శ్రీనివాస్ వురుపుటూరి


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

 

మహాభారతంలో పాత్రలను వాడుకున్నా ఈ నాటకపు కథ స్వతంత్రమైన కల్పనే. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకును వదులుకోవాల్సిన క్లిష్టపరిస్థితి ఏర్పడ్డప్పుడు తల్లిదండ్రులు రెండవ కొడుకును వదులుకునేందుకు సిద్ధపడడం అనే ఊహకు, ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించే శునశ్శేఫుడి కథకు సామ్యం కనిపిస్తుంది.

‘ఈ నాటకాలన్నింటినీ ఒకే రచయిత వ్రాసాడా, అనేకులా?’, ‘ఒకే రచయిత అయిన పక్షంలో, ఆ రచయిత భాసుడేనా?’, ‘ఇప్పుడు లభ్యమవుతున్న కృతులన్నీ మూలకృతులేనా, లేక అంతకు మునుపు వ్రాయబడ్డ కృతులకు అనుసరణాలా?’ వంటి ప్రశ్నలపై పెద్దయెత్తున వివాదాలు చెలరేగాయి. ఆంగ్లంలో, భారతీయభాషల్లో ఈ విషయమై వేల కొలది పుటల్లోకి విస్తరించిన చర్చోపచర్చలను ‘భాససమస్య’గా వ్యవహరిస్తారు.

స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.