హిందూ వివాహవ్యవస్థలోని బోలుతనం, ఆధిపత్య భావజాలం, కోడంట్రికం, ఇంటి కోడలి సహనం, పతివ్రతాలక్షణం – నవలలో ప్రధానాంశాలు. అయితే కమలను అంతమాత్రంగానే చిత్రించివుంటే ఈ నవలలో చెప్పుకోదగ్గ విషయం ఉండేది కాదు. కమలలో ఈ ‘పవిత్ర భారతనారి’ లక్షణాలెన్ని ఉన్నా, ఆమెలో ప్రత్యేకతలున్నాయి.
శీర్షికలు సంచికలు
మానవ జీవితం వన్ వే ట్రాఫిక్. ఒకవైపుకే మన ప్రయాణం. మనం అందరం చివరగా వెళ్ళేది ఒక చోటుకే. దార్లో ఎంతోమంది స్నేహితులూ మిత్రులూ కలుస్తారు, వస్తారు, మధ్యమార్గంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ‘జీవితం అంటే ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వదిలిపోయే స్నేహాలు, సహచరులు, మారిపోయే ప్రాధాన్యతలు, అనుబంధాలు… ఇదే జీవితమేమో అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ఒంటరిగా మనం.
గ్రహణాలు అతి ప్రాచీనమైనవి, మనిషి భూమిమీద అంతరించిపోయిన తర్వాత కూడా కొనసాగేవీ. ఖగోళశాస్త్రంలో గణనీయమైన చరిత్ర ఉన్న మనం ఆ క్షేత్రంలో జరుగుతున్న పరిశోధనలను జాగ్రత్తగా గమనిస్తూ, మానవజాతి పురోగతిలో మనవంతు పాత్ర పోషించడానికి తగిన కృషిచెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.
క్రోధి యను పేరు గల్గినం గోపపడక
మక్కువను నిత్యసౌఖ్యంబు మాకుఁ గూర్చి
ఆదుకొనవయ్య మమ్ము నవాబ్దవర్య!
త్యక్తమొనరించి నీ అభిధార్థమెల్ల!
ముజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో! ఆమె రాగానే మూడేళ్ళ నా చెల్లెలు సేనిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఇక అప్పటి నుంచి సేని ముజుని వదిలి క్షణం ఉండేది కాదు. ఆమె వెంటే తిరుగుతూ ఉండేది. ముజుని పెళ్ళి చేసుకున్న కొన్ని రోజులకే పచ్చి తాగుబోతైన మా నాన్న చిన్న మురికికాలవలో పడి ఆపైన మంచానికి అతుక్కుపోయాడు. తాగుడుకి డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక ఆయన తన కోపమంతా ముజుపైన చూపించేవాడు.
కవితలు కురవడం ఆగిపోయిన తీగ మీద సుతిమెత్తని కిరణం వాలితే ఇలాంటి సవ్వడే అవుతుందేమో! భుజం మీదినుంచి కోయిల ఎగిరిపోయినా ఇదే చుక్క జారుతుందేమో! లోపలి చూపులనుంచి వొలికే నిశ్వాసల వొరవడీ వొరిపిడీ ఇంతేనేమో. దిండ్లుగా మారిన బండల స్పృహ ఛెళ్ళుమనడం ఇలాగే తెలుస్తుందేమో! ఇవన్నీ మీరు వినాలనే అనుకుంటాను కాని, కత్తులే మొద్దుబారాయో, గుండే గడ్డకట్టిందో కాని…
“మీరు అమ్మాయి వివరాలు ఫోటోలు చూసినట్టు వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫోటో ఉద్యోగం చదువు ఇవన్నీ చూడాలి కదా. ఇవాళే మీ వివరాలన్నీ వాళ్ళకు పంపించేస్తాం. వాళ్ళు చూసి ఓకే చెప్పగానే మీకు తెలియజేస్తాం.” ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా వచ్చిపడుతున్న మాటలు. రోజూ చెప్పే అవే అబద్దాలకు మన ముఖాలలో ఎలాంటి మార్పు ఉండదు. కంగారు ఉండదు. చెరగని చిరునవ్వుతో ఎంతో ఇష్టంగా చేస్తున్నట్టు సహజంగా ఉండటం వీలవుతుంది.
ఇంతకీ దుఃఖానికి
దేవత ఎవరు?
దాహార్తి నివారణకోసం
బలి కోరే,
రుధిర పాత్రల నాహ్వానించే
దేవీదేవతల వలె
కన్నీళ్ళు కుండలతో
స్వీకరించే అప్రాచ్య దేవత ఎవరు?
నిలకడ లేకుండా నిరంతరం
సాగే అతగాడి జీవనం.
బహుశా
పదమూడేళ్ళ వయసుంటుందేమో
వంతెన పక్కన
నేనా అబ్బాయిని చూసినప్పుడు.
మన యిండియన్లదంతా మెమొరీ పైన నిలబడిన హిస్టరీనే అమృతా! దేన్నీ రికార్డు చేసేది మనవాళ్ళకు తెలియదు. మావూర్లో సంక్రాంతి పండగనాడు ప్రతి యింటోళ్ళూ బ్రాహ్మణుడ్ని పిలిచి పెద్దలకు తర్పణమొదల్తారు. అప్పుడా బ్రాహ్మణుడు వాళ్ళను కనీసం వాళ్ళ మూడు తరాలవాళ్ళ పేర్లయినా చెప్పమని మొత్తుకుంటాడు. వాళ్ళకు వాళ్ళ తాత పేరయినా సక్రమంగా జ్ఞాపకముండదు. అందరిండ్లల్లో జమిందార్లు, వీరులు, శూరులూ వుంటారా చెప్పు గుర్తు పెట్టుకునేదానికి?
ఎన్నో రైళ్ళుమారుతూ
మరెన్నో ఊళ్ళు తిరుగుతూ
నదులూ అడవులూ
కొండలూ గుహలూ
వెతుక్కుంటూ సాగిపోతావు
నీ సత్యం నీకెక్కడో
తారసపడకపోదు
ఇంక నువ్వు తెల్లవార్లూ
సణుగుతావు చూడూ…
తను నిద్రకు మెలకువకు
నేటికి రేపటికి మధ్య
కాలం శూలానికి
దృశ్యరహిత రక్తమోడుతుంది
ఈ లోగా నేనూ అనేక అవతారాలెత్తి
పని భూగోళాన్నంతా అట్లాసై మోసేసి
పై వాడిని మెప్పించో వప్పించో
కావలిసినంత అలసటనో ఆవేగాన్నో నింపుకుని
మనిషితనానికి తావీయకుండా
ఈసురోమని ఇల్లు చేరతాను.
కాళికాంబ ఎక్కడికి వెళ్ళినా పోలీసులు వెంటాడుతుండేవారు. ఇల్లు సోదా చేసేవారు. ఇంట్లో సామాన్లు, వండిన వంటలు, ఊరగాయలు అన్ని పాడుచేసి, చేతికి వచ్చినవి పట్టుకుపోతూ ఉండేవారు. నోటికి వచ్చినట్లు ఛండాలపు మాటలనేవారు. ఆడవాళ్ళని నానా భీభత్సంగా భయపెట్టడం, మానభంగాలు చేయడం, కొట్టడం చేసేవారని ఆమె పేర్కొన్నారు.
అడ్డం వెన్నెలవహేలనము (2) సమాధానం: హేల దుర్యోధనుని వంశం వారు కారు ఈ గొర్రెలకాపరులు (3) సమాధానం: కురుబ తమలపాకులో నర్తించేది (3) సమాధానం: […]
క్రితం సంచికలోని గడినుడి-89కి మొదటి ఇరవై రోజుల్లో ఏడుగురు సరైన సమాధానాలు పంపారు. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-89 సమాధానాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
నెచ్చెలి 5వ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా నిర్వహిస్తున్న ద్వితీయ కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం! ఎంపిక చేసిన కథలు, కవితలు ‘నెచ్చెలి’లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి. రచనలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ మే 10, 2024.
తెలుగులో తాము సీనియర్ రచయితలం, కవులం అని చెప్పుకునే మనుషుల కనుసన్నలలో ఇప్పుడు ఎన్నో సమూహాలు ఉన్నాయి. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే శిష్యబృందమూ ఉంది. ఎవరైనా ఒకరు ఒక రెండు ఫేస్బుక్ పోస్ట్లకి వంద లైకులు సాధిస్తే, లేదా ఎక్కడైనా ఒక నాలుగు రచనల ప్రచురణ జరిగితే, ఇక వారికి రచయితలు అన్న టాగ్ వచ్చేస్తుంది. వాళ్ళ రచనలను బట్టి కథకులనో, కవులనో ముద్ర వేసేశాక, ఇక వాళ్ళకి సదరు ‘గురు’కులాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, రాసి ఏం చెయ్యాలి – ఇవన్నీ నేర్పించబడతాయి. అవి మేలు చేస్తున్నాయో చేటు చేస్తున్నాయో చెప్పడం కష్టం కాదు కాని, ఆ గీతలు అంత స్పష్టంగా కొత్తవారికి కనపడవు. కళలు ఉద్యోగాలు కావు అన్న స్పృహను పక్కన పెట్టేసిన సీనియర్ కవులు రచయితలు, కాలేజిలో ఫ్రెషర్స్కు చెయ్యాల్సిన పనుల చిట్టా చెప్పినట్టు, వారికి రచనలోకి రాగానే ఎంచుకోవాల్సిన ‘సబ్జెక్ట్స్’ ఇచ్చి, వెన్ను తట్టి పెన్ను పట్టిస్తారు. ‘సీనియర్’ల సంగతి ఒదిలెయ్యండి, తమ రచనను విభిన్న వర్గాల పాఠకులకు చేర్చడానికి తెలుగులో ఇన్ని పత్రికలు, ఇన్ని మాధ్యమాలు అందుబాటులో ఉన్నా, ఇలా ఏదో ఒక వేదికమీద మాత్రమే, ఏదో ఒక కూటమితో జతపడి మాత్రమే, రచనలు ప్రచురించి, తాము పొందగలిగినది ఏమిటో యువరచయితలు ప్రశ్నించుకోవాలి. ఒకే రకం అభిప్రాయాలను సమర్థించే బృందంలో ఉన్నప్పుడు, అవి సహజంగానే అక్కడివారి ఆమోదం పొందుతాయి. కానీ ఆ రచనలను భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళకి చేరవేయగలుగుతున్నామా, వస్తువుతో నిరాకరణ ఉన్నా సరే, వాళ్ళని తమ రచనాబలిమి చేత చదివించగలుగుతున్నామా, ఆలోచింపజేయగులుతున్నామా అన్న ప్రశ్నలు వీరికి రావాలి. అవి రావాలంటే, ఈ ప్రచురణా ప్రపంచంలో ఎందుకు ఉన్నామని వీరు ప్రశ్నించుకోవాలి. తనదైన ఆశయంతో రచనలు చేయడానికా? ఏది రాసినా అనుమోదించి దన్నుగా నిలబడగల నలుగురు స్నేహితులను పోగేసుకోవడానికా? తన రచన మీద ఏ విమర్శ వచ్చినా కాపు రాగల కూటమిని కూడగట్టుకోవడానికా… దేనికి? కుటుంబాలతో ఉద్యోగాలతో తలమునకలుగా ఉండే జీవితంలో నుండి కొంత సమయాన్ని వీరు సాహిత్యం కోసం కేటాయించడానికి కారణాలేమిటి? అది నిజంగా నలుగురు, నిజంగా మెచ్చగల రచనను సృష్టించడమే అయితే, ఆ రచనాబలాన్ని తెలుసుకోవడానికి ఆశ్రయించాల్సింది ఎవరిని? ఎవరి విమర్శ నమ్మదగినది? మహామహా ఉద్యమాలే ఆత్మవిమర్శ కొరవడి నీరుకారిపోవడం చరిత్ర నమోదు చేసిన సత్యం. ఇక శ్రద్ధ లేని రచనలేపాటి? లేదూ, కావలసినది ఎంతోకొంత కాలక్షేపమే అయితే, ఈ రచనాపీఠాలను పట్టుకుని వేలాడుతూ వీరు పొందుతున్నది ఏమిటి? కోల్పోతున్నది ఏమిటి? వీటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అది లోపలి పాఠకుడిని బతికించుకోవడం. సాహిత్యంలో విలువలు, రచనకు ఒక స్థాయి ఆశించడం ఎందుకు మానేశారు? పొగడ్త తప్ప విమర్శ ఎందుకు వినరు? సమాజపు సమస్త ఊహలకూ రెక్కలివ్వాల్సిన రచనాలోకంలో, ఈ విజ్ఞతని నిద్రపుచ్చి కవిరచయితలు చేస్తున్నదేమిటి? ముక్కలుముక్కలుగా రాసే మాటల్లో నాలుగు మెరుపులు కనిపిస్తే వస్తే మెచ్చుకోళ్ళకు పొంగిపోతూ, రచన మొత్తంలో కనపడవలసిన పరిపూర్ణత గురించి మాట్లాడటానికి భయపడుతూ లేదా నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉంటే సాహిత్యం ఎలా మెరుగవుతుంది? నిజమైన రచన శక్తిని, సమయాన్ని, మరీ ముఖ్యంగా నిజాయితీని కోరుతుంది. వీటికి తూనికరాళ్ళు ఎవరికీ వేరేవాళ్ళు ఇవ్వలేరు. ఏ సాహిత్య స్నేహాలూ సమూహాలూ రచనాబలిమి లేని శుష్కసాహిత్యాన్ని బతికించలేవు. సాహిత్యసృజన ఏకాంత ప్రక్రియ.
నాకు ముందునుంచీ ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలలో యూరోపియన్ల రాకకు పూర్వమే విలసిల్లిన మాయన్, ఇన్కా నాగరికతల విషయంలోను, అవి యావత్ ప్రపంచానికీ అందించిన సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ ఆసక్తీ ఆరాధనా ఉన్నాయి. అక్కడి దేశాలలో ఇప్పటికీ కొనసాగుతోన్న ఘనమైన దేశవాళీ సంస్కృతి పట్ల ఆకర్షణ ఉంది.