రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మన ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి.
జయంతన్
జీవిత విశేషాలు
ప్రఖ్యాత తమిళ రచయిత జయంతన్ మూడు నవలలు, ఎన్నో కథలు, నాటకాలు రచించి తమిళ సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించారు. మధ్య తరగతి వర్గానికి చెందిన కుటుంబంలో పుట్టి పెరిగిన మనిషిగా సగటు మనుషుల ప్రవర్తనను విశ్లేషిస్తూ ఆయన రాసిన కథలు ఇప్పటికీ పాఠకులను అలరిస్తున్నాయి. అన్యాయాన్ని ఎదిరించలేని సగటు మనిషి పిరికి తనం, అట్టడుగు తరగతి మనుషుల ప్రవర్తన జయంతన్ గారి కథలలో ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. జయంతన్ గారి బోడి అన్న అనువాద కథ కౌముదిలో ఏప్రిల్ 2009లో వచ్చింది. ‘వానం ఉనదు’ అన్న నాటకానికి ఆల్ ఇండియా రేడియోలో మొదటి బహుమతి లభించింది.