(మల్లంపల్లి శరభేశ్వరశర్మగారి వ్యాఖ్యనుండి)
మాధుకరవృత్తి
మధుకరమునకు (తుమ్మెదకు) సంబంధించిన వర్తనము (జీవనము)
ఒక్కొక్క పువ్వునుండి ఒక్కొక్క తేనెబిందువును తుమ్మెదసేకరించినట్లు ఒక్కొక్క యింటినుండి ఒక్కొక్క యన్నకబళమును మాత్రమే పరిగ్రహించుట పేరు మాధుకరవృత్తి.
మీరు మరిచిపోయారో, రాయటం మంచిదికాదో అని మానేసారో తెలియలేదు. మీరు బ్రాహ్మల భిక్షాటన ప్రస్తావించలేదు.
వేదం, శాస్త్రం, వ్యాకరణం, చదువుకోని బ్రాహ్మలు (అంటే వైదీకుల్లో ఒక శాఖ వాళ్ళు: వీళ్ళని కొన్ని ప్రాంతాలలో మురికినాడులని కూడా పిలవటం కూడా కద్దు) పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం, వగైరా బట్టీపట్టి, ప్రొద్దున్నే ఇతర బ్రాహ్మల ఇంటి ముందు కొచ్చి, అవి వల్లించి, ‘భిక్షాం దేహి’ అని అడుక్కునే వాళ్ళు. బామ్మో, అమ్మో, ఒక గుప్పెడు బియ్యం ఆ బాపనాయన జోలెలో వేసేవాళ్ళు.
వాళ్ళ వెనకాలే నిలబడి, ఎందుకూ పనికిరాని నియోగులు కూడా అడుక్కునేవాళ్ళట! ఆయితే, ఎంతైనా ‘నియోగి’ భేషజం కదా! అందుకని, ‘ఏవమ్మోయ్. ఆచేత్తోనే నాక్కూడా ఓ గుప్పెడు బియ్యం పారెయ్యి’ అని అడుక్కునేవాళ్ళని చదువుకున్న వైదీకులు వేళాకోళం చెయ్యటం మాచిన్నప్పుడు విన్నాను.
మీరు బాగా చిన్నవాళ్ళు కదా, మీరు విని వుండకపోవచ్చు. ఇప్పుడు మీ ముష్టి కథనం ముగింపు సవ్యంగా గుండ్రంగా ముగుస్తుంది.
“ఇప్పటి తమిళనాడులో, ఒకప్పుడు జరిగిన పారులెదిరింపు ఎసవులో (ఉద్యమంలో), ఎక్కువగా దెబ్బతినింది తెలుగు పౌరులే (బ్రాహ్మణులే). ఊళ్ళకు ఊళ్ళు, ఇళ్ళకు ఇళ్ళు వదిలేసి నగరాలకు వలసపోయింది తెలుగు వైదికులే. ఇప్పటికీ కావేరి ఒడ్డునున్న మేల్గేరులలో అంతో ఇంతో తమిళ పారులు ఉన్నారు కానీ, తెలుగువారిని వెతికివెతికి పట్టుకోవాలి.”
లైలా గారూ: ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! మీరు ఎప్పుడు ఏది రాసినా అది చక్కగా వుంటుంది. చదవబుద్ధి అవుతుంది.
నన్నెచోడునిపై వ్యాసంలో జె. కె. ఎమ్.గారు, క్రౌంచ అంటే హెరొన్ (heron) అని రాశారు. హెరొన్ల ముక్కులు, కాళ్ళూ పొడుగ్గా వుంటాయి. పరగల ముక్కు, కాళ్ళూ, పొట్టిగా వుంటాయి. పరగపిట్ట మన గుప్పిట్లో ఇముడుతుంది; అంత చిన్నది!
అందుచేత, మా సూర్యనారాయణరాజు అప్పటో మాకు విందుల్లో పెట్టే పిట్టలు పరగలు (పోనీ పరిగలు అందాం, శాయిగారికి కోపం రాకండా!) అనే నేను నిర్థారించుకుంటున్నాను.
ధన్యవాదాలు
వేలూరి వేంకటేశ్వర రావు.
ఆలిస్ మన్రో గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:
07/18/2024 1:46 pm
కెనడా రచయిత్రి గురించి వేలూరిగారి లఘు టిప్పణి బావుంది. ఈ సందర్భంగా, కొడవళ్ళ హనుమంతరావుగారు ప్రస్తావించిన విషయాలు విలువైనవి. కేవలం రచన గొప్పదైతే చాలా? రచయిత జీవితం కూడా గొప్పది కావాలా? ఈ చర్చ పాతదే ఐనా మళ్ళీ ప్రస్తావనకు రావడం మంచిదే.
ఇంకొక విషయం కథా రచనలో చర్చనీయాంశం: వాతావరణ కల్పన – వాతావరణ వర్ణన – మన తెలుగులో అధికులది – బుచ్చిబాబు, రావిశాస్త్రి గార్లతో సహా పాత పద్ధతే. అంటే వారికి తెలిసినది వర్ణన, కల్పన కాదు. ఈ సందర్భంగా -గుమ్మడిదల రంగారావుగారి అభ్యంతరం ఎన్నదగినదే.
గతంలో – అంటే ముప్ఫై ఏళ్ళ క్రింద నేను మన తెలుగు కథారచన మీద చిన్నపాటి పరిశోధన చేపట్టాను, తెలుగులో గురజాడ మొదలుగా వచ్చిన మూడు తరాల కథలను – విమర్శనా దృష్టితో చదివి – నాకు ఒక కథ ఎందుకు నచ్చిందో, నచ్చలేదో ఆ కారణాలను గుర్తుంచుకునేవాడిని. అప్పట్లో ఇతర భాషల్లో వచ్చిన కథలను ఇబ్బడి ముబ్బడిగా చదివి నచ్చిన కొన్ని కథలను అనువాదం సైతం చేసేవాడిని. ఆ క్రమంలో – ఒక కథ ఎందుకు నచ్చుతోంది. ఒక కథ ఎందుకు నచ్చడం లేదు అన్న ఆలోచన మొదలైంది. నాకు జూడగా – “కవిత్వానికి రూపం లాంటిది కథకు వాతావరణం; ప్రతి కవితకూ ఒక రూపం ఉన్నట్టే, ప్రతి కథకు ఒక వాతావరణం ఉంటుంది. కవితకు ఒక నిర్దిష్ట ఆకృతిని ప్రసాదిస్తుంది దాని రూపం, అలాగే,కథ రూపు రేఖలను నిర్ణయించేది దాన్ని వ్యక్తపరుస్తున్న వాతావరణమే.” (కథ-వాతావరణం)
వాతావరణ కల్పన అంటే ఏమిటో తెలుసు కాబట్టే Alice Munro కింది ఉదహరించిన వాక్యం రాయగలిగింది.
“Sand was stinging their faces and the waves delivered crashing loads of gravel at their feet.”
ఈ ఎఱుక లేని కారణంగానే – కొడవళ్ళగారు అనుమానించినట్టు “బుచ్చిబాబు చివర అలా ఒక్క వాక్యంతో వర్ణన వదిలేవాడు కాదేమో.”
కథకుడు వాతావరణాన్ని కల్పించాలి – వర్ణనకు దిగబడరాదు. ఈ విషయంలో ఆసక్తి గల పాఠకులు “కథ -వాతావరణం”, “కథన కుతూహలం” అన్న వ్యాసాలు (నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు (2004)) చదవగలరు.
ఇక కథకురాలి కూతురి వ్యధ – తల్లి ప్రపంచం పట్టనంత రచయిత్రి అయినా నికృష్టుడైన సవతి తండ్రి బారినుండి సొంత కూతురిని కాపాడలేక పోయింది. కాపాడటం అటుంచి, కూతురి ఆవేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవి ఒక తరహా Narcissistic Personality Disorder (NPD) పోకడలు – కొందరు గొప్ప రచయితల్లో , వ్యక్తుల్లో గమనించవచ్చు. NPD పరిశోధనలు ఇటీవలి కాలంలో అందరికీ తెలిసివచ్చాయి, గతంలో ఇటువంటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టంగా ఉండేది.
I enjoyed Eluri Rajah’s friend Veluri’s essay and the subsequent discussions on Krauncha birds. Being a Floridian I get to see these birds. “తెల్లని కొంగలు బారులు బారులు, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, అవిగో అవిగో అవిగో…” is an everyday thing for us.
క్రిందిది ఒక క్రౌంచపదము.
నిల్చితి నెంతో ఓర్పుతొ నేనొక్క అలతిపదమునె ఇలనిడి; నిల్చీ
కొల్చితి నన్ని క్రౌంచమునై వెంచల జలముల నడుమలను మహేశా!
తల్చితి నిన్నే కూరిమితో రేలు పవలనవరతము నిరతి; ఏమో?
గెల్చితినేమో నీ హృది నా దేశి తెలుగు వలపుల పలుకుల నీశా!
క్రౌంచపదము అను ఒక వృత్త ఛందస్సును గురించి ‘ఈమాట’ పత్రికలో జె.కె. మోహనరావు, ‘నన్నెచోడుని క్రౌంచపదము’ అన్న వ్యాసములో (మార్చ్ 2009) తెలిపారు. రచ్చబండ యాహూ గ్రూప్స్ లో కూడ చర్చించారు. ఆ చెప్పిన చదువు మూలాన; భ మ స భ న న న య గణములు కలిగి, పాదానికి 24 అక్షరములు ఉన్న ఈ క్రౌంచపదము ఎప్పుడోగాని నేను రాసాను. ఐతే నాకు చేతకానందున తెలిపిన యతులు, పదముల విరుపులు ఉంచలేదు. ఆ హంగులు లేకున్నా మరే విధమైన లొసుగులున్నాగాని, ఈ పద్యము అందమైనది అని నా భావన. ఎందువలనంటే ఈ పద్యంలో శివదీక్షాపరురాలైన పార్వతి; శివగాథలు తలుస్తూ ఒక కావ్యాన్ని శివునికి అర్పించిన నన్ని కవి; ఒంటికాలి జపం చేస్తున్న ఒక తెలుగు కొంగ ఉన్నట్టు నాకు తోస్తున్నది. అందువలన.
Dear Hamumantha Rao garu: I just looked into Andrea Skinner. Sad. Very sad. I am sure the other biographies would not have mentioned about the sad experience of Skinner. Now, I will read Munro’s stories only, whenever I can. Regards, v r veluri.
మంచి సమీక్ష. కథలు చదవాలనిపించేలా ఉంది. అనిల్ గారికి అభినందనలు. నిశ్శబ్దంగా రాసే రచయితను మనమే వెతికి పట్టుకోవాలి. విలువైన వాక్యం. రచయిత, రచనలకు ఆరోగ్యకరమైన ధోరణిని పిచ్చేశ్వరరావు గారు తన ఆచరణ ద్వారా అందించారు.
తిక్కన భాషలోని అనేకానేక విశేషాలు వెలువడటానికి కృష్ణమూర్తిగారు తిక్కనపై జరిపిన ప్రత్యేక అధ్యయనం ఒక కారణమైతే, తిక్కన పదప్రయోగకోశ సహకారం రెండవది. ఈ వ్యాసంలో భాషావిశేషాలతోపాటు తిక్కన కవితావ్యక్తిత్వాన్ని కూడా కృష్ణమూర్తిగారు ఎత్తిచూపారు. కృష్ణమూర్తిగారు గొప్ప భాషాశాస్త్రవేత్తేకాదు, గొప్ప సాహిత్యవిమర్శకులు అనటానికి ఈ వ్యాసం ఉపకరిస్తుంది. నా అవగాహనలో సాహిత్యాన్ని, భాషను సమతూకంగా అధ్యయనం చేసిన ఏ పండితులైనా భావితరాలకు ఉపయుక్తగ్రంథంగా నిలుస్తారనటానికి కృష్ణమూర్తిగారికి మించిన ఉదాహరణ ఉండదని చెప్పవచ్చు.
ముష్టి పలురకములు గురించి VSTSayee గారి అభిప్రాయం:
07/21/2024 2:51 pm
వ్యాసుడు – కాశి – మాధుకరవృత్తి
త్రిషవణస్నానంబుఁ దీర్చు భాగీరథి – శివధర్మములు చెప్పు శిష్యతతికి
నుదరపోషణము సేయును మాధుకరవృత్తి – లింగార్చనంబుఁ గల్పించు నియతి
ముక్తిమంటపమధ్యమునఁ బురాణము సెప్పుఁ – బంచాక్షరంబు జపంబు సేయు
భూతి సర్వాంగీణముగ సముద్ధూళించు – ధరియించు రుద్రాక్షదామకములు
శ్రుతులు నాల్గు నేర్పఱిచిన సూక్షబుద్ధి
బ్రహ్మసంవేది యాదిపురాణకర్త
భారతాఖ్యానసంహితా ప్రథమసుకవి
గంధవతిపట్టి యానందకాననమున. (కాశీఖండము: సప్తమాశ్వాసము-128)
(మల్లంపల్లి శరభేశ్వరశర్మగారి వ్యాఖ్యనుండి)
మాధుకరవృత్తి
మధుకరమునకు (తుమ్మెదకు) సంబంధించిన వర్తనము (జీవనము)
ఒక్కొక్క పువ్వునుండి ఒక్కొక్క తేనెబిందువును తుమ్మెదసేకరించినట్లు ఒక్కొక్క యింటినుండి ఒక్కొక్క యన్నకబళమును మాత్రమే పరిగ్రహించుట పేరు మాధుకరవృత్తి.
ఆలిస్ మన్రో గురించి Ranga Rao గారి అభిప్రాయం:
07/20/2024 8:49 pm
గౌరవనీయులైన వేలూరి వారికి అభివాదములు! బతుకుదెరువు కోసం గడిపిన ముప్పై ఏళ్ళ రచనా జీవితంలో తెలుసుకున్న సత్యం అది!
ముష్టి పలురకములు గురించి V R Veluri గారి అభిప్రాయం:
07/20/2024 5:12 pm
అయ్యా శర్మ గారూ:
మీ ముష్టి కథనం పూర్తిగా చదివాను. బాగా రాశారు.
మీరు మరిచిపోయారో, రాయటం మంచిదికాదో అని మానేసారో తెలియలేదు. మీరు బ్రాహ్మల భిక్షాటన ప్రస్తావించలేదు.
వేదం, శాస్త్రం, వ్యాకరణం, చదువుకోని బ్రాహ్మలు (అంటే వైదీకుల్లో ఒక శాఖ వాళ్ళు: వీళ్ళని కొన్ని ప్రాంతాలలో మురికినాడులని కూడా పిలవటం కూడా కద్దు) పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, వర్జ్యం, వగైరా బట్టీపట్టి, ప్రొద్దున్నే ఇతర బ్రాహ్మల ఇంటి ముందు కొచ్చి, అవి వల్లించి, ‘భిక్షాం దేహి’ అని అడుక్కునే వాళ్ళు. బామ్మో, అమ్మో, ఒక గుప్పెడు బియ్యం ఆ బాపనాయన జోలెలో వేసేవాళ్ళు.
వాళ్ళ వెనకాలే నిలబడి, ఎందుకూ పనికిరాని నియోగులు కూడా అడుక్కునేవాళ్ళట! ఆయితే, ఎంతైనా ‘నియోగి’ భేషజం కదా! అందుకని, ‘ఏవమ్మోయ్. ఆచేత్తోనే నాక్కూడా ఓ గుప్పెడు బియ్యం పారెయ్యి’ అని అడుక్కునేవాళ్ళని చదువుకున్న వైదీకులు వేళాకోళం చెయ్యటం మాచిన్నప్పుడు విన్నాను.
మీరు బాగా చిన్నవాళ్ళు కదా, మీరు విని వుండకపోవచ్చు. ఇప్పుడు మీ ముష్టి కథనం ముగింపు సవ్యంగా గుండ్రంగా ముగుస్తుంది.
వేలూరి వేంకటేశ్వర రావు.
కలుపుకొంటే కలుపుకొన్నంత గురించి ఉరుపుటూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
07/20/2024 12:13 pm
చిన్న సవరణ
“ఇప్పటి తమిళనాడులో, ఒకప్పుడు జరిగిన పారులెదిరింపు ఎసవులో (ఉద్యమంలో), ఎక్కువగా దెబ్బతినింది తెలుగు పౌరులే (బ్రాహ్మణులే). ఊళ్ళకు ఊళ్ళు, ఇళ్ళకు ఇళ్ళు వదిలేసి నగరాలకు వలసపోయింది తెలుగు వైదికులే. ఇప్పటికీ కావేరి ఒడ్డునున్న మేల్గేరులలో అంతో ఇంతో తమిళ పారులు ఉన్నారు కానీ, తెలుగువారిని వెతికివెతికి పట్టుకోవాలి.”
పౌరులు కాదు, పారులు.
[కృతజ్ఞతలు – సం.]
మరల రామాయణంబదేల… గురించి V R Veluri గారి అభిప్రాయం:
07/18/2024 6:21 pm
లైలా గారూ: ఎన్నాళ్ళకెన్నాళ్ళకి! మీరు ఎప్పుడు ఏది రాసినా అది చక్కగా వుంటుంది. చదవబుద్ధి అవుతుంది.
నన్నెచోడునిపై వ్యాసంలో జె. కె. ఎమ్.గారు, క్రౌంచ అంటే హెరొన్ (heron) అని రాశారు. హెరొన్ల ముక్కులు, కాళ్ళూ పొడుగ్గా వుంటాయి. పరగల ముక్కు, కాళ్ళూ, పొట్టిగా వుంటాయి. పరగపిట్ట మన గుప్పిట్లో ఇముడుతుంది; అంత చిన్నది!
అందుచేత, మా సూర్యనారాయణరాజు అప్పటో మాకు విందుల్లో పెట్టే పిట్టలు పరగలు (పోనీ పరిగలు అందాం, శాయిగారికి కోపం రాకండా!) అనే నేను నిర్థారించుకుంటున్నాను.
ధన్యవాదాలు
వేలూరి వేంకటేశ్వర రావు.
ఆలిస్ మన్రో గురించి తమ్మినేని యదుకులభూషణ్ గారి అభిప్రాయం:
07/18/2024 1:46 pm
కెనడా రచయిత్రి గురించి వేలూరిగారి లఘు టిప్పణి బావుంది. ఈ సందర్భంగా, కొడవళ్ళ హనుమంతరావుగారు ప్రస్తావించిన విషయాలు విలువైనవి. కేవలం రచన గొప్పదైతే చాలా? రచయిత జీవితం కూడా గొప్పది కావాలా? ఈ చర్చ పాతదే ఐనా మళ్ళీ ప్రస్తావనకు రావడం మంచిదే.
ఇంకొక విషయం కథా రచనలో చర్చనీయాంశం: వాతావరణ కల్పన – వాతావరణ వర్ణన – మన తెలుగులో అధికులది – బుచ్చిబాబు, రావిశాస్త్రి గార్లతో సహా పాత పద్ధతే. అంటే వారికి తెలిసినది వర్ణన, కల్పన కాదు. ఈ సందర్భంగా -గుమ్మడిదల రంగారావుగారి అభ్యంతరం ఎన్నదగినదే.
గతంలో – అంటే ముప్ఫై ఏళ్ళ క్రింద నేను మన తెలుగు కథారచన మీద చిన్నపాటి పరిశోధన చేపట్టాను, తెలుగులో గురజాడ మొదలుగా వచ్చిన మూడు తరాల కథలను – విమర్శనా దృష్టితో చదివి – నాకు ఒక కథ ఎందుకు నచ్చిందో, నచ్చలేదో ఆ కారణాలను గుర్తుంచుకునేవాడిని. అప్పట్లో ఇతర భాషల్లో వచ్చిన కథలను ఇబ్బడి ముబ్బడిగా చదివి నచ్చిన కొన్ని కథలను అనువాదం సైతం చేసేవాడిని. ఆ క్రమంలో – ఒక కథ ఎందుకు నచ్చుతోంది. ఒక కథ ఎందుకు నచ్చడం లేదు అన్న ఆలోచన మొదలైంది. నాకు జూడగా – “కవిత్వానికి రూపం లాంటిది కథకు వాతావరణం; ప్రతి కవితకూ ఒక రూపం ఉన్నట్టే, ప్రతి కథకు ఒక వాతావరణం ఉంటుంది. కవితకు ఒక నిర్దిష్ట ఆకృతిని ప్రసాదిస్తుంది దాని రూపం, అలాగే,కథ రూపు రేఖలను నిర్ణయించేది దాన్ని వ్యక్తపరుస్తున్న వాతావరణమే.” (కథ-వాతావరణం)
వాతావరణ కల్పన అంటే ఏమిటో తెలుసు కాబట్టే Alice Munro కింది ఉదహరించిన వాక్యం రాయగలిగింది.
“Sand was stinging their faces and the waves delivered crashing loads of gravel at their feet.”
ఈ ఎఱుక లేని కారణంగానే – కొడవళ్ళగారు అనుమానించినట్టు “బుచ్చిబాబు చివర అలా ఒక్క వాక్యంతో వర్ణన వదిలేవాడు కాదేమో.”
కథకుడు వాతావరణాన్ని కల్పించాలి – వర్ణనకు దిగబడరాదు. ఈ విషయంలో ఆసక్తి గల పాఠకులు “కథ -వాతావరణం”, “కథన కుతూహలం” అన్న వ్యాసాలు (నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు (2004)) చదవగలరు.
ఇక కథకురాలి కూతురి వ్యధ – తల్లి ప్రపంచం పట్టనంత రచయిత్రి అయినా నికృష్టుడైన సవతి తండ్రి బారినుండి సొంత కూతురిని కాపాడలేక పోయింది. కాపాడటం అటుంచి, కూతురి ఆవేదనను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవి ఒక తరహా Narcissistic Personality Disorder (NPD) పోకడలు – కొందరు గొప్ప రచయితల్లో , వ్యక్తుల్లో గమనించవచ్చు. NPD పరిశోధనలు ఇటీవలి కాలంలో అందరికీ తెలిసివచ్చాయి, గతంలో ఇటువంటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టంగా ఉండేది.
మరల రామాయణంబదేల… గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
07/18/2024 12:47 pm
I enjoyed Eluri Rajah’s friend Veluri’s essay and the subsequent discussions on Krauncha birds. Being a Floridian I get to see these birds. “తెల్లని కొంగలు బారులు బారులు, నల్లని మబ్బులు గుంపులు గుంపులు, అవిగో అవిగో అవిగో…” is an everyday thing for us.
క్రిందిది ఒక క్రౌంచపదము.
నిల్చితి నెంతో ఓర్పుతొ నేనొక్క అలతిపదమునె ఇలనిడి; నిల్చీ
కొల్చితి నన్ని క్రౌంచమునై వెంచల జలముల నడుమలను మహేశా!
తల్చితి నిన్నే కూరిమితో రేలు పవలనవరతము నిరతి; ఏమో?
గెల్చితినేమో నీ హృది నా దేశి తెలుగు వలపుల పలుకుల నీశా!
క్రౌంచపదము అను ఒక వృత్త ఛందస్సును గురించి ‘ఈమాట’ పత్రికలో జె.కె. మోహనరావు, ‘నన్నెచోడుని క్రౌంచపదము’ అన్న వ్యాసములో (మార్చ్ 2009) తెలిపారు. రచ్చబండ యాహూ గ్రూప్స్ లో కూడ చర్చించారు. ఆ చెప్పిన చదువు మూలాన; భ మ స భ న న న య గణములు కలిగి, పాదానికి 24 అక్షరములు ఉన్న ఈ క్రౌంచపదము ఎప్పుడోగాని నేను రాసాను. ఐతే నాకు చేతకానందున తెలిపిన యతులు, పదముల విరుపులు ఉంచలేదు. ఆ హంగులు లేకున్నా మరే విధమైన లొసుగులున్నాగాని, ఈ పద్యము అందమైనది అని నా భావన. ఎందువలనంటే ఈ పద్యంలో శివదీక్షాపరురాలైన పార్వతి; శివగాథలు తలుస్తూ ఒక కావ్యాన్ని శివునికి అర్పించిన నన్ని కవి; ఒంటికాలి జపం చేస్తున్న ఒక తెలుగు కొంగ ఉన్నట్టు నాకు తోస్తున్నది. అందువలన.
-Lyla
PS: నన్నెచోడుని కవిత్వము, పార్వతి తపస్సు గురించి ఎవరు ‘ఈమాట’ లో రమ్యంగా రచించినారంటే, ఆమె -కాశీనాథుని రాధ. (సెప్టెంబర్ 2014: పార్వతి తపస్సు: నన్నెచోడుని కుమారసంభవము). అలాగే పోతన/యశోద ను గురించిన ఆమె వ్యాసం అమ్మ గోపెమ్మ(జూలై 2012: అమ్మ గోపెమ్మ) కూడాను.
ఆలిస్ మన్రో గురించి v r veluri గారి అభిప్రాయం:
07/17/2024 3:45 pm
Dear Hamumantha Rao garu: I just looked into Andrea Skinner. Sad. Very sad. I am sure the other biographies would not have mentioned about the sad experience of Skinner. Now, I will read Munro’s stories only, whenever I can. Regards, v r veluri.
అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు గురించి బి.వి.ఎన్.స్వామి గారి అభిప్రాయం:
07/16/2024 10:26 pm
మంచి సమీక్ష. కథలు చదవాలనిపించేలా ఉంది. అనిల్ గారికి అభినందనలు. నిశ్శబ్దంగా రాసే రచయితను మనమే వెతికి పట్టుకోవాలి. విలువైన వాక్యం. రచయిత, రచనలకు ఆరోగ్యకరమైన ధోరణిని పిచ్చేశ్వరరావు గారు తన ఆచరణ ద్వారా అందించారు.
తిక్కన భారతంలో పలుకులపొందు గురించి డా. మోదుగు గారి అభిప్రాయం:
07/16/2024 2:45 am
తిక్కన భాషలోని అనేకానేక విశేషాలు వెలువడటానికి కృష్ణమూర్తిగారు తిక్కనపై జరిపిన ప్రత్యేక అధ్యయనం ఒక కారణమైతే, తిక్కన పదప్రయోగకోశ సహకారం రెండవది. ఈ వ్యాసంలో భాషావిశేషాలతోపాటు తిక్కన కవితావ్యక్తిత్వాన్ని కూడా కృష్ణమూర్తిగారు ఎత్తిచూపారు. కృష్ణమూర్తిగారు గొప్ప భాషాశాస్త్రవేత్తేకాదు, గొప్ప సాహిత్యవిమర్శకులు అనటానికి ఈ వ్యాసం ఉపకరిస్తుంది. నా అవగాహనలో సాహిత్యాన్ని, భాషను సమతూకంగా అధ్యయనం చేసిన ఏ పండితులైనా భావితరాలకు ఉపయుక్తగ్రంథంగా నిలుస్తారనటానికి కృష్ణమూర్తిగారికి మించిన ఉదాహరణ ఉండదని చెప్పవచ్చు.