మాత్రాఛందస్సు గురించి ప్రాకృత హిందీ భాషలలో నెక్కువగా వ్రాయబడియున్నను తెలుగులో వీటి చర్చ చాల పరిమితమే. కన్నడ తెలుగు భాషలలోని దేశి ఛందస్సులో అంశ లేక ఉపగణములను ఉపయోగిస్తారు. తెలుగులోని సూర్యేంద్రచంద్రగణములు కన్నడమునందలి బ్రహ్మ విష్ణు రుద్ర గణములనుండి పుట్టినవే.

చరిత్రకారులు నవలారచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరేట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే?

పైన బడబాగ్నిలాంటి ఎండ
కింద పిచ్చుకల్లాంటి పిల్లలు
పైన భగ్గు మంటున్న ఎండ
కింద మగ్గిపోతున్న పిల్లలు

స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్‌పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పడుతోంది.

ఏనుగు అరటి తోటలో పడిందంటే ఒక్కొక్కచెట్టునూ తొండంతో పెళ్ళగించి పారెయ్యకుండా వూరుకోదు. దానికి అరటి చెట్టంటే అంత వైరం ఎందుకో తెలుసుకోవాలని వుందా? వినండి. అందమైన అమ్మాయి తొడలను ఏనుగు తొండంతోనూ, అరటిచెట్టు బోదెతోనూ పోల్చడం మన ప్రాచీనకవులకు అలవాటు. ఇలాంటి అలవాట్లు చాలా వున్నాయి వారికి.

“అలాగే ఏం పందెం వేసుకుందాం? నువ్వే చెప్పు. నువ్వేదంటే అదే” తలెత్తి చూపు సారించి సుబ్బలక్ష్మిని తనివిదీరా చూసుకున్నాను. చింపిరి జుట్టును చేత్తోనే అటూ ఇటూ సరిచేసి వేసుకున్న రెండు జడలు, కళ్ళనిండుగా కాటుక, పెదవులపై అస్తవ్యస్తంగా పూసుకున్న ముదురు ఎరుపు లిప్‌స్టిక్.

ఆ కిటికీ గుండానే మూడేళ్ళ క్రితం ఒకరోజు మా చిన్నాన్న, ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, బయటికెళ్ళారు, వేట కోసం. వాళ్ళిక మరి తిరిగి రాలేదు. బయట అడవుల్లో మంచులో, వానలో చిక్కుకు పోయారు. ఆ సంవత్సరం కనీ వినీ ఎరగని వర్షాలు పడి బయట నేలంతా చిత్తడిగా అయింది. ఏ ఊబిలోనో చిక్కుకొని వుంటారు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.

గోపాలన్ మా ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్. చాలా కఠినమైన వ్యక్తి. జీవితంలో ఒక్కొక్క మెట్టుగా ఎక్కి వచ్చిన మనిషి. అందువల్ల అందరూ అలాగే రావాలని అనుకునే వ్యక్తి. ప్రొద్దున్న తొమ్మిది గంటలకి ఆఫీసుకి వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా వేరే ఆలోచనలు లేకుండా అన్నిటినీ మూటకట్టి పెట్టి ఆయనతో సమంగా పరుగెత్తాలి.

తన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్న కొద్ది ధరలు పెంచటానికి బదులు తగ్గించాడు. దానితో మధ్య తరగతి ప్రజలు సహితం కొనడం ప్రారంభించారు. బహుశా ప్రజల అందుబాటులోకి తన చిత్రాలు రావడం రాయ్‌కి ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చి వుండవచ్చు.

మంగలి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఫేషన్ పేరుతొ గుండు కొట్టించుకొని, మీసాలూ, గెడ్డాలూ తీసేయమని ఏ విద్యార్థికయినా చెప్పే ధైర్యం మనకుందా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరపులోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే, మర్నాడే కనాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని ఘంట వాయించి మరీ చెప్పగలను.


జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్
!

శాస్త్ర , కళా రంగాల్లో ఎనలేని కృషిచేసి ధృవతారలల్లే దారి చూపిన ఏ కొద్దిమందో మాత్రమే పార్థివ శరీరాన్ని ఒదిలి వెళ్ళిపోయినా యశఃకాయులై మనమధ్యే ఉండిపోతారు. అటువంటి మహామహుడు, తెలుగువారు గర్వించదగ్గ ద్రావిడ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఇటీవలే అస్తమించారు. ఆచార్య కృష్ణమూర్తి, విశిష్ట ప్రతిభాసంపన్నులు. భాషాశాస్త్రంలో తమ విశేషమైన కృషితో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలందుకున్నవారు.

తమ వెలుగుతో ప్రపంచపు చీకట్లను పారద్రోలే దీపాలు కొడిగట్టటం, సహజమరణం అనివార్యమని తెలిసినా కూడా బాధించే విషయం. గత కొద్దికాలంగా, అతి తక్కువ వ్యవధిలో చనిపోయిన తెలుగు తేజోమూర్తులను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇది ఒక తరం అంతరిస్తున్న సమయమేమో అనే భావన రాకా మానదు. వారు వెళ్ళిపోగా ఏర్పడ్డ శూన్యం భయపెట్టకా మానదు. దీపాన్ని దీపంతో వెలిగించి దీపావళిగా మార్చినట్లు వారి మార్గదర్శకతను ఆదర్శంగా తీసుకొని ముందు తరాలకు అందించడం మన బాధ్యత, మనం ఆ జ్ఞానమూర్తులకు చూపగల గౌరవం. ఈ తరంలోనూ, రాబోయే తరాల్లోనూ వారు వెలిగించిన జ్ఞానదీపాలు కొడిగట్టకుండా కాపాడే సమర్థులు ఉన్నారనీ, ఉంటారనీ ఆశించడం ఒక పగటికల కాదనే మా బలమైన నమ్మకం.


సెప్టెంబర్ 8, 2012: రచయిత, సంగీత విద్వాంసుడు, శాస్త్రవేత్త, ఈమాట సాహితీకుటుంబంలో సభ్యుడు అయిన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఆకస్మికంగా మరణించారన్న దుర్వార్త ఇప్పుడే మాకు తెలిసింది. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.


ఈ సంచికలో కథలు, కవితలు, వ్యాసాలతో పాటుగా సంగీతపరిమళం వెదజల్లే డా. శ్రీపాద పినాకపాణి గారు నిండు నూరవ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంలో వారి గురించి పరిచయ వ్యాసం, ప్రత్యేకం. భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినం సందర్భంగా ఈమాట ప్రచురించిన ప్రత్యేక సంచిక ఈ సమయంలో మరొక్కసారి గుర్తు చేయడం సముచితం. విశ్వనాథ వేదాంత చర్చ ఆడియో మరొక విశేషాంశం. ఇంకా…

మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ కాలం నుండి, ఇప్పటివరకూ, అంటే ఈ నూరు సంవత్సరాలలో ప్రచురించబడ్డ ‘చారిత్రక నవలల’కు లూకాచ్ చెప్పిన లక్షణాలు ఉన్నాయా, లేవా? అనే ప్రశ్నకి సమాధానం వేరే మరొక వ్యాసం మరొకరు రాయవలసి ఉంటుంది. అసలు, లూకాచ్ ఉద్ఘాటించిన లక్షణాలు ఈ కాలపు చారిత్రక నవలలకి ఆపాదించవచ్చా అన్నది మౌలిక మైన ప్రశ్న.

నిశ్శబ్దంగా లంగరెత్తి అంధకారపు కడలి కడుపు లోకి
మాయమయ్యే ఒంటరి నావలా నీవు వెళ్ళిపోయే క్షణాన
నీ అంతరంగంలో చెలరేగిన వేదనల తుఫానుల్ని …

ఇంకొక విశేషమేమిటంటే – ఈ కవితలు వ్రాసిన కవులు ఒకరు ఆంధ్రలో, మరొకరు అమెరికాలో ఉన్నా, ఇద్దరూ కూడబలుక్కుని వ్రాసినట్లనిపించాయి. ఒకరు ‘చందవరం, ప్రకాశం జిల్లా’లో మనల్ని ఒక రౌండ్ కొట్టిస్తే, మరొకరు అధునాతనమైన బంగళాలోకి ‘తేనీటి సమయానికి’ సాదరంగా ఆహ్వానించారు.

నిద్ర లేచిన భీముడు ‘ఎవరూ’ అని అడిగి, ద్రౌపది గొంతు గుర్తించి – కీచకుని దురాగతం నాకు చెప్పి వాణ్ణి చంపేందుకు నన్ను నియోగించడానికి వచ్చింది కాబోలు అనుకుంటూ, అయినా తన నోటితోనే విందామని నిశ్చయించుకొని – ‘ఇంత రాత్రివేళ ఎందుకొచ్చావు, ఎవరూ చూళ్ళేదు గదా’ అంటాడు. ఆమె ఆ మాత్రం అర్థం చేసుకోలేదా?