ఈమాట పాఠకులకు కన్నెగంటి చంద్రను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథయినా, కవితయినా, చంద్ర పేరు చూడగానే చేస్తున్న పనులన్నీ ఆపేసి వెంటనే చదివే పాఠకులం ఎందరమో. అలాంటి చంద్ర, అక్షరం మనసు తెలిసిన చంద్ర, తన రచనల నుంచి ఏమీ ఆశించకుండా నిరాపేక్షగా చావో బతుకో వాటి మానాన వాటిని విడిచిపెట్టే చంద్ర, ఒకానొకప్పుడు పృథివ్యాపస్తేజోవాయురాకాశములైన పంచభూతాల వంటి ఐదు కవితలు రాశాడు తెలుసాలో – మట్టి, వాన, మంట, గాలి, మబ్బులు, అంటూ! ఆ కవితలు చదివి వేలూరి అందరినీ, ఇప్పుడైనా చూడండి చంద్ర ఎందుకు మంచి కవో అని చెప్తూచెప్తూనే, ఆర్కైవుల్లో ఆ ఐదు కవితలూ వెతుక్కుని చదువుకుని దాచిపెట్టుకున్నాం కూడానూ. ఆతర్వాతెప్పుడో చంద్ర కవితలను వాన వెలిసిన సాయంత్రం అనేసి హడావిడిగా పుస్తకం చేసినప్పుడు వేలూరి ఈమాటలో వాటి గురించి మరోసారి గుర్తు చేశారు కూడానూ. ఏమైతేనేం, ఆ ఐదు కవితలూ మీకు పరిచయం చేయడం కోసం, పోనీ ఆ సాకుతో మీతో కలిసి మేమూ మరోసారి చదవడం కోసం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.

“తల్లీ! మునికి పేరు పెట్టాననుకో, అప్పుడు ఈ కథ ఆ పేరు గల ఒక మునికి మాత్రమే చెందుతుంది, మతంగుడి కథ, భరద్వాజుడి కథ లాగా. నువ్వు మునులేం చేస్తారు? అన్నావు కదా! ఏ పేరూ పెట్టకపోతే మునులు సాధారణంగా ఈ రకంగా ఉంటారు అన్నది చెప్పినట్టవుతుంది. ఈ విషయం అర్థమయింది కదా? ఇప్పుడు ముని పేరు అచ్చయ్య అనుకుందాం. ముని పత్ని పేరు పిచ్చమ్మ.

ఉద్యోగం లేదని చిరాకు ఒక వైపు. ఆమె నన్ను తనింట్లోకి రానియ్యకుండా నా ముఖం మీదే తలుపులు మూసేసిందని దిగులు మరో వైపు. ఆమెని అల్లరి చేశాను, ఆమె తోనే ఉండాలని, ఆమె మళ్ళీ మళ్ళీ కావాలనిపించి పిచ్చి పట్టినట్లయి ఆమెని ఎన్ని మాటలో అన్నాను. నేనట్లా మాట్లాడినా కూడా ఆమెకి నా మీద అంతే అభిమానం వుండింది. తను నాతో మాట్లాడకపోయినా తమ్ముడి చేత ఫోన్లు చేపిస్తూ నన్ను వచ్చేయమని అడిగిస్తూనే ఉంది.

‘సామాన్యుని జీవనం’ ఆయా కాలాలలో వచ్చిన సృజనాత్మక సాహిత్యంలో అంతో ఇంతో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దేశి సాహిత్యంలో అది విస్తృతంగా కనిపిస్తే, మార్గ సాహిత్యంలో పరిమితంగా కనిపిస్తుంది. తెలుగులో శైవసాహిత్యమూ, శ్రీనాథుని కావ్యాలూ సామాన్య జనజీవనాన్ని మరింత ఎక్కువగా ప్రతిఫలిస్తాయి. అయితే, ఏ కావ్యమైనా సమకాలీన సమాజ పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా తప్పించుకోలేదు కాబట్టి ఏదో ఒక రూపంలో ప్రబంధాలలో కూడా ఆ కాల స్వభావం వ్యక్తమవుతూనే ఉంటుంది.

అంతకుముందు ఎప్పుడైనా చర్చ్‌కి వెళ్ళడానికి ఆసక్తి ఉండేది. ఇప్పుడు పొద్దున్నే లేవడానికీ, తిండి తినడానికీ కూడా వెగటే. దేవుడి గురించి విన్నదీ కన్నదీ అంతా కట్టుకధే అనే అనుమానం మొదలైంది. దేవుడనే వాడుంటే ఇలా చేస్తాడా? వయసైపోతున్న తనని వదిలేసి చిన్నకుర్రాణ్ణి తీసుకెళ్ళిపోయేడు. చర్చ్‌లో ప్రతీవారం పాస్టర్ భగవంతుడికి అపారమైన కరుణ ఉందని అంటాడే! మరి కళ్ళముందటే ఇలాంటివి జరుగుతూంటే ఎలా నమ్మడం?

అప్పా ఒక్కసారి నిశ్చేష్టుడయ్యాడు. మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకొని మాటల యుద్ధం మొదలు పెట్టాడు. మాస్టారు ఏమాత్రం కనికరం చూపించలేదు. “నావల్ల కాదు,” అంటూ వంద సార్లు అన్నాడు. చివరకి అప్పాకి విసుగొచ్చింది. మాస్టారి నిగ్రహం చూసి ముద్దు పెట్టుకోబోయాడు. కావాలంటే తన కొడుకు బదులు తనే పరీక్ష తీసుకుంటానన్నాడు. బూతు జోకులు చెప్పాడు. మరీ దిగజారుడుగా మాట్లాడ్డం మొదలు పెట్టాడు.

పిల్లలమంతా మళ్ళీ రెక్కలు విప్పుకున్న
సీతాకోకచిలుకలమవుతాము
కట్టుతాళ్ళు విప్పుకున్న లేగదూడలమల్లే బయటికురుకుతాము
నోళ్ళు తెరుచుకుని ఆఖరి వానచుక్కలు అందుకుంటూ…

రెక్కలు విప్పుకొన్న దూది కొండల్లో
చెట్లూ, ఏనుగులూ, కొండశిలవలూ ఇంక యేవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటి కిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకుండా
రెక్కలాడిస్తూ పోతున్న పిట్టలూ-

గాలి వుక్కిరిబిక్కిరై అల్లాడుతుంది
పారిపోవాలని వొకటే ప్రయాస-
దాక్కుందామని అదే తాపత్రయం-
ధ్వని కంపనాలకు దడపుట్టి
నిశ్శబ్దంలోకి తప్పుకోవాలని!

మాఘకవి వర్ణించిన జాణలు అప్పటమైన సంస్కృత వనితలు. ఆ కవి నర్మదాతీరవాసి కనుక కాస్తో కూస్తో అక్కడి సంప్రదాయపు ఒప్పులకుప్పలు. నగరకాంతలు, ధనవంతులబిడ్డలు. పెద్దన తీర్చిన గంధర్వకాంతలు పట్టణవాసులైనప్పటికీ ముగ్ధలైన పల్లెపడుచుల తీరు. వీరు అప్పటమైన తెలుగు అందాలకు ప్రతీకలు.

తెలుగు భాషలో ఒక నూతన కవితాశైలికి నాందీవాక్యమును పలికిన మహాప్రస్థానంలో ఎన్నో రకములైన మాత్రాఛందస్సులను శ్రీశ్రీ వాడినాడు. ఛందస్సు సర్పపరిష్వంగము నుండి విముక్తుడనయ్యానని చెప్పుకొన్న శ్రీశ్రీ గేయములలో రసానుభూతి కోసం ఎన్నో ఛందస్సులను పాటించాడు.

దసరాకి బొమ్మల కొలువు పెట్టడం తమిళదేశంలో అధికంగా వ్యాప్తిలో ఉంది. ఇళ్ళలోనే కాకుండా నవరాత్రులలో దేవాలయాలలో కూడా బొమ్మల కొలువులు పెడతారు. మధుర మీనాక్షీ దేవాలయంలో ప్రతీ ఏటా నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో వివిధ దేవీమూర్తులు కనిపిస్తాయి.

ఇన్నేసి మతాలు, ఆచారాలూ , వాటితో పోరాడుతూ నిబ్బరంగా సాగుతూంటారు ఈ చిన్ని గుంపులోని మనుషులు. మత మౌఢ్యం పెద్ద పులి. వేటాడుతుంది వీరిని.

ఇది భాగవతుల త్రిపుర సుందరమ్మగారు (బీనాదేవి) రావిశాస్త్రిగారి కథలపైన 1997లో విజయవాడ కేంద్రంలో చేసిన ప్రసంగం. ఈ ప్రసంగ పాఠం తరువాత వార్త దినపత్రికలోను, పైన పేర్కొన్న సమగ్ర రచనల సంకలనం లోను ప్రచురితమైంది.

రేడియో ‘అక్కయ్య, అన్నయ్య’లుగా ప్రసిద్ధులైన న్యాయపతి కామేశ్వరి, రాఘవరావుల గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదనుకుంటాను. ఈ సంచికలో ‘బాలానందం’ బృంద గేయాలుగా వచ్చిన కొన్ని రికార్డులను విందాం.

తాము చేసే పని మీద శ్రద్ధాసక్తులు, తమ పనితనం పట్ల గౌరవము, గర్వము, అభిమానమూ లేనివారి పని ఫలితాలు ఎంత నాసిరకంగా ఉంటాయో చెప్పడానికి మన తెలుగు ప్రచురణారంగం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగులో ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా మనం గర్వంగా చెప్పుకోదగిన ప్రచురణ సంస్థలు లేవు. విషయం ఏదైనా పుస్తకం కూడ ఒక వస్తువే. దానికీ నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రచురణ అంటే కేవలం అచ్చేయడం కాదనీ, ఒక మంచి పుస్తకం అనేది శ్రద్ధతో అభిమానంతో రూపు దిద్దితేనే సాధ్యమనీ, అవి లేకపోవడమే మన ప్రచురణ సంస్థల ప్రస్తుత పరిస్థితికి కారణమనీ, తమ వ్యాసం తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలులో శ్రీనివాస్, నాగరాజు, నారాయణరావు తమ అభిప్రాయాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. అంతే కాదు, ప్రస్తుతం తమ పుస్తకాలు తామే ప్రచురించుకునే ఔత్సాహికులకు ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలో వివరిస్తున్నారు కూడా.
 
తెలుగు గ్రంథాలలో అత్యంతకఠినమైనవాటిలో అగ్రగణ్యంగా, వసుచరిత్రం కంటే దుర్లభమైనదిగా పరిగణించబడే గ్రంథం, 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానాన్నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు, రామరాజభూషణునికి సమకాలికుడు అయిన సురభి మాధవరాయలు రచించిన చంద్రికాపరిణయముఅనే మహాప్రబంధం. ఈ గ్రంథానికి కొల్లాపురసంస్థానపండితులైన బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులవారు వ్రాసిన టీకాతాత్పర్యసహితవ్యాఖ్యానంతో కూడిన ప్రతి ఆఖరిముద్రణ 1928లో. ఆ ప్రతి ఇప్పుడు అలభ్యం. అపురూపమైన ఆ ప్రతి సాధించుకుని, షుమారు ఏడు వందల పేజీలు అక్షరం అక్షరమూ అచ్చుతప్పులు దిద్దుకుంటూ, కేశవపంతులు నరసింహశాస్త్రి, శ్రీరంగాచార్యులవారి ఉపోద్ఘాతములు జత చేస్తూ, యూనీకోడ్‌లో తిరగ వ్రాసి ఈమాట గ్రంథాలయం కోసం అందచేశారు తిరుమల కృష్ణదేశికాచార్యులు. వారి అద్వితీయమైన శ్రమకు, ప్రాచీన సాహిత్యం పట్ల వారి నిబద్ధతకూ ఈమాటనుంచి వారికి హృదయపూర్వక అభినందనలు.

“మోనీ, ఒకటి చెప్తా, ప్రామిస్ చెయ్, ఎవరికీ చెప్పకూడదు.”

“ప్రామిస్, చెప్పవే ఏంటో?”

… …

“ఓ! సత్యా?! ఆరోజు బస్ వెనక చీకట్లో తనతో… అది నువ్వేనా?”

“ఏంటీ? కాలేజ్‌లో తెలిసిపోయిందా? వద్దన్నాను. నైట్ కదా! చీకట్లో ఎవరూ చూడరని… చున్నీ కప్పేసుకుని…”

“మరి ఇంట్లో చెప్పావా?”

“అమ్మో, డాడీ చంపేస్తారు. ఇంటర్ కాస్ట్ అంటే అసలొప్పుకోరు.”

మౌనంగా ఉన్న కైక నోరు తెరిచింది. “మంధరా, ఇప్పుడు నువ్వు వచ్చినది రఘువంశ మహారాజు దశరధుడి దగ్గిరకి. రఘువెటువంటివాడో, సూర్య వంశం ఎటువంటిదో నీకు తెలియకపోవచ్చు. నిన్ను ఇక్కడకి విశ్వామిత్రులవారు పంపించారంటే అందులో మనకి తెలియని నిగూఢ రహస్యం ఏదో ఉందన్న మాట. చూద్దాం ఏం జరగబోతోందో. ఈ రాజభవనం నీ ఇల్లే అనుకో. నీ చేతనైన సహాయం చేస్తూండు. మా పూర్వీకులని కూడా రావణుడు చంపాడని నేను విన్నాను. ఏదో ఒకరోజు వాడికి ఆయుర్దాయం తీరిపోతుంది.”