మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.
నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..
కవి పట్ల కృతి పట్ల గౌరవం క్షమ లేని పాఠకులు కూడా పాఠకులేనా అనిపిస్తుంది.
చాన్నాళ్లుగా చూస్తున్నాను – అంతర్జాలంలో అఫ్సర్ గారి పట్ల కొంతమంది వెలిబుచ్చుతున్న అక్కసుకు కారణం? నాకు తెలిసి అఫ్సర్ గారు ఏనాడూ లోనిప్పును ఆర్పేసుకోలేదు. ఉప్పు సముద్రంలో మునిగిపోలేదు తేలుతూనే ఉన్నారు ఈదుతూనే ఉన్నారు. అందుకేనా ?
ఎంతటి బాల్యమిత్రులైనా సభలో మీరు మీరు అని సంబోధించుకొంటారు. అది సభామర్యాద. అనానిమస్ గా ఉండొచ్చు కదాని (కొంతమంది) ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం సభామర్యాదా?
బొల్లోజు బాబా
[Post briefly edited – Eds.]
[రచనపై జరగ వలసిన చర్చలు వ్యక్తిగత దూషణకి దిగజారడం విచారకరం. గతంలో ఒకసారి ఇదే విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈమాట సంపాదకులు వ్యాఖ్యాతలని సున్నితంగా హెచ్చరించారు కూడా. మళ్ళీ అదే పరిస్థితి తిరిగి ప్రత్యక్షమైంది కాబట్టి, ఒక్కసారి అందరూ పాఠకులకి సూచనలు మరొక్క సారి చదవడం ఔచిత్యంగా ఉంటుంది. అప్పుడూ ఇప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తడంలో పాత్రధారులెవరైనా, సహృదయులైన ఈమాట పాఠకులకి ఒక విన్నపం. వైయక్తిక స్పర్థలతోనో, సహజ గుణాభిజాత్యాలతోనో, మరే కారణం వలనో, ఎవరైనా ఏదైనా రచన మీద అసభ్యంగా మాట్లాడినా, అలా అనిపించినా, అలా ఏ అభిప్రాయమైనా మిమ్మల్ని నొప్పించినా, వెంటనే సంపాదకులకు తెలియజేయండి. తగిన చర్యలు వెంటనే తీసుకుంటాము. నేరుగా ఇతర పాఠకులతో వాగ్యుద్ధానికి దిగడం వల్ల అనర్థం తప్ప ఏమీ ఉండదు. ఏ ఒకరో, ఇద్దరో దురుసుగా మాట్లడినంతలో ఈమాటలో రచయితలకు సద్విమర్శ, ఆదరణ లేవు అనే ఏకాభిప్రాయానికి రావడం కూడా సమంజసం కాదు. ఏ అభిప్రాయం ఎంత వరకూ సభ్యమైనది, వెలిబుచ్చిన భావం, భాషా తీవ్రత సబబేనా, ఈ అభిప్రాయం చర్చకు ఎంత దోహదం చేస్తూంది, ప్రచురించాలా వద్దా? అని ప్రతీ సారీ మేము తర్జన భర్జనలు పడుతూ తీసుకునే సాపేక్షిక నిర్ణయాలలో అప్పుడప్పుడూ పొరపాట్లు జరగవచ్చు. జరిగినై కూడా. తప్పులు దిద్దుకుంటూ ఈమాట సుహృద్భావ వాతావరణం చెడకుండా మేం చేస్తూనే ఉండే ప్రయత్నాలకి మీ తోడ్పాటు అవసరం అని వేరే చెప్పక్కర్లేదు. దయచేసి సహకరించండి. – సంపాదకులు]
ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవు. తెలిసిన పాఠకులకి నా వ్యాఖ్యలు ఏవీ పెడసరంగా విన్పించవు. నేను అభ్యంతరకతరమైన లేదా అమర్యాదాపూరితమైన వాక్యాలు ఏమీ రాయలేమోదు. అందువలన కృష్ణ ఈమాటకోసం ఆ పత్రిక సంపాదకుల కోసం.. ఇంకా అఫ్సర్ వంటి కవుల కోసం బాధ పడితే నేను చేయగలది ఏమీ లేదు. అననుకూల అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే వాళ్లకోసం నేను అభిప్రాయాలు రాయడం లేదు. అది పత్రికని చదివే మిగతా పాఠకుల సమస్య కాదు. నేను నా అభిప్రాయాలని చెప్పకూడదని ఈమాట సంపాదకులెవ్వరూ అనలేదు. వారు వద్దని అన్న రోజున నేను అలాగే అభిప్రాయాలు చెప్పడం మానేయగలను. నాకొచ్చిన ఇబ్బది ఏమీ లేదు.
వేలూరి వెంకటేశ్వరరావు గారు నా అభిప్రాయాలని చదివి ఆలోచించే విజ్నత ఉన్నవారే గానీ నా వ్యాఖ్యలకే బాధపడిపోయేటంత సున్నిత మనస్కులు కారు గనక నా అభిప్రాయాలని పక్కకు పెట్టి ఈ పాఠకులు వారి వారి అభిప్రాయాల ప్రకారం పత్రికని చదువుకోవచ్చును కదా?? నా గురించి వారికి ఈ చింతేల??
నేను ” భజన చేసే విధము తెలియండి” వంటి తోవలో నడిచిన దాన్ని గాను. నడవను. ఎక్కడైనా alternative voice ని ఆహ్వానించేవారుండాలి. వ్యతిరేకించే వారుండరు. అప్పుడు అందులో “ప్రజాస్వామ్యం” లోపించిందని అర్ధం. ఈమాట ప్రహజాస్వామ్య విలువలకి కట్టుబడిన పత్రిక అని నేను ఈ అతి సున్నిత పాఠక వర్గానికి గుర్తు చేయనవసరం లేదనుకుంటాను. ఇకపోతే నేను ఎక్కడ కన్పించినా మానినా “ఇక్కడ” కన్పిస్తున్నాను కదా?? చాలదా?? నా గురించి మరిచిపోండి. నా అభిప్రాయాలలోని విషయాన్ని గురించి ఆలోచించండి. అది ఎక్కువ మంచిదీ మీకూ..మీరు అభిమానించే పత్రికకీ కూడా!!
రమ.
[Post briefly edited – Eds.
ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవనే ఈ అభిప్రాయానికి కారణాలు తెలుసుకోవాలని మాకూ కోరికగా ఉంది. కానీ పెద్దలు చెప్పినట్లు “de gustibus non est disputandum”. ]
ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.
చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.
ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.
* * * * *
మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.
పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.
రామారావుగారూ,
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చర్చించడం అనవసరం అన్నాను కాని దాని గురించి కొత్త మార్గంలో పరిశోధించడమే అనవవసరమని నా ఉద్దేశం కాదు. “కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అన్న కొసరు అందుకే 🙂
అలాగే ఇలాంటి పరిశోధనకి statistical techniques ఉపయోగపడవని కూడా నా అభిప్రాయం కాదు. వాటిని తెలుగు సాహిత్యంలో ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి, ఎంతవరకూ ఎలా ఉపయోగపడతాయో ప్రయోగాల ద్వారా పరిశీలించిన తర్వాత ఉపయోగించడం సమంజసమని నా ఉద్దేశం.
“ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి.” నాది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం. తెలుగు మాట్లాడని వాడు కావడం వల్లనే అలా రాసేడని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది విమర్శకులు దీనిని ప్రౌఢశైలి అని, క్షాత్రశైలి అని, క్లుప్తత అని అన్నారు. భావాలలో ప్రౌఢత్వాన్ని పక్క పెడితే, భాషలోని ప్రౌఢత్వం మాత్రం కవి తెలుగువాడు కాకపోవడం వల్లనే వచ్చిందని నాకనిపించింది. అయితే పూర్వకవి ప్రయోగాలు కనిపించనంత మాత్రాన అతనికి తెలుగు సాహిత్యంతో చెప్పుగోదగ్గ పరిచయమే లేదు అని చెప్పలేం. తెలుగువాడు కాకపోవడం వల్ల ఆ ప్రయోగాలు సహజంగా అతని మనసులో ముద్రపడలేదని అనుకోవచ్చు కదా.
సరళంగా ఉండే పద్యాల విషయంలో – we have to look at how they are distributed across the kavya. Only then we can decide on whether they are part of the inherent variability or written/modified by someone else. నేను చదివినంతలో అవి కావ్యమంతా అక్కడక్కడా ఉన్నాయనిపించింది. రాయల కలలో విష్ణువు చెప్పిన మాటల్లోనే, “ఎన్నిను…” అన్న పద్యంలో రాయల ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. వెంటనే “తెలుగదేలయన్న…” పద్యం. “బాసాడి” అన్న పదం ఇతర తెలుగు కవులెవరైనా ప్రయోగించారేమో నాకు తెలియదు. అలాగే రాజనీతి చెపుతున్నప్పుడు కాని (ముఖ్యంగా కందపద్యాలు), విష్ణుస్తుతి చేసేటప్పుడు కొన్ని చోట్ల, ఇలా అక్కడక్కడ కావ్యమంతా సరళమైన, సహజమైన తెలుగు పద్యాలు కనిపిస్తాయి, రెండుమూడు ఉదాహరణలు:
ఏపట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్
ఇప్పటి (జూలై 2010) కృష్ణదేవ రాయల ప్రత్యేక సంచిక సందర్భముగా ఈ వ్యాసం కూడా ముఖ్యమైనదే. కృష్ణరాయల గురించి, వారి కాలాన్ని గురించి, అప్పటి కవులను గురించి ప్రచురితమైన ఇలాటి వ్యాసాల పట్టికను ఒకటి తయారుచేసి సంపాదకులు ఒక చోట ఉంచితే బాగుంటుందేమో?
అష్టదిగ్గజాలగురించి ఒక మాట. అష్టదిగ్గజాలు, నవరత్నాలు అందరూ ఎందుకు తెలుగు కవులై ఉండాలి? రాయల ఆస్థానములో వ్యాసతీర్థులవంటి గొప్ప సంస్కృత కవులు, పండితులు, కర్ణాటక కవిసార్వభౌముడైన తిమ్మణార్యునివంటి వారు కూడా ఉన్నారు గదా? వారీ బిరుదుకు అర్హులు కారా? నాకేమో అనిపిస్తుంది ఎన్నో కట్టుకథలతో ఇది కూడా ఒక కట్టు కథ అనే.
సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుల్లో లేరు. అందువల్ల రాబోయే సంచికలో ఏ వ్యాసాలూ, శీర్షికలూ ఉండబోతున్నాయో ఆయనకీ తెలియదు. సురేశ్ ఈ పరిశోధనా పత్రాన్ని మా అభ్యర్థన మేరకు అనువదించారు. అంతవరకే. ఈ సంచికలో ఏ రకమైన సాహిత్యం ఉండాలి అనేది మా నిర్ణయం. అందువల్ల ఈ సంచికపై మీ అభిప్రాయాలకు కారణం, సంపాదకులమైన మేమే.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/10/2010 4:38 pm
మీ కోరికని తీర్చాలీ అంటే నేను మీ పత్రికలో పాఠకుల లోతులేని అభిప్రాయాలని..వారి వారి సాహిత్య పరిజ్ఞాన లేమినీ ఉదాహరణ పూర్వకంగా పోల్చిచూపించాలి. అది నాకు చికాకైన పని. అటువంటి ఏకవాక్య అభిప్రాయాలు రాసే పాఠకుల అతితెలివి భావాలని పక్కకిపెడితే..మీ పత్రికలో తెలివైన అభిప్రాయాలు, కాస్త చదవాలి అన్న అభిప్రాయాలు రాసే పాఠకులు నేను గమనించినంత వరకూ వీళ్ళు – మీరు అడిగినతర్వాత మీకు తెలుసుకోవాలీ అన్న కోరిక కలిగిన తర్వాత ఎంతోకొంతైనా చెప్పడం నా ధర్మం గనక మాత్రమే చెబుతున్నాను – ఈమాట ప్రధాన సంపాదకులనీ..ఓపికగా పత్రికని నిర్వహిస్తున్న ఇతర సంపాదకవర్గాన్నీ మొదటగా చెప్పాలి. వీరి తర్వాత బెజ్జాల కృష్ణమోహనరావుగారు, సురేష్ కొలిచాల, పరుచూరి శ్రీనివాస్, లైలా ఎర్నేని, చీమలపర్తి బృందావనరావుగారలూ..ఇంకా కొడవళ్ళ హనుమంతరావు..బాబ్జీలు..కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ,గొర్తి బ్రహ్మానందం, కామేశ్వర రావు గారలూ .వీరి వ్యాసాలూ..కవిత్వంలో వైదేహీ శశిధర్, ఉదయకళ, శ్రీవల్లీ రాధిక, పాలపర్తి ఇంద్రాణీ..వీరి కవితలూ నేను చదివినప్పుడు ఆస్వాదించగలిగాను. అభిప్రాయాలు సైతం నేను ఎక్కువ చదివేది వీరినే!! వీళ్ళుమాత్రమే మీ పత్రిక పాఠకులు కారు కదా?? ఇంక మిగతా అభిప్రాయాలలో నాకు ఏనాడూ ఆసక్తిని కలిగించేవి పెద్దగా కనిపించలేదు. లోతులేని తెలిసీతెలియని భావాలు తప్ప. మీ పత్రికలో మాత్రమే పద్యానికి నిజంగా ప్రాముఖ్యతని ఇస్తున్నారు. కృష్ణదేశికుల వారి పద్యాలని నేను ఇస్టంగా చదువుతాను.
నేను పైన ప్రస్తావన చెప్పిన వీరివికాక నా దృష్టికి వచ్చిన ముఖ్యమైన రచన గానీ ముఖ్యమైన అభిప్రాయంగానీ లేదు అనే చెప్పాలి. వచనకవిత అనే ప్రక్రియని తెలుగుదేశంలోనూ మీదేశంలోనూ చతురతతో నడపగలిగిన వాళ్ళు బహుకొద్దిమంది మాత్రమే అని చెప్పగలను. వచన కవిత్వం రూపాన్ని సులువుగా వాడుకునీ లోతులేని ఊహసాగని అయోమయపు భావాలని రాసి పుస్తకాలుగా అచ్చేసి చాలా మది కవులుగా చలామణీ అయిపోతున్నారు. కవిత్వం బాగుంటే దాన్ని విశ్లేషించి అది ఎందుకు బాగుందో వివరంగా చెప్పవచ్చు. కానీ అకవిత్వాన్ని విశ్లేషించే పని ఎవరు చేసినా అది దండగ వ్యవహారం మాత్రమే!! నాకు తెలుసు నేనీ మాట అన్నప్పుడు తెలుగు దేశంలోనూ ఇంకా మీదేశంలోనూ “కవి” నామధేయులకి ఎందరికో కోపం వస్తుందని. ఇందుకు భయపడే..ఇబ్బందిపడె సమకాలీన వచనకవిత్వం మీద ఎవరూ విమర్శకి పూనుకోవడంలేదు. నా మాట అటుంచండి. సాహిత్యం మీద ఆసక్తి లేదా అభినివేశం ఉన్న ఎవరైనా ఇవాళ కవిత్వం పేర అచ్చవుతూన్న వాటిలో నిజంగా కవిత్వం ఏమేరకి ఉందో చెప్పండి. ఈ అవకాశాన్ని వాడుకుని ఎందరు కవిత్వమే రాయలేని వాళ్ళు కవులుగా చెలామణీ అయిపోతున్నారో చూడండి. తెలుగులో మంచి కవులకన్నా వీళ్ల హడావిడి ఎక్కువ. నిజంగా చూద్దామా అంటే చెప్పుకోదగ్గ ఒక్క కవిత ఉండదు. ఇది పాఠకులకీ తెలుసు..సమీక్షకులకీ తెలుసు..విమర్శకులకీ తెలుసు. వాళ్ళు చెప్పిన చాలా కారణాలకి వాళ్ళు పేర్కొన్న ఎన్నో వచనకవితలు నిజంగామిగలలేకపోయాయని. ఇది ఒక నిశ్శబ్ద అసహనం. నేను దానికి మాటని ఇచ్చాను అంతే!! ఒక కవిత్వాభిమానిగా అకవిత్వాన్ని ఊరికే రెపరెపలాడిస్తూంటే మరి నా వల్ల కాక బయటికి చెప్పిన అభిప్రాయం. ఏది ఎందుకు మంచికవితో నేను చెప్పగలనేమో గానీ మంచి కవిత కాని దాని గురించి మాట్లాడి నా సమయాన్నీ ..మీ సమయాన్నీ నేను వృధా చేయలేను. నాకు నచ్చిన ఆధునిక కవులలో మోహన ప్రసాద్ ..అజంతా..త్రిపుర..పాటల రచయితలలో గద్దర్ వంగపండు[ 20 ఏళ్ళకిందట..ఇప్పుడుకాదు] ఇప్పుడు ..గోరటి వెంకన్న..లాంటి వాళ్లు తప్ప ఇవాళ్టి కాలంలో నాకు నిజంగా చదవ వలసిన వాళ్ళూ ..వినవలసిన వాళ్ళూ ఉన్నారని అనుకోను. మీరు అడిగిన కారణానికి నేను నా భావాలని వివరంగా చెప్పక తప్పింది కాదు మిగతా అనేక వాదాల మీదా ..ఇజాల మీదా రాజకీయంగా నాకు ఆసక్తి ఉందే గానీ వాళ్ళ వాళ్ళ కవితా వ్యక్తీకరణలమీద నాకు ఆసక్తి లేదు. తెలుగులో భాషా పరంగాగానీ..భావపరంగా గానీ డొక్కశుధ్ధి లేని వాళ్ళు సైతం కవిత్వం రాసేస్తున్నారు ఇంతకన్నా దారుణం మరొకటి లేదు..ఇప్పటికైనా సరైన సాహిత్య విమర్శ ఆధునిక కవిత్వమ్ మీద గనక రాగలిగితే [ఎలాంటి మెరమెచ్చులూ లేకుండా.. నిష్పక్షపాతంగా]..మంచి సాహిత్యం మిగులుతుంది. సాహితంగా చెలామణీ అవుతున్న పొల్లు పోతుంది. సాహిత్య పత్రికలు అందుకు దోహదం చేసి ..మంచి రచనలని మరొకసారి అయినా ఈ తరం పాఠకులకి పరిచయం చేయాల్సి ఉంది.. పలుకున్న కవులూ..రచయితలూ మరోసారి పాఠకులకి తెలియడం వలన పాఠకులు ఎక్కువ లాభపడతారు. మరింతగా వాళ్ళ ఆలోచనలని వాళ్ళు పదును పెట్టుకుంటారు. అలాగేమంచి కవిత్వాన్నీ మంచి విమర్శనీ మెచ్చుకోగలవాళ్ళు సైతం మరింతగా పెరుగుతారు. నేను వీలైనంత క్లుప్తంగానూ..అదే సమయంలో స్పస్టంగానూ మాట్లాడాలని ప్రయత్నంచేసాను. ఇప్పటికిది చాలునని అనుకుంటూ..
సెలవు,
భవదీయ..
రమ.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి bollojubaba గారి అభిప్రాయం:
07/10/2010 12:52 pm
నేను ఉష గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
కవి పట్ల కృతి పట్ల గౌరవం క్షమ లేని పాఠకులు కూడా పాఠకులేనా అనిపిస్తుంది.
చాన్నాళ్లుగా చూస్తున్నాను – అంతర్జాలంలో అఫ్సర్ గారి పట్ల కొంతమంది వెలిబుచ్చుతున్న అక్కసుకు కారణం? నాకు తెలిసి అఫ్సర్ గారు ఏనాడూ లోనిప్పును ఆర్పేసుకోలేదు. ఉప్పు సముద్రంలో మునిగిపోలేదు తేలుతూనే ఉన్నారు ఈదుతూనే ఉన్నారు. అందుకేనా ?
ఎంతటి బాల్యమిత్రులైనా సభలో మీరు మీరు అని సంబోధించుకొంటారు. అది సభామర్యాద. అనానిమస్ గా ఉండొచ్చు కదాని (కొంతమంది) ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం సభామర్యాదా?
బొల్లోజు బాబా
[Post briefly edited – Eds.]
[రచనపై జరగ వలసిన చర్చలు వ్యక్తిగత దూషణకి దిగజారడం విచారకరం. గతంలో ఒకసారి ఇదే విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈమాట సంపాదకులు వ్యాఖ్యాతలని సున్నితంగా హెచ్చరించారు కూడా. మళ్ళీ అదే పరిస్థితి తిరిగి ప్రత్యక్షమైంది కాబట్టి, ఒక్కసారి అందరూ పాఠకులకి సూచనలు మరొక్క సారి చదవడం ఔచిత్యంగా ఉంటుంది. అప్పుడూ ఇప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తడంలో పాత్రధారులెవరైనా, సహృదయులైన ఈమాట పాఠకులకి ఒక విన్నపం. వైయక్తిక స్పర్థలతోనో, సహజ గుణాభిజాత్యాలతోనో, మరే కారణం వలనో, ఎవరైనా ఏదైనా రచన మీద అసభ్యంగా మాట్లాడినా, అలా అనిపించినా, అలా ఏ అభిప్రాయమైనా మిమ్మల్ని నొప్పించినా, వెంటనే సంపాదకులకు తెలియజేయండి. తగిన చర్యలు వెంటనే తీసుకుంటాము. నేరుగా ఇతర పాఠకులతో వాగ్యుద్ధానికి దిగడం వల్ల అనర్థం తప్ప ఏమీ ఉండదు. ఏ ఒకరో, ఇద్దరో దురుసుగా మాట్లడినంతలో ఈమాటలో రచయితలకు సద్విమర్శ, ఆదరణ లేవు అనే ఏకాభిప్రాయానికి రావడం కూడా సమంజసం కాదు. ఏ అభిప్రాయం ఎంత వరకూ సభ్యమైనది, వెలిబుచ్చిన భావం, భాషా తీవ్రత సబబేనా, ఈ అభిప్రాయం చర్చకు ఎంత దోహదం చేస్తూంది, ప్రచురించాలా వద్దా? అని ప్రతీ సారీ మేము తర్జన భర్జనలు పడుతూ తీసుకునే సాపేక్షిక నిర్ణయాలలో అప్పుడప్పుడూ పొరపాట్లు జరగవచ్చు. జరిగినై కూడా. తప్పులు దిద్దుకుంటూ ఈమాట సుహృద్భావ వాతావరణం చెడకుండా మేం చేస్తూనే ఉండే ప్రయత్నాలకి మీ తోడ్పాటు అవసరం అని వేరే చెప్పక్కర్లేదు. దయచేసి సహకరించండి. – సంపాదకులు]
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
07/10/2010 12:00 am
ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవు. తెలిసిన పాఠకులకి నా వ్యాఖ్యలు ఏవీ పెడసరంగా విన్పించవు. నేను అభ్యంతరకతరమైన లేదా అమర్యాదాపూరితమైన వాక్యాలు ఏమీ రాయలేమోదు. అందువలన కృష్ణ ఈమాటకోసం ఆ పత్రిక సంపాదకుల కోసం.. ఇంకా అఫ్సర్ వంటి కవుల కోసం బాధ పడితే నేను చేయగలది ఏమీ లేదు. అననుకూల అభిప్రాయాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడే వాళ్లకోసం నేను అభిప్రాయాలు రాయడం లేదు. అది పత్రికని చదివే మిగతా పాఠకుల సమస్య కాదు. నేను నా అభిప్రాయాలని చెప్పకూడదని ఈమాట సంపాదకులెవ్వరూ అనలేదు. వారు వద్దని అన్న రోజున నేను అలాగే అభిప్రాయాలు చెప్పడం మానేయగలను. నాకొచ్చిన ఇబ్బది ఏమీ లేదు.
వేలూరి వెంకటేశ్వరరావు గారు నా అభిప్రాయాలని చదివి ఆలోచించే విజ్నత ఉన్నవారే గానీ నా వ్యాఖ్యలకే బాధపడిపోయేటంత సున్నిత మనస్కులు కారు గనక నా అభిప్రాయాలని పక్కకు పెట్టి ఈ పాఠకులు వారి వారి అభిప్రాయాల ప్రకారం పత్రికని చదువుకోవచ్చును కదా?? నా గురించి వారికి ఈ చింతేల??
నేను ” భజన చేసే విధము తెలియండి” వంటి తోవలో నడిచిన దాన్ని గాను. నడవను. ఎక్కడైనా alternative voice ని ఆహ్వానించేవారుండాలి. వ్యతిరేకించే వారుండరు. అప్పుడు అందులో “ప్రజాస్వామ్యం” లోపించిందని అర్ధం. ఈమాట ప్రహజాస్వామ్య విలువలకి కట్టుబడిన పత్రిక అని నేను ఈ అతి సున్నిత పాఠక వర్గానికి గుర్తు చేయనవసరం లేదనుకుంటాను. ఇకపోతే నేను ఎక్కడ కన్పించినా మానినా “ఇక్కడ” కన్పిస్తున్నాను కదా?? చాలదా?? నా గురించి మరిచిపోండి. నా అభిప్రాయాలలోని విషయాన్ని గురించి ఆలోచించండి. అది ఎక్కువ మంచిదీ మీకూ..మీరు అభిమానించే పత్రికకీ కూడా!!
రమ.
[Post briefly edited – Eds.
ఈమాటలో చాలా మంది పాఠకులు పెద్దగా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళు కారు. వారికి సాహిత్యపు పూర్వాపరాలూ తెలియవనే ఈ అభిప్రాయానికి కారణాలు తెలుసుకోవాలని మాకూ కోరికగా ఉంది. కానీ పెద్దలు చెప్పినట్లు “de gustibus non est disputandum”. ]
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి కృష్ణ గారి అభిప్రాయం:
07/09/2010 6:45 pm
ఉష గారి బాధ అర్ధమవుతున్నది. కాని, కొంచెం స్పష్టంగా చెప్పవచ్చు కదా అనిపించింది. ఈమాటలో అందరి వ్యాఖ్యలూ కాదు, రమా భరద్వాజ పేరిట వస్తున్న వ్యాఖ్యలు మాత్రమే పెడసరంగా వుంటున్నాయి. ఆవిడ గారు పనికట్టుకుని కొందరి మీద రాళ్ళు రువ్వే పని పెట్టుకున్నట్టు, ఆ రాళ్ళన్నీ ఈమాట వైపే రువ్వుతున్నట్టు అనిపిస్తున్నది.ఆవిడ ఇంకెక్కడా కనిపించరు కనుక ఈ మాట అనవలసి వస్తున్నది. అన్యధా భావించరాదు.
చర్చ అఫ్సర్ పుస్తకం “వూరి చివర” గురించి. పుస్తకం చదివిన వేలూరి గారు ఆయనకు తోచింది రాసారు. అందులో విమర్శ కూడా వుంది. రమా భరద్వాజ గారికి ఆ విమర్శ కనిపించలేదు. అఫ్సర్ ని వేలూరి పొగిడారో అని చిన్న పిల్లలాగా ఉక్రోషం పట్టలేక యాగీ చేస్తున్నారు. రమ గారూ: చర్చని పుస్తకం మీద పెట్టి, అందులో అకవిత్వం ఏదో చెప్పగలిగితే బాగుంటుందేమో చూడండి. ఆ విధమ్మున అఫ్సర్ ని అకవి అనాలన్న మీ వుద్దేశం తీరుతుంది. ముందు అఫ్సర్ ని శుభ్రంగా వుతికి ఆరేసిన మీదట ముకుంద రామారావుకి మహాకవి అన్న అచ్చోసి వదులుదాం.
ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం గురించి ఉష గారి అభిప్రాయం:
07/09/2010 8:41 am
ఈమాటని గూర్చి నా “మరువం” బ్లాగులో మంచు మీద రాసిన ఓ కవితకి ఒకరి వ్యాఖ్య ఆధారంగా మొదటసారి సంవత్సమున్నర క్రితం మీ పత్రికలో చూడటం సంభవించింది. అప్పటినుంచీ సంచికల ఆధారంగా కాక సమయాన్ని బట్టి రావటం, ఈమాట రచయితలు అన్న టాబ్ నుంచి ఒకరిని ఎంచుకుని చదవటం. కనుక పాఠకురాలిగా మీ పత్రిక వయసులో నాది ఇరవై శాతం లోపే. అలాగే రచయితలనీ ఓ పాతికశాతం పూర్తిచేసాను. నా అభిరుచి కవితలు, పరిశోధనా వ్యాసాలు, కథలు కనుక అవి పట్టి పట్టి చదవటం అలవాటు. చదవటం ఒక కాలక్షేపంగా, జీవితానికి నేపథ్యంలో వున్న అభిరుచి మాత్రమే. అలాగే నా రచనలూను. అవి నా జీవితాన్నల్లుకున్న పడుగుపేకలు కాకపోయినా నాకత్యంత ప్రశాంతత దొరికేది వాటి వలననే. అన్నీ సగటు స్థాయిలో ఉన్న ఓ సాధారణ వ్యక్తిని. ఇది నా గురించిన స్వపరిచయం. ఇక ఈ వ్యాఖ్య ఈ ఒక్క రచనకే కాదు, నేను గమనించిన ఓ తీరు తెలుపటానికే, మీరు ఇది ప్రచురించకపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు.
* * * * *
మీ పత్రిక ఒక చక్కని సాంప్రదాయంలో కొనసాగుతుంది. రచనలను గూర్చి కాక వ్యాఖ్యలను/విమర్శలను గూర్చీ ఈ మాట. ప్రింటు పత్రికల్లో ఒక రచనకి సంపాదకునికి లేఖగా – ప్రశంస/విమర్శ అందుతాయి. ఇక్కడ కొన్నిసార్లు ఒక రచనని చక్కని వ్యాఖ్యారూప వనరులు కలిపి మరింత సంపూర్ణం చేసేవారున్నా, కొన్ని కేవలం ఒక చర్చ, రచ్చగా అవుతున్నాయి. విమర్శలు చదవకుండా వెళ్ళొచ్చా అంటారా, అవి ఒక్కోసారి బంగారు నగకి రతనాలు పొదిగినట్లుగా ఉండబట్టే అట్టి చక్కటి చదువరులు/విమర్శకులు కనపడబట్టే చదివేది. మరికొన్ని ఇక్కడ నుండి వెళ్ళేసరికి అసలు రచనని చిల్లులకి అతుకేసి కుట్టిన చింకిపాతలా తోచేలా చేస్తున్నాయి. కొన్ని ఎంత తీవ్రంగా ఉంటున్నాయంటే, రచయిత చేత “అగత్యం” పట్టింది అని అనిపించేంత. మరి కొన్ని రచయితని ఒంటరిని చేసి అంతా కలిసి యుద్దం చేసినంత. పత్రికకి నిష్పక్షపాతం, అభిప్రాయాల పట్ల సహనం ముఖ్యమే కానీ వాటి తీరు వ్యక్తిగత దూషణగా మారినప్పుడు మీ బాధ్యత లేదా? ఒక్కోసారి 1:on:1 లేదా ఒక్కరిదే విలువిద్యాప్రదర్శన లా అవుతుందిక్కడ. పోటాపోటీగా back to back మాటలు రువ్వేస్తూ, అస్త్రాలు ముందే అరచేత బిగించి ఆవలీలగా వేళ్ళతో అక్షరబాణాలు సంధిస్తూ అన్నట్లుగా.. మరి అది అన్ని రచనలకా అంటే అలా లేదు. అసలు కొన్ని రచనలు ఏ ప్రాతిపదికన తీసుకున్నారు అని ఆలోచించేలా ఉంటాయి. వాటికి ప్రశంసలు మరింత తికమక పెట్టేలా ఉంటాయి. కనుక ఇక్కడి ప్రశంసలు లేదూ కనీసం రచయిత కృషి పట్ల సదభిప్రాయం [చాలా తక్కువ మోతాదులోనైనా] విమర్శలు [సద్విమర్శలా/కువిమర్శలా ఆయా వారికే తెలియాలి] ఊహాతీతం. ఇలా రాస్తున్నానని నేను ఎవరికీ సానుకూలురాలినీ, సానుభూతిపరురాలినీ కాదు. అస్మదీయులు, తస్మదీయులూ లేరు. నిజానికి ఓ అనాథ పాఠకురాలిని. ఇక్కడ ఓ లోకం వెదుకుతున్నదాన్ని. ఒక రచయితని/ఒక రచనని సానబట్టి, ఆ ప్రక్రియలో రచయిత చేత లోతుగా ఆలోచింపచెయ్యడం సర్వదా అభిలషనీయం. నొప్పించడం ఎవరి ఉద్దేశం కాకపోయినా, ఒక పద్దతిగా అది జరగాలని మాత్రమే నా ఉద్దేశం. నేను ఈ అనంత సాహితీవాహినిలో ఓ బిందువునే. మన వెనక పుట్టి మనని దాటి వెళ్ళే సాహిత్యానికి నా వంతు ఏముందా ఇవ్వనూ అని యోచించేదాన్ని మాత్రమే. “ఔరా పిల్లకాకి/కాకిపిల్లా!….” అన్నా నాకు ఆనందమే.
పైన చెప్పినట్లుగా పాతిక శాతం పాఠకురాలిని, ఇలా నాలుగు దారుల కూడలిలో ఉన్నాను. నేను నడిచి వచ్చిన దారి నన్ను అయోమయంలో పడేస్తుంది. రచన చదివి పోవటమా/విమర్శలని పట్టించుకోకపోవటమా/ “ఈమాట” అంటే ఇది అని అవగతం అయ్యేంత వరకూ ఇలా కొనసాగటమా మిగిలున్నాయిక. నా ఈమాట మీ “ఈమాట” లో వెలుగు చూడకపోయినా దాదాపుగా ఆర్నెల్ల పాటుగా సందిగ్ధంలో పడి ఆగిన మాట వెలికివచ్చింది.
కృష్ణదేవరాయలు గురించి Megha గారి అభిప్రాయం:
07/08/2010 11:00 pm
thanks Madhav
శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము గురించి Kameswara Rao గారి అభిప్రాయం:
07/08/2010 9:43 pm
రామారావుగారూ,
ఆముక్తమాల్యద కర్తృత్వం గురించి మళ్ళీ మళ్ళీ అవే విషయాలు చర్చించడం అనవసరం అన్నాను కాని దాని గురించి కొత్త మార్గంలో పరిశోధించడమే అనవవసరమని నా ఉద్దేశం కాదు. “కొత్త విషయాలేమైనా తెలిస్తే తప్ప” అన్న కొసరు అందుకే 🙂
అలాగే ఇలాంటి పరిశోధనకి statistical techniques ఉపయోగపడవని కూడా నా అభిప్రాయం కాదు. వాటిని తెలుగు సాహిత్యంలో ఇంతవరకు నాకు తెలిసి ఎవరూ ఉపయోగించలేదు కాబట్టి, ఎంతవరకూ ఎలా ఉపయోగపడతాయో ప్రయోగాల ద్వారా పరిశీలించిన తర్వాత ఉపయోగించడం సమంజసమని నా ఉద్దేశం.
“ఏ కారణం చేత ఐతేనేం తెలుగులో ఆముక్తమాల్యద రాయటానికి పూనుకున్నాడు కాని సంస్కృత శ్లోక రచనా పథకాలే ఎక్కువగా ఈ పద్యాల్లోనూ వున్నాయి.” నాది కూడా సరిగ్గా ఇదే అభిప్రాయం. తెలుగు మాట్లాడని వాడు కావడం వల్లనే అలా రాసేడని నా ఉద్దేశం. ఇంతకుముందు చాలామంది విమర్శకులు దీనిని ప్రౌఢశైలి అని, క్షాత్రశైలి అని, క్లుప్తత అని అన్నారు. భావాలలో ప్రౌఢత్వాన్ని పక్క పెడితే, భాషలోని ప్రౌఢత్వం మాత్రం కవి తెలుగువాడు కాకపోవడం వల్లనే వచ్చిందని నాకనిపించింది. అయితే పూర్వకవి ప్రయోగాలు కనిపించనంత మాత్రాన అతనికి తెలుగు సాహిత్యంతో చెప్పుగోదగ్గ పరిచయమే లేదు అని చెప్పలేం. తెలుగువాడు కాకపోవడం వల్ల ఆ ప్రయోగాలు సహజంగా అతని మనసులో ముద్రపడలేదని అనుకోవచ్చు కదా.
సరళంగా ఉండే పద్యాల విషయంలో – we have to look at how they are distributed across the kavya. Only then we can decide on whether they are part of the inherent variability or written/modified by someone else. నేను చదివినంతలో అవి కావ్యమంతా అక్కడక్కడా ఉన్నాయనిపించింది. రాయల కలలో విష్ణువు చెప్పిన మాటల్లోనే, “ఎన్నిను…” అన్న పద్యంలో రాయల ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. వెంటనే “తెలుగదేలయన్న…” పద్యం. “బాసాడి” అన్న పదం ఇతర తెలుగు కవులెవరైనా ప్రయోగించారేమో నాకు తెలియదు. అలాగే రాజనీతి చెపుతున్నప్పుడు కాని (ముఖ్యంగా కందపద్యాలు), విష్ణుస్తుతి చేసేటప్పుడు కొన్ని చోట్ల, ఇలా అక్కడక్కడ కావ్యమంతా సరళమైన, సహజమైన తెలుగు పద్యాలు కనిపిస్తాయి, రెండుమూడు ఉదాహరణలు:
ఏపట్టున విసువక ర
క్షాపరుడవు గమ్ము ప్రజల చక్కి, విపన్ను
ల్గూపెట్టిన విని తీర్పుము
కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్
ఎక్కడి రాజ్యవైభవము? లెక్కడి భోగము? లేటి సంభ్రమం?
బక్కట! బుద్బుదప్రతిమమైన శరీరము నమ్మి మోక్షపుం
జక్కి గణింపకుంటి, యుగసంధుల నిల్చియు గాలు చేతి బల్
త్రొక్కుల నమ్మను ప్రభృతులున్ దుద రూపఱకుండ నేర్చిరే
ఎవ్వని చూడ్కిచేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వనియందు, డిందు మరి యెవ్వనియందిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేడ నే
నెవ్విధియైన నిన్గదియ నేని యనన్ విని బంధమూడ్చినన్
(పోతన్నని కచ్చితంగా చదివే (వినే) ఉంటాడనడానికి ఈ పద్యమే సాక్ష్యం 🙂
కృష్ణరాయల కవిపోషణ గురించి mOhana గారి అభిప్రాయం:
07/08/2010 1:12 pm
ఇప్పటి (జూలై 2010) కృష్ణదేవ రాయల ప్రత్యేక సంచిక సందర్భముగా ఈ వ్యాసం కూడా ముఖ్యమైనదే. కృష్ణరాయల గురించి, వారి కాలాన్ని గురించి, అప్పటి కవులను గురించి ప్రచురితమైన ఇలాటి వ్యాసాల పట్టికను ఒకటి తయారుచేసి సంపాదకులు ఒక చోట ఉంచితే బాగుంటుందేమో?
అష్టదిగ్గజాలగురించి ఒక మాట. అష్టదిగ్గజాలు, నవరత్నాలు అందరూ ఎందుకు తెలుగు కవులై ఉండాలి? రాయల ఆస్థానములో వ్యాసతీర్థులవంటి గొప్ప సంస్కృత కవులు, పండితులు, కర్ణాటక కవిసార్వభౌముడైన తిమ్మణార్యునివంటి వారు కూడా ఉన్నారు గదా? వారీ బిరుదుకు అర్హులు కారా? నాకేమో అనిపిస్తుంది ఎన్నో కట్టుకథలతో ఇది కూడా ఒక కట్టు కథ అనే.
విధేయుడు – మోహన
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Madhav గారి అభిప్రాయం:
07/08/2010 11:19 am
రవికిరణ్ గారూ,
సురేశ్ కొలిచాల ఈమాట సంపాదకుల్లో లేరు. అందువల్ల రాబోయే సంచికలో ఏ వ్యాసాలూ, శీర్షికలూ ఉండబోతున్నాయో ఆయనకీ తెలియదు. సురేశ్ ఈ పరిశోధనా పత్రాన్ని మా అభ్యర్థన మేరకు అనువదించారు. అంతవరకే. ఈ సంచికలో ఏ రకమైన సాహిత్యం ఉండాలి అనేది మా నిర్ణయం. అందువల్ల ఈ సంచికపై మీ అభిప్రాయాలకు కారణం, సంపాదకులమైన మేమే.
మాధవ్ మాచవరం
సంపాదకుల బృందం తరఫున.
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి రాఘవ గారి అభిప్రాయం:
07/08/2010 8:26 am
ప్రస్తుతానికి శేషేంద్రశర్మగారి సాహిత్యకౌముది చదువుతున్నాను. అందులో ఆయన ఉటంకించిన
అన్నది గుర్తొచ్చింది, ఈ కవిత చదివితే.