నేను చదివిన మీ వ్యాసాలలో ఇది రెండవది. నాకు బాగా నచ్చింది. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని రామా అన్నట్లు నా ఆకాంక్షలకు అనురూపమైన సాధనకు ఉపయుక్తమైన పరిజ్ఞానాన్ని అందించారు. చాలా చాలా కృతజ్ఞతలు.
రంగద భంగో త్తుంగ త
రంగాగ్ర నట త్తుషార రవ శీత ధునీ
సాంగత్య మబ్బె నిట మీ
సంగీత ప్రసంగ గాంగ స్నాన ప్రాప్తిన్
మీ వ్యాసంలో ఇంకా కొన్ని కొన్ని నా కవగతం కాలేదు కానీ, సాధన మొదలు పెట్టకుండానే, ప్రయత్న పూర్వకంగా తెలుసుకోకుండా అన్నీ మాటల వివరణల ద్వారా తెలుసుకోవాలని యత్నించడం అవివేకమని వాయిదా వేస్తున్నాను.
మరొక్క సారి కృతజ్ఞతలతో
భవదీయుడు
సాయి బ్రహ్మానందం గారికి
సంగీత స్వరాలను గురించి మీరు చదివిన శ్లోకం ఇదవునో కాదో తెలియదు గానీ “అమర కోశం” నాట్య వర్గులో ఈ శ్లోకాలున్నాయి :
నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ ధైవతాః
పంచమశ్చేదమీ సప్త తంత్రీ (సంభవ నిస్వనాః)
షడ్జం మయూరో వదతి గావస్త్వృషభ భాషిణః
అజావికం తు గాంధారం, క్రౌంచ క్వణతి మధ్యమం
పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమం
ధైవతం హేషతే వాజిః నిషాదం బృంహతే గజః
భావం సులభ గ్రాహ్యం మీరు చెప్పిందే గనుక వివరించను.
Nice story. This is something that happens in many families. I wish at least stories like this makes us think and understand the realities of life. Both husband and wife should understand their partner’s significance and should walk together in the long journey of life…….
వేమూరి గారి అభిప్రాయం చదివి ఆశ్చర్యపోయాను. తెలుగులో భాషాపరమైన డిగ్రీ ఏదీ లేకుండానే ఆయన నలుగురికీ ఉపయోగపడే నిఘంటువు నొకదానిని నిర్మించారు. మరి ఎవరో ఏదో అంటారని భయపడి శైలి మిద రాసిన పుస్తకాన్ని అచ్చువెయ్యకపోవడమేమిటి? అనుభవజ్ఞులు కూడా ఇలా వెనుకంజ వెయ్యడం చాలా నిరాశ కలిగిస్తుంది.
ఇక్కడ ప్రస్తావించిన – రంగనాయకమ్మ, బూదరాజు, దుర్గెంపూడి ల – పుస్తకాలు చెప్పుకోదగ్గవే కాని, అవేవీ, ఒంటిగా కానీ జమిలిగా కానీ, క్లుప్తత, సమగ్రత లలో Strunk and White కి సాటిరావు. కావాలంటే, “Elementary Principles of Composition,” కి సమాంతరమైనది ఈ పుస్తకాలలో ఏమైనా ఉందేమో చూడండి. వారి ప్రయత్నం ఎంతో మెచ్చుకోదగ్గదే అయినా, దానిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
అఫ్సర్ గారి లాంటి విద్యావేత్తలు, అలాంటి పుస్తకాలకి ఆదరణ ఉంటుందా లేదా అని అనుమాన పడకుండా, వాటి అవసరాన్ని గుర్తించి దానినో కర్తవ్యంగా తీసుకొని రాయాలి. ఫ్రొఫెసర్ Strunk చేసిందదే.
గొంతునుబట్టి మగవారికి ఒకటి, లేదా రెండు శ్రుతులు సరిపోతాయి.
స్వరస్థానాలను షడ్జమంతో పోల్చడం ద్వారా రాగాలను గుర్తుపడతాం. ఉన్న పన్నెండు (లేక పదహారు) స్వరాల్లో ఏవేవి, ఎటువంటి వరసలో వినిపిస్తున్నాయనేదాన్నిబట్టి రాగాల పేర్లను చెపుతాం. దీన్ని నేను డిజిటల్ పద్ధతి అంటాను. చాలామంది అదే రాగంలో తమకు తెలిసిన పాటతో (సినిమాపాట అయినా సరే) పోల్చి చూసుకుని చెప్పేస్తారు. ఇది ఎనలాగ్ పద్ధతి. ఇందులో స్వరాలను నిర్దుష్టంగా గుర్తించడం జరగకపోవచ్చు.
సదసత్కళా… పద్యంలో మరొక దానిని గమనించవచ్చును. అదేమంటే ఆ స్వరాల పాదాలు వచ్చేదానికి ముందు ఆ స్వరాలు కూడా నేపథ్యంలో వినబడుతాయి. నాకు తెలిసిన ఇలాటి అంశమున్న మరొక పాట – మలయమారుత అనే కన్నడ చిత్రంలో వల్లభాచార్యుల మధురాష్టకములో ప్రతి శ్లోకానికి ముందు సరిగమపధనిస స్వరాలు వస్తాయి. దీన్ని వాణీ జయరాం పాడగా బాలసుబ్రహ్మణ్యం ఊకొడుతారు. పాడబడిన మధురాష్టకాలలో ఇది చాలా మధురమైనది.
అనేక వెబ్ పత్రికలు, ఇతర కొత్త ప్రచురణ సాధనాలు పెరుగుతున్న ఈ కాలంలో తెలుగులో వొక శైలీ పుస్తకం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే విలువయిన వ్యాసం రాసినందుకు వేలూరి గారికి ధన్య వాదాలు. రచన – సృజనాత్మకమయినా, విమర్శ నాత్మకమయినా – కొన్ని సూత్రాలకు, నియమాలకు కట్టుబడి వుండడం వల్ల రచనకి అది బలమే. తెలుగు వాళ్లు సహజంగా ఆవేశజీవులు, ఆగ్రహ భావుకులు. విపరీతంగా పొగడ్డమో, తెగడ్డమో అలవాటయిన వాళ్లం. అందుకే, విమర్శ పేరిట వచ్చే చాలా రచనలు చివరికి కేవలం అర్ధ రహితమయిన ప్రశంసలుగా మిగిలిపోతుంటాయి. ఇక తెగడ్డం తూలనాడ్డంతో సరితూగుతుంది.
రాత అనేది సాధనతో సాధించుకునే విద్య. అది అచ్చు కావడానికి ముందే నలుగురు చదవడం వల్ల, నాలుగు మాటలు సరిదిద్దుకోవడం వల్ల మెరుగుపడుతుంది. తెలుగులో ఈ సాంప్రదాయం లేదు. చదివిన నలుగురూ మెచ్చుకుని తీరాలన్న పసితనపు ఉబలాటం తప్ప. పొరపాటున ఎవరయినా వేరే అభిప్ర్రాయం వ్యక్తం చేస్తే, ఇక ఆ వ్యక్తిని మన చదువరుల జాబితాలోంచి తీసి పడేస్తాం. దిద్దుబాట్లు, సరిదిద్దుబాట్లు మనకి నచ్చేలా వుండాలి. తెలుగు రచయితలు, కవులు చాలా మటుకు నిరంకుశ అధికారాల్ని కోరుకుంటారు. కొన్ని తరాలుగా ఇవి మొద్దు బారిన చర్మాలు. వీటి మీద చర్నాకోల లాంటి పదాలూ, వాక్యాలు తప్ప ఇంకేవీ పనిచెయ్యవు. అందుకే, సున్నితమయిన శైలీ పుస్తకాలు ఇక్కడ పనికి రావు.
తెలుగులో అచ్చు అనేది అచ్చోసిన ఆంబోతు లాంటిది. మనకి అచ్చు యంత్రాలు వచ్చాయి గాని, అచ్చు నియమాలు ఏమీ రాలేదు. అచ్చుకి సంబంధించిన భౌతిక ఏర్పాట్లు తప్ప నిజంగా అచ్చు సంస్కృతి రాలేదు. ఆ మాట కొస్తే, తొలి తరం ప్రచురణ కర్తలకి వున్న పాటి సంస్కృతి కూడా ఇవాళ మిగల్లేదు. ఒక రచన అచ్చుకి పంపడానికి ముందు ఏ ఏ దశలు అవసరమో ఆ ఆ దశల పట్ల మనకి శ్రద్ధ లేదు. అందుకే, రంగుల మయంగా కనిపించే ఇవాళ్టి ప్రచురణల కన్నా, ఆ నాటి వావిళ్ల, దేశి, ఆదర్శ, దక్షిణ భాషా సంస్థ ప్రచురణలు అందంగా కనిపిస్తాయి. ఆ అందం వాటి భౌతికత నించి రాలేదు, నిస్సందేహంగా అవి పాటించిన శైలీ నియమాల నించి వచ్చిందే అనుకుంటాను. అచ్చు తప్పులు లేక పోవడం కూడా ఆ నియమాల్లో భాగమే. ముందు తరాల సంపాదకులకు కూడా శైలి పట్ల ఆ గౌరవం వుండేది. ఈ తరంలో ఆ గౌరవాన్ని నిలిపే సంపాదకులు లేరు. అసలు సంపాదకుడి పాత్ర మీదనే ఇప్పుడు గౌరవం లేదు. ముఖ్యంగా అచ్చు గౌరవాన్ని పోగొట్టడంలో తెలుగు దిన పత్రికల పాత్ర పెద్దది. తెలుగు దిన పత్రికలన్నిటికీ నిజానికి శైలీ పుస్తకాలున్నాయి. అవి ఎవరూ పాటించిన పాపాన పోరు. అసలు అక్షరం ముక్క రాయడం వస్తే చాలు అనే స్థితికి దిన్ పత్రికల మార్కెట్ దిగజారి పోయినప్పుడు నిజమే, శైలి ఆందని ద్రాక్ష పండు మాత్రమే ! ఇప్పుడు సాహిత్యాన్ని పోషించేది కూడా ఈ దిన పత్రికలే కాబట్టి, సాహిత్య శైలి కూడా అంతే!
ఈ స్థితిలో వేలూరి వ్యాసం ఒక చూపుడు వేలు. అది కొందరి కళ్ళల్లో గుచ్చుకోవడం సహజమే! కాని, కాస్త నిగ్రహంగా ఆలోచిస్తే, ఈ వేలు ఒక మంచి రచనా సంస్కృతి వైపు దారి చూపిస్తుంది. మంచి ఆలోచనల్ని అక్షరాల్లోకి అనువదించే మంచి రాత ఆ సంస్కృతికి పునాది. ఇది నేర్చుకుంటే వచ్చేది తప్ప సహజ పాండిత్యం మాత్ర) కాదు. ఆ మాటకొస్తే, సహజ పాండిత్యం ఒక ఆత్మ వంచన, భ్రమ. అలా నేర్చుకోవడానికి మన తెలుగు వాళ్లు సిద్ధంగా వున్నారా అన్నది ప్రశ్న. అసలు నేర్చుకోవడం అనే ప్రక్రియ మీద మనకి గౌరవం వుందా? ఆ గౌరవం లేకపోతే , రాత నియమాలు మనకి పనికి రావు.
రోహిణీ ప్రసాద్ గారికి
మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజ్ఞతలు. స్వరాలను రాగాలను ర్తించే మార్గాన్ని గురించిన నా సందేహానికి సమాధానం అందులో నాకు లభించలేదు. అర్ధం చేసుకొనేంత పరిజ్ఞానం లేక పోవడం కారణమేమో నని భావిస్తాను. G (ఐదో శృతి) ఆధార శృతిగా స్త్రీ కంఠస్వరాలకుంటుందని తెలిపారు. 1956-57 లో
మా అక్కకు సంగీతం నేర్పిస్తున్నప్పుడు నేను ప్రక్కనుండి నేర్చుకున్నాను గనుక ఈ శృతి నేర్పివుండవచ్చు. మగవారికి ఏ రేంజిలో వుంటుందో తెలుపరా?
భవదీయుడు
I am pleasantly surprised to know that you are familiar with the person and have had similar experiences.
Thank you very much for your comment. It gives me a lot of encouragement to know that you have enjoyed the articles.
సిద్ధాంతరీత్యా ఏ సంగీతానికైనా ఆధారశ్రుతి ఏమిటో తెలియకపోతే రాగం పేరు చెప్పడం అసాధ్యం. అందుకే భారతీయ సంగీతంలో తంబురావంటిది మోగుతూ ఉంటుంది. లేకపోతే హిందోళం పాడుతున్నప్పుడు మోహన, శుద్ధసావేరి, మధ్యమావతి, శుద్ధధన్యాసి రాగాల్లో ఏదైనా అనుకుని పొరబడే అవకాశం ఉంటుంది. నల్లమెట్లనే ఉపయోగించి ఈ అయిదింటినీ వినిపించవచ్చని నేను వ్యాసంలో సూచించాను. సిద్ధాంతరీత్యా అని ఎందుకన్నానంటే ఇవన్నీ ప్రసిద్ధరాగాలు కనక స్వరాలమధ్యనున్న సంబంధాలను బట్టి శ్రుతి మోగకపోయినా వాటిని గుర్తుపట్టగలం కనక.
సెహెరా సినిమాలో లతా పాడిన పంఖ్ హోతే తో ఉడ్ ఆతీరే అనే పాట విషయంలో సరిగ్గా ఇదే అనుమానం వస్తుంది. తుహే దిల్ కా దాగ్ దిఖ్ లాతీరే అని అంటున్నప్పుడు చివరి స్వరం షడ్జమం అని సంగీత దర్శకుడి ఉద్దేశం కాబోలు. అది ధైవతం అని మనం అనుకుంటే హిందోళం అవుతుంది.
దేన్నైనా వాయిస్తున్నప్పుడు ఆధారశ్రుతి (షడ్జమం) ఏదో మనం నిర్ణయించుకోవాలి. ఆ తరవాత రాగం పేరు చెప్పడం తేలికే. మీరు జి (అయిదు శ్రుతి) ఆధారశ్రుతిగా నేర్చుకున్నట్టున్నారు. అది స్త్రీల గాత్రానికి పనికొస్తుంది; మగవారికి కాదు.
స అనేది ఫ్లోటింగ్ స్వరం. రాగాలన్నీ సరిగమల మీద ఆధారపడతాయి; శ్రుతిమీద కాదు. ఒకే రకం భవనాన్ని పల్లంలోనూ, మిట్టమీదా నిర్మించినట్టు ఒకే రాగాన్ని ఏ శ్రుతిలోనైనా వినిపించవచ్చు. తమాషా ఏమిటంటే రాగాలను గుర్తుపట్టేవారు స్వరాల తరవాత గమనించేది వాటిమధ్య గల గమకాలనూ, సంబంధాలనే. Characteristicగా ఉండేవి అవే.
సంగీతంతో కుస్తీ గురించి M.S.Prasad అభిప్రాయం:
05/18/2009 11:58 pm
నేను చదివిన మీ వ్యాసాలలో ఇది రెండవది. నాకు బాగా నచ్చింది. తారక మంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని రామా అన్నట్లు నా ఆకాంక్షలకు అనురూపమైన సాధనకు ఉపయుక్తమైన పరిజ్ఞానాన్ని అందించారు. చాలా చాలా కృతజ్ఞతలు.
రంగద భంగో త్తుంగ త
రంగాగ్ర నట త్తుషార రవ శీత ధునీ
సాంగత్య మబ్బె నిట మీ
సంగీత ప్రసంగ గాంగ స్నాన ప్రాప్తిన్
కడు మేటి గంటి నేడని
తడబాటున నుంటి మది ముదము వర్ణింపన్
బుడమేటి పొంగు బోల్చియు
కొడవటి గంటీ! పదాళి కొదలేడంటిన్
మీ వ్యాసంలో ఇంకా కొన్ని కొన్ని నా కవగతం కాలేదు కానీ, సాధన మొదలు పెట్టకుండానే, ప్రయత్న పూర్వకంగా తెలుసుకోకుండా అన్నీ మాటల వివరణల ద్వారా తెలుసుకోవాలని యత్నించడం అవివేకమని వాయిదా వేస్తున్నాను.
మరొక్క సారి కృతజ్ఞతలతో
భవదీయుడు
సాయి బ్రహ్మానందం గారికి
సంగీత స్వరాలను గురించి మీరు చదివిన శ్లోకం ఇదవునో కాదో తెలియదు గానీ “అమర కోశం” నాట్య వర్గులో ఈ శ్లోకాలున్నాయి :
నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ ధైవతాః
పంచమశ్చేదమీ సప్త తంత్రీ (సంభవ నిస్వనాః)
షడ్జం మయూరో వదతి గావస్త్వృషభ భాషిణః
అజావికం తు గాంధారం, క్రౌంచ క్వణతి మధ్యమం
పుష్ప సాధారణే కాలే పికః కూజతి పంచమం
ధైవతం హేషతే వాజిః నిషాదం బృంహతే గజః
భావం సులభ గ్రాహ్యం మీరు చెప్పిందే గనుక వివరించను.
భవదీయుడు
పునరపి గురించి Lakshmi అభిప్రాయం:
05/18/2009 6:50 am
Nice story. This is something that happens in many families. I wish at least stories like this makes us think and understand the realities of life. Both husband and wife should understand their partner’s significance and should walk together in the long journey of life…….
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/17/2009 8:32 pm
వేమూరి గారి అభిప్రాయం చదివి ఆశ్చర్యపోయాను. తెలుగులో భాషాపరమైన డిగ్రీ ఏదీ లేకుండానే ఆయన నలుగురికీ ఉపయోగపడే నిఘంటువు నొకదానిని నిర్మించారు. మరి ఎవరో ఏదో అంటారని భయపడి శైలి మిద రాసిన పుస్తకాన్ని అచ్చువెయ్యకపోవడమేమిటి? అనుభవజ్ఞులు కూడా ఇలా వెనుకంజ వెయ్యడం చాలా నిరాశ కలిగిస్తుంది.
ఇక్కడ ప్రస్తావించిన – రంగనాయకమ్మ, బూదరాజు, దుర్గెంపూడి ల – పుస్తకాలు చెప్పుకోదగ్గవే కాని, అవేవీ, ఒంటిగా కానీ జమిలిగా కానీ, క్లుప్తత, సమగ్రత లలో Strunk and White కి సాటిరావు. కావాలంటే, “Elementary Principles of Composition,” కి సమాంతరమైనది ఈ పుస్తకాలలో ఏమైనా ఉందేమో చూడండి. వారి ప్రయత్నం ఎంతో మెచ్చుకోదగ్గదే అయినా, దానిని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
అఫ్సర్ గారి లాంటి విద్యావేత్తలు, అలాంటి పుస్తకాలకి ఆదరణ ఉంటుందా లేదా అని అనుమాన పడకుండా, వాటి అవసరాన్ని గుర్తించి దానినో కర్తవ్యంగా తీసుకొని రాయాలి. ఫ్రొఫెసర్ Strunk చేసిందదే.
కొడవళ్ళ హనుమంతరావు
కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
05/16/2009 1:51 pm
గొంతునుబట్టి మగవారికి ఒకటి, లేదా రెండు శ్రుతులు సరిపోతాయి.
స్వరస్థానాలను షడ్జమంతో పోల్చడం ద్వారా రాగాలను గుర్తుపడతాం. ఉన్న పన్నెండు (లేక పదహారు) స్వరాల్లో ఏవేవి, ఎటువంటి వరసలో వినిపిస్తున్నాయనేదాన్నిబట్టి రాగాల పేర్లను చెపుతాం. దీన్ని నేను డిజిటల్ పద్ధతి అంటాను. చాలామంది అదే రాగంలో తమకు తెలిసిన పాటతో (సినిమాపాట అయినా సరే) పోల్చి చూసుకుని చెప్పేస్తారు. ఇది ఎనలాగ్ పద్ధతి. ఇందులో స్వరాలను నిర్దుష్టంగా గుర్తించడం జరగకపోవచ్చు.
మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి mOhana అభిప్రాయం:
05/16/2009 12:30 pm
సదసత్కళా… పద్యంలో మరొక దానిని గమనించవచ్చును. అదేమంటే ఆ స్వరాల పాదాలు వచ్చేదానికి ముందు ఆ స్వరాలు కూడా నేపథ్యంలో వినబడుతాయి. నాకు తెలిసిన ఇలాటి అంశమున్న మరొక పాట – మలయమారుత అనే కన్నడ చిత్రంలో వల్లభాచార్యుల మధురాష్టకములో ప్రతి శ్లోకానికి ముందు సరిగమపధనిస స్వరాలు వస్తాయి. దీన్ని వాణీ జయరాం పాడగా బాలసుబ్రహ్మణ్యం ఊకొడుతారు. పాడబడిన మధురాష్టకాలలో ఇది చాలా మధురమైనది.
విధేయుడు – మోహన
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి afsar అభిప్రాయం:
05/16/2009 11:58 am
అనేక వెబ్ పత్రికలు, ఇతర కొత్త ప్రచురణ సాధనాలు పెరుగుతున్న ఈ కాలంలో తెలుగులో వొక శైలీ పుస్తకం చాలా అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే విలువయిన వ్యాసం రాసినందుకు వేలూరి గారికి ధన్య వాదాలు. రచన – సృజనాత్మకమయినా, విమర్శ నాత్మకమయినా – కొన్ని సూత్రాలకు, నియమాలకు కట్టుబడి వుండడం వల్ల రచనకి అది బలమే. తెలుగు వాళ్లు సహజంగా ఆవేశజీవులు, ఆగ్రహ భావుకులు. విపరీతంగా పొగడ్డమో, తెగడ్డమో అలవాటయిన వాళ్లం. అందుకే, విమర్శ పేరిట వచ్చే చాలా రచనలు చివరికి కేవలం అర్ధ రహితమయిన ప్రశంసలుగా మిగిలిపోతుంటాయి. ఇక తెగడ్డం తూలనాడ్డంతో సరితూగుతుంది.
రాత అనేది సాధనతో సాధించుకునే విద్య. అది అచ్చు కావడానికి ముందే నలుగురు చదవడం వల్ల, నాలుగు మాటలు సరిదిద్దుకోవడం వల్ల మెరుగుపడుతుంది. తెలుగులో ఈ సాంప్రదాయం లేదు. చదివిన నలుగురూ మెచ్చుకుని తీరాలన్న పసితనపు ఉబలాటం తప్ప. పొరపాటున ఎవరయినా వేరే అభిప్ర్రాయం వ్యక్తం చేస్తే, ఇక ఆ వ్యక్తిని మన చదువరుల జాబితాలోంచి తీసి పడేస్తాం. దిద్దుబాట్లు, సరిదిద్దుబాట్లు మనకి నచ్చేలా వుండాలి. తెలుగు రచయితలు, కవులు చాలా మటుకు నిరంకుశ అధికారాల్ని కోరుకుంటారు. కొన్ని తరాలుగా ఇవి మొద్దు బారిన చర్మాలు. వీటి మీద చర్నాకోల లాంటి పదాలూ, వాక్యాలు తప్ప ఇంకేవీ పనిచెయ్యవు. అందుకే, సున్నితమయిన శైలీ పుస్తకాలు ఇక్కడ పనికి రావు.
తెలుగులో అచ్చు అనేది అచ్చోసిన ఆంబోతు లాంటిది. మనకి అచ్చు యంత్రాలు వచ్చాయి గాని, అచ్చు నియమాలు ఏమీ రాలేదు. అచ్చుకి సంబంధించిన భౌతిక ఏర్పాట్లు తప్ప నిజంగా అచ్చు సంస్కృతి రాలేదు. ఆ మాట కొస్తే, తొలి తరం ప్రచురణ కర్తలకి వున్న పాటి సంస్కృతి కూడా ఇవాళ మిగల్లేదు. ఒక రచన అచ్చుకి పంపడానికి ముందు ఏ ఏ దశలు అవసరమో ఆ ఆ దశల పట్ల మనకి శ్రద్ధ లేదు. అందుకే, రంగుల మయంగా కనిపించే ఇవాళ్టి ప్రచురణల కన్నా, ఆ నాటి వావిళ్ల, దేశి, ఆదర్శ, దక్షిణ భాషా సంస్థ ప్రచురణలు అందంగా కనిపిస్తాయి. ఆ అందం వాటి భౌతికత నించి రాలేదు, నిస్సందేహంగా అవి పాటించిన శైలీ నియమాల నించి వచ్చిందే అనుకుంటాను. అచ్చు తప్పులు లేక పోవడం కూడా ఆ నియమాల్లో భాగమే. ముందు తరాల సంపాదకులకు కూడా శైలి పట్ల ఆ గౌరవం వుండేది. ఈ తరంలో ఆ గౌరవాన్ని నిలిపే సంపాదకులు లేరు. అసలు సంపాదకుడి పాత్ర మీదనే ఇప్పుడు గౌరవం లేదు. ముఖ్యంగా అచ్చు గౌరవాన్ని పోగొట్టడంలో తెలుగు దిన పత్రికల పాత్ర పెద్దది. తెలుగు దిన పత్రికలన్నిటికీ నిజానికి శైలీ పుస్తకాలున్నాయి. అవి ఎవరూ పాటించిన పాపాన పోరు. అసలు అక్షరం ముక్క రాయడం వస్తే చాలు అనే స్థితికి దిన్ పత్రికల మార్కెట్ దిగజారి పోయినప్పుడు నిజమే, శైలి ఆందని ద్రాక్ష పండు మాత్రమే ! ఇప్పుడు సాహిత్యాన్ని పోషించేది కూడా ఈ దిన పత్రికలే కాబట్టి, సాహిత్య శైలి కూడా అంతే!
ఈ స్థితిలో వేలూరి వ్యాసం ఒక చూపుడు వేలు. అది కొందరి కళ్ళల్లో గుచ్చుకోవడం సహజమే! కాని, కాస్త నిగ్రహంగా ఆలోచిస్తే, ఈ వేలు ఒక మంచి రచనా సంస్కృతి వైపు దారి చూపిస్తుంది. మంచి ఆలోచనల్ని అక్షరాల్లోకి అనువదించే మంచి రాత ఆ సంస్కృతికి పునాది. ఇది నేర్చుకుంటే వచ్చేది తప్ప సహజ పాండిత్యం మాత్ర) కాదు. ఆ మాటకొస్తే, సహజ పాండిత్యం ఒక ఆత్మ వంచన, భ్రమ. అలా నేర్చుకోవడానికి మన తెలుగు వాళ్లు సిద్ధంగా వున్నారా అన్నది ప్రశ్న. అసలు నేర్చుకోవడం అనే ప్రక్రియ మీద మనకి గౌరవం వుందా? ఆ గౌరవం లేకపోతే , రాత నియమాలు మనకి పనికి రావు.
రెండో పాత్ర గురించి M.S.Prasad అభిప్రాయం:
05/15/2009 11:50 pm
చాలా బాగుంది. వచన కవితలు కూడా వాటిని అణుమాత్రమూ ఇష్టపడని అరసికుల మనసులను అలరింపచేయగలవని ఇటువంటి కొన్ని కవితలు ఋజువు చేస్తాయి.
భవదీయుడు
కీబోర్డ్ మీద రాగాలు గురించి M.S.Prasad అభిప్రాయం:
05/15/2009 11:33 pm
రోహిణీ ప్రసాద్ గారికి
మీ సద్యో ప్రత్యుత్తరానికి కృతజ్ఞతలు. స్వరాలను రాగాలను ర్తించే మార్గాన్ని గురించిన నా సందేహానికి సమాధానం అందులో నాకు లభించలేదు. అర్ధం చేసుకొనేంత పరిజ్ఞానం లేక పోవడం కారణమేమో నని భావిస్తాను. G (ఐదో శృతి) ఆధార శృతిగా స్త్రీ కంఠస్వరాలకుంటుందని తెలిపారు. 1956-57 లో
మా అక్కకు సంగీతం నేర్పిస్తున్నప్పుడు నేను ప్రక్కనుండి నేర్చుకున్నాను గనుక ఈ శృతి నేర్పివుండవచ్చు. మగవారికి ఏ రేంజిలో వుంటుందో తెలుపరా?
భవదీయుడు
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి నాగమురళి అభిప్రాయం:
05/15/2009 11:44 am
Astro Master garu,
I am pleasantly surprised to know that you are familiar with the person and have had similar experiences.
Thank you very much for your comment. It gives me a lot of encouragement to know that you have enjoyed the articles.
Regards,
Nagamurali.
కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
05/15/2009 5:19 am
ప్రసాద్ గారూ,
సిద్ధాంతరీత్యా ఏ సంగీతానికైనా ఆధారశ్రుతి ఏమిటో తెలియకపోతే రాగం పేరు చెప్పడం అసాధ్యం. అందుకే భారతీయ సంగీతంలో తంబురావంటిది మోగుతూ ఉంటుంది. లేకపోతే హిందోళం పాడుతున్నప్పుడు మోహన, శుద్ధసావేరి, మధ్యమావతి, శుద్ధధన్యాసి రాగాల్లో ఏదైనా అనుకుని పొరబడే అవకాశం ఉంటుంది. నల్లమెట్లనే ఉపయోగించి ఈ అయిదింటినీ వినిపించవచ్చని నేను వ్యాసంలో సూచించాను. సిద్ధాంతరీత్యా అని ఎందుకన్నానంటే ఇవన్నీ ప్రసిద్ధరాగాలు కనక స్వరాలమధ్యనున్న సంబంధాలను బట్టి శ్రుతి మోగకపోయినా వాటిని గుర్తుపట్టగలం కనక.
సెహెరా సినిమాలో లతా పాడిన పంఖ్ హోతే తో ఉడ్ ఆతీరే అనే పాట విషయంలో సరిగ్గా ఇదే అనుమానం వస్తుంది. తుహే దిల్ కా దాగ్ దిఖ్ లాతీరే అని అంటున్నప్పుడు చివరి స్వరం షడ్జమం అని సంగీత దర్శకుడి ఉద్దేశం కాబోలు. అది ధైవతం అని మనం అనుకుంటే హిందోళం అవుతుంది.
దేన్నైనా వాయిస్తున్నప్పుడు ఆధారశ్రుతి (షడ్జమం) ఏదో మనం నిర్ణయించుకోవాలి. ఆ తరవాత రాగం పేరు చెప్పడం తేలికే. మీరు జి (అయిదు శ్రుతి) ఆధారశ్రుతిగా నేర్చుకున్నట్టున్నారు. అది స్త్రీల గాత్రానికి పనికొస్తుంది; మగవారికి కాదు.
స అనేది ఫ్లోటింగ్ స్వరం. రాగాలన్నీ సరిగమల మీద ఆధారపడతాయి; శ్రుతిమీద కాదు. ఒకే రకం భవనాన్ని పల్లంలోనూ, మిట్టమీదా నిర్మించినట్టు ఒకే రాగాన్ని ఏ శ్రుతిలోనైనా వినిపించవచ్చు. తమాషా ఏమిటంటే రాగాలను గుర్తుపట్టేవారు స్వరాల తరవాత గమనించేది వాటిమధ్య గల గమకాలనూ, సంబంధాలనే. Characteristicగా ఉండేవి అవే.