పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni అభిప్రాయం:

    01/26/2018 4:40 pm

    K.V.S. Ramarao on January 19, 2018 at 3:30 pm said:

    నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.

    Nice of you, to allow the readers here to examine your opinion. Ramarao garu. Here are my thoughts.

    1.”ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”

    జాషువా “ఫిరదౌసి” 1932 లో వెలువడింది.

    ‘ఫిరదౌసి’ రాస్తున్నప్పుడు ఆయన బడి పంతులు పని చేస్తున్నాడు. రచన సరిగా సాగటం లేదు. రాసింది ఆయనకే నచ్చటం లేదు. అచ్చుకు డబ్బు లేదు. ఆపివేసాడు. రాసిన రచన లో భాగాలు అక్కడక్కడా చదివి వినిపిస్తున్నాడు. హెడ్ మాస్టరు, జాషువా ఆందోళన, రచన – రెండూ విని తప్పక పూర్తి చెయ్యమనీ, జనులు ఆదరిస్తారనీ చెపితే,- మళ్లీ ఉత్సాహం కలిగి రచన ముగించాడు. (జాషువా రచనలు మూడవ సంపుటి. Page 268.)

    జాషువా ఫిరదౌసి రాసేనాటికి, ఆయనకు 37 ఏళ్లు. అప్పటికి ఆయన ఎంతో కవిత్వం చెప్పి ఉండలేదు. ఎన్నో పబ్లికేషన్స్ లేవు. విలువలో Homer- Ilead తో తూగుతుందని, భారత రామాయణాల వంటిదని, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షానామా రచయితతో తనను పోల్చుకోడు. తన కెంత ఖ్యాతి రావాలో, అది వస్తుందో రాదో ఊహ చేసే సమయం కాదు.

    పైగా ఖ్యాతి, డబ్బు సంగతి పీడా పోయింది, ఫిరదౌసి కథలో కొడుకు పోవటం అన్న దుర్ఘటన ఉన్నది. అప్పట్టున మీ ఉద్దేశం భార్యాబిడ్డలు గల జాషువాకి వర్తింప చేయటం అసాధ్యం.

    2.”ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక.”

    జాషువా తనే రాసుకున్న జీవిత చరిత్ర ( నా కథ ) చదివితే, ఫిరదౌసికి ప్రతి పద్యానికి బంగారపు దీనారు ఇవ్వవలసి ఉండటమేమో గాని, గమనించండీ – ఒకచోట తన ప్రతి పద్యం లోనూ జాషువా నూటపదహార్ల వర్షం కురిపించాడు. సన్మానాలే సన్మానాలు. ఊరికే శాలువాలు కప్పి తాంబూలాలిస్తే ఆయనకు కుదరదు. డబ్బు ఇవ్వకుండా తన కవిత్వం వినటం ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా చెప్పాడాయన. జాషువాకి ప్రతిష్ఠ పుష్కలంగా లభించింది. ఊరూరా సన్మానాలూ గండపెండేరాలు తొడిగించుకోటం, శాసనసభకు ఎన్నికవటం, పద్మభూషణ్ రావటం. – ఇవన్నీ అతని కవిత్వానికి గుర్తింపూ, వ్యక్తిత్వానికి గుర్తింపూ, జీవితంలో upward moves కదా.

    3.”బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం”

    “ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా!” అనుకున్న చేమకూరి కవి మాటలు తన పట్ల వర్తించవని జాషువానే చెప్పుకున్నాడు. “నేనే గతి రచియింతునో చెప్పంజాలను కాని సమకాలీనుల వాత్సల్యమునకు గురియైతినని చెప్పుకొను పుణ్యము నాకు గల్పించిన తెలుగువారికి నేను కృతజ్ఞుడను..” అని చెప్పుకున్నాడు.

    జాషువాకి తన జీవితకాలం లోనే కవిగా, వ్యక్తిగా సమాజంలోనూ, స్వకుటుంబంలోనూ కూడా ఖ్యాతి, ప్రేమాభిమానాలు లభించాయనే నాకు అనిపిస్తున్నది.

    4.” అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం.”

    Not at all. For the reasons already given. Here is what I think is possible at that time.

    When he is dwelling on the story, I would say Joshua has made a silent vow to himself, not to be a loser ‘financially’, like the man in his story. Joshua did not want to make the foolish mistake of waiting around 30 years to collect on his poetry revenue. The story taught him financial prudence. If you notice, Joshua showed quite a bit of financial wisdom eventually. He was making sure he is paid every time he wrote. He was lining up his writings, and matching them up with his publishers, donors. He was motivated. He was continuously moving upwards.

    Also, knowingly or unknowingly; He sent a message to the public, thru the publication of Firdaus.
    జాషువా ఫిరదౌసిమీదున్న కథని కావ్య వస్తువు గా ఎన్నుకుని, కవిని గౌరవించాలనీ, కవిత్వం చాలా గొప్పవస్తువనీ, బంగారు నాణేలు ఇవ్వవచ్చనీ, అతనికి ప్రామిస్ చేసిన డబ్బిస్తేనే, షావుకారు మర్యాద నిలుస్తుంది – అన్న నీతిని ప్రజకు అందించాడు కదా. కవికి డబ్బు ఇవ్వకుండా మహమ్మద్ చచ్చాక – అతని తలకాయ రాత్రులలో గజనీపట్టణ వీధులలో ఆర్తనాదాలు చేస్తూ తిరుగుతుందన్న పద్యంతో ముగించాడు ఫిరదౌసిని. With that, He put God’s fear into people’s hearts.
    ఫిరదౌసి కావ్యం రాయటం, జాషువాకి పై విధాలుగా లాభించింది.

    Expanding the discussion a bit for clearer understanding, a little more writing on Joshua, based on my reading Joshua’s poetry in ‘జాషువా రచనలు.’

    ఫిరదౌసి కావ్యం రాసాక, ఆ కావ్యం రాసిన కవిగా, ఇతరులు అతన్ని గుర్తించారు కాబట్టి, తరవాత తరవాత జాషువా ఆలోచనను ‘అతని ఫిరదౌసి’ కొంత ఆక్రమించాడు. సందర్భాన్ని బట్టి ఆ ఫిరదౌసితో identification వస్తుంది.

    జాషువా, సుమారు తన 60 ఏళ్ల వయసులో రాసిన ‘నిర్వేదము’ అని ఒక చిన్నకవితలో అది చూడవచ్చు. (జాషువా రచనలు నాల్గవ సంపుటి. పేజీ 214.) ఆయన మీద ఏవో అభియోగాలు మోపినట్టున్నారు. ఆయనతో కలసి 40 ఏళ్లు పైన కాపురం చేసిన భార్య గతించింది. డబ్బు పొడిదుడుకులు అలానే ఉన్నాయి. అప్పుడు ఆ సమయంలో నేను ఫిరదౌసి కవి లాగానే, డబ్బు ఇబ్బందులతోనే చస్తాను కవీశ్వరేశ్వరీ! నీతో పాటు మట్టిలో కలుస్తాను, జీవితేశ్వరీ! – అనుకుంటాడు. It is momentary. At that point, it is apt. That grief passes. ఆ తర్వాత ఆయన మళ్లీ పెళ్ళాడాడు. ఆ పైన ఇంకా చాలా జీవితం నడిచింది.

    కవిత్వపు తొలిదినాల్లో జాషువా identification కర్ణుడితో ఉండింది.

    తొలిరోజుల్లో, జాషువాని ఒకసారి కవిత్వ సభలో పోటీ చేద్దువు గాని అని స్నేహితుడు తీసుకువెడితే, అక్కడ అతడు పంచముడు అని కోపంతో కొంతమంది సభ లోంచి లేచి వెళ్లిపోతారు. అక్కడ కొందరి మాటలకు మనసు గాయపడి, ఇంటికి వెళ్లి ఏడుస్తాడు. అప్పుడు మనశ్శాంతి కోసం భారతం చదువుకుంటూ -నిద్రపడితే- కర్ణుడు ఎంతో ప్రకాశమైన రూపంతో కనిపించినట్టు తలుస్తాడు. కర్ణుడిని – నువ్వు సూతుడవు, నువ్వు రాజకుమారులతో విలువిద్యలో పోటీ చెయ్యటం వీలుకాదన్న ఆ సందర్భం తలుస్తాడు.
    అక్కడ కర్ణుని గురించిన పద్యాలు చక్కగా ఉన్నవి.

    Pretty easy to see similarity in situation, for any of us.

    In his times Joshua is told many times by some people, he is not an equal. He cannot enter certain arenas. He cannot take up sports/studies or compete in certain things reserved only for others. But, truly, Joshua is also a son of India. He is an equal to others.

    There is a great deal of truth, in Joshua’s identification with this powerful character from fiction. Karna who is kind and heroic in his spirit and in his suffering. Joshua became better than Karna, deciding in -not to hate others, more in the line of Gandhi, Christ. But, he does not become a sacrificial lamb either.

    Thanks, Lyla
    PS: నేను సాహిత్యం, సాహిత్య విమర్శ విషయాల ఆలోచనలోనే ఉన్నానని, ‘ఈ మాట’ దేవళంలో ఊరికే గబ్బిలం లా ఎగరటం లేదని పాఠకులు తప్పక గ్రహిస్తారు.

    శాయి గారు కాని చదువుతుంటే, ‘భారతి’ పత్రికలో కర్ణుడి మీద జాషువా గారు రాసిన వ్యాసం దొరుకుతుందా? ఆ వ్యాసం నాకు చదవాలని ఉంది. Thanks.

  2. రీప్లే గురించి Twilight అభిప్రాయం:

    01/25/2018 4:40 am

    కధ చాలా బాగుంది. ఒక విధంగా డాన్ బ్రొవ్న్ తెలుగులో రాస్తే ఇలానే ఉంటుందేమో అనిపించింది.
    congrats 🙂

  3. ఇది చాలు నాకు గురించి నగేష్ అభిప్రాయం:

    01/25/2018 2:05 am

    చక్కటి తెలుగు నేను నేర్చుకోవాలి. తప్పులు లేకుండా ఎలా రాయాలి

  4. తెలుగు సాహిత్య విమర్శకు తూనికరాళ్ళు గురించి కోదాటి రమాకాంత రావు అభిప్రాయం:

    01/23/2018 12:10 pm

    ఈ వ్యాసంపై స్పందించడానికి ఎవరికీ కారణం దొరక్క కాదనుకుంటాను.

    వీరు రససృష్టి, సాహిత్యదృక్పథం గురించి చాలానే వివరించారు. కానీ సామాజిక దృక్పథం, సాహిత్య దృక్పథం వేర్వేరుగా ఉంటాయని వీరి ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను.

    “Form is useless unless it is the form it’s content” (మార్క్స్) అన్న విషయాన్ని చెప్పడానికి వీరు చాలా తిప్పలు పడ్డారనిపిస్తోంది. కానీ “Content decides the form” అన్న విషయాన్ని వీరి రససృష్టిలో మిళితం చేశారు.

    అట్లా వీరు ఏదో కొత్త ప్రతిపాదన చేసినట్లనిపించించేందుకు ప్రయత్నించారనిపిస్తోంది కానీ ఆధునిక విమర్శ చలం తూనిక రాళ్ళని దాటిపోయి చాలా కాలమైందన్న సంగతిని వీరు విస్మరించారనిపిస్తోంది.

    –కోదాటి రమాకాంత రావు

  5. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి కోదాటి రమాకాంత రావు అభిప్రాయం:

    01/23/2018 8:16 am

    మానస చామర్తి గారి వ్యాసానికి డెట్రాయిట్ వారి ప్రధమ బహుమతి లభించినందుకు సంతోషం. అభినందనలు..

    వీరు ఇచ్చిన కొత్త ఆలోనలు ప్రత్యేకించినవేమీ కావు.

    ౧ వీరు చెప్పిన రచనా లోకానికీ జీవన వాస్తవికతకీ తేడాని గమనించలేదు సరికదా భావుకత పేరుతో నిరాకరణని శాస్త్రీకరించారు. ఉదా: రేవతీదేవి “దిగులు”నీ, రాజేశ్వరీదేవి “మార్కెట్ సమాజాన్నీ” వీరు సరిగ్గా అంచనా వేయలేక పోయారని తెలుసుసుకోవడం కష్టమేమీకాదు. వాస్తవం వద్దు రంగుల కలే ముద్దు అనడంలోని (సత్యం వద్దు స్వప్నమే కావాలి) సామాజిక సత్యాన్ని గుర్తించలేకపోవడమే కారణం.

    ౨ నువ్వు ఏమైనా చెప్పు ముందు అది కవిత్వమై ఉండాలి అన్నది పైకి చాలా సమంజసంగానే కనిపిస్తుంది. కానీ పైకి కనిపించే సామాజిక వాస్తవాల ముసుగు తీయడానికి భావవాద/రూపవాద విమర్శకుల శక్తికి మించిన పని అని వేరే చెప్పనక్కరలేదు.

    ౩ “సహృదయ విమర్శ” గోడ మీద పిల్లి. సాహిత్యానికీ దాని భూమికైన సమాజానికీ ఈ “రకం” విమర్శ ఏమాత్రం మేలుచేయకపోగా చదువరుల్ని మభ్య పెట్టి మబ్బుల్లో తిప్పుతుంది. కాకపోతే సృజకుడిని (కవి, రచయిత) తృప్తిపరచి పైమెట్టెక్కిస్తుంది.

    ౪ కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు తెలుగులోసాహిత్య విమర్శ లేదనుకోవడానికి కూడా సవాలక్ష కారణాలు కనిపిస్తుండవచ్చు. విమర్శని కూడా ఒక సృజనగా భావించకపోవడం శోచనీయం.

    ౫ “గులక రాయి” దేనికి సంకేతమో తెలియక అస్పస్టత ఏర్పడిందని మానస గారు అనుకోవడంలో విఫలమైనారని అనుకోవాల్సివస్తోంది.

    వీరి వ్యాసంలో కేవలం “వాచక” విమర్శకే పరిమితమైనారని సులభంగానే తెలుసుకోవచ్చు. అందుకే ఇది రూపవాద విమర్శకు సంబంధించిన ఆలోచనలుగానే మిగిలిపోయినాయి.

    –కోదాటి రమాకాంత రావు

  6. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి రాధిక అభిప్రాయం:

    01/22/2018 5:49 am

    ఈ వ్యాసంలో నాకు అసంతృప్తి కలిగించిన విషయాలు రెండుమూడు ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్దామనుకుంటున్నాను. వ్యాసంలోని ఉదాహరణలు, వాటిని వివరించిన తీరు సరిగా లేవని అనిపించాయి. ఉదాహరణ సరిగా లేనపుడు ప్రస్తావించిన ముఖ్యాంశం పాఠకులని మెప్పించడానికి బదులుగా ‘ఇది కేవలం పడికట్టుపదాల ప్రయోగమేమో’నని సందేహించే పరిస్థితిలో పడేస్తుంది.

    1. “సైన్స్‌ ఫిక్షన్‌ రచనలో టైమ్‌ ట్రావెల్‌ ఒక అంగీకరింపబడిన సత్యం. అలాంటి రచనను టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అది కేవలం కల్పన అనే ప్రాతిపదికన పరిశీలించబోవడం, ఆ రచనను దాని పరిధి దాటి పరిశీలించడం అవుతుంది. హాస్యం ప్రధానోద్దేశమైన రచనలో సామాజిక సందేశం వెతకడం ఇలాంటిదే.” –

    ఇది మొదటి ఉదాహరణ. ఈ ఉదాహరణ కి ముందు వ్యాస రచయిత్రి చెప్పిన అంశం చదివి సమకాలీన విమర్శ గురించి ఒక సమగ్ర పరిశీలన చేస్తున్నారేమోనని అనుకునేలోపూ ఈ ఉదాహరణ వస్తుంది. దానితో ఆ అంశం యొక్క స్థాయి ఒక్కసారిగా పడిపోతుంది. ఇక్కడ చెప్తున్నది చాలా మామూలు విషయమనిపిస్తుంది. “పరిధి” అని దీనిని అంటున్నారా వ్యాసరచయిత్రి! ఈ పరిధి కూడా తెలియకుండా వున్నారా ఇప్పటి విమర్శకులు! అన్న ఆశ్చర్యం కలుగుతుంది.

    (ఎందుకంటే నాకయితే ఫేస్బుక్ లో వ్యాఖ్యల వంటివి ఇలా (ఈ ఉదాహరణలలోగా) ఉండవచ్చు కానీ విమర్శ అనే శీర్షిక క్రింద వ్రాయబడే వ్యాసాలు ఇలా ఉంటాయని ఒప్పుకోలేమనిపించింది. సైన్సుఫిక్షన్ రచన గురించి విమర్శించ బూనుకున్న “సమకాలీన విమర్శకులు” టైమ్‌‌ ట్రావెల్‌ అనేది లేదు అనే ప్రాతిపదికన (అంటే మరీ ఆ స్థాయిలో) పరిశీలిస్తున్నారని అనడం సబబు కాదేమోననిపించింది.)

    2) అలాగే “సూరన కళాపూర్ణోదయం యొక్క ప్రశస్తి, అందులోని వర్ణనలకే పరిమితం కాదనీ, మన దేశంలో ఆ కాలానికి వాడుకలో లేని ఆధునిక నవలా సాహిత్య లక్షణాలన్నీ అందులో ఉన్నాయనీ, ఆ రకంగా ఆ కావ్యం సాహిత్య చరిత్రనే కాదు, సాహిత్యం ఆధారంగా మన దేశచరిత్రనే పునఃపరిశీలించడానికి ఆస్కారం ఇచ్చిందనీ చెప్పడం– ఆ రచన సామాజిక, సాహిత్య చరిత్రలో ఎక్కడ ఒదుగుతోందో వెల్చేరు నారాయణరావుగారు[1] విశ్లేషించి, వివరించి చూపించడం వల్లే సాధ్యపడింది.” అన్న ఉదాహరణ కూడా. –

    2002 లో వెల్చేరు నారాయణరావుగారు (ఆ పుస్తకం పీఠికలో) చెప్పేవరకు ఆ నవల ప్రశస్తిని విమర్శకులు వర్ణనలకే పరిమితం చేశారన్న ఈ ఉదాహరణ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.

    3) ఇక “సోదాహరణంగా విమర్శ” అన్న శీర్షిక క్రింద మొదలుపెట్టిన పేరాలో కవితని వివరించిన తర్వాత వ్రాసిన వాక్యాలు “ఇప్పుడు ఎవరైనా- ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు, ఈ మట్టివేర్లతో ఓ ఆకుపచ్చ దుప్పటి మీద కప్పుకోవడమన్న భావన ఆహ్లాదంగా ఉందనీ, ఇది సౌందర్యమనీ అనుకోవడం కద్దు. సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్నారు.

    ఇవి చాలా అజాగ్రత్తతో వ్రాసిన వాక్యాలనిపించాయి. “ఆ రచన ఆసాంతమూ చదవనివాళ్లు” అనే మాట వ్రాయడంలో వ్యాస రచయిత్రి భావం ఏమిటి? విమర్శకులు కనీసం ఆసాంతమూ చదవకుండా విమర్శిస్తారనా! కాదు కదా!

    లేక కవిత అసాంతమూ చదవనివారు అపార్థం చేసుకుంటారు కానీ ఆసాంతమూ చదివితే అందరికీ ఒకేలా అర్థమవుతుందనా! అదీ కాదు కదా! మరి ఇక “ఆసాంతమూ చదవనివారు” అనేమాట ఎందుకు వాడినట్లు?

    అంతే కాదు “సమర్థులైన విమర్శకులు ఇలాంటి వ్యాఖ్యానాన్ని అందించడంతోనో, లేదా దీన్ని ఖండించడంతోనో ఆగిపోరు.” అన్న వాక్యం కూడా అనేక ప్రశ్నలకి తావిస్తుంది.

    సమర్థులైన విమర్శకులు సరే సమకాలీన విమర్శకులు ఇలా చేస్తున్నారా చేయట్లేదా! అనేది వెంటనే వచ్చే ప్రశ్న. ఎందుకంటే వ్యాసం శీర్షిక “సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ” కాబట్టి.

    అసమర్థులైన విమర్శకులు అసమర్థంగా చేస్తారు సమర్థులైన విమర్శకులు సమర్థంగా చేస్తారు అనేది ఎప్పుడూ ఉండేదే కదా! ఇపుడు ఈ వ్యాసం శీర్షికకి ఈ అంశం ఎలా పొసగుతోంది అనేది ఒక ప్రశ్న.

    ఇక “ఈ ఉదాహరణలో చెప్పినదే సమర్థమైన విమర్శా!” అన్న ప్రశ్నని పక్కన పెట్టినా, “వ్యాసరచయిత్రి అభిప్రాయం ప్రకారం అది సమర్థమైన విమర్శ, విమర్శ అంటే అలా ఉండాలి” అని ఒప్పుకున్నా.. ఆతర్వాత కూడా మరికొన్ని ప్రశ్నలు వస్తాయి.

    “ఇప్పుడీ నేపథ్యంలో మనం చర్చిస్తున్న కవితను చూస్తే, ఇది ఏ కోవకు చెందిందో స్పష్టంగా చెప్పడం అంత తేలిక కాదు. వాక్యం వెనుక వాక్యం హాయిగా ముగిసే తీరు, సౌమ్యమైన పదాల పోహణింపు ఇది ఒక సౌందర్యాత్మకమైన కవితేనన్న భావన కలిగించినా, కవి పాఠకుడికి చెప్పాలనుకున్న భావం ఆ వాతావరణానికి పూర్తిగా ఆవలి దిక్కున ఉండి, ఒక చేదు అనుభూతినీ బాధనూ మిగుల్చుతోంది.” లాంటి వాక్యాలు వ్యాసరచయిత్రి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారో అర్థం కాదు. సాధారణ పాఠకులనా! విమర్శకులనా! వాళ్ళలో సమర్థులనా! అసమర్థులనా! వగైరా వగైరా…

    ఎందుకంటే అక్కడే మళ్ళీ “ఇలా ఒకేసారి రెండు భిన్నమైన అనుభవాలను కలిగించడం ద్వారా, ఈ కవిత పాఠకుడిని మలి పఠనాలకు ప్రేరేపిస్తోంది” అంటున్నారు. అదే ఆ కవిత యొక్క ప్రత్యేకత అని విశ్లేషిస్తున్నారు. మరి అలాంటి రెండు భిన్నమైన అనుభవాలని కవిత పాఠకుడికి అందించగలుగుతున్నపుడు ఇక్కడ విమర్శకుడి పాత్ర ఏమిటి అనేది మరొక ప్రశ్న!

    ఇలా అడుగడుగుకీ ఎన్నో ప్రశ్నలు రావడం వలన ఉదాహరణలు, పదాలు మరింత జాగ్రత్తగా ఎంచుకోవలసిందేమోననీ, వాక్యనిర్మాణాల పట్ల ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిందేమోననీ అనిపించింది.

  7. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    01/19/2018 3:30 pm

    ఈ వ్యాసం మీద లైలా గారి స్పందన ఆలోచనాత్మకంగా వుంది. వ్యాసం మాత్రం నేలబారుగా, మూసపద్ధతిలో సాగింది. లైలా గారి “ఫిరదౌసి” గురించిన మాటలు సహేతుకాలే ఐనా ఆవిడ premise సరైనది కాదని నా అభిప్రాయం. నా ఉద్దేశ్యంలో ఆ కావ్యం అసలు ఫిరదౌసి గురించి కాదు; అతను నిమిత్తమాత్రుడు; అది జాషువా తన గురించి రాసుకున్న కావ్యం. ఫిరదౌసికి బంగారు నాణేల బదులు వెండి నాణేలు దొరకటం జాషువాకి తన అర్హతకి తగిన గుర్తింపు, ఆదరణ దొరక్కపోవటానికి ప్రతీక. బంగారు నాణేలు వచ్చేసరికి ఫిరదౌసి పరలోకాలకి పోవటం తను బతికుండగా తనకూ తగ్గ గౌరవం దక్కదనే జాషువా భావనకి రూపం. ఈ దృష్టితో చూస్తే జాషువాకి ఫిరదౌసి గురించి ఏమీ తెలియనక్కర్లేదు ఎప్పుడో ఎక్కడో ఒక కవికి ఎంతో అన్యాయం జరిగిందన్న ఒక myth తప్ప.

  8. Ekphrasis గురించి మరి కొంత… గురించి lyla yerneni అభిప్రాయం:

    01/18/2018 2:00 pm

    బాగా రాసారు ఈ వ్యాసం. చక్కగా విషయం గురించి చదివి, ఆలోచించి, వివరంగా చక్కని ఉదాహరణలతో రాసారు. మీ కవిత, చిత్రమూ కూడా బాగున్నవి.

    మీ కవితల గురించి, చిత్రాల గురించి ఈ పత్రికలో ప్రచురించండి. One artist’s exhibition లాగా ఆనందం కలిగిస్తుంది. ఎదురు చూస్తాను.

    వేలూరి తన వ్యాసంలో, ఈ ‘ప్రక్రియ’ తెలుగువారికి పరిచయం లేదు అని ఉండాల్సింది కాదు. Ecphrasis అన్న ‘మాట’ తో తెలుగు వారికి (ఇతరులకు కూడా) పెద్దగా పరిచయం లేదు అని ఉండాల్సింది. వెబ్స్టర్ డిక్షనరీ ఆ మాటతో తనకు అంత పరిచయం లేదని చెప్పుకున్నట్టు. Microsft word కి కూడా Ekphrasis మాట తో పరిచయం లేదు. రెండు స్పెల్లింగులు ఇప్పుడు డిక్షనరీ లో ఎక్కించాను. Ecphrasis ప్రక్రియ గా ఐతే వాడుకలో ఎప్పుడూ ఉంది. భారతదేశంలో తెలుగు స్కూల్లో ఉన్నప్పడే లేండ్సేప్ చిత్రాలు, ఇతర పోస్టర్లు ఇచ్చి వాటికి మాటలు రాయించేవారు మాతో. ఐతే అది ఏదో ప్రక్రియ అని టీచర్లు చెప్పలేదు.

    వేలూరి విస్తారంగా చదువుతారు. ఎక్కువమందికి తెలియని మాటలు, కాన్సెప్ట్స్ తెలియచేస్తారు. డయాస్పోరా లిటరేచర్ అంటే ఏమిటి అని కొన్నేళ్ల క్రితం వేలూరి ఉపన్యాసంగా మాట్లాడితేనే నాకు తెలిసింది. పద్యాల మొదటి లైన్లు తీసుకుని, మరో పద్యం చేస్తే వాటిని అదేదో ఆ మాట అంటారని ఇక్కడి పాఠకులకు చెప్పినట్టు. రాసి చూపించినట్టు. మనకి కూడా ప్రయత్నించ బుద్ధి అవుతుంది. ఐతే దామెర్ల రామారావు చిత్రానికి తెలుగులో వేలూరి వివరణ పద్యం నాకేం పెద్ద ఆనందం కలిగించలేదు. ఇంగ్లీష్లో రాస్తే, Sarojini Naidu – Bangle Sellers poem లాగా కొంచెం exotic గా ఉండేదేమో. అరుంధతీ రాయ్ కోతులు -కొబ్బరికాయల కథలు ఫారెనర్స్కి బాగున్నట్టు. కొందరు ఇండియన్స్కి కూడా బాగుంటయ్. నాకు సోది. కొన్నిసార్లు ఒళ్లు మంట. ఆ ‘ద న్యూయార్కర్’ లో టీనా బ్రౌన్ ఎడిటర్గా ఉన్నప్పుడు, కొంతమంది స్త్రీ రైటర్లను ముద్దు చేసింది. వారికి పులిట్జర్లూ, బుకర్ ప్రైజ్ లూ వచ్చాయి. ఏమైనా, emphasis (చూసారా, మైక్రొసాఫ్ట్ ఇంకా మాట నేర్చుకోలేదు. నేను రాసిన మాటను మళ్లీ emphasis అని దిద్దింది) ఎక్ఫ్రాసిస్ లో అందమైన Grecian Urn – art piece కి దీటుగా ఉండే On Grecian Urn అన్న కీట్స్ పొయెట్రీ లాటి వైతే రెండూ ‘కళ ‘ గా ఆనందిస్తాము. లేకుంటే ఒకటి కళ, రెండోది exercise. ‘వేలూరి’ కెందుకంట ఆ వెంకాయమ్మ టెంకాయమ్మ ఒకటో తరగతి కబుర్లు, పిల్లమ్మ ఇకనుంచి ఓణీ వేసుకోవాలి – లాటి ఎడ్వైజులూ.

    సర్లెండి, మరి ఈ వ్యాసం ఇంత చక్కగా రాసారుగదా, ఆ ట్రివియా వ్యాసమెందుకు పాఠకుల వ్యాఖ్యల మీద. నాకు నచ్చలేదు. అది ఎడిటర్ లకు నచ్చింది. ఏదో మంచి ఎడ్జెక్టివ్ వాడారు మీ పరిశీలన ప్రస్తావిస్తూ. ఎడిటర్ల సూచనలను మీరు Ten Commandments లాగా చూపి, పాఠకులను, కొద్దిగా రూల్స్ ఉల్లంఘించి, కట్టుబాట్లకు లొంగని వాళ్లుగా, సరదాకి ఏదో గాలిగా రాసేస్తూ, పత్రికల్లో లిటరేచర్ని ‘సీరియస్’ గా తీసుకోని వాళ్లలాగా చూపినందునా. Can’t be. ఇక్కడ ఎడిటర్లు నవ్వూ హాస్యం, ఉన్నవాళ్లు. పాఠకులు పత్రికలో ఆటలాడితే వాళ్లకు ఇష్టమే. ఎవరైనా పాఠకులు, సరదాకి రాసానంటే, వేరే వాళ్లకు బాధ ఎందుకు.

    పైగా ఈ వ్యాసంలో మీ కవిత, అక్కడ ఆమె బొమ్మ చూస్తే, కట్టుబాట్లు అంటే మీకు ఎంత రోత అనేది తెలుస్తా ఉంది కదా. జీవితంలో సరదా పాడూ లేకుండా ఆమె ఇష్టం లేని పెళ్లి జైల్లోకి బోయి ఆ తలుపు మూత బడిపోతే ఇంకేమన్నా ఉందా? అనే కదా మీ కవిత చెప్పేది. (పాతకాలపు Bias ఉందనుకోండి. ఆడవాళ్లకే ఇష్టం లేని పెళ్లి జరుగుతుందనీ, మగవాళ్లకు అది వర్తించదన్నట్టు. ‘ఆమె’ కావటం వల్ల ఒక్క ప్రెగ్నెన్సీ తప్పించి మిగతా సమస్త కష్టాలూ, ఆడా, మగా కు సమానమే. ఒ ఓ. సవరింపు. మగవాళ్లకు బట్టతల. మగవాళ్లు ఆడవాళ్ల మీద ప్రద్దానికీ జాలి పడిపోయినట్టు, తమ విషయం గురించి రాతల్లో బట్టబయలు చెయ్యరు). మరి సాహిత్యంలో మాత్రం రాసేవారికీ, రాసినవి చదివి రాసేవారికీ -అందరికీ స్వాతంత్రం అక్కర్లేదూ? వ్యాఖ్యల పరిశీలన అంటూ – లెక్కలతో మొదలెట్టి, లింగూ లిటుకూ డేటా కలెక్షన్ చేసి ఆఖరులో వ్యవసాయం ఉపమానం గల కవిత్వపు వాక్యంతో ముగించారు.

    ఆ ముగింపు వాక్యాల అర్ధమేమిటి? నాకు తెలియలేదు. అందులో గానీ పరిశీలనా ఫలితం, ఏదైనా హెచ్చరిక గాని ఉంటే అది నాకు తెలియలేదు.

    ఓ. నేను ముగించే ముందు – Rx: మేరేజ్! కథ మీరు సమ్మరైజ్ చేసినట్టుగా గాని, ఇక్కడి మీ సీరియస్ తెలుగు కవితలో కంటెంట్ లాగా గాని చదవాల్సిన కథ కాదు. అది కొంచెం నవ్వూ, హాస్యంతో చదువుకోవాల్సిన కథ. (చి.న.) అందంగా లేకపోతే పెళ్లి కాదనుకుంటే అన్ని కోట్ల పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయండీ? భలేవారు మీరు! (ద.హా.)

    Lyla

  9. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి lyla yerneni అభిప్రాయం:

    01/18/2018 11:52 am

    “విమర్శకులు తమ అభిప్రాయం జనబాహుళ్యంలో అప్పటికే ప్రచారంలో ఉన్న అభిప్రాయానికి భిన్నమైనదైనా సరే, ప్రతిపాదించడానికి కూడా వెనుకాడకూడదు.” డా. విజయ్ కోగంటి

    Well and Good.

    మానస గారి వ్యాసం ‘జాషువా –ఫిరదౌసి’ ఈ పత్రికలోనే ఉన్నది. చదివినారా? ముఖ్యంగా ఈ పై కారణం వల్లనే, చాలా పేలవమైన వ్యాసం అని నేను అనుకున్నాను.

    జాషువా రచించిన ‘ఫిరదౌసి’ ఒక ఎన్నదగిన రచన కానే కాదు. ఆ ఖండకావ్యానికి మంచిపేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇంటర్మీడియేట్ విద్యార్ధులకు 1940 వరకు పఠనగ్రంధాలలో ఒకటి గా ఉన్నదని జాషువా కవి తెలిపారు. ఆ యా గురువులు ఆ కావ్యం గురించి ఆ రోజులలో వారి విద్యార్ధులకు ఏమి బోధించారో!

    నా ప్రశ్న – జాషువా ‘ఫిరదౌసి’ లో ఒక పారశీక కవి రూపుగాని, మాటగాని, ఏ పారశీక కవిత్వపు తీరుగాని, అందునా ఫిరదౌసి కవిత్వ పరిచయం గాని ఉన్నదా? సమాధానం: శూన్యం. సున్నా. షానామా కవిత్వప్రఖ్యాతి వల్లే కదా జనులు ఫిరదౌసిని తెలుసుకోవాలనుకునేది? కాదా? స్వాతంత్ర పోరాటం, సత్యాగ్రహం గురించి కాపోతే, మోహనదాస్ కరంచంద్ గాంధీని గురించి ఎవరు తెలుసుకోవాలనుకుంటారు?

    కవిత్వ ప్రియులు, కవిత్వం తెలుసుకోటం మాని, కవిని గురించిన కాకమ్మ కథలు వినటం – జాషువా ఫిరదౌసి చదవటం. ఫిరదౌసి అన్న పారశీక కవిని గురించి ప్రచారం లో ఉన్న ధన సంబంధమైన ఒక కథను గూర్చి మాత్రమే జాషువా రాసినాడు. (ఇలాటి చాటువు, చాటు గురించి ఈ పత్రికలో మాటికి ముమ్మారు చాటి చెప్పిగా విన్నాం కదా.) ఆ రచన ఎలాటిదంటే, ఒక సంగీతవేత్త గాని – భక్త రామదాసు జైల్లో ఉంటే రాముడు లక్ష్మణుడు వచ్చి, కప్పం కట్టి అతడిని చెర వినిపించటం కట్టుకథ మనకు చెప్పి, – రామదాసు కీర్తన ఒక్కటి తెలియచెప్పటం గానీ, పాడటం కానీ చెయ్యలేకపోటం వంటిది.

    ఒక కవి, ఇంకో కవి కవిత్వం చదవకుండానో, ఆ ప్రసక్తి ఇంత తేకుండానో, మకుటం లో అతని పేరుతో అతని మీద ఖండకావ్యం రాయటమేమిటి?

    జాషువా రాసిన ఫిరదౌసి కావ్యం పేరు మార్చి, కాళిదాసు, బమ్మెర పోతన అని పెట్టినా, కీట్స్ అని గాని, షేక్స్పియర్ అని గాని పెట్టి, లోపల పద్యాలలో పేరు మారిస్తే, చాలు. ఏం తేడా రాదు. ఆ ఏ ఒక్కరి specific జీవనం, విద్య, శైలి, ఆలోచన రీతి, సాధించిన పని, మనకింత కూడా తెలియదు. అలాటి generic రచన జాషువా చేసింది. ఫిరదౌసి పారశీకపు కవిత్వపు తీరు తెన్నులు జాషువాకు బహుశా తెలియవు. ఆయన చెప్పలేనందున ఈ ఖండకావ్యం ద్వారా మనకూ తెలియవు. కొంతమంది చదువరులకు మరి ఫిరదౌసి కవిత్వ పరిచయం జాషువా రచన ద్వారా, ఎలా కలిగిందో?

    ఫిరదౌసి అన్న కావ్యంలో ఆ కవి లేనే లేడన్న విషయం మానస మాత్రం గమనించిందా? లేదు.

    జాషువా రాసిన ఆ ఖండకావ్యము పేరుగొన్నదనే చదువుకుని, బాగున్నదనే నమ్మి, వాల్మీకి, నారాయణరావు, గురజాడ – ఇలా సాహిత్యంలో తెలిసిన కొందరిని, వారి మాటలను తన వ్యాసం లో ప్రస్తావిస్తూ రివాజు ప్రకారం ఒక సాంప్రదాయికమైన వ్యాసాన్ని, మానస తయారు చేసింది. ఆ ప్రస్తావనలు కూడా ఆమెకు ఈ రచన సందర్భంలో సొంత ఆలోచన లేకపోటాన్నే బలపరుస్తాయి. వాల్మీకి – సీతకు ఎడమ కన్నో, కుడి కన్నో అదరటానికీ, ఒక పారశీక కవి నమ్మికలకూ, మానసిక స్ధితిగతులకూ ఏమిటి సంబంధం?

    ఫిరదౌసి గురించి జాషువా “ఏమని కవిత్వం వ్రాసినట్టు, ఎందుకు వ్రాసినట్టు” అని మానస ప్రశ్నించుకుంది. సాహితీ వ్యాసాల్లో – ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి? అని తమ వ్యాసాల్లో అనటం నేర్పిన సాహిత్య సైంటిస్ట్ ల నుండి ఆ వాక్యం రాయటం వరకు ఆమెకు వచ్చింది. మరి సంపాదించిన సమాధానం? అదసలు ఏమిటి? దొరికినది సజావుగా ఉన్నదా?

    ఎన్నో విషయాల మీద ఆసక్తితో మనుషులు శ్రమిస్తారు. సైంటిస్ట్ లకు ఒక పరిశోధనలో ముఫ్పై ఏళ్లు శ్రమిస్తే, అందునుండి మనుషులకో, మరెవరికో ఉపయోగించే ఫలితం ఏదీ రాకపోతే ఆవేదన కలుగుతుంది. అనుకున్న ఆదాయం రాకపోయినా కష్టం కలుగుతుంది. నిజమే.. మరి, ఫిరదౌసి కవిత్వమైతే ప్రజలకు ఆనందించటానికి ఉన్నది. జాషువా కావ్యం రాసేనాటికి ఫిరదౌసి ప్రసిధ్ధుడైన కవే. ఆ కవిత్వం దొరుకుతున్నది. మరి జాషువా ఒక పాతకథను పట్టుకు ఎందుకు పాకులాడ్డం? ప్రపంచంలోనే పేరు పడిన కవిని, మరో కవి ముఖ్యంగా అతని కవిత్వాన్ని గుర్తిస్తాడా? కవిత్వాన్ని పరిచయం చేస్తాడా – లేక, అది మరచి, (నిజమో కాదో తెలియని) ఒక పరిదీన పరిస్థితిలో మనకు ఫిరదౌసిని చూపుతాడా? అది చేయదగ్గ పనిగా నాకు అనిపించటం లేదు.

    జాషువా కావ్య వస్తువుగా తన తెలుగు జీవితం, తన నిజ పరిస్థితిని తనే వర్ణించి తన సమకాలీన పాఠకులకు చూపవచ్చు. “గబ్బిలము” లో ఎంతో కొంత చూపినాడు. కాని, ఏనాటి వాడో పర్షియన్ ఫిరదౌసిని జీవితంలో ఏదో అన్యాయానికి గురైన వాడుగా మాత్రమే నమ్మి మనకు కావ్యంలో చూపటం గాని, కవిత్వ ప్రస్తావనే లేని కావ్యం రాయటం కాని, ఫిరదౌసి జీవితం తో జాషువా జీవితానికి సాపత్యం ఉంది – అని అతనైనా, ఎవరైనా అనుకోటం కాని, అవి సరైన ఆలోచనలు కావు.

    మానస – తన రచనలో 1. జాషువాకు ఫిరదౌసి కవిత్వం తెలుసునో తెలియదో చెప్పగలగాలి. 3. అందుకు స్వయంగా ఫిరదౌసి కవిత్వం కొంతైనా తను చదివి, చర్చించ గలిగి ఉండాలి. అప్పుడు గదా ఆమె ‘జాషువా- ఫిరదౌసి’ అన్న వ్యాసం రాయవలసింది. కాదా? Is it not?

    (సమయం కొద్దీ, మానస చామర్తి కవితలు, కవిత పరిచయాల గురించి మరోసారి.)

    Lyla

  10. సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ గురించి srini అభిప్రాయం:

    01/17/2018 5:24 pm

    Well written. Very timely. Enjoyed reading it.