పట్నాలు – ప్రేమలు: మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం.

డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్‌కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు.

సుందరి దగ్గరికి వచ్చి నిల్చుంది. అరవడం మొదలుపెట్టింది. నేను నాన్న కళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆయన కళ్ళు క్రూరత్వాన్ని, కోపాన్ని, పశ్చాత్తాపాన్ని ఏకకాలంలో చూపిస్తున్నాయి. నేను మాట్లాడకుండా ఉండడం గమనించిన సుందరి ఇంకా కోపంగా అరిచింది. నాన్న ఇప్పుడు ఉరిమి చూశాడు. ఆయన కళ్ళను చూసే ధైర్యంలేక నేను తలవంచుకున్నాను. ఒళ్ళంతా కరెంటు పాకుతున్నట్టు అనిపించింది. నాన్న కోపంగా లేచి నిల్చుని అరుస్తున్నాడు. సుందరి ఎడమవైపు నిలుచుని అరుస్తుంది.

కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది.

తాణప్పన్న, లీలక్కతో మాట్లాడుతున్నప్పుడు లీలక్క నాలుగు దిక్కులూ చూడ్డం, అప్పుడప్పుడు ఫక్కుమని నవ్వడం, తలొంచుకోడం నిన్న వాళ్ళు గుడికి వెళ్ళేప్పుడు చూశాను. కప్పకళ్ళోడు “తెలిసిందిలే నెలరాజా…” అని పాడుకుంటూ కొబ్బరి చెట్టెక్కాడు. నన్ను చూసి కన్నుకొట్టాడు. అణంజి వంగి తాణప్పన్నను పరీక్షగా చూసింది. చేత్తో అతని లుంగీ పక్కకు తీసి చూసింది. నేను చేతులడ్డం పెట్టుకుని నవ్వాను. “ఏందా నవ్వు? విత్తనం సత్తువ చూడాలిగా!” అంది అణంజి.

ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అస్పష్ట సమాధానము భయంకరమై ఉండెను. గౌరవ భంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడమూ సాధ్యం కాదు. వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని సడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడునొప్పి’ అనుకుంటుండగానే నొప్పి తగ్గి ముందు ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నప్పుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకుని పోయెను.

ఈ అపార్టుమెంటు బ్లాకులోనే ఓ ప్లాటులో ఆయన చాలా కాలంగా అద్దెకి ఉన్నారు. ఆయన గురించి పనిమనిషి – తాను పని చేసే అందరి ఇళ్ళల్లో చెబుతూ ఉండేది. ఈ పనిమనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన పదిమందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను – ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం, పైగా దాసుగారు కూడా తరచూ పనిమనుషులను మార్చి విసిగిపోయారు.

విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి.

చెమటలు కక్కుకుంటూ బయటకు పరిగెత్తాను. కాళ్ళు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మెలమెల్లగా నాలో తార్కిక చింతన తిరిగి మొదలై అంతా నా భ్రాంతేనని అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాను. గది లోపలికి వెళ్ళడానికి భయమేసింది. వరండాలోనే పడుకున్నాను. మా వీధి చాలా వెడల్పుగా ఉంటుంది. చక్కగా గాలి వీస్తుంది. అలసిపోయి ఉండటంతో నిద్రపోయాను. ఎదురింటి కుక్క వరండా కింద పడుకుని ఉంది.

ఇట్లా ఉండగా జనవరి 12వ తేదీనాడు తెల్లవారి గుజరాతి పత్రికను తెరచినపుడు Demonetization శాననపు పిడుగు దొంగ వ్యాపారులు, లంచగొండులు అందరికీ సోకినట్లే అతనికి హఠాత్తుగా సోకెను. ‘500 రూ॥లకు పైన విలువగల నోట్లన్నీ రద్దు’ అనే పెద్ద అక్షరాల శీర్షిక కండ్లలో పడగానే పిలానికి తల తిరిగి కన్నులు చీకట్లు క్రమ్మెను. గుండెలు దడదడ లాడెను. శ్వాస నిలిచిపోయెను. చేతులు వణికి పత్రిక పడిపోయెను.

గాలివాటపు జీవనం.
ఆడంబరాల హోరు,
యవ్వనం మెఱుఁగులు
చెరిగిపోయే మెరుపులు.
సమయజ్ఞానంతో
బిరాన ఎంచుకో నీదైన క్షణం.

క్వెన్క నుంచి గుయాకీల్ 250 కిలోమీటర్లు. మధ్యలో ఒకచోట విరామం కోసం ఆగాం, అంతే. అంతా కలసి ప్రయాణానికి నాలుగున్నర గంటలు పట్టింది. దారంతా వర్షం – బయట అసలేమీ కనిపించనంత వర్షం. క్వెన్క వదిలీ వదలగానే రోడ్డు ఆండీస్ పర్వతాల మధ్య మెలికలు తిరుగుతూ సాగింది.

కథ చెప్పుకోవడంలో ఎదురయ్యే సమస్యేమిటో, వాళ్ళు వెంటనే పసిగట్టగలిగారు. కొత్తగా ఒక కథను చెప్పడం మొదలుపెడితే మనచేతనే సృష్టించబడ్డ పాత్రధారులు పునఃసృష్టితో దేవుళ్ళుగా మారి ఎప్పుడు మళ్ళీ కథ లోపలికి ప్రవేశిస్తారో మనం ఖచ్చితంగా చెప్పలేం. వాళ్ళు మనల్ని చూసి నవ్వి, చేతులతో సైగ చేసి, మారీచుడిలా ఆశ చూపి కుట్ర చేసి ఎటో దూరంగా తీసుకెళ్ళిపోతారు. చిట్టచివరికి కుట్ర బయటపడేసరికి మనం సెలవు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతుంది.

మంచం మీంచి చూస్తున్న పాపకు తెరిచివున్న తలుపులో నుంచి, మసక చీకట్లో ఏదో రాచుకుంటున్న శబ్దంతో గుట్టుగా ఒక ఆకారం అటూ ఇటూ నెమ్మదిగా తిరగడం కనపడుతోంది. ఇప్పుడు సరిగా కనపడుతోందది; క్రమేపీ బూడిద రంగు మచ్చలా మారి చుట్టూ వున్న చీకట్లో కలిసిపోయింది. రాచుకుంటున్న శబ్దం ఆగిపోయింది. దగ్గర్లో చెక్క నేల కిర్రుమన్న శబ్దం. దూరాన మళ్ళీ అదే శబ్దం… అంతా నిశ్శబ్దం. ఆ ఆకారం న్యాన్యా అని అర్థమైంది. న్యాన్యా వ్రతంలో ఉంది.

ఆ వస్తువులన్నిటిని క్షిప్ర అంతకు ముందు కూడా చూసింది. కానీ ఇప్పుడు అవి మరీ కొట్టొచ్చినట్టుగా కనపడుతున్నాయి. తార భర్త వాటన్నిటిని క్షణంలో బయట పారేస్తాడేమో. తార తన హృదయంలో ఎన్నో అవమానాలను పెట్టుకొని భరించింది. ‘ఒకరోజున ఇవన్నీ సర్దుతాను అనుకుంటాం. కానీ, వాటిని అలాగే వదిలి ఎకాయెకిన చెప్పాపెట్టకుండా ఈ లోకాన్ని వదులుతాం.’ తార పార్థివశరీరం ముందు నిలబడగానే క్షిప్రకు ఈ ఆలోచన మనసులో మెదిలింది.

ఆండీస్ పర్వత శ్రేణి విస్తరించి ఉన్న దక్షిణ అమెరికా దేశాలలో మొక్కజొన్ననుంచి తయారు చేసే చిచా అన్న మదిర తెప్పించుకొని రుచి చూశాను. ఆ పానీయం ఆ ప్రదేశాల్లో మాత్రమే తయారవుతుందట. దాని మూలాలు ఇన్కా నాగరికత పూర్వపుదినాల నాటివట. ఇన్కా ప్రజానీకం కూడా పండుగలు పబ్బాలలో ఈ మదిరను కాచి విరివిగా సేవించేవారట.

ఈ ముసలోడెందుకు ఇంతలా శివా! శివా! అని కేకేస్తూ ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాడో అని కూడా అనిపించసాగింది. సమయం దొరికినప్పుడల్లా చిలకస్వాముల పక్కన చేరి ఆయన్ని ఆటపట్టించడంలో ఆనందం పొందాడు. రోజులు గడిచిన కొద్దీ చిలకస్వాములతో ఒక మాటయినా మాట్లాడించాలని పంతం పట్టాడు అర్చకస్వామి. అయితే అది అంత సులువయిన పనిగా అనిపించలేదు. చాలావరకు చిలకస్వామి ఏ రకంగానూ ప్రతిఘటించేవాడు కాడు.

మూడు మైళ్ళు పరుగెట్టాక కట్టెలకు వెళ్ళిన ఇద్దరూ ఎదురుగా వస్తూ కనిపించేరు. వాళ్ళు నిజంగానే చుట్టలు తాగుతూ కాలక్షేపం చేశారు. కట్టెలు ఇంకో గంటలో వస్తాయని వీరితో బొంకారు. ఈ ఇద్దర్నీ చూశాక పరుగెట్టే ఇద్దరూ ఆగి చెప్పారు శవం కదలడం, మూలుగు వినడం అవీ. ఇది విన్న వాళ్ళు వీళ్ళని వెక్కిరించారు పిరికిపందలని. మొత్తానికి నలుగురూ కలిసి మరోసారి శ్మశానానికి తిరిగొచ్చారు. గుడిసెలోకి వెళ్ళాక తెల్సింది – కాదంబిని శవం అక్కడ లేదు.