వసుచరిత్రలోని రెండవ ఆశ్వాసంలో శుక్తిమతీనది, కోలాహలపర్వతాల సంబంధాన్ని, సంగమాన్ని ప్రకృతిపరంగాను, వ్యక్తిపరం గాను శ్లేషమూలకంగా అత్యద్భుతంగా వర్ణించడంలో రామరాజభూషణుఁడు చూపిన వైదుష్యం, కౌశల్యం, కవిత్వపాటవం సాహిత్యవిమర్శకులు తరచుగా విశ్లేషించునవే. శుక్తిమతీ కోలాహలుల పుత్త్రికయైన గిరికయొక్క చెలికత్తె మంజువాణి గిరికాదేవి జన్మప్రకారాన్ని నర్మసచివునికి వివరించే సందర్భంలో ఈవర్ణన చేయబడింది.
శీర్షికలు సంచికలు
ఆవిడ నమ్మడం లేదు గానీ, ఈ హత్యకు… అదే హత్యాయత్నానికి కారణం ఆలీబాబానే. కన్ఫ్యూజ్ చేయడానికి అని ఆమె అంది గానీ అసలు సైతాన్ అని పెడితే, ఏ కన్ఫ్యూజన్ వుండేది కాదు. హత్యలు, ఊచకోతల నుంచే నాయకుడిగా ఎదిగినవాడతడు. అంటే స్వయంగా చేస్తాడని కాదు, చేయిస్తాడు. అందుకు అధికార బలాన్ని అర్థవంతంగా వినియోగిస్తాడు. అందరం ఒక్కటిగా వున్న మమ్మల్ని విడదీసి, వేర్వేరని చాటింది అతడే.
బయట నుంచి గుర్రం జూలు విదిలించిన శబ్దమూ గంటల శబ్దమూ వినిపించాయి. అంటే బగ్గీ సిద్ధమైందన్నమాట. కొట్టు తాలూకు తాళాల గుత్తి చేతిలోకి తీసుకుంటాడు నాన్న. గడియారం ముల్లు ఎనిమిదిన్నర వైపు కదులుతూ ఉంటుంది. క్వీచ్ క్వీచ్ మంటూ నాన్న తన కిర్రు చెప్పులు వేసుకుంటాడు. తర్వాత గొడుగు సరిగా పని చేస్తుందా లేదా చూడ్డానికి దాన్ని ఒకసారి తెరిచి మూసిన శబ్దం వినిపిస్తుంది. ఇదంతా రోజువారీ రివాజు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది.
నేనొక్కడినే కూర్చున్నాను అక్కడ, పిగిలి –
ఎదురుగా, ఎవరో
తరుముతున్నట్లుగా, పరిగెత్తి పోయే
నీడ లేని మనుషుల్లో, నువ్వూ కలిసిపోయి
క్షణకాలం ఆగి, నను
వెనుదిరిగి చూసి, వాళ్ళలో కనుమరుగై!
ఓ వర్షాకాలపు మధ్యాహ్నం అలిసిపోయిన భూమి వదులుతున్న వెచ్చని ఊపిరి చర్మాన్ని తాకుతున్నట్టుగా, ఎండలో పచ్చిక చెమ్మ నిండిన పిల్లగాలి వీస్తోంది. ప్రకృతికీ ప్రపంచానికీ దాని బాధేదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఓ పక్షి విసుగు పుట్టించేలా మధ్యాహ్నమంతా ఆపకుండా కూసింది. పోస్టుమాస్టరుకు చెయ్యడానికి పనేమీ లేదు. తనకు చూడడానికి ఉన్నదల్లా వానకు తడిసి నిగనిగలాడుతున్న ఆకులూ, మిగిలిపోయిన తెల్లని పలుచని మేఘాలూ మాత్రమే.
కలలపల్లకిపై ఊరేగుతూ
మరొక మెరుపువాక్యం
రంగుల రేకులు విప్పుకుని
అందంగా పూస్తుంది
వేరొక గుండె దోసిలిపట్టి
అపురూపంగా కళ్ళకద్దుకుంటుంది
చర్మంపై మునుపటి నునుపు లేదు,
పోనీ కాంతీ లేదు.
బుగ్గల్లో కరుకుదనం.
నవ్వులో ఒకలాంటి అంతశ్శోకం
పళ్ళ సందుల్లో శూన్యం.
అయినా తెల్లటి నిర్మలత్వంలో ఒక దాపరికం.
కొందరు ఎప్పటికోగాని కొత్త సంపుటి తీసుకురారు. అది కూడా రాసినవారు చిన్నప్పటి స్నేహితులైతే, కాలం పరుసవేది హస్తస్పర్శతో బంగారంగా మారిన గతదినాలు గుర్తుకు వచ్చి, జ్ఞాపకాల పరిమళం చటుక్కున గుబాళిస్తుంది. ఇటువంటి అనుభవమే రెండు కవితా సంపుటాల విషయంలో ఈమధ్య నాకు కలిగింది.
తెరిచీ మూసే గుప్పిళ్ళతో
ఆ గుప్పెడు పదాల విరాట్ రూపాన్నీ
మాటల మధ్య లుప్తమైన ఖాళీలనూ
ఖాళీల మధ్య గుప్తమైన భావాలనూ
గుండెతో చూసిన ఇంద్రియాలన్నీ
వెలుతురు కొమ్మలై మొలిచాయి
ఈ కవిత చివరిలో బాలుడికి ఉండే జిజ్ఞాస, చైతన్యం మనిషిలో నిరంతరం లేకపోతే ఈ ఆటని ఆడలేడని ఒకే ఒక పార్శ్వాన్ని మనకి తెలియజేసినట్లు మనకి అనిపిస్తుంది. కాని, తరచి చూస్తే, కవిత ప్రారంభంలో చెప్పిన ‘చదివి పారేసిన పుస్తకం’ అయిన ఆకాశం ఆ జిజ్ఞాస ఉన్నవాడికే తన పుస్తక రహస్యాల్ని విప్పుతుందన్నది సంజ్ఞ.
అడ్డం ఏనుగు సింహం కలిస్తే యోగమే (5) సమాధానం: గజకేసరి ముందు నడచే ఉక్కరి (5) సమాధానం: వీరాగ్రేసరి ఓహో నీహార తీర నీలాంబర […]
క్రితం సంచికలోని గడినుడి-85కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై నాలుగు మంది సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-85 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
ఇరవై అయిదేళ్ళ క్రితం, ఇంటర్నెట్ వాడకం మొదలయిన తొలినాళ్ళలో, ప్రవాసంలో ఉన్న తెలుగు సాహిత్యాభిమానులు, రచయితల కోసం ఒక చిరువేదికగా రూపుదిద్దుకున్న పత్రిక ఈమాట. మొట్టమొదటి ఈమాట సంచిక విడుదలై పాతికేళ్ళు దాటిన సందర్భంలో, ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సింహావలోకనం చేసుకుంటుంటే, మైలురాళ్ళ లాంటి ఎన్నో సందర్భాలు కనపడుతున్నాయి. వెబ్ పత్రికలంటే ప్రింట్ పత్రికల స్థాయీ కాదు, వాటికి ప్రత్యామ్నాయమూ కాదు అనుకున్న ఆ తొలినాటి నుండి, కథలైనా, కవితలైనా, ఏ వార్షిక సంకలనాలైనా వెబ్పత్రికలను జల్లెడ పట్టక తప్పని ఈనాటి దాకా సాగిన సుదీర్ఘ ప్రయాణమిది. లాభాపేక్ష లేకుండా, కుల మత రాజకీయ వాదాలకూ వర్గాలకూ అతీతంగా, రచయితలకూ పాఠకులకూ స్నేహపూరితమైన వాతావరణాన్ని అందించే ఉమ్మడి వేదికగా మనగలగడమే మొదటినుంచీ ఈమాట ఏకైక లక్ష్యం. సాహిత్యానికి నిర్వచనాలు, పరిధులు, పరిమితులు ఉండవు, ఉండకూడదు అన్న బలమైన నమ్మకంతో అన్ని రకాల అభిప్రాయాలకు, నూతన సాంప్రదాయ సాహిత్యాలకు, విభిన్న సాహిత్య ప్రయోగాలకూ నెలవు కావాలన్న ఆదర్శానికి, ఆశయానికీ ఈమాట ఈనాటికీ కట్టుబడి ఉంది. రచయితకు ముఖస్తుతి గౌరవం కాదు. వారి రచన పట్ల శ్రద్ధ చూపడం, సమయం వెచ్చించడం, చర్చించడం, సహృదయంతో విమర్శించడం – ఇదీ రచయితకు చూపగల నిజమైన గౌరవం. రచయితల పేరు కాదు, రచన నాణ్యత ముఖ్యం అన్న అకుంఠిత నియమంతో నడపడం వల్ల, కొందరు రచయితలు ఈమాటకు వ్రాయలేదు, కొందరు మా పరిష్కరణ పద్ధతుల పట్ల సుముఖులు కాలేదు. మరి కొందరు ఆగ్రహించారు, దూషించారు. కానీ ఎందరో ఈమాటకు వ్రాశారు, ఇంకొందరు కేవలం ఈమాటకే వ్రాశారు. ఎందరో రచయితలు మా పరిష్కరణలను సాహిత్యస్ఫూర్తితో ఆహ్వానించారు. అవసరమైన చోట వారి రచనలు మెరుగు పరుచుకోగలందుకు మా సూచనలు స్వీకరించారు. ఈమాట నియమాన్ని సాహిత్యవ్యాసంగపు ముఖ్యావసరంగా గుర్తించి సంపాదకులతో కలిసి పనిచేసి తమ రచనలకు మెరుగులు దిద్దుకున్నారు. ఒకరి తప్పులు ఒకరు ఎత్తి చూపుకోవడం కాదు, కలిసి తప్పులు దిద్దుకోవడం ఇది అని గుర్తించారు. రచయితలు సంపాదకులూ ఒకరికొకరు తోడుగా ఒకే గమ్యం కోసం కలిసి చేసే సాహితీప్రయాణం ఇది అని అర్థం చేసుకున్నారు. అలానే ఎందరో సాహిత్య ప్రేమికులు ఇక్కడి రచనలను మిత్రులతో పంచుకున్నారు. చదివారు, చదివించారు. విమర్శించారు. తప్పులను నిష్కర్షగా చర్చకు పెట్టారు. మేము మెరుగయ్యే మార్గాలు ప్రతిపాదించారు. ఒక సాహిత్యసమాజంగా మనందరి గమ్యం ఒకటే అన్న స్పృహతో సాగిన ఈ ప్రయాణాన్ని, కాలంతో ఎదుగుతూ, సమకాలీనతకు ఒదుగుతూ, ఇలానే కొనసాగించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంటాం. మాకు వెన్నుదట్టి, ప్రోత్సహించి ఈ ప్రయాణంలో మాతో కలిసి నడిచిన రచయితలు, పాఠకులకు ఈ సందర్భంగా మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. తొలినాటి నుంచీ తోడు నడిచిన రచయితలతో పాటు ఎందరో కొత్త రచయితలు, ఎంతో ఆసక్తితో ఈమాటకు తమ రచనలు పంపుతున్నారు, మాతో చర్చిస్తున్నారు, ఈమాట నిరంతరాయంగా నడపడానికి మాకు ఎనలేని ప్రోత్సాహం ఇస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇకముందూ ఇలానే ఉంటుందని ఆశిస్తూ, మీ అందరికీ మరోసారి కృతజ్ఞతాపూర్వకంగా ఈ సంచికకు సాదర స్వాగతం పలుకుతున్నాం.
ఎలియట్ ఎక్కడనుండి ఎవరినుండి దేనిని గ్రహించినా యథాతథంగా గ్రహించడు కదా. అంతేకాదు, తిరిగి యివ్వకుండా ఏదీ తీసుకోడు. ఈ ఉపనిషత్తులోని ‘దత్త దామ్యత దయధ్వమ్’ వరుస మార్చి, ‘దత్త దయధ్వమ్ దామ్యత’ చేశాడు. అంతే కాదు. ఆ ఉపదేశాలకు తన స్వీయభాష్యం కూడా చెప్పాడు, కవితారూపంలో.
“నా భయాలు, బలహీనతలు, ఇష్టాలు, కోరికలు, నా రహస్యాలన్నీ నీకు చెప్పేశాను. నువ్వేం చెప్పవు!” బుంగమూతి పెట్టింది. ఆమెకి నచ్చినట్టు ఒక బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అడిగాడు. “ఏం చెప్పను?” “ఏదయినా నీ చిన్నప్పటి జ్ఞాపకం.” “ఫొటోగ్రఫీ కోర్స్ చేయాలని ఆశ. ఫ్రెండ్స్ అంతా చేరారు. ఇంట్లో గొడవ. డబ్బుల్లేవని నాన్న. ఆయనకి తాగుడు అలవాటు. బార్లో బాకీ కట్టి రమ్మని ఆరోజు డబ్బులిచ్చి పంపాడు. నేనెక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను…”
మానవ నిర్మాణ అద్భుతాలలో ఒకటైన పనమా కెనాల్ దగ్గర ఆ అపరాహ్ణ సమయం ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడిచింది. ఈ కెనాలే లేని పక్షంలో పనమా అనేకానేక చిరుదేశాలలో ఒకటిగా ఉండిపోయేది. ఈ కాలువకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యత పనమాను ఒక నిర్దుష్టమైన ఉనికి ఉన్న దేశంగా నిలబెట్టింది.
సావిత్రి కథను ఇంగ్లిష్లో చెప్పిన మొదటి కవయిత్రి ఈమే. తొరూ దత్ రచనలో సావిత్రి కథ ప్రణయభావనలతో అందమైన కావ్యమైంది. అరవింద ఘోష్ ఈ కథకు తాత్వికరూపమిచ్చిన విషయం తెలిసిందే. దాన్ని మోడర్న్ క్లాసిక్స్లో ఒకటిగా పరిగణిస్తారు.
నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను. ఈ కథ ప్రచురించడం ద్వారా ముందు ముందు రాబోయే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా ఈమాట బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాను. – ఈమాట సంపాదకుడు. 06 నవంబర్ 2023.
శివరాత్రి శివరాత్రికీ ఇంట్లో సాయంత్రం వరకూ ఉపవాసం, రాత్రి జాగారం ఉంటారు బామ్మా, చిట్టి బామ్మగారూనూ. అమ్మా పిన్నీ అమీను తాతయ్యగారు ఉపవాసం ఉండరు. జాగారం మాత్రం చేస్తారు. మేం పిల్లలం తాతయ్యగారిలా జాగారం మాత్రమే ఉంటాం. వాళ్ళు పడుకోమన్నా పడుకోం.