని ప్రసాద్ రాసిన “అనంతం” ముందుమాట గుర్తొచ్చింది: “ఏ ముసుగులూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్టు రాశాడు శ్రీశ్రీ. … మింగలేని చేదునిజాలూ, వినలేని సంగతులూ, చూడలేని దృశ్యాలూ … ఏదిఏమయినా ప్రజలు హంసల లాంటివారు…”
సామాన్య పాఠకులకి హంసలతో కాస్తో కూస్తో చుట్టరికం లేకపోతే, అనంతం వెలువడిన పాతికేళ్ళ తర్వాత కూడా మహాప్రస్థానం ఎందుకు నిలుస్తుంది?
సాధారణ పాఠకుడైనా, గొప్ప మేధావి అయినా, తను మెచ్చిన ద్రష్ట నిజ జీవితంలో భ్రష్టుడని తెలిస్తే, హతాశుడవుతాడు. సందేహం లేదు. కాని అతని పనితనం గొప్పదయితే దానిని పూర్తిగా తిరస్కరించలేడు.
(నేనీ లాంగ్ వీకెండ్ ని సద్వినియోగపరచుకుంటే, వచ్చే వారం అలాంటి ఒక ద్రష్ట గురించి నా కంప్యూటింగ్ వ్యాసంలో చదవచ్చు. విషయం, సందర్భం, మన రచయితలతో పోల్చదగ్గది కాదు కాని నేను పైన అన్న దానికి ఓ ఉదాహరణ.)
కొడవళ్ళ హనుమంతరావు
ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/29/2008 2:01 pm
పామర్తి గారూ,
ఇక్కడ ఏ రచయితనీ చీల్చి చండాడడం లేదు. ప్రశ్నించే వాళ్ళ పీక నొక్కడం లేదు. సీమ సినిమాల్లో లాగా కత్తులు నూరడం లేదు. అందులో తప్పేమిటి? ఎవర్ని ఎవరూ తూలనాడడం లేదు. నీకేం తెలీదు, నే చెప్పేది విను అన్న ధోరణి అంతకన్నా లేదు. “ప్రకర్ష” పేరుతో ఎదుటి వాళ్ళని చులకనగా చూడ్డం లేదు. ఎవరి అభిప్రాయాల్ని వాళ్ళు గిరి దాటకుండా చెబుతున్నారంతే! ఉద్వేగాలూ, ఉద్రేకాలు అంతకన్నా లేవు :)- ఒకవేళ ఎవరైనా “చెయ్యి” జారితే, సంపాదకుల కత్తెర చూసుకుంటుంది. కాబట్టీ, ద్వారకానగరము దారి బట్టీ అన్నట్లుగా చర్చించుకో వచ్చు. :)-
ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:
08/29/2008 1:06 pm
అయ్యల్లారా, అయ్యయ్యల్లారా! (అమ్మలందరూ ఏరి?)
జీవితాన్ని చిత్రించడం మాత్రమే సాహిత్యం అయితే జేకే రౌలింగ్ రాతలు సాహిత్యం కాదు. అవి అభూతకల్పనలు కనుక. అదే విధంగా కథాసరిత్సాగరమూ, పంచతంత్ర కథలూ కూడా సాహిత్యం కావు. ఎక్కడైనా జంతువులు మాట్లాడతాయా? ఆలోచించి మనుష్యుల్లా వ్యవహరిస్తాయా?
మనము ఆచరించేదే కథల్లో రాయాలని తీర్మానించుకుంటే అవి మన చేతులకి మనమే తొడుక్కున్న సంకెళ్ళవుతాయి.
కథలు కల్పితాలు. ఆత్మ కథలు కల్పితాలు కారాదు. ఈ రెంటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఆత్మ కథల్లో రచయితల జీవితాలను చిత్రించడం జరుగుతుంది. నిజాన్నీ, నిజాయితీని ప్రదర్శించడం జరుగుతుంది. నమ్మకాలూ, సందేహాలూ తెలియజేయబడుతాయి. అలా జరగని పక్షంలో అవి విమర్శనార్హాలవుతాయి.
ఆత్మకథల్లోనో, నిజమని చాటించబడి ప్రచురించబడిన రచనల్లోనో వాస్తవికత లోపిస్తే నిస్సందేహంగా విమర్శించండి. కల్లా కపటం కనిపిస్తే ఖండించండి.
కొడవటిగంటి గారు ప్రతి బేతాళ కథ అంతంలోనూ “కల్పితం” అని రాసేవారు. కావాలంటే పాత చందమామలు తిరగవేయండి. తర్వాత భావ్యమని అనిపిస్తే విమర్శించండి. అంతే కాదు. చందమామలో వచ్చిన ఏ ఒక్క కథనూ తనదిగా చాటుకున్నట్లు లేదు.
ఆత్మకథలకు ఉండాల్సిన లక్షణాలను ఇతర సాహిత్య రచనలకు ఆపాదించవలసిన అవసరం లేదు. ఇతర సాహిత్యం అన్నది ఈ విశాల ప్రపంచంలో “జీవితాన్ని చిత్రీకరించడం” అన్న కుగ్రామపు పరిధి లోపల చెర బాధననుభవించనక్కర్లేదు. ఈ విధి కి బలికానవసరంలేదు.
కథలన్నవి, రాసే వారి నమ్మకాలకు అనుగుణంగా లేక పోయినా పర్వాలేదు. వాస్తవికతకి దూరంగా ఉన్నా పర్లేదు. మీరందరూ నిజాయితీ, నీతి, అవినీతి అని రచయితల విషయంలో బాధపడటం అవసరం లేని పనిగా నాకు తోస్తున్నది.
ఈ రచయిత శ్రీరంగ నీతులు బోధిస్తున్నాడు (కథల్లో). చాలా మంచి పాటలు పాడేస్తున్నాడు. వీడి జీవిత చరిత్రని తవ్వుదాం. అవినీతిని బట్టబయలు చేద్దాం. వాణ్ణి కపటవేషధారి అని నిరూపించి వీధి మధ్యలోకి ఈడ్చి చీల్చి చెండాడుదాం. భ్రష్టుడనిపించుదాం. ధ్వజస్తంభానికి కొరత వేద్దాం అనే లాంటి ఉద్రేక పూరిత మాటలు సబబుగా గోచరించట్లేదు.
నమస్కారములతో
పామర్తి సత్యనారాయణ
ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
08/29/2008 6:06 am
హనుమంత రావు గారూ,
మీరు
“చండీదాస్ అన్న మాట చాలా సబబయినదే కాదు, ఉదాత్తమైనది కూడా. ముందు తన రచనని చదవమన్నాడు. అది విలువైనదయితే, తను నలుగురూ తెలుసుకోదగ్గ రచయితయితే, తన జీవితం – దాంట్లో అల్పత్వాలున్నా మహత్వాలున్నా – అందరి ముందరా పెడతానన్నాడు.” అని రాసారు. చండీదాస్ లా ధైర్యంగా చెప్పే రచయితలెంత మందున్నారు? కాకపోతే సాధారణ పాఠకులు హంసలు కారు. వ్యక్తినీ, రచన్నీ, వ్యక్తిగత సిద్ధాంతాలనీ దేనికది వేర్వేరుగా తూకం వెయ్యరు. వెయ్యలేరు.
అలాగే రచయితలందరూ నీతీ, నిజాయితీ మడిబట్ట కట్టుకొని రచనలు చేస్తారని నేనుకోను. చెప్పే సిద్దాంతాలకీ, నీతులకీ, తాను చేసే పనులకీ పొంతన లేకుండా ఉంటే రచయిత నిజాయితీ మీద నమ్మకం ఎలా కలుగుతుంది?
మీరు కుటంబరావు గారి ఉదాహరణ చెప్పారు. మీరు చెప్పినట్లుగా కుటుంబరావు గారికీ ఓ కుటుంబం ఉంది. దాని పోషణా బాధ్యతా ఉంది. అందుకోసం పత్రికా సంపాదకులుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలని పక్కనబెట్టి, ఆయనకప్పగించిన పనిని అద్భుతంగా చేసారు. కాదనను. ఆయన మీద నమ్మకంతో ఓ బాధ్యత అప్పగిస్తే, ఇంతకంటే గొప్పగా ఎవరూ చేయలేరన్నట్లుగా చేసి చూపించారు. అది ఆయనకి పనిమీదుండే గౌరవాన్ని చూపిస్తుంది.
( తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తాయన. ఆయన నా అభిమాన కథకుల్లో ఒకరు. )
ఇక్కడ నాదో ఉదాహరణ. ఓ నాస్తికుడు దేవాలయ బోర్డులోనో, లేదా దానికి సంబందించిన ఓ పనికో నియమింప బడి, అది చేయచ్చు. దాన్నెవరూ ప్రశ్నించరు. కానీ అదే వ్యక్తి పురోహితుడిగా ఉద్యోగం చేస్తూ, నేను దేవుణ్ణి నమ్మను కానీ పౌరోహిత్యం నా జీవనాధారం అంటే ఎవరూ ఏం చేయలేరు. కాకపోతే అదేమిటి ఇంత విరుధ్ధంగా వుందా వ్యక్తిత్వం అనిపించడం సహజం. అలాంటప్పుడే నిజాయితీ అనేది బయటకొస్తుంది. కాదంటారా?
నేనేమీ ధర్మవ్యాధుళ్ళాంటి వాణ్ణి కాను. అందువల్ల నాకూ మామూలు పాఠకుల్లాగే అనిపిస్తుంది.
రాత్రి పీకల వరకూ పీతల్లా తాగి తెల్లారేసరికి మంచి మంచి రచనలు చేయచ్చు. నాకేమీ అభ్యంతరం లేదు. తాగుబోతు రాసాడంటూ ఆ రచన్ని అరేబియా సముద్రంలో విసిరేయను. ఎవరి అలవాట్లు వాళ్ళవి అనూరుకుంటాను. నా దృష్టిలో అలవాట్లూ వేరు. వ్యక్తి త్వం వేరు. మంచిగా రాస్తే చదివి ఆనందిస్తాను. కానీ -ఆ రచయితే “తాగడం తప్పు, దీనివల్ల ప్రజలకి మంచిది కాదంటూ నీతి వాక్యాలు వాళ్ళ రచనల్లో చుట్టేసేడనుకోండి. అప్పుడే చిర్రెత్తుకొస్తుంది. అలాంటి రచయితంటే నాకు గౌరవం లేదు. అదే నాకున్న అభ్యంతరం.
నాకు నమ్మకం లేని విషయాలు నేనాచరించలేను. నా పిల్లలకీ చెప్పలేను. నేను నమ్మే సిద్ధాంతాలకి వ్యతిరేకంగా జీవిస్తూ, అవి వాళ్ళకి నూరిపోయను. ( కమ్యూనిష్టు సిద్ధాంతాలను నమ్ముతూ, బి జె పి లో పనిచేయలేను :)- )
మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇదే చేస్తాను.
పలాయనం గురించి Bhushan అభిప్రాయం:
08/29/2008 1:24 am
ఇదేం కథండీ బాబూ ! కాకపోతే మాలాంటి మగ మహారాజులకి వంట చెయ్యమని చెప్పే కథ రాస్తారా? ఎంత మీరు ఎక్సర్ సైజ్ అని వంక పెట్టి రాస్తే మాత్రం, అది మాలాంటి పురుషాహంకారులని ఏ మాత్రం మార్చలేదు, హ్వహ్వహ్వ ! భూషణ్