మూడురోజుల కుంభవృష్టి తెరపిచ్చింది. సన్నటి జల్లు. రోడ్లన్నీ నీళ్ళల్లోనే మునిగి ఉన్నాయి. రోడ్డుపై ఐదారుగురు మనుషులు మూగి ఉన్నారు. చిట్టితల్లి హడావుడే అయుంటుంది అనుకున్నాను. చిట్టితల్లి కనపడలేదు. నీళ్ళల్లో పడవలు తేలుతున్నాయేమో అని చూశాను. ఇంటిముందు పడవలూ కనిపించలేదు. కనిపించడానికి అక్కడికి ఒక కిలోమీటరు దూరం వెళ్ళాలట.

నమ్మలేం కదూ
ఎవరిలో వారు గజగజలాడూతూ
సమయానికి ఎదురీదడం
ఎవరికి వారు మౌనంగా
గతం మరోసారి పునశ్చరణ గావించడం
నమ్మలేరు తీసిపారేసిన గడ్డిపరక నమ్మకం

ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక సరుగుడు చెట్టు వుండేది. మంచి వర్షంతో పాటూ తగినంత సూర్యరశ్మి కూడా ఉండడంతో అది ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ వుండేది. దాని నీడలో పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ వుండేవారు. దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పక్షులు కిలకిలారావాలు ఆలపించేవి. కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ సరస సల్లాపాలాడే ఉడతల్ని చూస్తే, ఎవరికైనా ఉత్సాహం ఉరకలేస్తుండేది.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

ఆధునిక వర్ణనాత్మక భాషశాస్త్రజ్ఞుల వలె సూత్రాలను ఉదాహరణలతో అతి తక్కువ పారిభాషిక పదాలతో తన వ్యాకరణాన్ని 191 పద్యాలతో రాసిన కేతన తొలి తెలుగు వ్యాకర్త. సంస్కృత సంప్రదాయంలో పాణినీయ పరిభాషకు భిన్నంగా తేలికైన మాటలతో రాసిన మొట్టమొదటి తెలుగు వ్యాకరణం. అందరూ చదవదగ్గది, చదివి ఆలోచించదగ్గదీను!

అడ్డం ఒకటికి రెండైతే కన్నుపొడుచుకుని చూడండి, ఏమైనా కనిపిస్తుందేమో (6) సమాధానం: అంధతమసము హిందీ సినిమాల ఖిలాడీహీరో యొక్క స్వర్గము (6) సమాధానం: అక్షయలోకము […]

క్రితం సంచికలోని గడినుడి-58కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-58 సమాధానాలు.

శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారికి సాహిత్యాభివందనాలు!

నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కలలకు రూపం వస్తే… అని ఒక సినీకవి ఆనాడు ఏసందర్భానికి రాశాడో కాని, ఆపాట ఈపూట ఈమాటలో మానోట పాడబడుతుందని ఆయన ఊహకు అందడం జరిగివుండదు. తెలుగు సాహిత్య అకాడెమీ కార్పొరేషన్ కో. & సన్స్ లిమిటెడ్‍కు శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారిని ఓనరుగా రాష్ట్రప్రభుత్వం నియమించడం తెలుగు (సంస్కృతానికి కూడా) భాషకు, సాహిత్యానికి ఒక అనిదంపూర్వగౌరవంగా మేము భావించడం జరిగింది. సాహిత్యరంగేతర్ అని శ్రీలక్ష్మిగారి నియామకాన్ని కొందరు విమర్శించడాన్ని మేము ఖండిస్తున్నాం. అసలు తెలుగులో కవి, రచయితలు కాన్దెవరు? ఖర్వాటుడికి ఈర్పెనెందుకు? అని ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుత సాహిత్యకారులు, కారకులలో ఎవరూ కూడా ఈ పదవికి అర్హులు కారని, ఇంతకుముందు ఓనరులైన కారుల వల్ల అకాడెమీ ఎక్కని ఎత్తులేమైనా అరాకొరా మిగిలివుంటే అవి ఎక్కించేయాలని, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నిజాలు నిజంగా ఇవీ అని మేము మనసుతో నమ్మడం జరిగింది. అచ్చతెలుగులో ఏదైనా చేయడం జరిపించగల శ్రీలక్ష్మిగారిని నియమించడం అనేది రాష్ట్రప్రభుత్వం తెలుగు లాంగ్వేజీ పట్ల ఎత్తూ లావూ తెలియని మమకారంతో, దానిని తెగబతికించాలన్న ఆవేదనతో, తెలుగు స్త్రీచెల్లెలి అభ్యుదయం కోసం ఒక అన్న తీసుకున్న నిర్ణయంగా కూడా గుర్తించి మేము సంతోషపడడం జరిగింది. శ్రీలక్ష్మిగారి భుజాలమీద, తల మీద, టేబుల్ మీద ఎంతో నమ్మకంతో పెట్టబడిన ఈ బాధ్యత బరువైనది. అయినా, ఎవరికీ అందనంత ఎత్తులో ఆండ్రోమెడా నక్షత్రమండలానికి ఇటు అంచుపై ఉన్న ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని అటు అంచుపైకి జరపడం చేయించగలరని వీరి శక్తిపై వంచన లేకుండా మేము నమ్మడం జరిగింది. ఇదే సమయంలో, 2పు లేదా 10ర, 5పు లేదా 25ర, 10పుస్తకాలు లేదా 50పైగా రచనలు స్వయంకృషితో, స్వార్థంతో (స్వ+అర్థంతో, స్వీయార్థంతో) ప్రచురించుకున్నవారికి వరుసగా బి.ఎ, ఎమ్.ఎ, డాక్టరేట్ గౌరవ పట్టాలతో పాటు, కులకవితాతిలక, మతకథాజాతిరత్న, సంప్రదాయసాహిత్యకాషాయసింధు, అభ్యుదయసాహిత్య‌అరుణబిందు, అస్తిత్వసాహిత్యషాజహాన్, మైనారిటీసాహిత్యమోజెస్ వంటి బిరుదులు కూడా అకాడెమీ ఇవ్వాలన్న మా చిరకాల కోరికను శ్రీలక్ష్మిగారు తమ క్రియాశీలక పనిలో భాగంగా అమలు చేయడం జరిపించగలరని మాకు ఒక ఆశ కూడా పుట్టడం జరిగింది. ఎలాగైతే దేశస్థాయిలో వ్యక్తిస్వేఛ్ఛ, వాక్స్వాతంత్ర్యం వంటివి ప్రజ మంచి కోసం తుడిచిపెట్టబడుతున్నాయో అలాగే సాహిత్య మంచి కోసం, విమర్శ, విశ్లేషణ వంటివి కూడా సాహిత్య మినిమం రిక్వయిర్‍మెంట్లనుంచి తుడిచిపారేయాలని ఈ సందర్భంగా మేము బాధతో డిమాండ్ చేయడం జరుగుతోంది. తమ సరస్వతి సేవలో భాగంగా, శ్రీలక్ష్మిగారు ఫేస్‍బుక్, వాట్సాప్ వంటి వేదికలలో విస్తరించిన సాహిత్య కూటములు, తండాలు, గుంపులు, గ్రూపులు, సెల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషనులలో చేరాలని, అక్కడి సాహిత్య రాజకీ సేవలో తరించాలని మాకు తపన రావడం కూడా జరుగుతోంది. అంతే కాకుండా, జన్మతః ఉద్దండులై కూడా, అహర్నిశలు కథాకథనశైలీశిల్పాది లక్షణాలను మధిస్తూ సాధిస్తున్న తమ దైనందిన యూజ్‍లెస్ డ్రజరీకి దూరంగా, స్వల్పతెరపి కోసం మాసిక త్రైమాసిక వార్షికాలుగా, ఆహ్లాదకరమైన పరిసరాలలో వనభోజనాలతో, ఉల్లాసమైన తుళ్ళింతలతో ఉల్లాసంగా తుళ్ళిపడుతూ రెండురోజులు, పెళ్ళికిముందు సంగీత్ సెరిమొనీ వంటి ఎల్లలు లేని ప్రేమయికస్నేహసౌభ్రాతృసిస్టర్‍హుడ్ [ఇది తత్సంతద్బం తెలుగుపదం అని తెలియడం జరిగింది – సం.] వాతావరణంలో హర్షానందాతిరక్తతతో గడిపి, ఎన్నో మధుర యాదిలనూ తీపి మెమరీసునూ మనసులోను, ఇంకా ఎన్నో సెల్ఫీలనూ పికె‍ఎ‍ఫ్‍సి తరహా గ్రూపు ఫోటోలనూ సెల్ఫోనులలోనూ నింపుకొని సేదతీరి, మండే మార్నింగుకల్లా మండే గుండెలతో తమ సామాజికబాధ్యతను భుజాలకెత్తుకుంటున్న ఫ్రంట్‍లైన్ సేవియర్స్ సాహిత్యకారసంగమాలడెక్‍లలో కూడా శ్రీలక్ష్మిగారు పేకముక్కల్లే కలిసిపోయి వాటిని మరింత దిగ్విజయం చేయాలని తెలుపుకుంటూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

పండు అనుకుని ఆంజనేయుడు సూర్యుడి దగ్గరకి ఆకాశంలో ఎగిరి వెళ్ళేడు. మీదికి బాగా లేచేక బాగా వేడెక్కిపోతాడెమో! పొద్దున్నే అంత వేడిగా ఉండడేమోలే! కాస్త కాలితే కాలింది అనుకుందామంటే అందడు కదా! గాలికి పుట్టేడు కాబట్టి ఆంజనేయుడు ఎగిరివెళ్ళేడు. నేనెలా వెళ్తానూ? ఎగరలేనే! ఎలా సూరీడిని రాకుండా చెయ్యాలీ? తెల్లారకుండా ఎలా చెయ్యాలీ?

ఇంటికి ఎవరెవరో వచ్చారు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బయటికేగాని లోపల ఎవరికీ డాలీని పట్టించుకోవాలని ఉన్నట్లు లేదు. నాకు సంతోషమేసింది, డాలీని నిజంగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డాలీ కూడా ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆడుకొంటున్న పిల్లల దగ్గర ఉంది. ఎవరితో కలవకుండా అందరినీ పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే డాలీ ప్రత్యేకమా?

స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి, ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది.

“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”

కట్టిన పుట్టమేమి, కనకాంబరమా? కరితోలు! నెత్తిపై
బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ? ఉమ్మెత గడ్డిపువ్వు, మై
దట్టిన దేమి, చందన కదంబరమా? తెలి బూది! నిన్ను జే
పట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ!

వెచ్చని సముద్రతలం మీద
చేపల చాపల కోసం
పడవ ప్రయాణం
లంగరేస్తే బట్ట నిలువదు
సహస్రాక్షుడి సహపంక్తి భోజనం
వేదాలు, హాలాహలము
మోసానికి మొదటి పాఠాలు

నీడల్ని పెకలించుకుని
శూన్యం ఊడ
ఇళ్ళల్లోకి ఎప్పుడు దిగబడిందో తెలీదు
బయటకి ఇళ్ళన్నీ ప్రశాంతంగా కనబడుతున్నా
లోపల గదులు గదులుగా శూన్యం
ఎప్పుడు విస్తరించిందో తెలీదు

బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో

వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో

కళ్ళనో గుండెనో మెత్తగా తాకే క్షణాలైనా
సరదా సరాగాల చెలిమి సమయాలైనా
బంధాలు బంధనాల వంతెనపై
బహిరాంతర్లోకాల నడుమ
నిరంతర వాత్సల్య చలనాలవుతాయి
గుట్టలుగా రాలిపోతున్న క్షణాల మధ్య
బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాల రాశులవుతాయి.

కట్టలు తెంచుకోలేని గొంతుకు
గంతలు కన్నీరు పెడుతుంటే
బరువును తూచలేని త్రాసుతో
విలువ తూలిపడుతుంటే

మళ్ళీ నల్ల కోట్ల
తెల్లని నటన
ఎర్రని వాదన

చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.