ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉన్న సత్యం కాదు. అది చైతన్యంపై పడిన ప్రతిబింబం మాత్రమే. ‘దాని నీడయే ఈ జగత్తు’ అనగా అదే. నీడకు స్వంతంగా ఉనికి లేదు. నీడ ఉండాలంటే ఒక వస్తువు, కాంతి ఉండాలి. ఈ చైతన్యసత్త్వము అన్నియెడల ఉండి మనకు కనబడక ఎందుకు గూఢంగా ఉన్నది?
శీర్షికలు అనువాదాలు
ఆకాశాన్ని నిలువునా చీల్చే
అంతు లేని దుఃఖం
ముంచెత్తినపుడల్లా
ఈ దుర్భరబాధ ఇదే చివరిసారి అని
ఇంకెప్పుడూ కలగదని
అనుకుంటూ ఉంటాను.
మేము నడుస్తోన్న దారి క్షేమం కాదనీ, అడుగు ఏమాత్రం తడబడినా దిగువనున్న బుధిగండకి మాకోసం ఎదురుచూస్తోందనీ మా అందరికీ తెలుసు. అంతా కలసి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న దారి… అడుగడుగూ చూసుకుంటూ వెళ్ళవలసిన దారి… సరిగ్గా అదే సమయంలో నా హెడ్ లాంప్ పని చెయ్యడం మానేసింది.
“మరణించినవారి లోకం కంటే బ్రతికున్నవారి లోకం ఎంత అందంగా ఉందో…” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయభానుడి కిరణాల వెచ్చటి స్పర్శకు ఒడిస్సియస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సర్సీ కనిపించింది. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో మెరుస్తూన్న ఆమె దుస్తులు ఆమె సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
నేను కుక్కను కాలేనా ఏంటి? నేనవుతా. కచ్చితంగా అవ్వగలను. ఇలాంటి చావుతో నా ఉనికి మాసిపోనివ్వను. తరాలకు తరాలు ఉనికి నిలుపుకోవాలనుకుంటున్నాను. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ మొఱిగాడు. ‘భౌ భౌ భౌ…’
దూరాన ఉన్న కొండచరియల మీద కనిపిస్తోన్న జలపాతాల దృశ్యం అధివాస్తవిక చిత్రంలా అనిపించింది. ఏదో ఆరుబయలు రంగస్థలంలోని బృహత్తరమైన గ్రానైట్ తెరమీద జాలువారే జలధారల వర్ణచిత్రంలా అనిపించింది. అంత చక్కని దృశ్యం చిత్రించిన చిత్రకారుడెవరూ? ‘ఏ కౌన్ చిత్రకార్ హై?’ అని శాంతారామ్ సినిమాలోని పాటలో అడిగినట్లు అడగాలనిపించింది.
ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అతని దృష్టి ఎటూ చెదరకుండా గమ్యం మీదనే ఉంది. ఆ గమ్యం ఇథకా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్. ఈపాటికి పిల్లడికి పన్నెండేళ్ళు వచ్చి ఉంటాయి. తన తల్లిదండ్రులు? వారింకా బ్రతికే ఉన్నారా?
తన్మయుం డద్దమున కెదురుగా నిలచి లా-
వణ్యముల తిలకించి మురిసిపోవునటు
చిన్మయుడు సృష్టి చిత్రమున తన వీర్య సం-
పన్నము ననుభవించు – మంకుతిమ్మ
ఈ పుస్తకంమీద దాదాపు 9 సంవత్సరాలు పని చేశాను. దాదాపు 900 మందిని కలిసిన తరువాతే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన వందలాది గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, ఊరికే చెప్పుకొన్న కబుర్లు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నావళి – వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం.
అంతు దొరక్క గిలగిలా కొట్టుకోవడం అన్నది మానవ మాత్రులుగా మన ఆఖరి ప్రతిస్పందన. అప్పుడు దేవుడు మందహాసం చేస్తాడు. ఒక చిన్న క్లూ విసిరి చూస్తాడు. వీడు దీన్ని పట్టుకోగలుగుతాడా అని సరదాగా పైనుండి వేడుక చూస్తాడు.
హిమాలయాలు మరోసారి పిలుస్తున్నట్టు అనిపించసాగింది. ‘పద, ఇంకోసారి వెళ్ళివద్దాం’ అంటూ మనసు తట్టి లేపసాగింది. బుద్ధి కూడా ‘మనసు చెప్పిన మాట విను’ అని హితవు పలకసాగింది.
ప్రకృతి శక్తులతో మానవమాత్రుల మల్లయుద్ధం మళ్ళా మొదలైంది! పరాజయాన్ని నిరసిస్తూ, ఇనుమడించిన సంకల్ప శుద్ధితో, సముద్రంతో, సుడిగాలిలో పది రోజులు నిరాఘాటంగా పోరాడారు.
సరళ జీవనపు కల మంకుతిమ్మని మనసు
సరస ఋత సౌజన్య శాంతి శోభనము
సరసి తెరలేచి తుంపర చినుకులను చల్లి
మరల సరసిని జేరు – మంకుతిమ్మ
పూజ్యులైన డి.వి.గుండప్పగారి ఈ గ్రంథము ’మంకుతిమ్మని మిణుకు’ అనే ఆంధ్రానువాదానికి మూలమైన ’మంకుతిమ్మన కగ్గ’కు రెండవభాగము. ఈ రెండవ భాగం ప్రకటమైనది 1984లో, డి.వి.జి గారు గతించిన తొమ్మిది సంవత్సరాల తరువాత.
నన్ను వ్యక్తిగతంగా ‘నువ్వు ఏ ట్రెక్ను ఎక్కువగా ఇష్టపడ్డావు’ అని అడిగితే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేను. దేని ప్రత్యేకత దానిది. కానీ నాకు అన్నపూర్ణ ట్రెక్ను సమన్వయం చెయ్యడం ఎవరెస్ట్కన్నా పెద్ద సవాలుగా నిలిచిందని చెప్పుకోవాలి.
యుద్ధంలో ఎప్పుడో ఒడిస్సియస్ చచ్చిపోయి ఉంటాడనుకొని, పెనలొపీని పెళ్ళాడి… ఇథకా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆశతో పెక్కురు రాకుమారులు నిత్యం ఆమెను అనేక విధాలుగా ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి బారినుండి తప్పించుకోడానికి పెనలొపీ రకరకాల పన్నాగాలు పన్నుతూనే ఉంటుంది.
“లల్లేశ్వరి తత్వం శాశ్వతమైనది. దాని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం, ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు,” నాన్న బదులు పలికాడు. “అందుకే నా అనుసృజన ఎప్పటికీ అసంపూర్ణమే!”
5000 మీటర్ల ఎత్తున ఎత్తుపల్లాలను దాటుకుంటూ నడవడం అంటే మాటలు కాదు. వేసే ప్రతి అడుగూ అదనపు సంకల్పశక్తిని కోరే సమయమది. ప్రతి నాలుగు అడుగులకూ ఒకసారి ఆగి, గుక్కతిప్పుకుని ముందుకు సాగవలసి వచ్చే సమయమది. ఎంత అనుభవం ఉన్న ట్రెకర్లయినా ఆచి తూచి అడుగులు వేసే ప్రాంతమది.
స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.
పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.