గణిత ప్రపంచంలో మూడు శతాబ్దాలకి పైబడి పరిష్కారం లేకుండా ఉండిపోయిన అతి జటిలమైన సమస్య ఏదయ్యా అంటే అది ఫెర్మా కదాచిత్తుగా ప్రవచించిన ఒక అభిప్రాయం. ఎవరీ ఫెర్మా? ఏమిటా శిష్టాభిప్రాయం? ఈ సమస్య పరిష్కారం లేకుండా మూడు వందల ఏళ్ళు పైబడి ఎందుకు ఉండిపోయింది? చివరికి పరిష్కారం ఎలా దొరికింది?

ప్రియుని ప్రవాసవార్తను విన్నంతనే ఆమె తనువు కృశించినది. కన్నీరు నిరంతరముగా కారిపోయినది. ఆ వెళ్ళబోవుప్రియునితో అతనికి మిత్రములైనట్లుగా ఇవన్నియు బయలుదేరినవి. ఒక్క ప్రాణము మాత్రమే ఆమెలో మిగిలియున్నది. ఓప్రాణమా! నీవును నీకు మిత్రసమానులైన వారితో బోవక ఎందుకున్నావు? అని యామె ప్రశ్నించుచున్నది.

శేషయ్య శాస్త్రిగారు కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు. రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేశారు.

ఈ సంస్కృత నాటకం గురించి గతంలో ఒకసారి ప్రస్తావించాను. ఈ మధ్యనే ఎస్. వి. భుజంగరాయ శర్మగారి రేడియో ప్రసంగం ఒకటి దొరికింది, అదికూడా ఈ కాలిదాస నాటకం పైన చేసినది. ఆయన ప్రసంగాన్ని, దానికి అనుబంధంగా ఈ నాటకాన్ని ఇక్కడ జత చేస్తున్నాను.

మల్లెపూలు కోసుకొచ్చి, ఒడిలో పోసుకొని, తల్లి దగ్గర కూర్చొని ఉంది కొత్త పెళ్ళికూతురు. ఒకో పువ్వుని తల్లికి అందిస్తూ ఉంటే ఆమె కూతురికి చక్కని వాలుజడ అల్లుతోంది. ఈ లోపున ఈయన వచ్చారు. ఇంకా కొత్త కదా, సిగ్గూ బిడియం పోలేదు. ఆయన్ని అలా చూసేసరికల్లా ఆ నవోఢకు ఏం చేయడానికీ పాలుపోలేదు. దగ్గరకి వెళ్ళాలా, అలాగే ఉండాలా, సిగ్గుతో పారిపోవాలా – ఏమీ తెలియక, ఏదో చేయాలన్న తొందరలో, దిగ్గునలేచి మునిగాళ్ళపై నిలుచుండిపోయింది.

తెలుగు వైయాకరణులు సాధురేఫను లఘురేఫ, శుద్ధరేఫ, మేలురా, గుండురా అని, బండి-ఱను అలఘురేఫ, శకటరేఫ, గౌరవరేఫ, పెద్దఱ, గురుఱ అని పలురకాల పేర్లతో ప్రస్తావించారు. బండి-ఱ లిపి రూపం రెండు బండి చక్రాలతో, మధ్యలో గీత ఇరు,సు లాగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని బండి-ఱ అన్నారని మనం ఊహించవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం పరిశీలనగా చదివి, పరిశోధన చేసి పిహెచ్‌డీలు సంపాదించుకున్న విద్యార్థుల్లో కొందరినీ, తెలుగుదేశంలో ప్రామాణికమైన పరిశోధన చేసిన కొందరినీ, పిలిచి అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16-17 తేదీల్లో, అధ్యాపకులు వెల్చేరు నారాయణరావు, జాయ్స్ ఫ్లూకిగర్ ఒక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు సాహిత్య విమర్శ మీద కొత్త ఆలోచనలు ఆవిష్కరించడానికి పరిశోధన మార్గాలలో కొత్త పద్ధతులు అనుసరించడానికి, ఈ సంవృత సదస్సు ఉద్దేశించబడింది. అంతర్జాతీయంగా తెలుగు సాహిత్య విమర్శకి ప్రామాణిక స్థానం ఏర్పడడం, ప్రపంచ సాహిత్య విమర్శలో తెలుగు సాహిత్య విమర్శ ఒక భాగం కావటం ఈ సదస్సు వల్ల ఉద్దేశించిన ఫలితాలు. ఈ సదస్సుకు కావలసిన ఖర్చులన్నీ ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ప్రత్యేకమైన ఆచార్య పీఠం ఏర్పాటు చేసిన కొప్పాక కుటుంబం వాళ్ళే ఇచ్చారు. ఈ సదస్సులో చర్చల ఫలితంగా వ్యాసరచయితలు తమ వ్యాసాలను పరిష్కరించుకున్న తరువాత వాటినన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించాలని నిర్వాహకుల ఉద్దేశ్యం. అలా పుస్తకంగా రాకముందు ఆ వ్యాసాలను కొన్నింటిని అనువాదం చేసి ఈమాటలో ముందుగా వేయటానికి ఆయా వ్యాసరచయితలు అంగీకరించారు. వారికి మా కృతజ్ఞతలు.

ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది.

వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.

“తమ్ముడూ, ఇప్పుడు మనం జీవితంలో చరమాంకాన్ని చేరుకున్నాం. ఇప్పటివరకూ చేసిన పాప పుణ్యాలూ, ఆచరించిన ధర్మాధర్మాలు ఒక్కటే మన వెంటే వచ్చేవి. మనం ఐదుగురం అతిరధ మహారధులుగా ఉండీ వస్త్రాపహరణం సమయంలో ఏమి చేయగలిగాం? భగవంతుడైన కృష్ణుడు తన స్వంత కొడుకుగా పుట్టిన తర్వాత కూడా వచ్చి విడిపించేవరకూ దేవకీ వసుదేవులు కారాగారంలోనే కదా బతికినది? ఎవరి పుణ్యఫలం వారిది. చివరిదాకా నువ్వు బతికి ఉంటే మాత్రం ద్రౌపది కష్టాలు పడదని రూఢిగా చెప్పగలవా?

శుచిముఖి చేసిన వర్ణనలో, ప్రభావతి శరీరాంగాలకు పోలికలుగా చెప్పిన తుమ్మెదలు, చంద్రబింబమూ మొదలైన ఉపమానాల సౌందర్యానికి వెయ్యిరెట్లుగా ఆయా శరీరభాగాలను ఊహించుకొన్నాడు ప్రద్యుమ్నుడు. అలా ఊహించి ఊహించి తన మనసుకి కొద్ది కొద్దిగా కనిపించే ఆమె శరీరాకృతిని జాగ్రత్తగా పొందుపరచుకొన్నాడు. అలా కొంచెం కొంచెం పొందుపరచుకొంటూ పోగా చివరికి ఆమె రూపం ఎలా ఉంటుందో, సరిగ్గా అలాగే ప్రద్యుమ్నునికి దర్శనమయ్యిందిట!

అధిక బరువు చేత నట్లైనదో యేమొ
హరితకలల గనుచు నడుగులిడిరొ!
ఉగ్రనీడల మతి దప్పి యుంటిరేమొ!
జనకొలువు జేర – జాగ్రత జారిపోయి
పాదబాటల బట్టిన పతనమబ్బు!

వేయాల్సిన వెర్రి వేషాలన్నీ అయిపోయాయి
ఇక మరణించాలనుకుంటా
ఎవడు మరణిస్తాడు పోదూ
నక్షత్రము మరణిస్తుందా
భూగోళం మరణిస్తుందా

తాళం వెనుక తాళం తీస్తూ పోతే
తలపులలా తెరుచుకుంటూనే
వుంటాయి.

శూన్యమైన గది మూలల్లోనూ
ముడుచుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తలలెత్తి చూస్తాయి.