ఇపుడు జీవించాలన్న తలపు
తొలిచేస్తోంది
ఓపినన్ని కలలున్న ఎడారిని నేను
ఒయాసిస్సులను మొలిపించుకోగలను
ఏమో, పాడుకుంటూ పరవళ్ళు తొక్కే
ఒక సెలయేరూ దారిలో ఎదురవ్వచ్చు.
Category Archive: సంచికలు
ఇస్మాయిల్గారు టాగూర్ను సదాబాలకులు అన్నారని మనకు తెలుసు. అయితే మంచి కవులందరూ సదాబాలకులే. వాళ్ళలో పసితనపు సమ్మోహనత్వమేదో నిలిచే ఉంటుంది. ఆ పసితనపు స్వచ్ఛత సూదంటురాయిలా ఆకర్షించినట్టు, వీళ్ళ కవిత్వం కూడా పాఠకులను లాగుతూ ఉంటుంది. ఈ సంపుటిలో కూడా ఇదే ప్రధాన ఆకర్షణ.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
అడ్డం కృష్ణజన్మస్థానం ఆరంభంలో తెగి చక్కెర అయింది (3) సమాధానం: రసాల సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి ప్రక్రియల్నిముందుండి నడిపించే పరాశక్తి (3) సమాధానం: […]
గడినుడి పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రితం సంచికలోని గడినుడి-50కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-50 సమాధానాలు.
సాహిత్యం ఒక ఆయుధం కాదు సమాజాన్ని ఖండించడానికి; సాహిత్యం మన వాదభావరాజకీయావసరాలు తీర్చే, తీర్చగలిగే ఒక పనిముట్టు కాదు-ప్రత్యేకించి వాటిని వాడటం చేతకాని చేతులలో. అలా కావాలి అంటే ముందు సాహిత్యం పట్ల, సమాజం పట్ల, ఆ రెంటి సంబంధం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. అది లేనప్పుడు, ఎన్ని వాదాలను సమర్థిస్తూ ఎన్ని నమూనా కథలు రాసినా వాటి ఫలితం శూన్యం. సమాజం ఒక అభాసరూపి; బహుముఖీన. నిర్వచనాలకు లొంగనిది. పాఠకులతో రచయిత జరిపే సాహిత్య సంభాషణ వ్యక్తిగతమైనది. సామూహికమైనది కాదు. అందువల్ల రచయిత చేయగలిగింది, చేయవలసింది తమ రచనల ద్వారా తమ ఆలోచనలను పాఠకులకు స్పష్టంగా చేర్చగలగడం, పాఠకులు తమ భావాలకు, ఆలోచనలకు స్పష్టతనిచ్చుకోవడంలో సహాయపడడం మాత్రమే. ఇలా తమ సాహిత్యం ద్వారా పాఠకులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న రచయితలు తెలుగులో ప్రస్తుతం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. కోట్లమంది తెలుగువారిలో సాహిత్యం చదివేవారు వేలమందిలోను, విమర్శనాత్మకంగా చదవగలిగినవారు వందల్లో మాత్రమే ఉన్నారనడం సత్యదూరం కాని విషయం. పాఠకుల సాహిత్యాభిరుచి ఈ స్థితికి రావడానికి కారణం రచయితలే. సాహిత్యం ఇలానే ఉండాలి, ఈ వాదాలనే సమర్థించాలి, ఈ రకమైన ముగింపులే ఇవ్వాలి అని నిర్బంధించి, సమాజంలోని ఎన్నో రంగుల జీవితాలను కేవలం నలుపు-తెలుపులలో చూపే ప్రయత్నాలను మాత్రమే రచయితలు, పత్రికలు కూడా సమర్థించడం వల్లనే. అందువల్ల, పట్టుమని పదిమంది కూడా చదవని తమ సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తెస్తున్నామనుకోవడం, వారి సాహిత్యానికి అంత శక్తి ఉందనుకోవడం కేవలం రచయితల పగటికల మాత్రమే. వైయక్తికస్థాయిలోనైనా మార్పు తేగలిగినంత ప్రభావంతో తెలుగులో ఎవరూ రాయటంలేదు. కారణం? పాఠకులకంటే కూడా ముఖ్యంగా రచయితలకు సాహిత్యస్వభావం గురించి లేశమాత్రమైనా అవగాహన లేకపోవడం. తమచుట్టూ తమలాంటి ఒక పదిమందిని కూడగట్టుకొని తాము చూసిందే ప్రపంచమని, దాన్ని తాము మారుస్తున్నామని, ప్రశ్నిస్తున్నామని, తమ గొంతు వినిపిస్తున్నామని అపోహపడడం, అలా కాని సాహిత్యాన్ని నిందించడం, ఆపై సాహిత్యవ్యాసంగాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొనడం. ఇదీ నేటి పరిస్థితి రచయితలది, కొండొకచో పత్రికలదీ. సాహిత్యం ద్వారా తమ వాదపక్షపాతాన్ని ప్రకటించడం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నించడంలో ఏ తప్పూ లేదు. కాని, సాహిత్యం కేవలం మనకు నచ్చినట్టే ఉండాలని, మన ఇష్టాయిష్టాలను, మన అభిప్రాయాలను, అపోహలనూ మాత్రమే ప్రతిబింబించాలని అనుకోవడం, అలా కాని సాహిత్యం ప్రమాదమని, హేయమని దాడి చేయడం కేవలం మూర్ఖత్వం. మనం నచ్చని, మనకు నచ్చని ప్రజలు ప్రపంచంలో ఉన్నట్టే, మనకు నచ్చని కథాంశాలు, పాత్రలు, వాటి ప్రవర్తనలు ఉన్న కథలుంటాయి. కథను కథలాగానే చదవాలి. అర్థం చేసుకోవాలి. కథగానే విమర్శించాలి. ఈ సాహిత్య సంస్కారం ప్రస్తుతం పాఠకులకంటే రచయితలకు ఒక ముఖ్యావసరం కావడం బాధించే విషయం. రచయితలు ముందు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. నిష్పాక్షికంగా తమచుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. అవధులు లేని దాని విస్తీర్ణతను బహురూపత్వాన్ని గుర్తించాలి. సాహిత్యసంస్కారంతో పాటు, భిన్నాభిప్రాయాల పట్ల నిరసనను కూడా గౌరవంగా తెలపగలిగే సాంఘిక సంస్కారమూ అలవర్చుకోవాలి. ఈ తక్షణావసరాన్ని గుర్తించకుంటే తెలుగు సాహిత్యం, రచయితలు కొత్తలోతులకు దిగజారగలరేమో కాని కొత్త ఎత్తులు ఎక్కలేరు.
సంక్లిష్టమైన ఇతివృత్తాన్ని లేఖల ద్వారా కథనం చేయడంలో రచయిత్రి అపారమైన ప్రతిభ చూపింది. ఉత్తరాలనగానే కథకు మాత్రమే ఉపకరిస్తాయనిపిస్తుంది కాని, ఇందులో ఉత్తరాల ద్వారా అప్పటి సమాజం, ఆర్థిక వ్యత్యాసాలు, స్త్రీలను, పేదలను ధనవంతులు దోచుకునే విధానాలు, వాటికి వ్యవస్థ ఆమోదాలు అన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి.
రామాయణం రంకు, భారతం బొంకు అని ఒక నానుడి. భారతం విషయం నిర్వివాదం, అది ధర్మరాజు బొంకు కనుక. కాని రామాయణం విషయంలో ఆ నానుడి యీనాడు ఏమాత్రము నిర్వివాదం కాదు. ఆనాడు కానీ యీనాడు కానీ అన్ని అనర్థాలకు మూలం కామం. అది లేంది సృష్టిలేదు. కనుక, దాన్ని అదుపులో ఉంచుకోవడమే పురుషార్థసాధన. ఏ కావ్యవిషయమైనా ఆ విషయమే, ప్రాచ్యంగాని పాశ్చాత్యంగాని.
ఎడారిలో పూలు చూడటమన్నది వింతగొలపడం ఎప్పుడో మానేసిందిగానీ ఆ సాయంత్రం స్టేడియం మెట్రో స్టేషన్నుంచి ఇంటికి నడుస్తోన్నపుడు కురిసి గొడుగు తెరిచేలా చేసిన పది నిమిషాల వాన మాత్రం నాకు అపురూపమైన అనుభవాన్ని మిగిల్చింది. పూలను వికసింపజేయడం మానవ సాధ్యమే కావచ్చుగానీ ఆరుబయట వాన కురిపించటానికి దేవతలే కరుణించాలి.
పెళ్ళానికైనా ఇవన్నీ చేశానా? ఆమెకైనా ఎందుకు చేయాలి? ఎప్పుడైనా పెళ్ళాంగా ఉందా? పూర్తి స్వాతంత్య్రం ఇచ్చా కదా! దేనిలో ఇచ్చా? అంతకంటే చేసేదేంటి, ఏం కావాలో అవి చేశా. ఆమెనేమన్నా అబ్యూజ్ చేశానా? ‘తిట్టడం కొట్టడం ఒక్కటే అబ్యూజా, ఇంట్లో ఇంకో మనిషి ఉందన్న ధ్యాస లేకుండా, తనతో బతికే మనిషిని పట్టించుకోని నిర్లక్ష్యం కంటే పెద్ద అబ్యూజ్ ఏముంటుంది?’ అనేది ఆమె.
ఎందుకో తెలీదు, వర్షంలో తడవనంటే చాలు మనస్సు ఎండిపోతుంది. తేలికపాటి జల్లుల్లో, ఏటవాలు రోడ్ల పైన పారుతున్న నీటి మీద స్ట్రీట్ లైట్ల వెలుతురు. వెలిసిపోయిన తెరపై నిజజీవితపు సినిమాని చూస్తున్నట్టు ఉంటుంది నాకు. అది చూస్తూ నడవాలని ఉంటుంది, ఆడాలని ఉంటుంది. డాన్స్ తప్ప నన్ను నేను మర్చిపోయే పని ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఇన్ని గుర్తొచ్చిన ప్రాణం ఊపిరిని కోరుకుంది.
తల్లిదండ్రులు పిల్లల చదువులు, కెరియర్లు వరకూ ఎంతైనా శ్రమపడతారు. వ్యక్తిత్వం రూపుదిద్దుకునే వయసులో ఆ పిల్లల్లో మానసికంగా ఎలాటి భావనలు కలుగుతున్నాయో, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారేమో అనేవాటి గురించి మాత్రం పట్టించుకోరు. అయినా బిడియపడకుండా, భయపడకుండా పిల్లలు తమ సమస్యను అమ్మ, నాన్నలతో చెప్పుకునే వాతావరణం ఎంతవరకు ఉంది?
కొత్త నిబంధనల గ్రంథం ప్రకారం, నమ్మిన వాళ్ళకి క్రీస్తు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమే ఋజువుగా చలామణీ అవుతోంది. క్రీస్తు ఈ వాగ్దానాన్ని చేస్తున్న సమయంలో, ఆత్మశుద్ధిగల, నిజాయితీ పరులైన, స్వేచ్ఛగా ఆలోచించగల వ్యక్తుల నైతిక ప్రవర్తనని మరిచిపోయైనా ఉండాలి, నిర్లక్ష్యం చేసి అయినా ఉండాలి, లేదా తిరస్కారభావంతో చూసైనా ఉండాలి.
ఒక పాత ఒళ్ళుని మనుషుల ముందు పాతరేసి
తవ్వుకు తినమంటావు.
పెదాలను స్వాగతించే దమ్ము నీకెప్పుడూ రాదు.
పుట్టడం, పొందడం మాత్రమే
నిఘంటువులో ఉన్నాయని ధైర్యంగా అబద్దాలాడతావు.
కిక్లు కొట్టీ కొట్టీ చెమటతో తడిచిపోయి ఉంది ఆ మాస్క్ వేసుకున్నవాడి షర్టు. అతని పక్కనే బిక్కమొహం వేసుకుని వాడి ఫ్రెండ్ నిలబడి ఉన్నాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్ ఊదుతూ స్కూటర్ని పక్కకు లాగమని దానిమీద లాఠీ పెట్టి కొడుతూ వాళ్ళను బెదరగొడుతున్నాడు. రుక్కు పక్కనే నెమ్మదిగా కదులుతున్న కారు ఫ్రంట్ సీట్లో ఉన్న పెద్దాయనకి రుక్కు ఎందుకు అలా తెరలుతెరలుగా నవ్వుకుంటుందో అర్థం కాలేదు.
దాసోహమన్నా ఋషిలా మూలిగినా
చేతులూ గుండె కవాటాలూ అన్నీ అప్పగించినా
మెలికలు తిరగటం ఆపేస్తానని
పేగులు మెలియబెడుతూ చెప్పే పచ్చి ఎర్రటి క్షణం
వింజామరల రేకలు రాలే తనం.
చాచిన నాలుకల్లోకి చేరే తనం.
చందులాల్గారిని గూర్చి ఆ కాలమున రెండు అభిప్రాయములుండెను. ఆయన కుటిలరాజ్యతంత్రజ్ఞుడనియు, లంచగొండియనియు, దుబారాఖర్చు చేయువాడనియు, దుర్మార్గుడనియు, కొందరాయనను గూర్చి చెప్పుచుండిరి. మరికొందరాయన చాలా మంచివాడనియు, కార్యదక్షుడనియు, స్నేహపాత్రుడనియు, దాతయనియు పొగడుచుండిరి.
సూర్యునిలాగా
తల ఎగరేస్తూ
నిప్పులు విసిరేది
చంద్రునిలాగా
నవ్వులు పేల్చే
మల్లెలు విరిసేది
మబ్బు తునకలా
తల వంచుకుని
సాగీపోయేది
నేను, నువ్వు తలో చోటా నడుస్తుంటాం
నీ దారిలో నేనుంటానో లేనో
నా దారిలో, నాలో నీవుంటావు.
ఈ దేహంలో, ఇదే మనసుతో
బ్రతకలేక బ్రతుకుతూ నేను
నైరూప్య లోకంలో నీవు
నేనే నీ వైపు నడిచి వస్తున్న భ్రమలాంటి సత్యం.
పుస్తకం తెరిచివున్నట్టే ఉంటుంది
రాసుకోవడానికే ఏమీ మిగలదు
గాలి పాడుతున్నట్టే ఉంటుంది
స్వరాలేవీ సరిగా ధ్వనించవు
అంకం తర్వాత అంకంగా సాగిన
ప్రయాణమంతా
కళ్ళముందు కదలాడుతుంటుంది