కావ్యకంఠ గణపతిముని
జీవిత విశేషాలు
కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధుడైన అయల సోమయాజుల గణపతిశాస్త్రి (1878-1936) తెలుగువాడే అయినా, తెలుగువాళ్ళకి ఈయన గురించి పెద్దగా తెలియదు. ఆయన తన జీవితకాలంలో సింహభాగం తమిళదేశంలోనూ, కన్నడదేశంలోనూ, కొంకణ ప్రాంతాలలోనూ ఎక్కువగా గడిపాడు. ఆయన రచనలన్నీ సంస్కృతంలోనే జరిగి, వాటిలో కొన్ని మాత్రమే తెలుగులో వచ్చాయి. 1900 సంవత్సరంలో, నవద్వీపంలో జరిగిన విద్వత్పరీక్షలలో పాల్గొని, అక్కడి వారందరినీ తన కవిత్వంతో, పాండిత్యంతో మెప్పించి కావ్యకంఠ బిరుదు పొందాడు. ఉమాసహస్రం, రమణగీత, ఇంద్రాణీ సప్తశతి, సద్దర్శనం మొదలైన కావ్యాలని రచించాడు.