విస్తార గ్రహాంతర నక్షత్రాంతర ప్రాంతాలను ఇకపై విశ్వంలోని పనికిరాని ఖాళీ ప్రదేశాలుగా పరిగణించలేము; సృష్టికర్త వాటిని తన చిహ్నమైన ఏ వస్తువుతోనూ నింపలేదని అనుకోలేము. ఆ ప్రాంతాలన్నీ ఒక అద్భుతమైన మాధ్యమంతో (medium) నిండి ఉన్నాయి. జ్యేష్టానక్షత్రంలో (dog-star) ఓ అణువు కంపిస్తే, ఆ కంపనాలని ఈ మాధ్యమం తనలో మూడేళ్ళపాటు ఉంచుకొని వాటినన్నిటినీ క్రమం తప్పకుండా భూమ్మీద స్పెక్ట్రోస్కోప్‌కి చేరవేస్తుంది.

అంతు దొరక్క గిలగిలా కొట్టుకోవడం అన్నది మానవ మాత్రులుగా మన ఆఖరి ప్రతిస్పందన. అప్పుడు దేవుడు మందహాసం చేస్తాడు. ఒక చిన్న క్లూ విసిరి చూస్తాడు. వీడు దీన్ని పట్టుకోగలుగుతాడా అని సరదాగా పైనుండి వేడుక చూస్తాడు.

ప్రతీ ఒక్క మనిషీ తనకి ప్రతీ ఒక్క విషయమూ సరిగానే అర్ధం అయిపోతోంది అని అనుకుంటాడు. అది కరెక్టా, కాదా అనే విషయం రాబోయే కాలం మాత్రమే చెబుతుంది. అనుకున్న సమయంలో మాత్రం ఎటువంటి రుజువులూ దొరకవు. కానీ, ఆ మనిషి అర్ధం చేసుకునేది ఎప్పుడూ, ఆ మనిషి చైతన్య స్థాయి మీదే ఆధారపడి వుంటుంది.

రొండేళ్లగా నా బుర్రలో తిరగతా వుండాడు గూనోడు. వోణ్ణి కతగా మార్చాలని ఆరేడు నెల్లగా తపన పడతా వుండా. కుదరడం ల్యా. … అయినా నా పిచ్చిగానీ, వోడి బతుకులో కై గట్టాల్సినంత కతేడ వుండాది… దోసిడు కన్నీళ్ళు దప్ప!

హిమాలయాలు మరోసారి పిలుస్తున్నట్టు అనిపించసాగింది. ‘పద, ఇంకోసారి వెళ్ళివద్దాం’ అంటూ మనసు తట్టి లేపసాగింది. బుద్ధి కూడా ‘మనసు చెప్పిన మాట విను’ అని హితవు పలకసాగింది.

సంగ సాహిత్యం మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది –- కాలం మారినా, మనిషి హృదయం మారదు. దాని సంవేదనలు మారవు. ప్రేమ, బాధ, ధైర్యం, దయ, కరుణ – ఇవన్నీ శాశ్వతమైనవి. ఈ కారణంగానే, రెండువేల ఏళ్ల తరువాత కూడా, సంగ కవిత్వం మనల్ని కదిలిస్తుంది.

జీవితంలో నిజానిజాలుగాని, తప్పొప్పులుగాని ఋజువు చేయగలిగినవి కావు. ప్రేమ ఎప్పుడు ప్రేమ, ఎప్పుడు హింస కూడా ఋజువుకాదు. అంతేకాదు, ఋజువు చేయవలసినవి కూడా కావు. అనుమానపిశాచాలను తరిమేసి, స్వార్ధం కొంత మానుకుని బతకడం సరైన మార్గం.

నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’ మొదలుపెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం – జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా.

అవసరాల అడ్వర్టైజ్‌మెంట్లలో పడి,
భావ దారిద్య్రపు టోపోగ్రఫీలో దాహంతో ఎండిపోయావు.
రియాలిటీ ఫిల్టర్‌ను కోల్పోయిన శూన్యంలో మిగిలిపోయావు.

పలుకునో, వివరణమునో, ప్రశ్ననో మ
లచి, ప్రియజిగీష విడుచుట ప్రణయమునకు
ప్రకటరూపము కాబోదు; లలితమైన
హృదయభూమిక స్పందించి కదలనపుడు.

ఫలితం ఏదైనా సరే, స్వేచ్ఛ బరువైతే అవ్వనీ.
అదొక యుద్ధం గెలిచిన గాయం.
పరాయి పట్టుపరుపుల మీద
సేదతీరడం కన్నా,
స్వయంకృత గాయాన్ని
గర్వంగా తాకడమే నాకు హాయి!

అయితే అందరూ తెలుగే మాట్లాడుతారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవటానికి డిక్ష్నరీలు మోసుకెళ్ళక్కర లేదు. ఉచ్చారణకి ప్రమాణాలు వుండటం మంచిదేననుకోండి. కానీ అది కొండని తవ్వి ఎలుకను పట్టేటయితే, శుద్దదండగ.

ప్రకృతి శక్తులతో మానవమాత్రుల మల్లయుద్ధం మళ్ళా మొదలైంది! పరాజయాన్ని నిరసిస్తూ, ఇనుమడించిన సంకల్ప శుద్ధితో, సముద్రంతో, సుడిగాలిలో పది రోజులు నిరాఘాటంగా పోరాడారు.

ఖగోళం కచ్చితమైన శాస్త్రం. ప్రసంగవశాత్తుగానీ ఉద్దేశపూర్వకంగాగానీ కొన్ని ఖగోళవిషయాలను ప్రస్తావించినపుడు, లేదా నమోదు చేసినపుడు, ఆ ఖగోళవిషయాలు ఎప్పుడు జరిగేవన్నది, ఎక్కడ జరిగేవన్నది కచ్చితంగా కాలంలో వెనక్కి వెళ్ళి నిర్ణయించవచ్చు.

పూజ్యులైన డి.వి.గుండప్పగారి ఈ గ్రంథము ’మంకుతిమ్మని మిణుకు’ అనే ఆంధ్రానువాదానికి మూలమైన ’మంకుతిమ్మన కగ్గ’కు రెండవభాగము. ఈ రెండవ భాగం ప్రకటమైనది 1984లో, డి.వి.జి గారు గతించిన తొమ్మిది సంవత్సరాల తరువాత.

పదిహేనవ శతాబ్దంలోని పోతనకు కెమెరాల గురించి, డ్రోనుల గురించి తెలిసే అవకాశంలేదు. కానీ తన ఊహలను కవిత్వంలోకి తర్జుమా చేసేటప్పుడు, చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న వివరాన్ని పద్యంలో ఇమిడ్చి, కవిగా తాను ఏమి భావనలు చేసాడో ఆ భావనలు పాఠక/శ్రోతల మనోనేత్రం ముందు సాక్షాత్కరించేలా పద్యాలను నిర్మించాడు. కవికి చెప్పదలచుకున్న అంశం ఎంత ముఖ్యమో, ఎలా చెప్పాలన్నది కూడా అంతే ముఖ్యం. అప్పుడే కావ్య ప్రయోజనం సిద్ధిస్తుంది.

ఇవన్నీ తెలిసిన పదాలే, తెలిసిన అర్థాలే. కానీ వాటిని సంయోజనం చేయడంలోనే ఉంది కవి ప్రత్యేకత. తెలిసిన పదాల సంయోజనంలోనే మాంత్రికత ఉంది. ఈ పదాల సంయోజనంలోనుండి చాలా శక్తిని తీసుకురావడం ప్రతిభావంతుడైన కవి చేయగలడు. అటువంటి అరుదైన కవి రవిశంకర్.

భార్గవి చెప్పిన తన చదువు కథలో కేవలం ఒక చదువరిగా మొదలైన ఆమె ప్రయాణం మాత్రమే కాక ఉత్తమ సాహిత్య ప్రేమికురాలిగా, విశ్లేషకురాలిగా ఎదిగిన క్రమాన్ని గమనించవచ్చు.

స్వర్గీయ పీచర సునీతారావు పేరుతో ఈ సంవత్సరం యథాక్రమంగా ఐదవ వార్షిక పురస్కారాలకోసం పీచర సునీతారావు ఫౌండేషన్ కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహితీ విభాగాలకు సంపుటులను ఆహ్వానిస్తున్నది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ!