రామారావుగారి కథలు చదివించవని చాలామంది అంటే, అలా తప్ప మరోలా రాయలేక పోయానని ఆయన వినయంగా అన్నారు. ఆ మాటలకీ, ఆ వినయానికీ అర్థమేమిటంటే, ఆ కథలు అలానే రాయాలి అని. నాకు తెలిసిన ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పేవాళ్ళు ఎంతోమంది లేరు.

పిన్ని కూతురు రేవతికి పన్నుమీద పన్ను ఎక్కింది. దొంతర పన్ను అంటారట! అది నవ్వితే భలే అందంగా ఉంటుంది. నిజానికి అందంగా కనబడకూడదుగా! అందరూ ఒకలాగ ఉండి ఒకళ్ళు వేరేగా కనబడితే దాన్ని గొప్పగా బాగుందనుకుంటాం కాబోలు! అది నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది!

కా.రా. కథలపద్ధతి వేరు. కా.రా. పేదలకంటే నిరుపేదల గురించి కథలు రాస్తాడు. అయితే మనుషులను మంచివారిగా గాని చెడ్డవారిగా గాని చూపడం అతడి కథాప్రయోజనం కాదు. మనిషి మంచివాడుగా గాని చెడ్డవాడుగా గాని ఎలా మలచబడుతున్నాడు మారుతున్నాడు అన్నది అతని కథావస్తువు.

జేన్ ఆస్టిన్ ‘నేను అందరిదాన్నీ’ అని ఏనాడూ చెప్పుకోలేదు కాని, అందరూ ఆమె తమకే చెందుతుందని అనుకున్నారు. తమ సిద్ధాంత పరిధుల్లోకి ఆమెను లాక్కువెళ్ళాలని ప్రయత్నించారు. ఆమె మరణించి రెండు శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ ఆమెను చర్చించుకుంటూనే ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆరు నవలల్లోనూ లోతుల్ని వెతుకుతూనే ఉన్నారు.

కొన్ని సెకన్లు రెస్టారెంటంతా నిశ్శబ్దంగా అయింది. అతని వైపు చూస్తూన్న అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి. ఆమె తలవంచుకుని మొహం దాచుకోవడంతో తలలు తిప్పుకున్నారు. ఆమెకు మరింత ఇబ్బంది కలిగించకూడదన్న సామూహిక ఒప్పందానికి వచ్చినట్టు ఏం జరగలేదన్నట్టు అందరూ తమ మాటలు కొనసాగించారు. పిల్లలు ‘దట్స్ మీన్!’ ‘హౌ రూడ్!’ అని గుసగుసలుగా అంటున్నారు.

“చూసినావురా శేషు, కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. సంతోషించు, నీ చిత్తం ఏంటో తెల్సి చేసిందో తెలీక చేసిందో కరుణమ్మ, తెలిసుంటే ఈ డబ్బులు కూడా దక్కేవి కావు.”

క్రితం నెల దాదాపు పదహారు పదిహేడేళ్ళ తరువాత నా పుట్టింటి వాళ్ళనందరినీ కలిశాను. అందరూ బాగా ఆదరించారు. రఫీ గురించి, ఆకాశ్ గురించీ వాళ్ళు రాలేదేమనీ అడిగారు. రఫీతో కాపురంలో పుట్టింటివాళ్ళను నేను పెద్దగా మిస్సవలేదు కాని, నావాళ్ళ మధ్య ఇన్నేళ్ళ తర్వాత కలిసి కూర్చుని మంచిచెడ్డలు పంచుకుంటుంటే ఎంత బావుండిందో! ఇప్పటికయినా నావాళ్ళు మళ్ళీ నన్ను కలుపుకున్నారని సంబరపడ్డాను.

“నేనుండగా ఒకరిద్దరు రైటర్స్ వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినా పలకరించలేదు. ఓ ఫ్లవర్ బొకే పెట్టొచ్చేశాను. ఎవరితోనూ మాట్లాడలేదు. చెప్పానుగా, నే వెళ్ళింది నాకోసం. అతనంటే జాలి వుంది. ప్రేమ లేదు. అతన్ని చూశాకా అనూ వచ్చుంటే బావుండేదని నాకూ అనిపించింది. ఎంతైనా కన్న తండ్రికదా? ఇప్పుడు నాకనిపించిన గిల్టే ముందు ముందు అనూకి రావచ్చు అనిపించింది.”

పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది. “చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.

అతను కాదు ఆమె కాదు
ఎగసిన మోహార్ణవం జీవనవనాన్ని దహించబోగా
నిజాయితీ కన్నీళ్ళు కొన్నీ
టీచర్స్ హైలాండ్ క్రీమ్ బొట్లు కొన్నీ
కలిసిపోయి రంగులు వెలిసిపోయి
కలిసి తెలుసుకుని మరీ తెలిసి కలుసుకొని

ఓ సారి నది
పంటకాలువ ఇంటికొచ్చింది
పొలం గట్లమీద
కాలువ చిరునవ్వుతో సాగిపోతుంటే
నది మౌనంగా అనుసరిస్తోంది
వెళ్తూ వెళ్తూ కాలువ
వేల పాయలుగా చీలిపోయింది

సాహిత్యంలోగాని యితర కళలలోగాని ఉద్యమాలు ఆయాకాలాల జీవనదర్శనాలప్రభావంలో ఆవిర్భవిస్తాయి. కాని వాటితో పోవు. అస్తిత్వవాదం అనేక సాహిత్యోద్యమాలలాగే వచ్చింది, పోయింది. ఉద్యమం చరిత్రలో కలిసిపోతుంది, సాహిత్యం నిలిచి ఉంటుంది. నిలిచి ఉన్న అస్తిత్వవాద సాహిత్యపరిచయమే ప్రస్తుత ప్రయత్నం. వాదం గౌణము, సాహిత్యం ముఖ్యము.

1942లో జరిగిన దౌర్జన్యములకు కాంగ్రేసే ఉత్తరవాదులని గవర్నమెంటువారు నిందించగా గాంధిగారు కాదనిరి. రాజప్రతినిధి దర్శనమివ్వలేదు. ఆయన ఉపవసింపగా ఆయనకు ప్రాణాపాయకర పరిస్థితి కలిగెను. అంతట బ్రిటీషు ప్రభుత్వమువారాయనను 1944 సం. మే 6వ తేదీన చెరసాల నుండి వదిలివేసిరి.

రాతియుగంలో సహజసిద్ధంగా లభించే లోహపు కణికలు మానవుడి కంటికి కనబడినప్పుడు వాటిని పదిలంగా భద్రపరచి ఉంటాడు. ఆకుపచ్చగా ఉండే తామ్ర కర్బనితం రాళ్ళనీ, నల్లగా ఉండే అంజన గంధకిదము రాళ్ళనీ గుండ చేసి ఈజిప్టులోని పురాతన రాజవంశీయులు సౌందర్య సామగ్రులుగా ఉపయోగించినట్లు దాఖలాలు ఉన్నాయి.

వ్యాకరణ రచనలో కేతన లాఘవం, అది కూడా తేలిక తెలుగు మాటలలో అప్పటికీ ఇప్పటికీ కూడా ఏ వ్యాకర్తలోనూ కనిపించదనిపిస్తుంది. అందువల్లనే చిన్న చిన్న మాటలలో, చిన్న కంద పద్యంలో కేతన తెలుగు క్రియా స్వరూపాన్ని వర్ణించిన తీరుకు తెలుగు వ్యాకరణాలను, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసే వారందరూ కూడా ఆనందిస్తారు.

క్రితం సంచికలోని గడినుడి-56కి మొదటి ఇరవై రోజుల్లో పద్దెనిమిది మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-56 సమాధానాలు.

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]