ఈ కవిత కన్నా, ఇందులోని వ్యాఖ్యలు ఎంత కామెడీని పంచాయంటే, చదివి, చదివి నవ్వుకున్నాను. ఇలాంటి కవితలవల్లే కవులన్నా, కవితలన్నా జన సామాన్యంలో చాలా చులకన భావం కలగడం, సినిమాల్లో కామెడీ చెయ్యడం జరుగుతోంది.
ఎవడిక్కావాలి ఈ కవితలో అర్థం ఉందో, లేదో!!
కవితలు రాయడం అంటే పొడుపుకథలు రాయడం కాబోలు. మా చిన్నప్పుడు ఆరో తరగతి ఇంగ్లీషు పుస్తకాల్లో హింట్లు ఇచ్చి, వాటిని బట్టి కథలు రాయమనేవారు. కవితలు రాసే ఫార్మ్యులా కూడా అంతే కాబోలు.
ఈ కవితనీ, కవినీ ఎందుకు అభినందించాలంటే – ఆ కవితకి పేరడీలూ, వ్యంగ్య వ్యాఖ్యానాలు రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. అవి చాలు పాఠకుడికి కడుపు నిండడానికి. వామన మూర్తిగారూ, ప్రజాపతి గారూ, సునీల్ గారూ, అందుకోండి మా అభినందనలు.
బాబా గారు,
మీరు యదుకులభూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తర్వాత కవిత అర్థం కాకపోయినా ఏదో ఉండి ఉంటుందిలే అని అనుకున్నానన్నారు. నేను కూడా భూషణ్ గారి కవిత్వం, అతనికి కవిత్వంపై ఉన్న దృక్పథం రుచి చూడడం మూలానే, ఆ కవితలో చెప్పిన విషయం కాకుండా అంతర్గతంగా మరేదీ దాగి ఉండదని నిర్ణయించుకున్నాను!వినీల్ గారు గణితంతో చెప్పిన పోలికా, కవితలోంచి తీయడానికి ప్రయత్నించిన అర్థమూ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా అవగాహన మేరకు భూషణ్ గారు సరిగ్గా అలాటి దానికి వ్యతిరేకి! క్లుప్తత విషయంలో అతనన్నది నిజమే కాని, కవితలకి అస్పష్టతని తెచ్చి పెట్టే సాంకేతికత (symbolism) అంటే, నాకు తెలిసి భూషణ్ గారికి అసలు నచ్చదు.
చివరిగా మీరడిగిన మిలియన్ డాలర్ల ప్రశ్నకి నా రెండు సెంట్లు: మనవాళ్ళు “సహృదయత” అన్నది పాఠకుల విషయంలోనే చెప్పారు కాబట్టి, కవి హృదయాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పాఠకులదే అని నా ఉద్దేశం. అది ఎక్కువమంది పాఠకులు చెయ్యగలిస్తే ఆ కవికి ప్రాచుర్యం లభిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ఆ కవి ఒంటరిగా మిగిలిపోతాడు!
కామేశ్వర రావు గారూ – మీరు చెప్పిన అర్ధం సరి అయినదే. దానితో నాకేమీ చిక్కు లేదు. కానీ ఆ అర్ధాన్ని పద్యభావంతో అన్వయించుకోలేక పోతున్నాను.
నేను పద్యంలో చెప్పబడి ఉన్న పార్వతిని ఊహిస్తున్నాను. ఆమె చక్కనిది, తపోనిష్టచే చిక్కినది. యువతి. ఆమె తపోముద్రలో ఉన్నది. అంటే వీపు నిటారుగా పద్మాసనం దాల్చి, మణికట్లు మోకాళ్ళపై నిలిపి అరచేతులు పైకి, చూపుడువేలు, బొటనవేలు తాకించి ఉన్నది. ఈ ముద్రలో, ఉదరంపై త్రివళులు ఏర్పడే అవకాశం చాలా తక్కువ, పైగా ఈ భంగిమలో ఉదరం చదునుగా ఉండటమే కద్దు (అందరికీ కాదు కానీ చాలా మందికి:) అందులో చక్కగా చిక్కినమ్మకు. కథాంశం ప్రకారం గిరిరాజ తనయ అవివాహిత, కుమారి.
పార్వతిని ఇంత అందంగా వర్ణించగల్గిన కవికి ఇది తెలియదంటారా? ముందే చెప్పినట్టు అర్ధంతో కాదు అర్ధార్ధంతో నాకు ఈ చిన్న చిక్కు పడింది. అంతే కాదు,లైలా చెప్పినట్లు కొండలనుండి జారి సాగర సంగమానికి ముందు పరీవాహక ప్రాంతంలో పాయలు కట్టే నదికి ఒక పోలిక కూడా ఉన్నది. అయితే ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టమే.
an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically.
కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో సాధారణంగా పాఠకుడు ఉండటంలో తప్పుకాదుగా. ఎందుకంటే యదుకుల భూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తరువాత, కొంత ఎక్స్పెక్టేషన్ తో కవిత ను చదవటం, కొంత అర్ధం కాకపోయినా ఎదో ఉండి ఉంటుందిలే, అని సరిపెట్టుకోవటం, తోచిన రీతిలో అన్వయించుకోవటం సహజమే.
ఏది ఏమైనా ఈ పద్యాలు ఈ క్రింది ఇవ్వబడిన లింకులోని వారి కవితా సంపుటిలోని పద్యాల వలేకాక, కొంత అస్ఫష్టంగానూ, ప్రతీ ఒక వాక్యానికీ ఏదో ఒక భాష్యం చెప్పుకొంటే తప్ప అర్ధంకానట్లు గానూ ఉన్నాయన మాట వాస్తవం.
“ముఖ్యంగా కథలు. ఆలోచనల్లో లోతు, శిల్పంలో పనితనం, వస్తువులో విస్తృతి అంతగా కనిపించటం లేదు. ఇంతెందుకు, కథల్లో ముందుగా వుండాల్సిన చదివించే గుణం కూడ అరుదైంది. రచయితల సంఖ్య సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్నట్టుంది. కవితల్లోనూ విషయవిస్తృతి కనిపించదు. భాషాపాటవం, శిల్పసౌందర్యం, భావసాంద్రతల మాట సరేసరి. ఇక దృశ్య, శ్రవ్య విభాగాలు. వీటిలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించటం లేదు. భవిష్యత్తు బాగుంటుందని ఆశ.”
రామారావు గారు చెప్పిన పై మాటలు ఆలోచింపతగ్గవి. ఈ విషయమై నా ఆలోచనలు:
ఎందుకు కథల్లో పరిణతి కనపడట్లేదు? అంతో, ఇంతో కథలు రాయగలిగిన శక్తి ఉన్నవారి తగినంత కృషి, శక్తి లోపమే దీనికి కారణం అనుకుంటాను. ఒక విషయాన్ని వ్యాసం ద్వారా సూటిగా చెప్పటం, మంచి శిల్పం ఉన్న కథ రాయటం కన్నా, సులభం కదా! కథకుల అధ్యయనలోపం కూడా ఇందుకు తోడ్పడింది. తను రాసే వన్నీ కథలుగా చెలామణీ చేసుకుంటున్న ఒక రచయిత, మంచి కథ రాయటానికీ, శిల్ప జ్ఞానానికీ సంబంధం లేదనటం నాకు అనుభవమే! బహుశా కవితల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు.
కానీ, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. తెలుగు నాట ఉద్దండ కథకుల్ని దృష్టిలో పెట్టుకొని, అటువంటి కథకులు రావాలని ప్రవాసాంధ్రులను కోరితే అది సాధ్యమా! బహుశా సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఒక్క విషయం మాత్రం నిజం – కథల్లో చదివించే గుణం కూడా అరుదైంది అన్న ఆవేదన సరైందే.
దీనికి సరైన సమాధానం కథలు, కవితలు రాసే వారి నుంచే రావాలి!
సువర్ణభూమిలో … గురించి రోమేశ్ గారి అభిప్రాయం:
11/07/2008 6:38 am
ఈ కవిత కన్నా, ఇందులోని వ్యాఖ్యలు ఎంత కామెడీని పంచాయంటే, చదివి, చదివి నవ్వుకున్నాను. ఇలాంటి కవితలవల్లే కవులన్నా, కవితలన్నా జన సామాన్యంలో చాలా చులకన భావం కలగడం, సినిమాల్లో కామెడీ చెయ్యడం జరుగుతోంది.
ఎవడిక్కావాలి ఈ కవితలో అర్థం ఉందో, లేదో!!
కవితలు రాయడం అంటే పొడుపుకథలు రాయడం కాబోలు. మా చిన్నప్పుడు ఆరో తరగతి ఇంగ్లీషు పుస్తకాల్లో హింట్లు ఇచ్చి, వాటిని బట్టి కథలు రాయమనేవారు. కవితలు రాసే ఫార్మ్యులా కూడా అంతే కాబోలు.
ఈ కవితనీ, కవినీ ఎందుకు అభినందించాలంటే – ఆ కవితకి పేరడీలూ, వ్యంగ్య వ్యాఖ్యానాలు రాయడానికి స్ఫూర్తినిచ్చినందుకు. అవి చాలు పాఠకుడికి కడుపు నిండడానికి. వామన మూర్తిగారూ, ప్రజాపతి గారూ, సునీల్ గారూ, అందుకోండి మా అభినందనలు.
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
11/07/2008 6:22 am
బాబా గారు,
మీరు యదుకులభూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తర్వాత కవిత అర్థం కాకపోయినా ఏదో ఉండి ఉంటుందిలే అని అనుకున్నానన్నారు. నేను కూడా భూషణ్ గారి కవిత్వం, అతనికి కవిత్వంపై ఉన్న దృక్పథం రుచి చూడడం మూలానే, ఆ కవితలో చెప్పిన విషయం కాకుండా అంతర్గతంగా మరేదీ దాగి ఉండదని నిర్ణయించుకున్నాను!వినీల్ గారు గణితంతో చెప్పిన పోలికా, కవితలోంచి తీయడానికి ప్రయత్నించిన అర్థమూ చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా అవగాహన మేరకు భూషణ్ గారు సరిగ్గా అలాటి దానికి వ్యతిరేకి! క్లుప్తత విషయంలో అతనన్నది నిజమే కాని, కవితలకి అస్పష్టతని తెచ్చి పెట్టే సాంకేతికత (symbolism) అంటే, నాకు తెలిసి భూషణ్ గారికి అసలు నచ్చదు.
చివరిగా మీరడిగిన మిలియన్ డాలర్ల ప్రశ్నకి నా రెండు సెంట్లు: మనవాళ్ళు “సహృదయత” అన్నది పాఠకుల విషయంలోనే చెప్పారు కాబట్టి, కవి హృదయాన్ని తెలుసుకోవలసిన బాధ్యత పాఠకులదే అని నా ఉద్దేశం. అది ఎక్కువమంది పాఠకులు చెయ్యగలిస్తే ఆ కవికి ప్రాచుర్యం లభిస్తుంది. ఎవరూ అర్థం చేసుకోలేకపోతే, ఆ కవి ఒంటరిగా మిగిలిపోతాడు!
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి Madhav గారి అభిప్రాయం:
11/07/2008 6:01 am
కామేశ్వర రావు గారూ – మీరు చెప్పిన అర్ధం సరి అయినదే. దానితో నాకేమీ చిక్కు లేదు. కానీ ఆ అర్ధాన్ని పద్యభావంతో అన్వయించుకోలేక పోతున్నాను.
నేను పద్యంలో చెప్పబడి ఉన్న పార్వతిని ఊహిస్తున్నాను. ఆమె చక్కనిది, తపోనిష్టచే చిక్కినది. యువతి. ఆమె తపోముద్రలో ఉన్నది. అంటే వీపు నిటారుగా పద్మాసనం దాల్చి, మణికట్లు మోకాళ్ళపై నిలిపి అరచేతులు పైకి, చూపుడువేలు, బొటనవేలు తాకించి ఉన్నది. ఈ ముద్రలో, ఉదరంపై త్రివళులు ఏర్పడే అవకాశం చాలా తక్కువ, పైగా ఈ భంగిమలో ఉదరం చదునుగా ఉండటమే కద్దు (అందరికీ కాదు కానీ చాలా మందికి:) అందులో చక్కగా చిక్కినమ్మకు. కథాంశం ప్రకారం గిరిరాజ తనయ అవివాహిత, కుమారి.
పార్వతిని ఇంత అందంగా వర్ణించగల్గిన కవికి ఇది తెలియదంటారా? ముందే చెప్పినట్టు అర్ధంతో కాదు అర్ధార్ధంతో నాకు ఈ చిన్న చిక్కు పడింది. అంతే కాదు,లైలా చెప్పినట్లు కొండలనుండి జారి సాగర సంగమానికి ముందు పరీవాహక ప్రాంతంలో పాయలు కట్టే నదికి ఒక పోలిక కూడా ఉన్నది. అయితే ఈ ఊహ కవిదో మనదో చెప్పడం కష్టమే.
పళ్ళెం మాత్రం పగలగొట్టకు గురించి Malathi Nidadavolu గారి అభిప్రాయం:
11/07/2008 5:45 am
క్షుద్రదేవతావాహన? –good one.
అసమర్థులు గురించి venkat chitta గారి అభిప్రాయం:
11/07/2008 5:29 am
an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically.
అసమర్థులు గురించి Srihari గారి అభిప్రాయం:
11/07/2008 2:10 am
ఈ మధ్య కాలంలో నేను చదివిన మంచి కధ ఇది.
సువర్ణభూమిలో … గురించి bollojubaba గారి అభిప్రాయం:
11/07/2008 12:01 am
పైన నేను చేసిన కామెంటుకి కొంత వివరణ
కవిత్వం అంటే మనకి అర్థంకానిదేదో దానిలోపల ఉండి తీరాలనే భ్రమలో సాధారణంగా పాఠకుడు ఉండటంలో తప్పుకాదుగా. ఎందుకంటే యదుకుల భూషణ్ గారి కవిత్వం రుచి చూసిన తరువాత, కొంత ఎక్స్పెక్టేషన్ తో కవిత ను చదవటం, కొంత అర్ధం కాకపోయినా ఎదో ఉండి ఉంటుందిలే, అని సరిపెట్టుకోవటం, తోచిన రీతిలో అన్వయించుకోవటం సహజమే.
ఏది ఏమైనా ఈ పద్యాలు ఈ క్రింది ఇవ్వబడిన లింకులోని వారి కవితా సంపుటిలోని పద్యాల వలేకాక, కొంత అస్ఫష్టంగానూ, ప్రతీ ఒక వాక్యానికీ ఏదో ఒక భాష్యం చెప్పుకొంటే తప్ప అర్ధంకానట్లు గానూ ఉన్నాయన మాట వాస్తవం.
http://www.eemaata.com/em/category/library/nnn/
ఇక పోతే కవి పాఠకుని స్థాయికి తగినట్లుగా వ్రాయాలా, లేక పాఠకుడే కవి స్థాయికి వెళ్ళి చదవాలా అనేదీ ఎప్పటికీ ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే.
బొల్లోజు బాబా
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Seetha Kumari గారి అభిప్రాయం:
11/06/2008 11:31 pm
ఎన్నె సార్లు చదివినా చదవాలనిపిస్తున్నది కవిత…. ఇంత చక్కగా ఎలా వ్రాస్తారబ్బా….
జనరంజని: మహానటి సావిత్రి గురించి S.Srinivasa Rao గారి అభిప్రాయం:
11/06/2008 6:10 pm
సేకరణ చాలా బావుంది. పరుచూరి శ్రీనివాస రావు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ link నాకు పంపిన్ అజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు.
పదేళ్ళ “ఈమాట” మాట గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
11/06/2008 12:13 pm
రామారావు గారు చెప్పిన పై మాటలు ఆలోచింపతగ్గవి. ఈ విషయమై నా ఆలోచనలు:
ఎందుకు కథల్లో పరిణతి కనపడట్లేదు? అంతో, ఇంతో కథలు రాయగలిగిన శక్తి ఉన్నవారి తగినంత కృషి, శక్తి లోపమే దీనికి కారణం అనుకుంటాను. ఒక విషయాన్ని వ్యాసం ద్వారా సూటిగా చెప్పటం, మంచి శిల్పం ఉన్న కథ రాయటం కన్నా, సులభం కదా! కథకుల అధ్యయనలోపం కూడా ఇందుకు తోడ్పడింది. తను రాసే వన్నీ కథలుగా చెలామణీ చేసుకుంటున్న ఒక రచయిత, మంచి కథ రాయటానికీ, శిల్ప జ్ఞానానికీ సంబంధం లేదనటం నాకు అనుభవమే! బహుశా కవితల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు.
కానీ, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. తెలుగు నాట ఉద్దండ కథకుల్ని దృష్టిలో పెట్టుకొని, అటువంటి కథకులు రావాలని ప్రవాసాంధ్రులను కోరితే అది సాధ్యమా! బహుశా సాధ్యం కాకపోవచ్చు. అయితే, ఒక్క విషయం మాత్రం నిజం – కథల్లో చదివించే గుణం కూడా అరుదైంది అన్న ఆవేదన సరైందే.
దీనికి సరైన సమాధానం కథలు, కవితలు రాసే వారి నుంచే రావాలి!
లక్ష్మన్న