నిద్ర మధ్యలో మెలుకువ ఒచ్చింది ఆమెకి. కుడివైపుకి తిరిగి చూసింది. పక్కన పడుకునివున్న అతడి కళ్ళు తెరచి వున్న గవాక్షంగుండా కనిపించని దూరాలలోకి చూస్తున్నాయి. దగ్గరగా జరిగింది. “ఏమిటా ఆలోచనలు నిద్రవేళ?” అంటూ అతడి చెక్కిలిపైన చేతిని వేసి తన వైపుకి తిప్పుకుంది. ఆ రాత్రివేళ ఒకానొక అడవిలో ఓ పర్ణశాలకి పహారా కాస్తూన్న తన కవల సోదరుడు ఆలోచనలనిండా నిండివున్నాడని అతడు చెప్పలేదు.

ఇలా ఆదివారం అబిడ్స్‌లో పాత ఎర్రబారిన, దుమ్ముపట్టిపోయిన మార్ట్ డ్రకర్ బొమ్మల పేజీలు కాకుండా, ఒకసారి మార్కెట్‌లోకి మార్ట్ డ్రకర్: ఫైవ్ డికేడ్స్ ఆఫ్ హిస్ కెరీర్ అనే పేద్ద పుస్తకం వచ్చింది. బ్లాక్‌లో మరీ వైట్ మనీ పెట్టి ఆ పుస్తకం కొన్నా. పుస్తకం పేజీ తిప్పగానే మార్ట్ డ్రకర్ ఇంటర్యూ ఉంది. ఇలా…

రెండు గదుల పెంకుటిల్లు. బయట వరండాలో రెండు అరుగులు. నవారు కుర్చీ. ఓ నులక మంచం. వంటింటి సామాన్లు, ఆమె చీరలు కాకుండా, అన్నిటికంటే ఆకర్షించింది అక్కడ ఉన్న చిన్న చిన్న వెదురు బుట్టలు. రకరకాల రంగుల్లో ఉన్నాయి. వాటిలో చిన్న చిన్న రంగుల గవ్వలు. గవ్వలతో చేసిన బొమ్మలు. పక్కన ఓ ట్రంక్ పెట్టె. దానిని తెరవాలనిపించలేదు. వాటినన్నిటిని చూస్తుంటే ఆమె ఆ ఇంటిని ఎంత ఇష్టంగా చూసుకుందో కనిపిస్తుంది.

రామచంద్రమూర్తి అర్థమయిందన్నట్టు తలూపి వెంటనే తన చివరి కోరిక కోరుకున్నాడు. కానీ “నీ యాస తమాషాగా ఉందే! దేవతలు మాట్లాడేదిలా లేదే!” అని వ్యాఖ్యానించి మరీ కోరుకున్నాడు. దేవత నొచ్చుకున్నాడు, కొద్దిగా కోపం తెచ్చుకున్నాడు. “దేవతల యాసా? అంటే? ఉన్నట్టుండి నేను మాట్లాడే తీరును ఆక్షేపించడానికి దేవతల యాస ఏదో నువ్వెప్పుడైనా విన్నావా ఇంతకు ముందు?” దేవత మొఖంలో దైవత్వం కాస్త తగ్గింది.

కైలాసరావు చూపు ఆమె వెంటే వెళ్ళింది. ఆమె గది లోపలికి వెళ్ళిపోయింది. ‘కిఱ్ఱు’మనే శబ్దంతో తలుపు మూసుకుని, ఆయన చూపు తలుపుకు గుద్దుకుంది. మూసిన ఆ తలుపు మీద ఒక ఆడ మనిషి ఆకారం చిత్రలేఖనంలా కనిపించింది. వయసు పదహారేళ్ళు ఉంటుంది. నున్నగా దువ్విన తలమీద నాగరం, పాపిడికి రెండుపక్కలా నెలవంక బిళ్ళ, వదులుగా జారవిడిచిన జడకు జడకుప్పెలు, నుదుట వెలుతురును వెదజల్లే ముత్యాల పాపిడిబిళ్ళ.

మొత్తంగా తనను తాను
అక్షరాల్లో కుప్పబోశాడు
ఎక్కడ ముట్టుకున్నా
వదిలివెళ్ళిన ఆఖరిచూపో
రగిలి రగిలి బూడిదైన గుండెనో
రెప్పల చివర మిగిలిన కలో

శుభ్రజ్యోత్న నీలాకాశం కింద
గుసగుసల ముచ్చెమటల ముచ్చట
ఇరువురికి తెలియని
ఒక ఆపతి ఇరువురి సోపతి
ఫెళ ఫెళ ఆర్భాటాల
ఉరుములు మెరుపులు

అడ్డం ఎగిరే పావురానికీ, ఈవిడకీ మాఘమాసమే ఎంతో ప్రియం (5) సమాధానం: రామచిలక వేటూరి వారి ఇంకులో ఎటుచూసినా మనిషిబ్రతుకింతే (3) సమాధానం: నటన […]

వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? అనుకుంటాం. పులుముకున్న చీకటి వేదనని తామే అనుభవించి మనకు చల్లని చందమామలైన వాళ్ళు కొందరు. ఈ పదిహేనుమందిలో అత్యాశతో అహంకారంతో అపకీర్తి మూటకట్టుకుపోయిన పాబ్లో ఎస్కోబార్ తప్ప తక్కినవారంతా కళాకారులే, తమ రంగాల్లో నిష్ణాతులే.

మన దేశవాళీ వంగ, కర్ణాటక, పంజాబీ సంగీతాలే కాదు, రజని మధ్య ప్రాచ్య సంగీతం ఆధారంగా ఎన్నో పాటలు వ్రాసి స్వరపరిచారు. మధ్య ప్రాచ్య సంగీతం ఆయన స్వభావానికి మరింత దగ్గరైన సంగీతం అనుకుంటాను. ఆయన ఒక సంగీతస్వరం వింటే దానిలో ప్రయోగాలు చెయ్యకుండా వుండేవారు కారు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

గత 29 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, రాబోయే క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ స్థాయిలో 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ ‘పోటీ కాని పోటీ’లో రెండు విభాగాలు ఉన్నాయి.

సాహిత్యానికి మనుగడ రచయితలు, పాఠకులు. అయితే, వీరిద్దరి మధ్యా వారధిగా నిలబడి, మంచి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ, పాఠకుల అభిరుచిని పెంపొందించేందుకు సాయపడే మాధ్యమాలలో పత్రికలది ముందువరుస. ఒక్కొక్క తరంలో రచయితలు కుదురుకునే వేదికగా కొన్ని మాసపత్రికలు, వారపత్రికలు బలంగా పనిచేశాయి. పత్రికలు రచయితల ద్వారానూ, రచయితలు పత్రిక ద్వారానూ పేరు తెచ్చుకొన్న సందర్భాలవి. దీపావళి, ఉగాది, సంక్రాంతి పండగలు ప్రత్యేక సంచికలుగా సాహిత్య సంబరాలను కూడా మోసుకురావడం అప్పటి ఆనవాయితీ. ఈ సరళి కేవలం వ్యాపారం కోసమే కాదు, మంచి రచయితలను, నాణ్యమైన సాహిత్యాన్ని నిలుపుకోవడానికి కూడా ఉపయోగపడింది. కాలం ఎంతమారినా, రచయితకు పత్రికకూ ఉన్న ఈ సంబంధం మారలేదు. ఎందుకంటే, పత్రికకు ఎన్ని వనరులు ఉన్నా, ప్రధానంగా పత్రిక ఆధారపడేది సమకాలీన రచయితల మీద, నాణ్యమైన రచనల మీదే. తన రచన పదిమందికి చేరడానికి రచయితలకు వేరే దారులు ఉన్నా, అందంగా తీర్చిదిద్దబడి, ఒక స్థాయి ఉన్న రచనలే ప్రచురింపబడతాయి అన్న పేరు వచ్చిన పత్రికలో రచనను చూసుకోవడం, దానికదే ఒక గౌరవం. వేలి చివర ఒక స్థలం ఖాళీగా కనబడి రాయమని పోరుతున్నా నిభాయించుకుని, ఆ ఆలోచనలను ఒక వరుసలో, శ్రద్ధతో రాసుకోవడం, దిద్దుకోవడం పరిశ్రమతో కూడిన పని. కానీ అది ప్రాథమిక సాహిత్య అవసరం. అంతేకాదు, అది ఎంతో తృప్తినిచ్చే వ్యవహారం కూడానని ఎందరో చేయి తిరిగిన రచయితలు అంటారు. ఫేర్‌వెల్ టు ఆమ్స్ ఆఖరు పేజీని సరైన పదాల కోసం వెదుక్కుంటూ ముప్పై తొమ్మిదిసార్లు తిరగరాశాడట హెమింగ్వే. తాను వ్రాసినదానికంటే చెరిపివేసినదే ఎక్కువ అంటాడు నబకోవ్. సరిగ్గా పడవలసిన ఒక్క పదం కోసం రోజుల తరబడి ఎదురు చూసేవారట దేవులపల్లి కృష్ణశాస్త్రి. అజంతా తన స్వప్నలిపిలో ప్రచురించిన ప్రతి కవితా ఆయన మళ్ళీ మళ్ళీ దిద్దుకున్నదే. ఏది తోస్తే అది వ్రాసే ప్రతీవారూ రచయితలు కాలేరు; రచయిత కాదలచుకున్న వారికి తన రాతని బేరీజు వేసుకోని అందులోనుంచి ఎంతభాగాన్నయినా నిర్దాక్షిణ్యంగా తీసివేయగల చూపు ఉండాలి అంటుంది సిదొనీ కొలెట్. అట్లాంటి చూపు సహజంగానే రచయితలకు ఉంటే మంచిదే. లేనప్పుడు ఆ నిష్పాక్షికమైన చూపును ఇవ్వగలిగే పత్రికలు అవసరం. ఎందుకంటే, ఆ చూపు తన రచనలోని ప్రతి అక్షరాన్ని ప్రేమించే రచయితకు అందులోని అక్కర్లేని భాగాన్ని కూడా చూడగల శక్తిని ఇస్తుంది. తద్వారా రాతలో బిగి పెరుగుతుంది. ఆ బిగి ద్వారా రాతలో నాణ్యత. ఆ నాణ్యతే పాఠకులను రచనకు కట్టి పడేస్తుంది, వారి అభిరుచిని మెరుగుపరుస్తుంది. అలా నాణ్యత కోరుకునే రచయితలు పత్రికలకు అవసరం. బ్లాగులు, సోషల్ మీడియాల ఉద్దేశాలు వేరు కనుక, అక్కడ వ్రాసే వారికీ చదివే వారికీ ఈ చూపు అవసరం ఉండచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆ చూపునివ్వగల పత్రికలు రచయితలకు అవసరం. రచయితలు కాదలచుకున్న వాళ్ళకి మరింత అవసరం.

కొన్ని పాతజ్ఞాపకాలు ఏనాటికీ మరుపురానివి! ఆరోసారో పదహారోసారో చూస్తున్న ‘రోమన్‌ హాలిడే’ లాంటివి. మహాకవిని వోక్స్‌వేగన్‌ బగ్‌లో మేడిసన్‌ తీసుకొని వెళ్ళటం, జీడిమామిడి చెట్లకింద కూచొని మరోకవితో డైలన్‌ థామస్‌‌ని చదవటం, టెన్సింగ్‌ నార్కేకి షేక్‌ హాండ్ ఇవ్వడం, ఇండియా నించి కొత్తగా అమెరికా వచ్చిన ప్రొఫెసర్‌‌‌ని మంగలి షాపుకి తీసికెళ్ళి తెల్ల అమ్మాయి చేత క్షవరం చేయించటం, ప్రసిద్ధ భారతీయ చిత్రకారుడితో మస్తుగా స్కాచ్‌ పట్టించడం, వగైరా!

సూర్యాస్తమయం నేనున్న చోటుకు వ్యతిరేక దిశలో అయింది కాని, అస్తమయం తరువాత వెల్లివిరిసే సంధ్యాకాంతులు పరిసరాలను సువర్ణభరితం చెయ్యడం గమనించాను. అవును – ఒక్కోసారి సూర్యాస్తమయ దృశ్యం కన్నా దాని తరువాత జరిగే వర్ణలీల మరింత మనసుకు హత్తుకొంటుంది.

బాపు ఒక నిట్టూర్పు విడిచి రాట్నం వడిగా తిప్పసాగారు. కీచుమని శబ్దం రావడం మొదలై, దారం పురి వదులయ్యి తెగిపోయింది. బాపు మళ్ళీ దారం కలిపి తిప్పడం మొదలు పెట్టారు. దారం మళ్ళీ తెగింది. ఆయన వేళ్ళకీ చక్రానికీ మధ్య వుండే సమన్వయం లోపించినట్టుగా వుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతోంది. బాపు తల పూర్తిగా కిందికి వంచి, తన దృష్టినంతా చక్రం మీద కేంద్రీకరించారు. ఆయన వేళ్ళు వణకడం ప్రారంభించాయి.