మోహన రావు గారు: మీ అనుస్పందన హర్షణీయం. “ఈమాట” వ్యాసకర్తలు అందరూ మీదారిలో నడిచి ప్రతివ్యాసానికి మొదల్లో abstract రాస్తారని, అలా ఆ వ్యాసం లో వారేం సాధించదల్చుకున్నారో వారి సొంత contributions ఏవిటో స్పష్టంగా పాఠకులకు ముందుగానే తెలియపర్చే అలవాటుని పాటిస్తారని ఆశిస్తాను.
ఇక మీ వ్యాసం గురించి: నాకు ఛందస్సు ఏమీ తెలియదు కనుక దాన్లో ఒప్పుతప్పరయు రసజ్ఞుడిని కాను. ఐతే ఛందశ్శాస్త్రం మీద మీకున్న మక్కువ అభినందనీయం, మీ కృషి, పట్టుదల శ్లాఘనీయాలు. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ వ్యాసం లో చాలా విశేషాలే వున్నట్టున్నాయి.
జయప్రభ గారు: రచయితలకు, పాఠకులకు ఉండవలసిన అర్హతల గురించి మీరన్న మాటల్తో ఏకీభవిస్తాను. ఐతే, “తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని.” అంటూ మళ్లీ “అరుదైన రచనల విలువనెరిగే” పని పాఠకుల మీదే వేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం తమ రచన అరుదైనదైతే అది ఎందుకు అరుదైందో, దాని విలువ ఏమిటో చెప్పటం లో రచయితా భాగస్వామ్యం వహించటం అవసరం. (ఈ అభిప్రాయం వ్యాసాలకే పరిమితం) అందుకే సాంకేతిక పత్రాలలోలాగా ముందుగా ఒక abstract రాయమని కోరటం.
కొత్త పాఠకుల విషయం లో మీ ఆవేదన న్యాయమైందే. ఐతే ఇంటర్నెట్ ఈ విషయం లో చాలా మేలు చేస్తున్నదని నేను భావిస్తాను. ఎందాకో ఎందుకు, మీ అభిప్రాయాల్నిప్పుడు ప్రపంచవ్యాప్తమైన తెలుగు జాతి అంతా చదవగలుగుతున్నది కదా. పదిహేనేళ్ల క్రితం వరకు ఇది అసాధ్యం. ఈ ఇంటర్నెట్ మూలాన ఇదివరకు ద్వీపాల్లా ఉండిపోయిన సాహిత్య ఔత్సాహికులు, professionals ఒకచోట అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నారు కదా. ఎన్నో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు వచ్చాయి. ఇవి తెలుగు సాహిత్యాన్ని బతికిస్తాయో లేదో తెలియదు కాని బతికే probability ని తప్పక పెంచుతున్నాయి.
ఆసక్తికరమైన రచనలు కనిపిస్తే వాటికి పాఠకులూ తయారౌతారు. సాహిత్యాన్ని బతికించటం లో ప్రధానపాత్ర రచయితలది. “మమ్మల్ని మెచ్చుకునే పాఠకులు వుంటేనే మేం రచనలు చేస్తాం” అని వారు భీష్మించుక్కూచుంటే పాఠకులు ఎక్కడినుంచి వస్తారు?
చివరగా – పుస్తకాల గురించి. నా ప్రగాఢ విశ్వాసం పుస్తక రూపానికి కాలం చెల్లిపోతోందని. బహుశా ముందుముందు “పుస్తకరచన” కూడ ఒక సామూహిక క్రియగా పరిణమిస్తుందని నేననుకుంటాను. ఒక పుస్తకాన్ని “రాసే” బాధ్యతని ఒకరే మోయాల్సిన అవసరం తీరిపోతున్నది. సైద్ధాంతికంగానే కాక ఆచరణలో సైతం పుస్తక రచయితా పాఠకుడూ రచనాబాధ్యతని సంయుక్తంగా నిర్వహించే రోజు వస్తుందని నా భావన. చూద్దాం.
కె.యెస్. రామారావు గారూ – నిజంగా ఇది మీరు భావించేటంతటి “జటిల” సమస్య కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకున్న అనుభవం పరిశీలన ఆధారంగా నాకు అనిపించిన విషయాలు ఇవీ! ఎప్పుడైనా కూడా ఏ రంగంలోనైనా పరిశోధనకి ఒక ప్రమాణం ఉండాలి. ఏది రాసినా అది పరిశోధన అవదు. దానికి సరి అయిన ఆకరాలు చూపిస్తూ ఆ పరిశోధన ఇతరుల దృస్టికన్నా ఎలా భిన్నమైనదో తన చూపు ద్వారా అదివరకూ తెలియని కొత్త విషయాలు ఏమున్నాయో అందుకు ఆ పరిశోధకురాలు/డు బాధ్యత వహించాలి. పరిశోధన చేసే వారికి అందుకు తగిన శిక్షణా, అలాగే చాలినంత అనుభవమూ ఉండాలి. తాను రాయదలుచుకున్న విషయం మీద అదుపు ఉండాలి.
ఇది అటుంచితే, పుస్తకాన్నీ దాని బాగోగులనీ ఎంచే వాళ్లకి కూడా తప్పకుండా ఒక స్థాయి ఉండాల్సిందే! ఒక పని లోని సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వారూ అలాగే పరిశోధనా రంగమ్లో తగిన అనుభవం ఉన్న వారూ మాత్రమే కొంత వరకూ సరి అయిన అభిప్రాయాన్ని చెప్పగలరు. మిగిలిన వారి భావాలు లేదా స్పందనలూ వారికి ఆ వస్తువు నచ్చడం లేదా నచ్చక పోవడం, అర్ధం కావడం లేదా సరిగ్గా తెలియక పోవడం మీద ఆధారపడి బయటికి వచ్చేవే అవుతాయి చాలా సార్లు. అందుకు చేయగలిగింది ఏమీ లేదు. అయితే అభిప్రాయాలు చెప్పే వీలు ఉండాలి. ఎవరినించైనా మంచి సూచనలు లభించే అవకాశం సైతం లేకపోలేదు. వాటి సాధ్యాసాధ్యాలని బట్టి రచయిత వాటిని పాటించవచ్చు లేదా చదివి ఊరుకోవచ్చు. పుస్తక రచనలో ఎప్పుడూ కూడా రచయితదీ పరిశోధకులదే అంతిమ అభిప్రాయం అవుతుంది. అది తప్పదు. పుస్తకం బాగోగుల బాధ్యత వారిదే గనక!
ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, కనీసం తెలుగు భాషా సాహిత్యాల వరకూ అయితే, పరిశోధనా రంగంలో తగిన అనుభవమూ శిక్షణా ఉన్నవారు క్రమంగా తగ్గి పోతున్న కాలం ఇది. అందువలన వేరే రంగాలలో స్థిరపడి తెలుగు మీద ప్రేమ లేదా ఇస్టం ఉన్నవాళ్ళు రాయక తప్పని ఒక పరిస్థితి వచ్చింది ఇవాళ. వారి భావ ప్రకటనకి అనువుగా ఉండే మాధ్యమం సైతం అందుబాటులో ఉంది. “అంతర్జాతీయ ప్రమాణాలు” అంటూ ఒక కొలమానాన్ని తెలుగున తెచ్చి పెట్టిన వాళ్ళు ఇంగ్లీషులో వచ్చే పుస్తకాలలో ఎన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయో, ఎన్ని విషయాలు దేశీయమైన వాటినించి గ్రహించి వేరే భాష వారి వారికి తగిన విధంగా రూపొందుతున్నాయో మాట్లాడక పోవడం విడ్డూరం. నా దృష్టిలో ఆసక్తికరమైన రచన కాని రచన అన్నవే చిట్టచివరికి ముఖ్యమైనవి అవుతాయి. అవి ఎవరు రాసినా అంతకన్నా మించిన ప్రమాణం ఏదీ ఉండదు ఎప్పుడైనా! మిగిలినవన్నీ ఊరికే చర్చిందుకుందికి పనికొస్తాయి అంతే!
తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని. సకాలంలో రాని స్పందన ఆ తరువాత వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే! మీనమేషాలు లెఖ్ఖించడాలూ లౌక్యాలు ప్రదర్శించడాలూ ఆ రంగానికి మేలు చేయగలిగిన అంశాలు కాలేవు. ఎందుకంటే తమ విలువైన కాలాన్ని ఎవరు గానీ ఒక క్రమంలో ఒక వస్తువు మీద పెట్టడం అన్నది మామూలు విషయం కాలేదు ఎప్పుడైనా కూడాను. అందునా ఏ డబ్బులూ రాని తెలుగు సాహిత్యమ్లో అంటే మరీను! అలాగే అందరూ అన్ని రకాల రచనలూ చేయలేరు. అందువలన కొన్ని తరహా రచనలు చేయగలిగిన వారే చేయాలి. అలాంటి రచనలు అంటూ అసలు వస్తే, వాటి పట్ల ఒక కుతూహలం పాఠకులకి కనీసం సాహిత్యం గురించి తెలిసిన పాఠకులకి ఉండటం సముచితం! అయితే పాఠకుల స్థాయి ఇక్కడ చాలా ముఖ్యం.
ఎందుకంటే ప్రతీ రచనకీ ప్రతీ వాళ్ళూ పాఠకులు కారు. ఆ వస్తువుని గురించి వారికి కనీశమైన స్పస్టత అయినా ఉండాలి. spoon feedingకి అలవాటు పడిన బధ్ధకస్తులైన పాఠకులు లాభం లేదు. కస్టపడగలిగిన స్వభావం ఉన్నవాళ్లై ఉండాలి పాఠకులు కూడా! అలాగే ఒక పుస్తకం అర్ధం చేసుకోవడం వేరు. అదే పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించడానికి తగిన పరిజ్ఞానం పుష్కలంగా ఉండి వారు ఆ పని చేయడం వేరు. రెండూ భిన్నమైన విషయాలు. దురదృష్టమైన విషయం ఏమంటే తెలుగున విమర్శ అరుదైన అంశం ఎలా అయిందో, అలాగే ఆ విమర్శ గురించి చేసే పాఠక వివేచన కూడా అరుదే అయిపోయింది. సూచనలు చేయడం రాసిన విషయాన్ని విశ్లేషణ చేయడం ఒకటి కాదు. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా ఎప్పుడూ అనేక తీరుల్లో రాసే వీలుంది. ఏదీ కూడా “perfect” కాదు. అవదు కూడా! ప్రతీ రచనకీ ఇది వర్తిస్తుంది. ఆ రాసిన వారెవరు అన్నదానితో సంబంధం లేకుండా! అందువలన అభిప్రాయాలు ఆ రచనని బేరీజు వేయడంలో అడుగు తప్పనివి అయి ఉండాలి. అంతే!
ఇంక చివరగా తెలుగు వరకూ పుస్తక ప్రచురణ, దానికి సంబంధించిన ఇతర అంశాలు అనేకం దుస్సాధ్యమైనవి. అయినా తెలుగున కస్టమైన అంశాల మీద ఇంకా పని చేయడం జరుగుతూ ఉందంటే, పుస్తకాలు అచ్చు అవుతున్నాయీ అంటే అది కేవలం రచయితలకి భాషా సాహిత్యాల పట్ల ఉండే ప్రేమ వల్ల మాత్రమే! మరొక్క పదేళ్ళాగండి అప్పుడు ఈ వచ్చే పుస్తకాలూ రావు. ఇంతపాటి మాట్లాడే వాళ్ళూ ఉండరు: కొత్త పాఠక వర్గం తయారైతే తప్ప.-అలా నిజంగా అయితే గనక అప్పుడు నాకన్నా సంతోషించే వాళ్ళుండరు. తెలుగు సాహిత్యం వరకూ రాసే వారిని నిలుపోగలిగితేనూ, పాఠక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళ గలిగితేనూ తప్ప అది సాధ్యమయ్యే వ్యవహారంలా లేదు. కారణం తెలుగున ప్రవేశం ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. దీన్ని ఏ రకంగా సరి చేయాలీ అన్నది ఆలోచించవలసిన విషయం. లేకపోతే తెలుగున పుస్తకాలు వచ్చే వీలే ఇటుపై ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఇందుకు రచయితా పాఠకులూ విమర్శకులూ వీరందరూ తమ పాత్రలని సక్రమంగానూ నిజాయితీ గానూ పోషించాలి. సరుకున్న రచనలని దూరం పెట్టి తేలిక పాటి రచనలని గురించి బాకా కొట్టే ఒక తప్పుడు పాత్ర పోషించకుండా ఉంటే చాలు. అందులో భాగంగానే మంచి రచనలని గురించి మాట్లాడ వలసిన బాధ్యతని సైతం సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారందరూ చూపించవలసి ఉంది. ఇదే మీరు మరి “జటిల”మంటారా? అయితే మరి సాహిత్యాన్ని ఏకంగా అటకెక్కించేస్తే చాలు:)
వెల్చేరు గారి రచన చదివిన తరవాత ఒక చిన్న చిరునవ్వు నవ్వుకున్నా! మళ్ళీ భయం వేసింది. “లక్ష్మణుడి నవ్వు ఎన్ని అపోహలకి దారితీసిందో ఈ రచనలో తెలిసింది కదా! మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నవ్వుతున్నావ్” అని నన్ను నేను ప్రశ్నించుకున్నా!
చూట్టానికి ఒక్కలా కనపడే కవలలుగా జన్మించిన రామన్నా – నేనూ చిన్నప్పుడు బాగానే దెబ్బలాడుకొనే వాళ్ళం. ఐదు నిమషాలు ముందు పుట్టినందుకు నా మీద అన్నగా పెత్తనం నాకు నచ్చేది కాదు. ఈ విషయమై మా అమ్మగారితో ఫిర్యాదు చెయ్యగా, చెయ్యగా మా అమ్మగారు నన్ను సముదాయించడానికి చెప్పిన ఈ క్రింది విషయాలు మరొక రకంగా వెల్చేరు గారు ఈ రచనలో చెప్పారు.
అసలు వనవాసానికి వెళ్ళమన్నది రాముడిని. భర్తకి తోడుగా ఉండాలని తోడు వెళ్ళింది సీత. మరి ఎవరూ లక్ష్మణుడిని వనవాసానికి వెళ్ళాలని ఆజ్ఞాపించపోయినా అన్న మీద ప్రేమ, గౌరవం కొద్దీ లక్ష్మణుడు స్వ ఇచ్ఛతో అడవులకి అన్న వెంట వెళ్ళాడు. ఇది లక్ష్మణుడు, రాముడి కంటే గొప్పవాడు అనటానికి మొదటి కారణం. (ఇది వినగానే నేను ఎంత గొప్పగా ఊహించుకున్నానో మీరు గమనించగలరు!). రాముడు వనవాసానికి చక్కగా తన భార్యతో హనీమూన్కి వెళ్ళినట్టు వెళ్ళాడు. మరి లక్ష్మణుడో? పెళ్ళి అయినా కూడా, భార్యని వదలి సేవకుడిలాగా అన్న వెంట నడిచాడు! ఇది లక్ష్మణుడు గొప్పవాడు అనటానికి ఇంకో కారణం! (ఇది వినగానే లక్ష్మణుడు కూడా గొప్పవాడే అన్న నిర్ధారణకి నేను వచ్చేసాను.)
మళ్ళీ అటువంటి అనుభూతే మళ్ళీ ఇప్పుడు ఈ రచన చదువుతుంటే కలిగింది. వెల్చేరుగారికి కృతజ్ఞతలతో,
Arudra, the social and literary historian! Data are concisely crammed and casually delivered; yet inferences get elaborate treatment and are empirically analyzed. The approach to a topic related to Literary history never fails to be logical. Cascading the information replete with data, fortifying with solid proof; unfolding fresh conclusion backed by solidly proven information from verifiable sources; comprehensive treatment of a given topic, offering a logical insight into the core and the peripheral issues; and drawing rational analysis are the hall marks of Arudra Garu. Infusing a conversational tone and rendering an authentic text of standard proof with readability and easeful flow are pervasive in Arudra.
His exhaustive acquaintance with the vast areas covering the background to a topic is seldom conspicuous, but lends authenticity to the key conclusions, which gives coherence to a concept. His multi-sourced knowledge fills the gaps in the basic structure of a topic. Most often, his inferences are logically concluded; and are driven by plausible analysis. They tend to add to the corpus of the knowledge in the fundamentals of a given topic, especially in areas of social legacy and that of literary history.
We are fortunate that Bhadriraju Krishna Murthy garu [ we saw and heard him quite recently at The Book exhibition on Necklace Road, Hyderabad] and Chekuri Rama rao garu are keeping good health. And we are unfortunate that their expertise is being left underutilized.
I appreciate your decision to retrieve the essay. Could you please do more from the archives?
శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.
బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!
మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?
తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.
అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.
ఒక నానుడిగా మారిపోయిన ‘లక్ష్మణదేవర నవ్వు’కు మూలంగా ఉన్న పాట గురించి ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను. వెల్చేరు నారాయణరావు గారికి కృతజ్ఞతలు.
ఈ కథ గురించి స్థూలంగా తెలుసు కానీ, శివుడూ, ఆదిశేషువూ, జాంబవంతుడూ, నీలుడూ కూడా భుజాలు తడుంకున్నారనేది కొత్త విషయం. అసలు లక్ష్మణుడే ఆదిశేషుడి అవతారమంటారు కదా? తను శివుడికి సేవకుడిగా రావటమేమిటో, శివుడికీ విష్ణువుకూ విరోధమేమిటో బోధపడలేదు. (శైవులకూ వైష్ణవులకూ గొడవలుండేవి కానీ వీళ్ళిద్దరికీ కూడా ఉన్నాయా? యుద్ధానికి ముందు శివుణ్ణి రాముడు పూజిస్తాడు కదా? ) నేను విన్న కథలో రాముడు కూడా లక్ష్మణుడి నవ్వుకు తలవొంచుకుంటాడు.
దేవర అంటే భర్త తోబట్టువు అనే అర్థం ఉందని ఈ వ్యాసం ద్వారానే తెలిసింది!
రోహిణీప్రసాద్ గార్కి:
నమస్తే. నాన్నగారి ‘కినిమా’ స్కెచ్ లు అపురూపం. కేవలం బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడే సినిమా పత్రికల్ని తప్పనిసరైనప్పుడు మాత్రమే చూసే అలవాటున్న నాకు, సినిమా పత్రికల్లో ఇంత quality రచనలుంటాయని నాన్నగారి రచనలవల్లనే నమ్మకం కలుగుతోంది. ఇంత సరళమైన ఆరోగ్యకరమైన రచనలు ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలబడగలిగే అర్హత కలిగి వుంటాయి. నాన్న గారు తెలుగు సాహిత్యం లో గల్పికలు మొదలైన ఎన్నో ప్రక్రియలకు జీవం పోసిన ఆద్యులు. ‘సినిమా సాహిత్యం’ లో వారి అడుగుజాడలున్నా, అవి ఆయనవేనని ఇంకా ముందు తరాల వారికి రుజువు చేసి వుంచ వల్సిన చారిత్రక అవసరం వుందని నా అభిప్రాయం.
1. సాంకేతిక పరిశోధనా పత్రాలకి ఒక వ్యవస్థ, పద్ధతీ ఉన్నాయి. సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు తీసుకుంటే మనకా వ్యవస్థా లేదు; పద్ధతి అంతకన్నా లేదు. ఏం రాసినా రచయిత ఆశ్రయించేడి పత్రికలనే! అంటే రచయిత వ్యాసాలకి స్థాయి ఆశించినట్లే పత్రికలకీ ఒక స్థాయి ఉండాలి. రచనలో వాసి ఆశించినట్లే, పత్రికలు తమ స్థాయిని పెంచుకునే మార్గాన వెళ్ళాలి. లేదా ప్రయత్నించాలి. కథలూ, కబుర్లూ రాస్తే వేయడానికి తెలుగునాట పత్రికలు సిద్ధమే కానీ వ్యాసాల వరకూ వస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉండరు – ముఖ్యంగా సాహిత్య పరిశోధనా వ్యాసాలు. వారి దృష్టిలో అది యూనివర్శిటీల బాధ్యత. ప్రస్తుతం యూనివర్శిటీలకి ఆ తీరికా, వెసులుబాటూ కరువయ్యాయి. చర్చించుకోడానికి అది వేరే విషయం. వదిలేద్దాం.
ఇలాంటప్పుడు మోహన గారి వ్యాసం కానీ, జయప్రభ గారి అన్నమయ్య పుస్తకం గానీ పాఠకులకి చేరేదెలా? మీరు చెప్పినట్లు దాన్ని చదివి తప్పొప్పులు సవరించీ, కాస్త కూర్పులూ, మార్పులూ చేసే పరిశీలకులు ఏరీ? ఒకవేళ ఉన్నారనుకున్నా, దానికి ఒప్పుకునే రచయితలూ ఉండాలి కదా? రచనని బేరీజు వేసే స్థాయి పరిశీలకులకీ వుండనవసరం లేదా? అంటే పరిశీలకుల స్థాయి మీద రచయితలకీ నమ్మకం ఉండాలి. విశ్వాసం కుదరాలి. ఇవన్నీ రాగద్వేషాల మధ్య కుదిరే విషయాలా? తాము రాసిందే వేదమూ, ఎదుటివారి జ్ఞానం శూన్యమూ అనుకునే వాతావరణంలో ఇవన్నీ కుదరని విషయాలు. ఎవరికివారే పెద్ద మేధావులుగా చెలామణీ అవ్వడానికే ప్రయత్నించే నేటి సాహిత్య వ్యవస్థలో రామారావు గారు ఆశించేది జరగని పని.
2. సాహిత్యంలో ప్రమాణాలు అవసరమని పత్రికలూ, పాఠకులూ, ముఖ్యంగా ఔత్సాహిక రచయితలూ భావించిన నాడు మంచి సరుకు పాఠకులకి రవాణా అయ్యే అవకాశం ఉంది. ఔత్సాహిక రచయితలు అని ఎందుకన్నానంటే చెయ్యి తిరిగిన రచయితలు వారేం రాసినా ప్రమాణంగానే భావిస్తారు కనుక. పత్రికలూ వీరి పట్ల సడలింపు ధోరణే అమలుపరస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. పేరొచ్చే వరకూ రాయి, అదొచ్చాక పత్రికలే మోస్తాయి అన్న సాహిత్య వాతావరణమ్లో కూరుకుపోయాం.
3. పోనీ ప్రచురణ కర్తలూ లేదా సంస్థలూ అయినా పైన చెప్పిన విషయాలమీద శ్రద్ధ చూపిస్తున్నాయా అంటే అదీ లేదు. వాదాలూ, రాజకీయల ఊబిలో పీకల్లోతు అవి మునిగున్నాయి. అమ్మకాలకి అవకాశం ఉండే పుస్తకాల మీదే వారి గురి. ఇలాంటి సందర్భాల్లో రచయితలే పుస్తకాలు అచ్చేసుకునే దౌర్భాగ్యపు సాహిత్య సమాజంలో ఉన్నాం. రాయడమూ, దిద్దుకోవడమూ, ప్రచురించుకోవడమూ, ప్రచారం చేసుకోవడమూ, ఆ పైన పంచుకోవడమూ అన్నీ రచయిత బాధ్యతలే అవుతున్నాయి. పాఠకులూ అదే తీరులో ఉంటున్నారు.
4. ఇహ వ్యాఖ్యలంటారా? ఎవరికి వారు పండుతులనీ, మేధావులనీ భ్రమించే నేపధ్యంలో అందరూ, అంటే ముఖ్యంగా రాసేవాళ్ళు, అన్నీ చదువుతారు. చదవనట్లు నటిస్తారు. వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండరు. అవే కారణాలు పునరావృత్తం అవుతాయి.
5. రాయగలిగిన వాళ్ళు రాస్తూ ఉండాలి. కానీ అభిప్రాయాలు ఆలంబన అవుతాయి. ఊతం ఇస్తాయి. మరింత మెరుగ్గా రాయలన్న ప్రేరణ కలిగిస్తాయి. చేసిన పనికి ఆనందాన్నిస్తాయి. ఇది పేరున్న రచయితలకీ వర్తిస్తుంది. పేరున్న రచయితలు పేరులేని వారివి చదవరు. చదివినా నోరు మెదపరు. అవే సమస్యలూ; అవే కారణాలూ.
సాహిత్య మార్జాలం గంట కట్టే వారికోసం వెతుక్కుంటోంది.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
05/07/2012 10:33 pm
మోహన రావు గారు: మీ అనుస్పందన హర్షణీయం. “ఈమాట” వ్యాసకర్తలు అందరూ మీదారిలో నడిచి ప్రతివ్యాసానికి మొదల్లో abstract రాస్తారని, అలా ఆ వ్యాసం లో వారేం సాధించదల్చుకున్నారో వారి సొంత contributions ఏవిటో స్పష్టంగా పాఠకులకు ముందుగానే తెలియపర్చే అలవాటుని పాటిస్తారని ఆశిస్తాను.
ఇక మీ వ్యాసం గురించి: నాకు ఛందస్సు ఏమీ తెలియదు కనుక దాన్లో ఒప్పుతప్పరయు రసజ్ఞుడిని కాను. ఐతే ఛందశ్శాస్త్రం మీద మీకున్న మక్కువ అభినందనీయం, మీ కృషి, పట్టుదల శ్లాఘనీయాలు. మీరు చెప్పినదాన్ని బట్టి ఈ వ్యాసం లో చాలా విశేషాలే వున్నట్టున్నాయి.
జయప్రభ గారు: రచయితలకు, పాఠకులకు ఉండవలసిన అర్హతల గురించి మీరన్న మాటల్తో ఏకీభవిస్తాను. ఐతే, “తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని.” అంటూ మళ్లీ “అరుదైన రచనల విలువనెరిగే” పని పాఠకుల మీదే వేస్తున్నారు. నా అభిప్రాయం ప్రకారం తమ రచన అరుదైనదైతే అది ఎందుకు అరుదైందో, దాని విలువ ఏమిటో చెప్పటం లో రచయితా భాగస్వామ్యం వహించటం అవసరం. (ఈ అభిప్రాయం వ్యాసాలకే పరిమితం) అందుకే సాంకేతిక పత్రాలలోలాగా ముందుగా ఒక abstract రాయమని కోరటం.
కొత్త పాఠకుల విషయం లో మీ ఆవేదన న్యాయమైందే. ఐతే ఇంటర్నెట్ ఈ విషయం లో చాలా మేలు చేస్తున్నదని నేను భావిస్తాను. ఎందాకో ఎందుకు, మీ అభిప్రాయాల్నిప్పుడు ప్రపంచవ్యాప్తమైన తెలుగు జాతి అంతా చదవగలుగుతున్నది కదా. పదిహేనేళ్ల క్రితం వరకు ఇది అసాధ్యం. ఈ ఇంటర్నెట్ మూలాన ఇదివరకు ద్వీపాల్లా ఉండిపోయిన సాహిత్య ఔత్సాహికులు, professionals ఒకచోట అభిప్రాయాల్ని పంచుకోగలుగుతున్నారు కదా. ఎన్నో వెబ్ పత్రికలు, బ్లాగ్ లు వచ్చాయి. ఇవి తెలుగు సాహిత్యాన్ని బతికిస్తాయో లేదో తెలియదు కాని బతికే probability ని తప్పక పెంచుతున్నాయి.
ఆసక్తికరమైన రచనలు కనిపిస్తే వాటికి పాఠకులూ తయారౌతారు. సాహిత్యాన్ని బతికించటం లో ప్రధానపాత్ర రచయితలది. “మమ్మల్ని మెచ్చుకునే పాఠకులు వుంటేనే మేం రచనలు చేస్తాం” అని వారు భీష్మించుక్కూచుంటే పాఠకులు ఎక్కడినుంచి వస్తారు?
చివరగా – పుస్తకాల గురించి. నా ప్రగాఢ విశ్వాసం పుస్తక రూపానికి కాలం చెల్లిపోతోందని. బహుశా ముందుముందు “పుస్తకరచన” కూడ ఒక సామూహిక క్రియగా పరిణమిస్తుందని నేననుకుంటాను. ఒక పుస్తకాన్ని “రాసే” బాధ్యతని ఒకరే మోయాల్సిన అవసరం తీరిపోతున్నది. సైద్ధాంతికంగానే కాక ఆచరణలో సైతం పుస్తక రచయితా పాఠకుడూ రచనాబాధ్యతని సంయుక్తంగా నిర్వహించే రోజు వస్తుందని నా భావన. చూద్దాం.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి jayaprabha అభిప్రాయం:
05/07/2012 3:41 pm
కె.యెస్. రామారావు గారూ – నిజంగా ఇది మీరు భావించేటంతటి “జటిల” సమస్య కాదు. తెలుగు సాహిత్యానికి సంబంధించి నాకున్న అనుభవం పరిశీలన ఆధారంగా నాకు అనిపించిన విషయాలు ఇవీ! ఎప్పుడైనా కూడా ఏ రంగంలోనైనా పరిశోధనకి ఒక ప్రమాణం ఉండాలి. ఏది రాసినా అది పరిశోధన అవదు. దానికి సరి అయిన ఆకరాలు చూపిస్తూ ఆ పరిశోధన ఇతరుల దృస్టికన్నా ఎలా భిన్నమైనదో తన చూపు ద్వారా అదివరకూ తెలియని కొత్త విషయాలు ఏమున్నాయో అందుకు ఆ పరిశోధకురాలు/డు బాధ్యత వహించాలి. పరిశోధన చేసే వారికి అందుకు తగిన శిక్షణా, అలాగే చాలినంత అనుభవమూ ఉండాలి. తాను రాయదలుచుకున్న విషయం మీద అదుపు ఉండాలి.
ఇది అటుంచితే, పుస్తకాన్నీ దాని బాగోగులనీ ఎంచే వాళ్లకి కూడా తప్పకుండా ఒక స్థాయి ఉండాల్సిందే! ఒక పని లోని సాధక బాధకాలు క్షుణ్ణంగా తెలిసిన వారూ అలాగే పరిశోధనా రంగమ్లో తగిన అనుభవం ఉన్న వారూ మాత్రమే కొంత వరకూ సరి అయిన అభిప్రాయాన్ని చెప్పగలరు. మిగిలిన వారి భావాలు లేదా స్పందనలూ వారికి ఆ వస్తువు నచ్చడం లేదా నచ్చక పోవడం, అర్ధం కావడం లేదా సరిగ్గా తెలియక పోవడం మీద ఆధారపడి బయటికి వచ్చేవే అవుతాయి చాలా సార్లు. అందుకు చేయగలిగింది ఏమీ లేదు. అయితే అభిప్రాయాలు చెప్పే వీలు ఉండాలి. ఎవరినించైనా మంచి సూచనలు లభించే అవకాశం సైతం లేకపోలేదు. వాటి సాధ్యాసాధ్యాలని బట్టి రచయిత వాటిని పాటించవచ్చు లేదా చదివి ఊరుకోవచ్చు. పుస్తక రచనలో ఎప్పుడూ కూడా రచయితదీ పరిశోధకులదే అంతిమ అభిప్రాయం అవుతుంది. అది తప్పదు. పుస్తకం బాగోగుల బాధ్యత వారిదే గనక!
ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, కనీసం తెలుగు భాషా సాహిత్యాల వరకూ అయితే, పరిశోధనా రంగంలో తగిన అనుభవమూ శిక్షణా ఉన్నవారు క్రమంగా తగ్గి పోతున్న కాలం ఇది. అందువలన వేరే రంగాలలో స్థిరపడి తెలుగు మీద ప్రేమ లేదా ఇస్టం ఉన్నవాళ్ళు రాయక తప్పని ఒక పరిస్థితి వచ్చింది ఇవాళ. వారి భావ ప్రకటనకి అనువుగా ఉండే మాధ్యమం సైతం అందుబాటులో ఉంది. “అంతర్జాతీయ ప్రమాణాలు” అంటూ ఒక కొలమానాన్ని తెలుగున తెచ్చి పెట్టిన వాళ్ళు ఇంగ్లీషులో వచ్చే పుస్తకాలలో ఎన్ని అచ్చుతప్పులు ఉంటున్నాయో, ఎన్ని విషయాలు దేశీయమైన వాటినించి గ్రహించి వేరే భాష వారి వారికి తగిన విధంగా రూపొందుతున్నాయో మాట్లాడక పోవడం విడ్డూరం. నా దృష్టిలో ఆసక్తికరమైన రచన కాని రచన అన్నవే చిట్టచివరికి ముఖ్యమైనవి అవుతాయి. అవి ఎవరు రాసినా అంతకన్నా మించిన ప్రమాణం ఏదీ ఉండదు ఎప్పుడైనా! మిగిలినవన్నీ ఊరికే చర్చిందుకుందికి పనికొస్తాయి అంతే!
తెలుగున వస్తువు మీద ఒక అదుపు ఉండి దానిలోని లోతుపాతులనెరిగి శ్రమ పడి పుస్తక రచన చేసేవారు నిజం చెప్పాలంటే లేరు. తెలుగులో పుస్తక రూపంలో కాల్పనిక సాహిత్యం కాక విమర్శలు రాకపోడానికి కారణం రాయగల సత్తా ఉన్న వాళ్ళు లేకపోవడమే! అలాంటప్పుడు వచ్చిన అరుదైన రచనల విలువనెరిగి పాఠకులు వాటి పట్ల స్పందించడం చేయదగిన పని. సకాలంలో రాని స్పందన ఆ తరువాత వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే! మీనమేషాలు లెఖ్ఖించడాలూ లౌక్యాలు ప్రదర్శించడాలూ ఆ రంగానికి మేలు చేయగలిగిన అంశాలు కాలేవు. ఎందుకంటే తమ విలువైన కాలాన్ని ఎవరు గానీ ఒక క్రమంలో ఒక వస్తువు మీద పెట్టడం అన్నది మామూలు విషయం కాలేదు ఎప్పుడైనా కూడాను. అందునా ఏ డబ్బులూ రాని తెలుగు సాహిత్యమ్లో అంటే మరీను! అలాగే అందరూ అన్ని రకాల రచనలూ చేయలేరు. అందువలన కొన్ని తరహా రచనలు చేయగలిగిన వారే చేయాలి. అలాంటి రచనలు అంటూ అసలు వస్తే, వాటి పట్ల ఒక కుతూహలం పాఠకులకి కనీసం సాహిత్యం గురించి తెలిసిన పాఠకులకి ఉండటం సముచితం! అయితే పాఠకుల స్థాయి ఇక్కడ చాలా ముఖ్యం.
ఎందుకంటే ప్రతీ రచనకీ ప్రతీ వాళ్ళూ పాఠకులు కారు. ఆ వస్తువుని గురించి వారికి కనీశమైన స్పస్టత అయినా ఉండాలి. spoon feedingకి అలవాటు పడిన బధ్ధకస్తులైన పాఠకులు లాభం లేదు. కస్టపడగలిగిన స్వభావం ఉన్నవాళ్లై ఉండాలి పాఠకులు కూడా! అలాగే ఒక పుస్తకం అర్ధం చేసుకోవడం వేరు. అదే పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించడానికి తగిన పరిజ్ఞానం పుష్కలంగా ఉండి వారు ఆ పని చేయడం వేరు. రెండూ భిన్నమైన విషయాలు. దురదృష్టమైన విషయం ఏమంటే తెలుగున విమర్శ అరుదైన అంశం ఎలా అయిందో, అలాగే ఆ విమర్శ గురించి చేసే పాఠక వివేచన కూడా అరుదే అయిపోయింది. సూచనలు చేయడం రాసిన విషయాన్ని విశ్లేషణ చేయడం ఒకటి కాదు. ఎప్పుడైనా ఏ పుస్తకాన్నైనా ఎప్పుడూ అనేక తీరుల్లో రాసే వీలుంది. ఏదీ కూడా “perfect” కాదు. అవదు కూడా! ప్రతీ రచనకీ ఇది వర్తిస్తుంది. ఆ రాసిన వారెవరు అన్నదానితో సంబంధం లేకుండా! అందువలన అభిప్రాయాలు ఆ రచనని బేరీజు వేయడంలో అడుగు తప్పనివి అయి ఉండాలి. అంతే!
ఇంక చివరగా తెలుగు వరకూ పుస్తక ప్రచురణ, దానికి సంబంధించిన ఇతర అంశాలు అనేకం దుస్సాధ్యమైనవి. అయినా తెలుగున కస్టమైన అంశాల మీద ఇంకా పని చేయడం జరుగుతూ ఉందంటే, పుస్తకాలు అచ్చు అవుతున్నాయీ అంటే అది కేవలం రచయితలకి భాషా సాహిత్యాల పట్ల ఉండే ప్రేమ వల్ల మాత్రమే! మరొక్క పదేళ్ళాగండి అప్పుడు ఈ వచ్చే పుస్తకాలూ రావు. ఇంతపాటి మాట్లాడే వాళ్ళూ ఉండరు: కొత్త పాఠక వర్గం తయారైతే తప్ప.-అలా నిజంగా అయితే గనక అప్పుడు నాకన్నా సంతోషించే వాళ్ళుండరు. తెలుగు సాహిత్యం వరకూ రాసే వారిని నిలుపోగలిగితేనూ, పాఠక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్ళ గలిగితేనూ తప్ప అది సాధ్యమయ్యే వ్యవహారంలా లేదు. కారణం తెలుగున ప్రవేశం ఉన్న వాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. దీన్ని ఏ రకంగా సరి చేయాలీ అన్నది ఆలోచించవలసిన విషయం. లేకపోతే తెలుగున పుస్తకాలు వచ్చే వీలే ఇటుపై ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే ఇందుకు రచయితా పాఠకులూ విమర్శకులూ వీరందరూ తమ పాత్రలని సక్రమంగానూ నిజాయితీ గానూ పోషించాలి. సరుకున్న రచనలని దూరం పెట్టి తేలిక పాటి రచనలని గురించి బాకా కొట్టే ఒక తప్పుడు పాత్ర పోషించకుండా ఉంటే చాలు. అందులో భాగంగానే మంచి రచనలని గురించి మాట్లాడ వలసిన బాధ్యతని సైతం సాహిత్యం పట్ల మమకారం ఉన్న వారందరూ చూపించవలసి ఉంది. ఇదే మీరు మరి “జటిల”మంటారా? అయితే మరి సాహిత్యాన్ని ఏకంగా అటకెక్కించేస్తే చాలు:)
జయప్రభ.
లక్ష్మణదేవర నవ్వు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/07/2012 1:17 pm
వెల్చేరు గారి రచన చదివిన తరవాత ఒక చిన్న చిరునవ్వు నవ్వుకున్నా! మళ్ళీ భయం వేసింది. “లక్ష్మణుడి నవ్వు ఎన్ని అపోహలకి దారితీసిందో ఈ రచనలో తెలిసింది కదా! మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నవ్వుతున్నావ్” అని నన్ను నేను ప్రశ్నించుకున్నా!
చూట్టానికి ఒక్కలా కనపడే కవలలుగా జన్మించిన రామన్నా – నేనూ చిన్నప్పుడు బాగానే దెబ్బలాడుకొనే వాళ్ళం. ఐదు నిమషాలు ముందు పుట్టినందుకు నా మీద అన్నగా పెత్తనం నాకు నచ్చేది కాదు. ఈ విషయమై మా అమ్మగారితో ఫిర్యాదు చెయ్యగా, చెయ్యగా మా అమ్మగారు నన్ను సముదాయించడానికి చెప్పిన ఈ క్రింది విషయాలు మరొక రకంగా వెల్చేరు గారు ఈ రచనలో చెప్పారు.
అసలు వనవాసానికి వెళ్ళమన్నది రాముడిని. భర్తకి తోడుగా ఉండాలని తోడు వెళ్ళింది సీత. మరి ఎవరూ లక్ష్మణుడిని వనవాసానికి వెళ్ళాలని ఆజ్ఞాపించపోయినా అన్న మీద ప్రేమ, గౌరవం కొద్దీ లక్ష్మణుడు స్వ ఇచ్ఛతో అడవులకి అన్న వెంట వెళ్ళాడు. ఇది లక్ష్మణుడు, రాముడి కంటే గొప్పవాడు అనటానికి మొదటి కారణం. (ఇది వినగానే నేను ఎంత గొప్పగా ఊహించుకున్నానో మీరు గమనించగలరు!). రాముడు వనవాసానికి చక్కగా తన భార్యతో హనీమూన్కి వెళ్ళినట్టు వెళ్ళాడు. మరి లక్ష్మణుడో? పెళ్ళి అయినా కూడా, భార్యని వదలి సేవకుడిలాగా అన్న వెంట నడిచాడు! ఇది లక్ష్మణుడు గొప్పవాడు అనటానికి ఇంకో కారణం! (ఇది వినగానే లక్ష్మణుడు కూడా గొప్పవాడే అన్న నిర్ధారణకి నేను వచ్చేసాను.)
మళ్ళీ అటువంటి అనుభూతే మళ్ళీ ఇప్పుడు ఈ రచన చదువుతుంటే కలిగింది. వెల్చేరుగారికి కృతజ్ఞతలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
Lucky.Vishnubhotla[AT]Globalfoundries.com
మాండలిక వృత్తి పదకోశం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
05/07/2012 12:50 pm
Dear Editor,
Arudra, the social and literary historian! Data are concisely crammed and casually delivered; yet inferences get elaborate treatment and are empirically analyzed. The approach to a topic related to Literary history never fails to be logical. Cascading the information replete with data, fortifying with solid proof; unfolding fresh conclusion backed by solidly proven information from verifiable sources; comprehensive treatment of a given topic, offering a logical insight into the core and the peripheral issues; and drawing rational analysis are the hall marks of Arudra Garu. Infusing a conversational tone and rendering an authentic text of standard proof with readability and easeful flow are pervasive in Arudra.
His exhaustive acquaintance with the vast areas covering the background to a topic is seldom conspicuous, but lends authenticity to the key conclusions, which gives coherence to a concept. His multi-sourced knowledge fills the gaps in the basic structure of a topic. Most often, his inferences are logically concluded; and are driven by plausible analysis. They tend to add to the corpus of the knowledge in the fundamentals of a given topic, especially in areas of social legacy and that of literary history.
We are fortunate that Bhadriraju Krishna Murthy garu [ we saw and heard him quite recently at The Book exhibition on Necklace Road, Hyderabad] and Chekuri Rama rao garu are keeping good health. And we are unfortunate that their expertise is being left underutilized.
I appreciate your decision to retrieve the essay. Could you please do more from the archives?
Yours faithfully,
Siddineni Bhava Narayana
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
05/07/2012 9:45 am
మోహనరావు గారి వ్యాసం చాలా బాగుంది నాకు.
శ్రీవక్కలంక లక్ష్మీపతిరావు గారు కూడా మేఘసందేశానికి ఒక తెలుగు అనువాదం వెలువరించారు. గత 70వ దశకంలో డిగ్రీ విధ్యార్థులకు అది పాఠ్యగ్రంథంగా కూడా ఉండేది. నేను కూడా అది అలా చదివాను. అయితే నాకు అందులో మూలకావ్యంలోని సొగసు కనుపట్ట లేదు. నాకు గుర్తున్నంత వరకు, వక్కలంకవారు ‘ఆ కాళిదాసు మన తెలుగువాడైతే యెట్లా వ్రాసి యుండేవాడో నని అట్లాగు వ్రాసాను’ అనటం నాకు రుచించ లేదు.
బహుకాలంగా తెలుగు కవులకు వృత్తచతుష్కం (ఉ., చం., శా, మ) తప్ప యిత వృత్తాలు కేవలం స్వల్పంగానే వాడాలన్న తప్పుడు స్పృహ ఒకటి సంప్రదాయంగా వచ్చింది. అలాంటిదే మరొక తప్పుడు స్పృహ సంస్కృత పాండిత్య ప్రదర్శన యెంత హెచ్చుగా చేస్తే అంత మంచిదీ, సమాసదైర్ఘ్యంతో అదరగొట్టటం ద్వారా కవిత్వానికి అందమూ కీర్తీ వస్తాయని భావించటం. ఇటువంటి పనులవలన తెలుగు కవిత్వంలో తెలుగు తరచుగా చులకనయింది, ప్రజలకు ఆ తెలుగు(?)కవిత్వం దూరంగా జరిగింది!
మందాక్రాంతంలో పూర్వపాదాంత్యాక్షరంతో కలిపి వరసగా అయిదు గురువులు వచ్చేటట్లు తెలుగులో వ్రాయటానికి పెద్దప్రతిబంధకం. అలాగే మందాక్రాంతం అందమంతా పాదంలో నిర్దిష్టమైన చోట్ల మూడు విరుపులు రావటంలో ఉంది. మన తెలుగుకవిత్వంలో యతిని ఒక తప్పనిసరి తద్దినంగా మార్చేసుకున్నాం కాని విరామస్థానంగా పాటించటమే లేదు కదా. ఇక విరుపుల అందం మీద ఆధారపడిన వృత్తం వ్రాయాలని తెలుగుకవులు యెందుకు తాపత్రయ పడతారు?
తెలుగుకవులకు వృత్తవైవిధ్యం ప్రదర్శించాలన్న కుతూహలం కూడా కద్దు కాబట్టి, అక్కడక్కడా వృత్తచతుష్కం బదులు మొక్కుబడిగా సందర్భానుసారం అన్నపేరుతో కొన్ని ఇతరవృత్తాలు గిలుకుతూ ఉంటారు. అంతే. అలాగే కొన్ని మందాక్రాంతాలూ ఉన్నాయి.
అసలు యతి, ప్రాసల నియమాలు రెండు వదలి వృత్తసహజవిరామాలతో అందంగా తెలుగులో యెందుకు పద్యరచన చేయసాహసించమో బోధపడదు.
లక్ష్మణదేవర నవ్వు గురించి వేణు అభిప్రాయం:
05/07/2012 9:21 am
ఒక నానుడిగా మారిపోయిన ‘లక్ష్మణదేవర నవ్వు’కు మూలంగా ఉన్న పాట గురించి ఇన్నేళ్ళకు తెలుసుకోగలిగాను. వెల్చేరు నారాయణరావు గారికి కృతజ్ఞతలు.
ఈ కథ గురించి స్థూలంగా తెలుసు కానీ, శివుడూ, ఆదిశేషువూ, జాంబవంతుడూ, నీలుడూ కూడా భుజాలు తడుంకున్నారనేది కొత్త విషయం. అసలు లక్ష్మణుడే ఆదిశేషుడి అవతారమంటారు కదా? తను శివుడికి సేవకుడిగా రావటమేమిటో, శివుడికీ విష్ణువుకూ విరోధమేమిటో బోధపడలేదు. (శైవులకూ వైష్ణవులకూ గొడవలుండేవి కానీ వీళ్ళిద్దరికీ కూడా ఉన్నాయా? యుద్ధానికి ముందు శివుణ్ణి రాముడు పూజిస్తాడు కదా? ) నేను విన్న కథలో రాముడు కూడా లక్ష్మణుడి నవ్వుకు తలవొంచుకుంటాడు.
దేవర అంటే భర్త తోబట్టువు అనే అర్థం ఉందని ఈ వ్యాసం ద్వారానే తెలిసింది!
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి mallikarjuna sarma అభిప్రాయం:
05/07/2012 6:20 am
ప్రధాన చర్చ నుండి ఈ నా deviation కు క్షంతవ్యుణ్ని. తిలక్ ‘నల్లజర్ల రోడ్డు’ radio నాటికగా వచ్చిందా! సందేహాన్ని విజ్ఞులు తీర్చగలరు.
కినిమా పత్రిక నుంచి – 3 గురించి mallikarjuna sarma అభిప్రాయం:
05/07/2012 5:58 am
రోహిణీప్రసాద్ గార్కి:
నమస్తే. నాన్నగారి ‘కినిమా’ స్కెచ్ లు అపురూపం. కేవలం బార్బర్ షాప్ కి వెళ్ళినప్పుడే సినిమా పత్రికల్ని తప్పనిసరైనప్పుడు మాత్రమే చూసే అలవాటున్న నాకు, సినిమా పత్రికల్లో ఇంత quality రచనలుంటాయని నాన్నగారి రచనలవల్లనే నమ్మకం కలుగుతోంది. ఇంత సరళమైన ఆరోగ్యకరమైన రచనలు ఒక ప్రత్యేక సాహిత్య ప్రక్రియగా నిలబడగలిగే అర్హత కలిగి వుంటాయి. నాన్న గారు తెలుగు సాహిత్యం లో గల్పికలు మొదలైన ఎన్నో ప్రక్రియలకు జీవం పోసిన ఆద్యులు. ‘సినిమా సాహిత్యం’ లో వారి అడుగుజాడలున్నా, అవి ఆయనవేనని ఇంకా ముందు తరాల వారికి రుజువు చేసి వుంచ వల్సిన చారిత్రక అవసరం వుందని నా అభిప్రాయం.
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి vikas,vinnakota అభిప్రాయం:
05/07/2012 3:18 am
మోహనగారు,
మీ సలహాలకు క్రుతజ్ణతలు.
వికాస్.విన్నకోట
ఆషాఢస్య ప్రథమ దివసే గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
05/07/2012 2:35 am
రామారావు గారి స్పందన చూసాకా మరో రెండు మాటలు:
1. సాంకేతిక పరిశోధనా పత్రాలకి ఒక వ్యవస్థ, పద్ధతీ ఉన్నాయి. సాహిత్యంలో, ముఖ్యంగా తెలుగు తీసుకుంటే మనకా వ్యవస్థా లేదు; పద్ధతి అంతకన్నా లేదు. ఏం రాసినా రచయిత ఆశ్రయించేడి పత్రికలనే! అంటే రచయిత వ్యాసాలకి స్థాయి ఆశించినట్లే పత్రికలకీ ఒక స్థాయి ఉండాలి. రచనలో వాసి ఆశించినట్లే, పత్రికలు తమ స్థాయిని పెంచుకునే మార్గాన వెళ్ళాలి. లేదా ప్రయత్నించాలి. కథలూ, కబుర్లూ రాస్తే వేయడానికి తెలుగునాట పత్రికలు సిద్ధమే కానీ వ్యాసాల వరకూ వస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉండరు – ముఖ్యంగా సాహిత్య పరిశోధనా వ్యాసాలు. వారి దృష్టిలో అది యూనివర్శిటీల బాధ్యత. ప్రస్తుతం యూనివర్శిటీలకి ఆ తీరికా, వెసులుబాటూ కరువయ్యాయి. చర్చించుకోడానికి అది వేరే విషయం. వదిలేద్దాం.
ఇలాంటప్పుడు మోహన గారి వ్యాసం కానీ, జయప్రభ గారి అన్నమయ్య పుస్తకం గానీ పాఠకులకి చేరేదెలా? మీరు చెప్పినట్లు దాన్ని చదివి తప్పొప్పులు సవరించీ, కాస్త కూర్పులూ, మార్పులూ చేసే పరిశీలకులు ఏరీ? ఒకవేళ ఉన్నారనుకున్నా, దానికి ఒప్పుకునే రచయితలూ ఉండాలి కదా? రచనని బేరీజు వేసే స్థాయి పరిశీలకులకీ వుండనవసరం లేదా? అంటే పరిశీలకుల స్థాయి మీద రచయితలకీ నమ్మకం ఉండాలి. విశ్వాసం కుదరాలి. ఇవన్నీ రాగద్వేషాల మధ్య కుదిరే విషయాలా? తాము రాసిందే వేదమూ, ఎదుటివారి జ్ఞానం శూన్యమూ అనుకునే వాతావరణంలో ఇవన్నీ కుదరని విషయాలు. ఎవరికివారే పెద్ద మేధావులుగా చెలామణీ అవ్వడానికే ప్రయత్నించే నేటి సాహిత్య వ్యవస్థలో రామారావు గారు ఆశించేది జరగని పని.
2. సాహిత్యంలో ప్రమాణాలు అవసరమని పత్రికలూ, పాఠకులూ, ముఖ్యంగా ఔత్సాహిక రచయితలూ భావించిన నాడు మంచి సరుకు పాఠకులకి రవాణా అయ్యే అవకాశం ఉంది. ఔత్సాహిక రచయితలు అని ఎందుకన్నానంటే చెయ్యి తిరిగిన రచయితలు వారేం రాసినా ప్రమాణంగానే భావిస్తారు కనుక. పత్రికలూ వీరి పట్ల సడలింపు ధోరణే అమలుపరస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. పేరొచ్చే వరకూ రాయి, అదొచ్చాక పత్రికలే మోస్తాయి అన్న సాహిత్య వాతావరణమ్లో కూరుకుపోయాం.
3. పోనీ ప్రచురణ కర్తలూ లేదా సంస్థలూ అయినా పైన చెప్పిన విషయాలమీద శ్రద్ధ చూపిస్తున్నాయా అంటే అదీ లేదు. వాదాలూ, రాజకీయల ఊబిలో పీకల్లోతు అవి మునిగున్నాయి. అమ్మకాలకి అవకాశం ఉండే పుస్తకాల మీదే వారి గురి. ఇలాంటి సందర్భాల్లో రచయితలే పుస్తకాలు అచ్చేసుకునే దౌర్భాగ్యపు సాహిత్య సమాజంలో ఉన్నాం. రాయడమూ, దిద్దుకోవడమూ, ప్రచురించుకోవడమూ, ప్రచారం చేసుకోవడమూ, ఆ పైన పంచుకోవడమూ అన్నీ రచయిత బాధ్యతలే అవుతున్నాయి. పాఠకులూ అదే తీరులో ఉంటున్నారు.
4. ఇహ వ్యాఖ్యలంటారా? ఎవరికి వారు పండుతులనీ, మేధావులనీ భ్రమించే నేపధ్యంలో అందరూ, అంటే ముఖ్యంగా రాసేవాళ్ళు, అన్నీ చదువుతారు. చదవనట్లు నటిస్తారు. వ్యాఖ్యానించడానికి సిద్ధంగా ఉండరు. అవే కారణాలు పునరావృత్తం అవుతాయి.
5. రాయగలిగిన వాళ్ళు రాస్తూ ఉండాలి. కానీ అభిప్రాయాలు ఆలంబన అవుతాయి. ఊతం ఇస్తాయి. మరింత మెరుగ్గా రాయలన్న ప్రేరణ కలిగిస్తాయి. చేసిన పనికి ఆనందాన్నిస్తాయి. ఇది పేరున్న రచయితలకీ వర్తిస్తుంది. పేరున్న రచయితలు పేరులేని వారివి చదవరు. చదివినా నోరు మెదపరు. అవే సమస్యలూ; అవే కారణాలూ.
సాహిత్య మార్జాలం గంట కట్టే వారికోసం వెతుక్కుంటోంది.
-బ్రహ్మానందం గొర్తి