5000 మీటర్ల ఎత్తున ఎత్తుపల్లాలను దాటుకుంటూ నడవడం అంటే మాటలు కాదు. వేసే ప్రతి అడుగూ అదనపు సంకల్పశక్తిని కోరే సమయమది. ప్రతి నాలుగు అడుగులకూ ఒకసారి ఆగి, గుక్కతిప్పుకుని ముందుకు సాగవలసి వచ్చే సమయమది. ఎంత అనుభవం ఉన్న ట్రెకర్లయినా ఆచి తూచి అడుగులు వేసే ప్రాంతమది.

స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.

పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.

ద్రౌపది కుమారులు ఐదుగురినీ కోల్పోయిందన్న వార్త నా చెవినపడ్డప్పుడు కూడా అదే జరిగింది. వెంటనే నా మనసు శాంతించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవాలి. ఆమె కడుపు మండిపోవాలి. ఆర్యావర్తంలో ముంచుకొచ్చిన ఈ పెనువిపత్తుకు బీజం వేసింది ఆమె అహంకారం కాదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ధగధగలాడే వజ్రాల కిరీటం ధరించి పట్టమహిషిగా సింహాసనం మీద నవ్వుతూ ఎలా కూర్చుంటుంది?

చెరువుతోనే సరిపెట్టకుండా అందరం దగ్గర్లో ఉన్న ఛోంగ్‌కోర్ వ్యూపాయింట్ దాకా ఎక్కాం… కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఆ వ్యూ పాయింట్ నుంచి దూరాన గంగపూర్ణ శిఖరం, అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు, తిలిచో శిఖరం – అన్నీ ఒకేసారి కొలువుదీరి మనసుకు పరవశం కలిగించాయి… చక్కని తేనీరు సేవిస్తూ చుట్టూ పరచుకుని ఉన్న శిఖరాలతో కబుర్లాడటం – అనూహ్యమైన అనుభవమది.

నిన్నంతా కురిసి కురిసి వాన అలసిపోయిందేమో – ఆ ఉదయాన వాన ఛాయలు వెదుకుదామన్నా కనిపించలేదు. గొప్ప ఉపశమనం. సంతోషం. అప్పటిదాకా మొహం చాటేసిన సూర్యుడు కూడా తన పూర్ణస్వరూపం చూపించడానికి తొందరపడసాగాడు. గొప్ప వాతావరణం. వెచ్చని ఎండలో, చక్కని వెలుగులో హిమశిఖరాల మధ్య ట్రెకింగ్ చెయ్యడమంటే స్వర్గసమానమే.

పన్నెండవశతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైకజీవనమే పూజ అని నమ్మిన కులరహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, ‘తక్కువకులస్థుల’తో మమేకమయ్యాడు. ఒక ‘వచనం’లో ఆయన, తను మదర చెన్నయ్య సేవకుడికీ, కాకయ్యవద్ద చర్మకారవృత్తిచేసే పనిపిల్లకు పుట్టినవాడినని చెప్పుకునేంతగా సాహసించాడు.

నాన్న మమ్మల్ని దగ్గరకు తీసుకొని ముద్దు చేసిన జ్ఞాపకమే లేదు. ఆయన ఇంటికి రావడమే అరుదు. ఎక్కువభాగం ప్రయాణాల్లోనే ఉండేవారు! ఆ రోజుల్లో, పాలక్కాడు కొండ ప్రాంతాలలో ఊరూరా తిరుగుతూ దొంగతనాలు చేసే బందిపోట్ల బెడద విపరీతంగా ఉండేది.

ఇపుడు మేము నడుస్తున్నది దిగువ హిమాలయాలలోని అడవులలో… మర్సియాంగ్దీ నదీలోయలోని పర్వతాల సానువుల్లో ఉన్న అరణ్యాలలో.. ఆ లోయకు అటూ ఇటూ ఎగసి నిలచిన పచ్చని పర్వతచరియల్ని చూస్తోంటే ప్రకృతి తన కళాత్మకతనంతా ఇక్కడే పొందుపరచిందా అనిపించింది. పచ్చని అడవులు, వరి పొలాలు, జలపాతాలు – అన్నీ చక్కగా అమరిపోయి ఉన్న ఆ సుందరసీమ ప్రకృతి గీసిన బృహత్తర వర్ణ చిత్రం కాదూ?!

ప్రతి రోజూ ఉదయం పశువులు మేతకొచ్చే సమయానికి చేను దగ్గరకెళ్ళి కాపలా కాయాలి. లేదంటే పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. పశువుల కాపర్లు వాటిని వొదిలేసి ఏ మఱ్ఱిచెట్టు కిందో కూర్చుని తూగుతూనో, గుడి మంటపం దగ్గర కూర్చుని పులీ-మేక ఆట ఆడుతూనో, ఈత పళ్ళు ఏరుకుంటూనో ఉంటారు. వాళ్ళకు తెలీకుండా పశువులు ఏపుగా పెరిగిన పత్తి చేల మీదికి వచ్చేస్తాయి. అది జరిగినప్పుడు పొలి కేకలు పెట్టుకుంటూ నాలుగు దిక్కులా వాటి వెనక పరిగెడుతూ, అరి కాళ్ళకు గుచ్చుకుని చర్మాన్ని చీల్చేసే పల్లేరు కాయల ముళ్ళను కూడా పట్టించుకోకుండా పశువుల్ని అక్కడినించి తరమాల.

చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.

బీజమే వృక్షమై పెరిగి పెరిగీ మరల
ఆ వృక్షమై చిన్ని బీజమైనట్టుగా
లింగమందుదయించి లింగమందైక్యమై
పురాతనులుగ వెలుగు జంగముల సంగమును చూడరయ్యా!

‘మరి మీ కుటుంబంలో ఎవరైనా భిక్షువులయ్యారా?’ అన్నది మా తదుపరి ప్రశ్న. నవ్వేశాడు పిసాంగ్. ‘నేను పదేళ్ళ వయసులో భిక్షువునయ్యాను. ఇరవై ఏడేళ్ళదాకా కొనసాగాను. రెండేళ్ళ క్రితమే మళ్ళా మామూలు ప్రపంచంలో పడ్డాను,’ అని సమాధానం చెప్పాడు.

మహాయాన బౌద్ధానికి చెందినదీ టిబెటియన్ బుద్ధిజం. జాతకకథల్లో చెప్పినట్టు బుద్ధుడు అనేక అవతారాలు ఎత్తిన మహనీయుడు అని వీరు నమ్ముతారు. అందులో కొన్ని జంతురూపపు అవతారాలు కూడానట. వాటి వాటి గుణధర్మాలు సామాన్యులు గ్రహించి అనుసరించాలన్నది ఆ అవతారాల ఉద్దేశ్యమట.

వేదశాస్త్ర ఆగమ పురాణములెల్ల
తవుడు నూకల దంపుడే సుమీ!
దంచుటెందుకు? చెరుగుటెందుకు?
చెదిరే మనసును నిలుపగలిగిన
అంతా బట్టబయలు చెన్నమల్లికార్జునా!

కాలాపత్థర్ శిఖరంనుంచి ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఎంతో స్పష్టంగా కనిపించాయి. ఎదురుగా నిలిచి పలకరించే శిఖరాలేగాకుండా దిగువన ఘనీభవించిన పచ్చల తటాకాలు, గ్లేషియర్లు కనిపించి మురిపించాయి. సాయంకాలపు ఎండలో బంగరుకాంతితో నిండిన ఎవరెస్ట్, సభాగారంలో ముఖ్యాసనంలో కూర్చున్న మహారాజులా కనిపించింది.

గిరియందు గాక గడ్డిదిబ్బల మీద ఆడునా నెమలి?
కొలనులో గాక చిన్నికాల్వల నీరాడునా కలహంస?
మావిచిగుళ్ళు మెసవక మోమెత్తి పాడునా కోకిల?
పరిమళములు లేని పూలపై వ్రాలునా తుమ్మెద?
నా దేవుడు చెన్నమల్లికార్జునుని గాక నా మనసు
ఇతరుల నెట్లు చేరగలదో? చెప్పరమ్మా?