దట్టమైన పొగమంచు అలముకున్న వేకువజామున వారణాసికి అంబులెన్స్ చేరుకుంది. నటరాజ్ పూరణిని నిద్ర లేపాడు. ఆ వేకువ జాము చలిలోనూ గంగానది రాళ్ళమెట్ల అంచులో ఎంతోమంది స్మారక కర్మలు చేస్తున్నారు. ఎందరో స్త్రీపురుషుల తలలు గంగలో మునకలు వేసి లేస్తున్నాయి. పురోహితులు, సాధువులు, పశువులు, శవాలు, తిరగాడుతున్నారు. నటరాజ్ హరిశ్చంద్ర ఘాట్ ఎటువైపో ఒకరి దగ్గర కనుక్కున్నాడు.
శీర్షికలు సంచికలు
స్త్రీలో ప్రాకృతికంగా వచ్చిన దేహం వెనుక విలాసమయ శరీరం ఒకటుంటుంది. ఇది భౌతికమైనదే గానీ శరీరసౌష్ఠవాన్నీ, అశ్లీల ప్రదర్శననూ అపేక్షించేది కాదు. ఆ విలాసానికి ప్రేమే హేతువు. వేరేది ఉండే ఆస్కారం లేదు. అటువంటి ప్రేమమయ స్త్రీవిలాసం చాలా గొప్పది. అందుకే అది కావ్యాలలో ఎంతో గొప్పగా వర్ణింపబడింది. ప్రణయకోపంలో ఒక స్త్రీ ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో చెప్పే పద్యమిది. ఈ పద్యంలోని నాయిక తన నాయకుడిపై కినుక వహించింది.
కొన్నిటిలో పేజీకి ఒకటి, కొన్నిటిలో పేజీకి మూడూ నాలుగు కూడా. అన్నీ శృంగార భంగిమలే. కూచున్న, పడుకున్న, నిలబడ్డ, ఎత్తుకున్న, సోలిన, వాలిన, పేలిన కామకేళి విన్యాసాలే ఆ బొమ్మలు. వాత్సాయనుడు కూడా కనిపెట్టలేని సూత్రాలు అన్నిటిని మోహన్గారి పెన్సిల్ పని పట్టింది. వాటిని చూడటానికి ముందస్తుగా నాకు సిగ్గేసింది.
ఋగ్వేదంలోని పదవ మండలంలో 129వ సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో అన్న విషయాల గురించి మహాశ్చర్యకరమైన ప్రశ్నలు వేస్తుంది. భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలం నుండి కాకుండా ఆంగ్లానువాదం నుంచి అనువాదం చేయడం క్షమించరాని నేరం. అందుకే సంస్కృత మూలం నుండి ముత్యాల సరాలకు దగ్గరిగా ఉండే ఛందంలో నేను చేసిన తెలుగు అనువాదం ఇది.
ఒక విధంగా ఆలోచిస్తే భౌతిక శాస్త్రం యొక్క గమ్యం వాస్తవం యొక్క నిజ స్వరూపం కనుక్కోవడమే. ఈ వాస్తవాన్నే మనం వేదాంత తత్త్వంలో బ్రహ్మము, బ్రహ్మ స్వరూపము అని అంటాం. మన ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ బ్రహ్మము గురించి చేసిన అన్వేషణ అనే చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల గమ్యమూ ఒక్కటే; వారు ఎంచుకున్న మార్గాలు వేర్వేరు, వారి పరిభాషలు వేర్వేరు. వేదాంత తత్త్వంలో అన్వేషణ కేవలం తర్కం, మీమాంసల ద్వారా జరుగుతుంది.
ఆయన ఆర్ధికంగా జర్మనీ వెనుకబాటుతనం, ప్రజలు మోస్తున్న అవమానభారాన్ని దగ్గరగా చూశారు. అంత ఘోరమైన ఓటమి, ప్రళయ వినాశనం తరవాత, తప్పు చేశామన్న భావనతో కుంగిపోయిన ఆ దేశాన్ని గుర్తించారు. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నపుడు కూడా, పశ్చాత్తాపంతో చింతించే ప్రజల మనస్సాక్షి ఎంత గొప్పదో అన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అంతకన్నా ఎక్కువ వినాశనాన్నే, అమెరికా జపాన్కు కలిగించింది.
ఆంగ్ల సాహిత్యంతో బాగా పరిచయం ఉన్న గురజాడ అప్పారావు తన కన్యాశుల్కంలో బయటకి ఈ పేకాటని వర్ణిస్తున్నట్టు కనిపించినా, దీనిని ఆసరాగా చేసుకుని పోలీసులకీ కొన్ని వర్గాలకీ మధ్య నడిచే అనుబంధాలని కథాగమనానికి, అందులో కొన్ని కీలకమైన మలుపులకీ చాలా చక్కగా వాడుకున్నారు.
నా దాహం తీరడం లేదు. లోలోపల దహించి వేస్తున్న దాహం. అంచెలంచెలుగా పెరిగిపోతున్న దాహం. చివరకు నిద్ర కూడా కరువైంది. ఏమీ చేయాలో తోచలేదు. మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. అతడు నాకు పాలీడిప్సియా ఉందని, నాలో ఒక రకమైన స్క్రిజోఫినిక్ లక్షణాలు కనిపిస్తున్నాయని నిర్ధారించాడు. నాకు భయం వేసింది. నాకు దాహం తప్ప ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నించా. కానీ అతడు వినలేదు. మెదడు మగతలో జారుకోవటానికి అంటూ కొన్ని మందులు ఇచ్చాడు.
వెలుతురు లేని ఆకాశం
కాంతి సంవత్సరాలు
తరించడం ఎలా?
క్షణాల దండ కట్టి
ఎవరి మెడలో వేయాలి?
నిరీక్షణకి అర్ధం లేదు
వారం ఎలా గడుస్తుందో మీరూ చూశారు. వారాంతంలో తప్ప మాకు సొంత పనులకు టైముండదు. అందుకే శనాదివారాల్లోనే మా షాపింగ్ అంతా చేసుకుంటాం. మీరు గుళ్ళూ గోపురాలూ తిప్పమంటే నేను కాదనలేదే. మా మేనేజరుతో మాట్లాడి, సెలవు తీసుకుని వెళ్దాం అని అన్నాను. అక్కడ లాగా అలా అనుకుని ఇలా వెళ్ళిపోవడం కుదరదు. అందుకని ఆపై వచ్చే శనాదివారాలు వెళ్దామని అన్నానే కాని వద్దని అనలేదుగా! ఆ మాత్రం దానికే అంత మాట అనాలా?
అక్కడ! వెలసిపోయినా పాత చీరలో
కళ్ళు చికిలించి
పగుళ్ళిచ్చిన అరిపాదంపై పెగిలిన
చర్మాన్ని, నీ వొణికే వేళ్ళతో లాగుతూ
గేటు వంకా, ఆపై
వీధి వంకా, మాటి మాటికీ చూస్తూ
హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టుగా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు. అయితే, ఆపాటి చదువుతో ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు.
ఊరికే ఉండడం కన్నా
క్షేమమైన దారేదీ లేదనుకుంటా ఇక్కడ.
క్షేమం అంత అవసరమా అని ప్రశ్న
జవాబు తెలిస్తే
వెయ్యి లోకాలకి ఒకేసారి తెరుచుకుంటావు
స్వేచ్ఛ లోకి వెళ్ళటం ఉన్మాదమా
అంటావు భయం భయంగా
చూపుడు వేలుకు గోరునామ
తడ తడ పెట్టినట్టు బాధ పడడం ఎందుకు
ఇంతకీ ఏమైంది అనడిగాను.
మా చిన్నన్న చేయించి
తీసుకొచ్చి ఇచ్చిన వస్తువు
విరిగిపోయిందంది.
మొసళ్ళ వంటి మనుషులకు
కట్టుకథల చేపలు విసిరి ఇద్దరం
సాయంత్రాలు పూచే పసుపు ఎండలో
తడిసినప్పుడు
నిరీక్షలు చొక్కాల్లా ఆరేసి
చలి నీడల కంబళిలో తలలుంచి దాక్కున్నప్పుడు
నువ్వొక పల్చని కాగితమై వస్తావు
నేను కుంచెనై
నీకు వేవేల రంగులద్దుతాను
నువ్వొక మట్టి ప్రమిదై వస్తావు
నేను చమురై
నిన్ను దేదీప్యమానంగా వెలిగిస్తాను
రోజువారీ జీవితం
నీ ఊహల్ని చెదరగొట్టకముందే
ఆ రాత్రికో తర్వాతరోజు ఉదయానికో
వేళ్ళు ప్రసవించనీ
అప్పుడిక మళ్ళీ నువ్వు
నీ చెట్టురూపంతో సహా అదృశ్యమైపోవచ్చు
అడ్డం తాదూర లేనిదానికి మరో రూపము(4) సమాధానం: సొరంగము పరిశీలించలేదుట ఎవరూ, పాపం (5) సమాధానం: అనాలోచిత ఎదలోన కదలే తుమ్మెద పాట దాగిన […]
క్రితం సంచికలోని గడినుడి-84కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-84 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: