ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానం అందించారు. అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న భావాల్ని ఇంకొంచెం పరిశీలించాలనిపించింది.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని సామెత. అదెంతనిజమో తెలియదు గానీ, చిన భూషయ్య పుట్టగానే, ‘ధరణి కంపించింది. కులపర్వతాలు వణికిపోయాయి. సముద్రంలో పెనుతుఫానులొచ్చాయి. ఆకాశంలో తోకచుక్కలు పొడిచాయి. ఫెళఫెళమని పిడుగులు పుడమిన పడ్డాయి.’

చాలా సందర్భాల్లో మాటలు రావు. చాలా లోతయిన విషయాలు మాట్లాడబోతే ఒకానొక ఒంటరితనం వేధిస్తుంది. నిజమే, ఎన్ని సంగతులు … ఎన్ని సంఘటనలు … ఎన్ని వ్యవహారాలు సజావుగా నడవాలి, మనం ఇంకొకళ్ళకి సలహాలిచ్చే స్థితిలోకి వెళ్ళాలంటే!

ప్రవాసాంధ్రులుగా జీవితం గడిపిన మనలో కొందరు తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుభూతి గల ఇతరులు దీన్ని అభిరుచి అనీ, గిట్టనివాళ్ళు దురద అనీ అంటూ ఉంటారు.

‘ఈ పొడి మాటలు తప్ప తామిద్దరూ పెద్దగా మాట్లాడుకునేదేం ఉండదా ఇప్పట్లో ‘, అనుకుంది. ఇక తమకు పిల్లలు పుడితే సైగలు తప్ప మాటలు రావేమో వాళ్ళకు అనే ఆలోచన వచ్చి నవ్వొచ్చింది. అతనూ నవ్వాడు ఆమె ఎందుకు నవ్వుతుందో తెలియకపోయినా.

తాను కలుసుకున్న ప్రముఖులతో సంభాషించేటప్పుడతను ఎంతో నేర్పుగా వారిని ఉబ్బవేశాడు. అతను గవర్నరుగారితో మాట్లాడేటప్పుడు, మాటల సందర్బాన అన్నట్టుగా ఈ రాష్ట్రంలో ప్రయాణిస్తుంటే స్వర్గంలో సంచరిస్తున్నట్టుగా ఉన్నదనీ, ఎక్కడ చూసినా రోడ్లు పట్టుపరిచినట్టుగా ఉన్నాయని, సమర్థులైన పాలకులను నియోగించిన ప్రభుత్వం ప్రశంసనీయమైనదనీ అన్నాడు.

ఒక యువకవి పదే పదే పంపిస్తున్న కవిత్వానికి ఏం జవాబివ్వాలో తెలియక, సతమతమై, చివరకి ఆ కవికి వుత్తరాలు రాయటం మొదలు పెట్టాడు రిల్కే. అలా అతను రాసిన పది వుత్తరాలు “లెటర్స్ టు ఎయంగ్ పోయెట్” అనే శీర్షికన పుస్తకంగా అచ్చయి, ఆ యువకవిని సాహిత్య చరిత్రకి ఎక్కించాయి.

జింకల కళ్ళూ వాగుల నీళ్ళూ ఊళ్ళో అమ్మించి
రాళ్ళకి పువ్వుల రంగులు వేయించి
పైకం గుళ్ళో పంచుకు తిన్నాము.

“హహ్హహ్హ, నైస్‌ జోక్‌, వెరీ నైస్‌” అన్నాను నేనూ నవ్వు కలుపుతూ, రాధిక కేసి కన్ను గీటుతూ. దాంతో ఆమె కూడ నాతో నవ్వు కలిపింది. ముగ్గురం అలా కాసేపు పగలబడి నవ్వుకున్నాం. ఫేమిలీ వేల్యూస్‌ అంటే మా ఫేమిలీ అంతా పడిచస్తాం మరి!