బాబ్జీలు గారు
నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.
కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.
ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.
మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
————————–
విధేయుడు
-Srinivas
మీరు 12 రకాల నిర్వచనాలు రాసేరు. ఇంకా బోల్డు వుండే వుంటాయి. ప్రస్తుతానికి ఇవే అనుకుందాం. అంటే 12 రకాల కవిత్వాలనా? లేదా పన్నెండింటినీ కలగలపాలా? విశ్వ శ్రేయస్సు కోరని రసాత్మకవైఁన వాక్యం ఏఁవఁవుతుంది? Tranquility లో ఎమోషన్ రికలక్ట్ అవకపోయినా మిగిలిన పదకొండు నిర్వచనాల్లో ఏదో ఒకదానికి సరిపోయీ రచన ఏఁవఁవుతుందీ?
వేలూరి వారు, పై వ్యాసంలో, ఆశించింది ఇలాటి సందిగ్ధావస్థని నివారించడానికే ఏదో ఒక “టెక్నిక్” కోసవేఁ కదా?
హనుమంత రావు గారూ, “మో” కవిత్వం, దాన్ని వేలూరి వారు వుదాహరణగా వాడుకున్న పధ్ధతికీ, లేదా చేరా చేసిన వ్యాఖ్యలకీ, మీరెందుకు ఇంత బాధపడుతున్నారూ? ఏం నిరూపిద్దావఁని?
పాఠకుడి గారికి:
ఇస్మాయిల్ గారి వ్యాఖ్యనీ, కన్యాశుల్కాన్నీ ఒకే గాటని కట్టకండి. ఇస్మాయిల్ గారే వొప్పుకోరు. కన్యాశుల్కం జీవితం. జీవితం గురించి మరో వెయ్యేళ్ళ తరవాత కూడా “హాట్ హాట్” చర్చలు జరుగుతాయి. మీరొక్కరే హనుమంతరావు గారడిగిన చర్చ చేశేరు. విపులంగా చేయాలి, దయచేసి.
సురేష్ కొలిచాల గారికి:
వేలూరి వారు “సాధారణ పాఠకుడు”. ఇది వేలూరి వారికి అవమానం కాదు. శ్రీశ్రీ చివరివరకూ “సాధారణ పాఠకుడే” సాధారణ పాఠకుడి మొదటి లక్షణం, నూతనత్వాన్ని, అదెలాటిదయినా, అందులో మంచి లేశమాత్రమైనా, “కానీయండి” అని. అసాధారణ పాఠకులు ఎక్కడో ఒకదగ్గర ఆగిపోతారు.కొత్త జ్నాపకాన్ని సృష్టించడవేవిఁటీ? వేలూరి వారు రాసింది రైటు. కొత్త జ్నాపకాన్ని నెమరు వేయడం. మీరు ఇస్మాయిల్ గారి గురించీ, “మో” గారి గురించీ ఏవీఁ అన్లేదు. అన్నట్టు “అసాధారణ పాఠకుడి” గురించి: “అమ్మమ్మా! కందిగుండలో ఇంగువ వెయ్యవా, ప్లీజ్. మా అత్తారింట్లో కందిగుండ ఘుమఘుమ లాడుతుందే, ఇంగువతోటి. ప్లీజ్ ప్లీజ్” అని బతిమాలినా “నో ఇంగువ. ఓన్లీ జీలకర్ర” అనే రకం.
“ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)
మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?
కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.
వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.
కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
“నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,
…
మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
నేనెళ్ళొస్తా గడేసుకో.”
అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:
“నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”
నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”
“The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.
“అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
[2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.
బాబ్జీలుగారు
“నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.”
ఏ context లోనైనా వర్తించేదే నిర్వచనం. ఫలానా context లోనే వర్తించేది వొట్టి వచనం. ఉదాహరణకు కావ్యానికి, కవితకు కొందరిచ్చిన నిర్వచనాలు, ఏ context లోనైనా పనికివచ్చేవి మచ్చుకు కొన్ని.
1. నానృషిః కురుతే కావ్యం – సంస్కృత సూక్తి
2. శబ్దార్థౌ సహితౌ కావ్యం – భామహుడు
3. ఇష్టార్థ పదావ్యచ్చిన్నా వళీ కావ్యం – దండి
4. ధ్వనిః కావ్య జీవితం – ఆనంద వర్ధనుడు
5. ఔచిత్యం కావ్యస్య జీవితం – క్షేమేంద్రుడు
6. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ కావ్యం – మమ్మటుడు
7. వాక్యం రసాత్మకం కావ్యం, రసోవై సః – విశ్వనాథుడు
8. రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యం – పండితరాయలు
9. విశ్వశ్రేయః్ కావ్యం – ఆంధ్ర శబ్ద చింతామణి
10. కవయః్ క్రాంతః్ దర్శనః – సంస్కృత సూక్తి
11. Poetry is emotion recollected in tranquillity – Wordsworth
12. Poetry turns everything to loveliness. It exaults the beauty of that whcih is beautiful and it adds beauty to that which is deformed. – Shelley
——————————
విధేయుడు
-Srinivas
నా ఉద్దేశ్యం లో మంచి కవిత కి ఉండవలసిన లక్షణాలలో ఒకటి పాఠకుడి అనుభవం లోకి రావటం .ఈ అనుభవం లోకి రావటం పాతజ్ఞాపకాలని/పాత అనుభూతులని గుర్తు తేవటం ద్వారా కావచ్చు ,లేదా ఓ కొత్త అనుభూతిని కలుగజేయటం ద్వారా కావచ్చు. పాతజ్ఞాపకాలు ఒకప్పటి కొత్త అనుభూతులే కదా!
కవిత్వం లో అస్పష్టతని గూర్చి
“అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి
దాని అనుభూతి ఆకారం పాఠకుడికి అందాలి,హత్తుకోవాలి”
అని తిలక్ చెప్పింది ఇప్పటికీ నిజమేనేమో అనిపిస్తుంది.
తను సృష్టించిన Common Man గురించి చెబుతూ RK Laxman ఇలా అన్నాడు: “I would say he symbolises the mute millions of India, or perhaps the whole world, a silent spectator of marching time.”
ఆర్. కె. లక్ష్మణ్ గారి కామన్ మాన్ లాంటివాడే వేలూరి గారి సాధారణ పాఠకుడు. పాకశాస్త్రంలో ప్రత్యేక తర్ఫీదు, ప్రావీణ్యత లేకపోయినా ఒక సామాన్య మానవుడు ఎలాగైతే నవవిధ పాకాలని ఆస్వాదించగలుగుతున్నాడో, అలాగే ఏ కవిత్వ తత్త్వ విచారము, సాహితీ సిద్ధాంతాల పరిచయం లేకపోయినా వేలూరి గారి సాధారణ పాఠకుడు — పాత జ్ఞాపకాలే సాధనంగా — కవితాస్వాదన చెయ్యగలడు.
అంటే, ఈ వ్యాసంలో వేలూరి గారిది ద్విపాత్రాభినయనం :-): సిసిఫస్ రాయిలా ఏ సిద్ధాంతాన్ని మోయకుండా, మంచి భోజనాన్ని ఆస్వాదించినట్టే మంచి కవిత్వాన్ని ఆస్వాదించే సాధారణ పాఠకుడు ఒక పాత్ర అయితే, ఆ సాధారణ పాఠకుడు సాహిత్య సేవనం చేస్తునప్పుడు కలిగే అనుభవాన్ని సిద్ధాంతీకరించే సాహితీ సిద్ధాంతకర్తగా, Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాలను చదివిన వేలూరిగారిది ఇంకో పాత్ర.
కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి.
వేలూరి గారు బహుశా “కొత్త జ్ఞాపకాన్నీ సృష్టించడం ఒక మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి” అని రాయాలనుకున్నారని నా అభిప్రాయం.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
11/27/2008 6:19 pm
బాబ్జీలు గారు
నిజమే మీరన్నట్లకు బోలెడు నిర్వచనాలున్నాయి. పంచుకున్నవి నాకు తెలిసిన కొంచెం మాత్రమే.
కవిత్వాన్ని నిర్వచించడం కుదరదు అని అనుకున్నా, చేసిన వాళ్ళు చేసారు, చేయని వాళ్ళు ఆగకుండా చేస్తున్నారు, ఇంకా ముందుకు చేయకుండా ఆగుతారనీ లేదు.
ఇక మీరడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానమే నాది కూడా అని అనుకుంటాను. విశ్వశ్శ్రేయం కావ్యం అంటే విశ్వశ్రేయం కానిదేదీ కావ్యం కాదని కాదు. తీపి మంచి రుచి అంటే తీపి కానిదేదీ మంచి రుచి కాదని అననట్లు.
మీరన్న ఒక మాట మాత్రం చాలా సత్యం. కవిత చదవగానే చదువరికి ఏదోవొక అనుభూతి కలగాలి అన్నది పాఠకుని పట్ల సహాయమే కాదు, అవసరం కూడా అనిపిస్తుంది. తెలుగు భాష ఉనికే సవాలుగా మరుతున్న సమయంలో “నారికేళ పాకం” ముసుగులో అస్పష్టతను సమర్థించడం కష్టంగా అనిపిస్తుంది.
————————–
విధేయుడు
-Srinivas
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/27/2008 1:32 pm
బాబ్జీలు గారికి,
బాధేం లేదు. మో నిరాకారుడి లాగే నేనూ అడివిలో చిక్కుకుపోయాను. 🙂
ఇస్మాయిల్ చెప్పేదేదో ఈ సందర్భంలో ఆలోచించదగ్గదనిపిస్తోంది కాని, అది అభిప్రాయాల పరిథి దాటిపొయ్యేటట్లుంది. ప్రస్తుతానికి అంతటితో ఆపేస్తాను.
వేలూరి గారికి నిరాకారుణ్ణి ప్రస్తావించినందుకు కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu అభిప్రాయం:
11/27/2008 8:12 am
నాగులపల్లి శ్రీనివాస్ గారూ,
నిర్వచనం, అందులోనూ కవిత్వాన్ని నిర్వచించడడం, మీరు చెప్పినట్టు కుదరదు. “సామాన్య, సాంగీక” శాస్త్రాల్లో కుదురుతాయి.
మీరు 12 రకాల నిర్వచనాలు రాసేరు. ఇంకా బోల్డు వుండే వుంటాయి. ప్రస్తుతానికి ఇవే అనుకుందాం. అంటే 12 రకాల కవిత్వాలనా? లేదా పన్నెండింటినీ కలగలపాలా? విశ్వ శ్రేయస్సు కోరని రసాత్మకవైఁన వాక్యం ఏఁవఁవుతుంది? Tranquility లో ఎమోషన్ రికలక్ట్ అవకపోయినా మిగిలిన పదకొండు నిర్వచనాల్లో ఏదో ఒకదానికి సరిపోయీ రచన ఏఁవఁవుతుందీ?
వేలూరి వారు, పై వ్యాసంలో, ఆశించింది ఇలాటి సందిగ్ధావస్థని నివారించడానికే ఏదో ఒక “టెక్నిక్” కోసవేఁ కదా?
హనుమంత రావు గారూ, “మో” కవిత్వం, దాన్ని వేలూరి వారు వుదాహరణగా వాడుకున్న పధ్ధతికీ, లేదా చేరా చేసిన వ్యాఖ్యలకీ, మీరెందుకు ఇంత బాధపడుతున్నారూ? ఏం నిరూపిద్దావఁని?
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి baabjeelu అభిప్రాయం:
11/27/2008 6:16 am
పాఠకుడి గారికి:
ఇస్మాయిల్ గారి వ్యాఖ్యనీ, కన్యాశుల్కాన్నీ ఒకే గాటని కట్టకండి. ఇస్మాయిల్ గారే వొప్పుకోరు. కన్యాశుల్కం జీవితం. జీవితం గురించి మరో వెయ్యేళ్ళ తరవాత కూడా “హాట్ హాట్” చర్చలు జరుగుతాయి. మీరొక్కరే హనుమంతరావు గారడిగిన చర్చ చేశేరు. విపులంగా చేయాలి, దయచేసి.
సురేష్ కొలిచాల గారికి:
వేలూరి వారు “సాధారణ పాఠకుడు”. ఇది వేలూరి వారికి అవమానం కాదు. శ్రీశ్రీ చివరివరకూ “సాధారణ పాఠకుడే” సాధారణ పాఠకుడి మొదటి లక్షణం, నూతనత్వాన్ని, అదెలాటిదయినా, అందులో మంచి లేశమాత్రమైనా, “కానీయండి” అని. అసాధారణ పాఠకులు ఎక్కడో ఒకదగ్గర ఆగిపోతారు.కొత్త జ్నాపకాన్ని సృష్టించడవేవిఁటీ? వేలూరి వారు రాసింది రైటు. కొత్త జ్నాపకాన్ని నెమరు వేయడం. మీరు ఇస్మాయిల్ గారి గురించీ, “మో” గారి గురించీ ఏవీఁ అన్లేదు. అన్నట్టు “అసాధారణ పాఠకుడి” గురించి: “అమ్మమ్మా! కందిగుండలో ఇంగువ వెయ్యవా, ప్లీజ్. మా అత్తారింట్లో కందిగుండ ఘుమఘుమ లాడుతుందే, ఇంగువతోటి. ప్లీజ్ ప్లీజ్” అని బతిమాలినా “నో ఇంగువ. ఓన్లీ జీలకర్ర” అనే రకం.
వైదేహీ శశిధర్ గారికి:
నిజవేఁనండోయ్. “ట్రాన్స్పెరెంట్ చీకటి” .
హనుమంతరావు గారూ, మహానుభావుల వ్యాఖ్యల గురించి నా అజ్నానపు విజ్నానపు అభిప్రాయాల్ని క్షమించీయండి.
ట్రాన్స్పెరెంట్ చీకటి, స్పష్టవైఁన అస్పష్టం, అస్పష్టవైఁన స్పష్టం, తీరిపోయిన దాహం, అంతవైఁన అనంతం. హనుమంతరావుగారూ! ఇదేవిటండీ. బాబ్జీలూ, ఇదనంతం.
అసమర్థులు గురించి satyavani.v అభిప్రాయం:
11/27/2008 4:54 am
రమ్య గీతిక గారి కథ చాల రమ్యం గా వుంది.క్రిందటి తరం లోనిఎందరో స్త్రీల మనో చిత్రణ ఈ కథ.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
11/27/2008 1:31 am
“నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.” – మో
బాబ్జీలు గారికి, (కొంత వైదేహి గారికి),
“ఎవరు ఆధునికులు? ఇది మీ లాటివారు తేల్చాలి,” అన్నారు మీరు. కవిత్వానికి సంబంధించినంతవరకు నాలాటి వాడు ఏమీ తేల్చలేడు. (నాలుగేళ్ళ క్రితం గట్టు వినీల్ నో పార్టీలో కలిసి, సాహిత్యం గురించి ముచ్చటించుకున్నాం. వినీల్ ది ఈ తరం. నేనో ఇరవై ఏళ్ళు సాహిత్యాంధకారంలో ఉండటాన ఈ తరం రచయితల పేర్లు కూడా తెలియలేదు. ఆ ఖాళీ పూరించుకోడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాలుగు పుస్తకాలు చదివి, నలుగుర్ని కోట్ చేసినంత మాత్రాన పండితులవుతామన్న అపోహ లేదు.)
మో గురించి చేరా “ఆషామాషీగా చదివితే అర్థమయ్యే కవి కాడు … అప్పుడప్పుడు అక్కడక్కడ కొంచం తిక్క చూపిస్తాడు” అన్నాడు. సామాన్య పాఠకులయినంత మాత్రాన ఆషామాషీగా చదవాలని లేదు కదా. లోతు ఉంటే తెలుసుకోడానికి కష్టపడితే ఏం?
కొన్ని కవితలు వెంటనే మనసుకు హత్తుకుపోవు. అందీ అందక ఉంటాయి. వాటిని కాస్త తెలిసిన వాళ్ళు ఎవరన్నా వివరిస్తే అప్పుడు మామూలు పాఠకులకి కూడా గాఢమైన అనుభూతి కలుగుతుంది.
వేలూరి గారి వ్యాసంలో మో కవిత మీద వ్యాఖ్యానం చూసి, చితి-చింత తీశాను – ఎవరన్నా ప్రస్తావిస్తేనే కాని ఇలాటివాటి జోలి కెళ్ళను నేను. వేలూరి గారు కోట్ చేసిన పాదాలు నాకూ అర్థం కాలేదు. “ఎర్ర ద్రాక్ష పళ్ళూ, తెల్ల అన్నం,” ఏమిటీ గొడవ? అనుకున్నాను.
కాని ఇది దీర్ఘ కవిత. ఇంకా ముందుకు పోతే, నిరాకారుడు, తలుపుతో,
“నీకు నిద్ర వృద్ధాప్యంలా ముంచుకొచ్చినపుడు
చలి కొణుకుతూ రాంకీర్తనలు గొణుగుతూన్నపుడు
నన్ను తలుచుకొని నీ పుస్తకం లోపల్లోపల చదువుకో,
…
మూసేసిన వెన్నెలమాసికలేసిన తలుపూ
నేనెళ్ళొస్తా గడేసుకో.”
అనేటప్పటికి, అయ్యో! ఇది మన గురించే, అని తెలిసింది, విషాదమావరించింది. అందుకే నా మొదటి అభిప్రాయం రాసింది. ఇవాళ మీరు మో మీద రాసింది చదివి, మో తన మీద తనే అన్న మాటలు గుర్తొచ్చాయి [1]:
“నా కవిత్వానికి ఎంతమంది అభిమానులున్నారో అంతేమంది విమర్శకులూ ఉన్నారు. అది అర్థం కాదనేది ప్రధాన విమర్శ. దాన్ని నేను ఖండించను. ఎందుకంటే నిజంగానే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎవరిదాకో ఎందుకు… చలసాని ప్రసాదరావు గారే నాకు రాసిన ఆఖరి లేఖలో, ‘మీ కవితా సంకలనాలన్నీ మీరు అరబ్బీలోనో పార్శీలోనో లేదా ఆఫ్రికా ఖండపు బురుండీ దేశభాషలోనో రాశారని ఎందుకు డిక్లేర్ చెయ్యకూడదు,’ అంటూ హాస్యమాడారు. నేనెన్నుకున్న వస్తువు నేపథ్యాన్ని బలంగా ఆవిష్కరించే ప్రయత్నంలో ఏ ఇంగ్లీషు కవి ప్రభావమో నామీద పడవచ్చు. ఆ భావాలతో బొత్తిగా పరిచయం లేని వ్యక్తికి… నేను రాసిన కవితలోని మూలం అందకపోవచ్చు. అలాగని నేను రాసిందంతా సంక్లిష్టమైన కవిత్వమంటే మాత్రం ఒప్పుకోను. నా కవిత్వంలోని విషాదపు జీర సమాజానికి సంబంధించిందే.”
నిరాకారుడి లాంటి కవితలకి చేరానో, మరో పండితుడో కాస్త వ్యాఖ్యానం ఇవ్వాలి. వెతికితే, వడాలి [2] లో కాస్త ఉంది: “Walter de la Mare’s poem The Listeners opens with a traveller “knocking on the moon-lit door”. MO’s Nirakarudu has a similar opening, but he cautions us against reading too much similarity between the two poems.”
“The Listeners” బాగా పేరున్న కవిత అట. ఆ కవి మీద TS Eliot చక్కటి కవిత రాశాడట. ఇవేవీ నాకు తెలియవు. ఇప్పుడవి చదివి, మళ్ళీ “నిరాకారుడు” చదివాను. ఈ వ్యాసంలోని మిగతా కవితలూ చదివాను.
“అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు,” అని చదివితే నాకూ చిన్నప్పటి మాఊళ్ళో బంతి భోజనాలు, గాడిపొయ్యులు, వాటితో పాటు వంటసాల చేసి పొగకి మండిన కళ్ళూ – అవన్నీ గుర్తొస్తాయి. మిగిలిన కవితలు గూడా మరికొన్ని జ్ఞాపకాలని తలపుకొస్తాయి. కాని అవేవీ మో కవిత అంతగా కదల్చడం లేదు. దానికి ఫలానా జ్ఞాపకం కారణం అని చెప్పలేను. నిరాకారుడు గొప్ప కవిత. కాస్త చెయ్యిస్తే సామాన్య పాఠకులని కూడా విషాదంలోనూ మోదంలోనూ ముంచెత్తేది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఏకాంతం నుంచి ఏకాంతంలోకి,” ఈనాడు ఆదివారం, మార్చి 27, 2005.
[2] “Modern Poetry in Telugu,” by V. Mandeswara Rao.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
11/26/2008 9:43 pm
బాబ్జీలుగారు
“నిర్వచనాలు out of context లో అనిర్వచనాలయిపోతాయి.”
ఏ context లోనైనా వర్తించేదే నిర్వచనం. ఫలానా context లోనే వర్తించేది వొట్టి వచనం. ఉదాహరణకు కావ్యానికి, కవితకు కొందరిచ్చిన నిర్వచనాలు, ఏ context లోనైనా పనికివచ్చేవి మచ్చుకు కొన్ని.
1. నానృషిః కురుతే కావ్యం – సంస్కృత సూక్తి
2. శబ్దార్థౌ సహితౌ కావ్యం – భామహుడు
3. ఇష్టార్థ పదావ్యచ్చిన్నా వళీ కావ్యం – దండి
4. ధ్వనిః కావ్య జీవితం – ఆనంద వర్ధనుడు
5. ఔచిత్యం కావ్యస్య జీవితం – క్షేమేంద్రుడు
6. లోకోత్తర వర్ణనా నిపుణ కవి కర్మ కావ్యం – మమ్మటుడు
7. వాక్యం రసాత్మకం కావ్యం, రసోవై సః – విశ్వనాథుడు
8. రమణీయార్థ ప్రతిపాదక శబ్దః కావ్యం – పండితరాయలు
9. విశ్వశ్రేయః్ కావ్యం – ఆంధ్ర శబ్ద చింతామణి
10. కవయః్ క్రాంతః్ దర్శనః – సంస్కృత సూక్తి
11. Poetry is emotion recollected in tranquillity – Wordsworth
12. Poetry turns everything to loveliness. It exaults the beauty of that whcih is beautiful and it adds beauty to that which is deformed. – Shelley
——————————
విధేయుడు
-Srinivas
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
11/26/2008 2:42 pm
నా ఉద్దేశ్యం లో మంచి కవిత కి ఉండవలసిన లక్షణాలలో ఒకటి పాఠకుడి అనుభవం లోకి రావటం .ఈ అనుభవం లోకి రావటం పాతజ్ఞాపకాలని/పాత అనుభూతులని గుర్తు తేవటం ద్వారా కావచ్చు ,లేదా ఓ కొత్త అనుభూతిని కలుగజేయటం ద్వారా కావచ్చు. పాతజ్ఞాపకాలు ఒకప్పటి కొత్త అనుభూతులే కదా!
కవిత్వం లో అస్పష్టతని గూర్చి
అని తిలక్ చెప్పింది ఇప్పటికీ నిజమేనేమో అనిపిస్తుంది.
My humblest two cents.
కుతంత్రం గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
11/26/2008 1:41 pm
Very well written story with pleasant and beautiful narration.
నేనొక సాధారణ పాఠకుణ్ణి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
11/26/2008 1:02 pm
తను సృష్టించిన Common Man గురించి చెబుతూ RK Laxman ఇలా అన్నాడు: “I would say he symbolises the mute millions of India, or perhaps the whole world, a silent spectator of marching time.”
ఆర్. కె. లక్ష్మణ్ గారి కామన్ మాన్ లాంటివాడే వేలూరి గారి సాధారణ పాఠకుడు. పాకశాస్త్రంలో ప్రత్యేక తర్ఫీదు, ప్రావీణ్యత లేకపోయినా ఒక సామాన్య మానవుడు ఎలాగైతే నవవిధ పాకాలని ఆస్వాదించగలుగుతున్నాడో, అలాగే ఏ కవిత్వ తత్త్వ విచారము, సాహితీ సిద్ధాంతాల పరిచయం లేకపోయినా వేలూరి గారి సాధారణ పాఠకుడు — పాత జ్ఞాపకాలే సాధనంగా — కవితాస్వాదన చెయ్యగలడు.
అంటే, ఈ వ్యాసంలో వేలూరి గారిది ద్విపాత్రాభినయనం :-): సిసిఫస్ రాయిలా ఏ సిద్ధాంతాన్ని మోయకుండా, మంచి భోజనాన్ని ఆస్వాదించినట్టే మంచి కవిత్వాన్ని ఆస్వాదించే సాధారణ పాఠకుడు ఒక పాత్ర అయితే, ఆ సాధారణ పాఠకుడు సాహిత్య సేవనం చేస్తునప్పుడు కలిగే అనుభవాన్ని సిద్ధాంతీకరించే సాహితీ సిద్ధాంతకర్తగా, Walter Benjamin, రాజశేఖరుడు, ఆనందవర్థనుడు, వగైరాలను చదివిన వేలూరిగారిది ఇంకో పాత్ర.
వేలూరి గారు బహుశా “కొత్త జ్ఞాపకాన్నీ సృష్టించడం ఒక మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి” అని రాయాలనుకున్నారని నా అభిప్రాయం.
పాఠకుడిగా,
సురేశ్.