ఈ మనుషులకి శవపేటికమీద ఉంచిన తాటాకుకు అర్థమే తెలియదనుకోవాలా? అది వారికేమీ కాదని అనుకుంటున్నారా? చనిపోయిన వ్యక్తి తన ఊరికోసం తిరిగివచ్చాడని వీళ్ళకెవరికీ తెలియడం లేదా? హార్వీ మెరిక్ పేరుతో జతకలిసి ఉండకపోతే ఈ ఊరి పేరు ఎవరికి తెలిసేది? ఈ ఊరు శాశ్వతంగా ఏ పోస్టల్ గైడులోనో సమాధి అయిపోయి ఉండేది.

ఒక్కటే ఉంటుంది
మనిషి కథ

కాకపోతే
ప్రచురించటానికి
ప్రపంచాన్ని మొదలెట్టాలి
మళ్ళీ
అదే శూన్యం నుండి

సంస్కృతములో విసమ లేక విషమ వృత్తములలో మూడు పాదములు ఒక విధముగా, ఒక పాదము వేఱొక విధముగా లేకపోతే అన్ని పాదములు వేఱువేఱు విధములుగా ఉంటాయి. ఈ వ్యాసపు ముఖ్యోద్దేశము విషమ వృత్తమైన ఉద్గతా(త) వృత్తమును వివరించి అందులో దాగియున్న తాళవృత్తముల మూసలను కూలంకషముగా చర్చించుటయే.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

సమకాలీన విమర్శకులు సునిశితంగా స్పష్టంగా విశ్లేషించగల తమ ప్రతిభని తమకి నచ్చని భావజాలం/దృక్పథం వున్న రచనలని విమర్శించేటపుడు చూపినంత చక్కగా తమకి యిష్టమైన భావజాలానికి చెందిన రచనల విమర్శలో చూపడం లేదని అనిపిస్తున్నది. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో ప్రచురణకు ఎంపికైన వ్యాసం.)

అడ్డం భక్తులకి సంతానాన్ని ప్రసాదించే దేవత కోసం ఆరుద్ర పదాలు (4) సమాధానం: కూనలమ్మ ఒకటి అడ్డంలో కవిగారు “అచ్చోట తిరగేసి కొడితే దాని […]

క్రితం సంచికలోని గడినుడి 20కి అన్నీ సరైన సమాధానాలతో పంపిన మొదటి అయిదుగురు: 1. మార్కండేయులు జి వి ఎస్ ఎస్ 2. బాలా త్రిపుర సుందరి 3. రవిచంద్ర ఇనగంటి 4. సుభద్ర వేదుల 5. భమిడిపాటి సూర్యలక్ష్మి. వీరందరికీ మా అభినందనలు.
గడి నుడి – 20 సమాధానాలు, వివరణ.

సాంస్కృతికంగా బలమైన సమాజాల్లో ప్రతీ తరం రాబోయే తరాలకు బహుముఖీనమైన కళావారసత్వాన్ని ఇచ్చి వెళ్ళడం, ఆ నీడన కొత్త తరాలు తమ ఆలోచనలను రూపు దిద్దుకోవడం పరిణామక్రమంగా జరిగే విషయం. ఆ వారసత్వం లేని సమాజం ఎక్కువకాలం ఉండలేదు. తెలుగులో సాహిత్యసంగీతాది కళలలో లబ్ధప్రతిష్టులైన ఎందరో కళాకారులు నిన్నటి యువతరానికి తమ వారసత్వాన్ని అందించి పడమటిగూటికి చేరుకుంటున్నారు. వారికి వారి కళ పట్ల ఒక స్పష్టమైన జ్ఞానం, కళలకు లక్షణాలే కాని కచ్చితమైన నిర్వచనాలు ప్రయోజనాలు ఉండవన్న విచక్షణ ఉన్నది. అది వారి వారి సృజనలో ప్రతిఫలించింది. ఆ బహుముఖీనత వల్లనే ఆ కళలు పండితపామర విచక్షణ లేకుండా పదిమందికీ చేరినది, అందరినీ అలరించినదీ. అలా చేరితేనే మంచిదనో గొప్పదనో కాకపోయినా కళ సమాజంలో ఎక్కువమందిని చేరగలగాలి. వారి అభిరుచిని పెంపొందించగలగాలి. కనీసం మంచీ చెడూ చర్చించే అవకాశం ఇవ్వగలగాలి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సృజనకున్న అనేకరూపాలను సమానంగా సహృదయంతో స్వీకరించి విశ్లేషించగల విమర్శా దృక్పథం ప్రస్తుతం సంగీతం, చిత్రకళ వంటి ఇతర కళలలో కొంతయినా కనిపిస్తున్నది కాని తెలుగు సాహిత్యంలో మాత్రం లేదు. బహుముఖీనతను విస్మరించి నిర్వచనాల సంకెళ్ళలో ఒకే రకమైన సాహిత్యాన్ని రచయితలు విమర్శకులు అందలమెక్కించడం వల్లనే సాహిత్యం తెలుగు సమాజంలో ఒకప్పటి ప్రాభవాన్ని పోగొట్టుకున్నది. సాహిత్యరంగంలో నిన్నటి తరం నేటి తరానికి అందించిన వారసత్వం ఎటువంటిది, అది రేపటికి ఎలా ఉండాలి? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చి కొంత కాలమయినా ఎవరూ ఆవైపుగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.

చిన్న పల్లెటూరులో పుట్టిపెరగటం వెలుపలి జీవనంతో ఆవిడకు ఎక్కువ పరిచయాన్ని ఇవ్వలేదు. పుస్తకాలే ఆవిడ లోకం. ఆ పల్లెపట్టు సౌందర్యాన్ని లోపలికి తీసుకోగలిగే భావుకత స్వతహా వచ్చింది. లోపలేదో స్రవంతి… సరళంగా సహజంగా పొంగుతూ బయటపడింది. కథలు రాయటం మొదలైంది.

అర్జీలు పెట్టొచ్చు
దేబిరించవచ్చు
ఫేసుబుక్కులోకి పోయి స్టేటస్ పెట్టొచ్చు
ఏడ్చి అలమటించవచ్చు
రొప్పుతూ రోజుతూ బతుకు గడిపేయొచ్చు
రక్తం కక్కుకుంటూ చచ్చిపోనూ వచ్చు
చెయ్యడానికి ఎన్నిలేవు? (గొప్ప దేశభక్తులుగా మారి)

పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి కథల్లో తరుచుగా కనిపించే ప్రకృతి నేపథ్యం. అన్ని కథల వెనుక సన్నగా వయొలిన్ మీద వినిపించే విషాదపు జీర. ఆ విషాదపు జీరకు మూలం తెలుసుకుంటే కోపమూ కరుణా ముప్పిరిగొని ప్రపంచమంతా దిగులు మేఘాలు కమ్మినా, ముఖం చూపించని సూర్యుడి మీద అసహాయతతో కూడిన కోపం వస్తుంది పాఠకులకి.

మధ్యలో కనపడని మంచుగోడగా గడ్డకడుతూ గాలి. నేపథ్య సంగీతమెప్పుడు ఆగిపోయిందో తెలియదు. తొందరగా ముగిసిపోయిన ఒక ఆట. ఉద్విగ్నక్షణాలూ విరబూసిన రంగులూ జారిపోయిన, కరిగిపోయిన అనంతరం ఖాళీగా మిగిలిన సినిమా హాల్లా. ఇష్టంగా తినీ, తాగీ అక్కడక్కడా ఇప్పుడు చెత్తగా ఒదిలేసిన కొన్ని పట్టించుకోని జ్ఞాపకాలూ.

నీకు తోచిందేదో నువ్ చెప్తుంటావ్
వాడేదో ఆలోచిస్తూ వింటూంటాడు
నీకేదో తెల్సినట్టు నువ్వనుకుంటావ్
వాడికేదో తెలియనట్టు వాడనుకుంటాడు
నేను చెప్పింది వింటాడా అని నువ్వనుకుంటావ్
వీడు చెప్తోంది చెయ్యాలా అని వాడనుకుంటాడు

వాతావరణం ఒక్కసారి స్తంభించిపోయింది. బీడీల చేతులు ఆగిపోయినై. టీవీ నడుస్తుందన్నట్టేగానీ తెలియని నిశ్శబ్దం ప్రవేశించింది. నేను జయక్కతో కళ్ళు కలపకుండా, అసలు ప్రత్యేకంగా ఎవరి మీదా చూపు నిలపకుండా అలాగే కూర్చున్నాను. ఎన్ని సెకన్లు దొర్లిపోయినై? అంతమందిలో ఎవరో కిసుక్కుమన్నారు. ఇక, నవ్వడమా మానడమా అన్నట్టుగా ఆగి నవ్వి ఆగి నవ్వి ఒక్కసారిగా అందరూ బద్దలైపోయారు.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు కెరటాలు
రాత్రి ఒక సముద్రం.

ఎదురెదురుగా వున్న రెండు దేహాలు
ఒక్కోసారి రెండు శిలలు
రాత్రి ఒక ఎడారి.

కొంతకాలంగా ఆహవి తల్లితో సుముఖంగా మాట్లాడటంలేదు. ఏమి చెప్పినా దానికి బదులు మాట్లాడుతుంది. ఏమడిగినా వంకర సమాధానాలు చెప్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ‘ఎలా ఉన్నావు?’ అనడిగితే ‘దిట్టంగా ఉన్నాను!’ అంటోంది. ‘తిన్నావా?’ అని ప్రశ్నిస్తే అవుననో లేదనో అంటే సరిపోతుంది. అయితే ఈ పిల్ల పళ్ళు ఇకిలించుకుంటూ ఏం మాట్లాడకుండా నిల్చుంటుంది.

రాజా! పచ్చిగా చెప్పాలంటే ఈ పాఠకరావు ప్రవర్తన నాకెందుకో పిచ్చిగా కనపడింది. పత్రికలో ఉన్న కథల పేర్లు చూసినప్పుడు అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు ఎందుకు పూచింది? చిటికె వేసిన మరుక్షణంలోనే అతడి కనుబొమలెందుకలా వింటి రూపం ధరించాయి? తన ఇంటి పైకప్పు ఎలా ఉంటుందో అతడికి తెలియదా? దాని వంక ఎందుకు అతడలా చూశాడు?

కవుకుదెబ్బలే​-​
చీకట్లో ఉఫ్ ఉఫ్‌మని
ఊదుకొమ్మంటోంది
నువ్వు కట్టుకున్న
పేక ముక్కల
​గీర మేడల్లో ​
ఎవరికీ తెలీకుండా
ఘొల్లుమని
ఏడవమంటోంది

ఊరు వదిలి నైజాం రాజ్యం వెళ్ళిపోయిన చాలాకాలానికి కనపర్తి మీద కతలు రాద్దామనుకున్నాక మళ్ళా ఆ ఊరికి వెళ్తారు శౌరీలు. పల్లెకాస్తా పట్నమయిపొయి, ఇళ్ళల్లో మనుషులకు బదులుగా టీవీలే మాట్లాడుతున్న వైనం చూసి బిక్కచచ్చిపోతోన్న శౌరీలుకు వాళ్ళ పెద్ద జీతగాడు బాలయ్య ఇంట్లో మళ్ళీ అప్పటి కనపర్తి దొరుకుతుంది.