కృత్రిమ మేధ, నాడీ వలయాల పునర్జన్మ అంశాల మీద మంచి వ్యాసాన్నిచ్చిన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. 1985లో హైద్రాబాదులో ప్రొ. రాజ్ రెడ్డిగారి ఉపన్యాసం విన్నందున… వారినీ స్మరిస్తూ…
భవదీయుడు,
కె. కె. రామయ్య
Dabbala Rajagopal “Raj” Reddy is an Indian-American computer scientist and a winner of the Turing Award. He is one of the early pioneers of artificial intelligence and has served on the faculty of Stanford and Carnegie Mellon for over 50 years.
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. అయితే, మీరు చెప్పిన అథర్వశీర్షం అన్నది అథర్వవేదంలో భాగం కాదండి.
మీరు చెప్పిన గణపతి అథర్వ శీర్షం అన్నదే శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్ అని కానీ గణపత్యుపనిషత్ అని పేరు పొందిన రచన చాలా అర్వాచీనం. దీని మీద పరిశోధన చేసిన అనిత రైనా థాపన్[1] ఇది 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో రచించబడి ఉండవచ్చునని ఆధారాలతో వాదించారు.
[1] Anita Raina Thapan (1997). Understanding Gaṇpati. Manohar Publishers. p. 40. ISBN 978-81-7304-195-2.
భక్తిసాహిత్యంలో అద్భుతమైన సాహిత్యం ఉండవచ్చును. ప్రతిశ్లోకంలోనూ తదాపి ప్రతిపాదంలోనూ కూడా సాహిత్యపువిలువలు బ్రహ్మాండంగా ఉండాలీ, ప్రత్యక్షరం రసరమ్యం కావాలీ అంటే అలా ఉంటే అద్భుతమే కాని మనం సమాహారంగా ఆసాహిత్యఖండికలోని రసరమ్యత వంటివి మాత్రమే స్వీకరించాలి. మైక్రోస్కోప్ క్రింద పెడితే అందమైన వస్తువులనేకం వికారంగా కనిపించవచ్చునండి.
ఇకపోతే భక్తి సాహిత్యం మనసా ఆస్వాదించి రమించవలసినదే కాని కేవలసాహిత్యపు విలువల తూకపురాళ్ళతో బేరీజు వేయదగినది కాదు తరచుగా.
పదాశ్రితానాం చ సమస్తచౌరం అన్న ఒక ప్రయోగం తీసుకుందాం. ఒక భక్తుడు ఈవాక్యం చదివి తన్మయత్వం చెందుతాడు. ఒక విమర్శకుడు ఏముంది ఈవాక్యంలో విశేషం అనుకోవచ్చును.
భగవంతుడు తన పాదాలను ఆశ్రయించినారి సమస్తాన్నీ దోచుకుంటాడట. ఏజీవుడైనా అహమిక ఉన్నంతకాలం ఇది నాది అది నాది అన్న లెక్కలనుండి దాటి బయటకు రాలేడు. వాడు నాది నాది అనుకొనేది సమస్తం భగవానుడు తీసివేసుకున్నాక ఆభక్తుడు నాది అనుకుందుకు గాను ఏదీ మిగలదు. తనది అన్నది ఉంటే దానితో బంధం. అటువంటిది లేకపోతే ఏబంధమూ లేదు కదా. ప్రాపంచికబంధరహితుడై భగవంతుడితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. వాడికి ఈస్థితి కలిగించాలనే అన్నీ ఆ భగవంతుడు లాగివేసుకుంటాడని ఈవాక్యం తాత్పర్యం. ఇదంతా స్ఫురించి భక్తుడు తాదాత్మ్యం చెందుతాడు. సాహిత్యవిమర్శకుడు ఏరసానుభూతినీ పొందడు. రసో వై సః అని మన సిధ్ధాంతం కదా. ఆ రససిధ్ధి కేసి అడుగువేయని వాడికి అంతా శుష్క భక్తి ప్రలాపమే.
ఇలాగు భక్తిభావన ఉన్నవారి దృక్కోణంలో ఇది సమున్నతమైన సాహిత్యమే. అసలు సాహిత్యం అంటే ఏమిటండీ? సహితమైనది సాహిత్యం. హితముతో కూడినది అని. ఏది హితము? భగవత్సంబంధి కన్నా హితమైనది ఉందా అని భక్తులు భావిస్తారు. కొందరు సామాజిక హితము వరకూ లెక్కలు వేస్తారు. కొందరు సాహిత్యప్రయోజనం వరకూ ఆలోచిస్తారు. ఇత్యాది.
ఈ నా అభిప్రాయం మూలం గురించి. అనువాదాల గురించి కాదు. అది ఎవరు రాశారు లేదా పాడారు అన్న విషయం పక్కన వుంచి శ్లోకాల్ని మాత్రమే చూస్తే – వీటిలో వీటి కర్త భక్తిపారవశ్యం స్పష్టంగానే మనక్కనిపిస్తుంది. “చౌర్యం” అనే భావాన్ని తీసుకుని దాన్ని అన్ని శ్లోకాల్లోను అంతర్లీనంగా చొప్పించే ప్రయత్నం జరిగింది, అభినందనీయమే. “నవనీతచోరుడిగా”, “గోపీమానసచోరుడిగా” కృష్ణుడు ప్రసిద్ధుడే. మొదటిదాన్ని పాలు, మజ్జిగలకి ఇంకా కావాలంటే నెయ్యికి, రెండోదాన్ని రాధ, రుక్మిణి మొదలైన ప్రియులకీ భక్తులకీ పొడిగించటం సాధారణమే. అలాటి చోరుణ్ణి చీకటికొట్లలో బంధించటం – భక్తుల మనసుల్తో సహా – అనేది కూడ లోతైన భావనగా నాకు కనిపించదు. శబ్దప్రయోగాలూ ఏమంత చెప్పుకోదగ్గవి కావు.
కనుక నా సందేహం వీటిలో కవిత్వం వున్నదా అనేది. అంటే పైపైన కనిపించే విషయమేనా లేక ఆలోచనామృతమైన వ్యవహారం ఏమైనా వుందా అనేది. నాకలాటిది కనిపించలేదు. కనిపించినవారు ధన్యులు. అదేదో మిగిలిన వారితో కూడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది.
భక్తిపురస్సరంగా వీటిని పాడుకుంటాం అంటే మంచిదే. కాని దీన్లో ఏదో అద్భుతసాహిత్యం వుందంటే ఒప్పుకోవటం కష్టం.
70ల మొదటి భాగంలో నేను రంపచోడవరంలో ఉండగా అక్కద రావాడ కృష్ణ అనే ఒక చిత్రకారులు ఉపాధ్యాయులుగా ఉండేవారు. అప్పట్లో యువకుడినైన నాతో చాలా అత్మీయంగా ఉండేవారు. (అక్కడ మానాన్నగారు ప్రధానోపాధ్యాయులు.)
కృష్ణగారికి సోమసుందర్గారంటే చాలా ఆరాధనా భావం ఉండేది (సోమసుందర్ ఎవరో అప్పట్లో నాకు తెలియదు). సోమసుందర్గారు చిన్నమ్మ వస్తోంది అని కాబోలు ఒక స్వీయ కవితాసంకలనం తెస్తున్నారని చాలా ఉత్సాహంగా చెప్పేవారు. అటువంటి కవితాసంకలనం సోమసుందర్గారు ప్రకటించారేమో తెలియదు.
అప్పట్లో శ్రీశ్రీగారికీ సోమసుందర్గారికీ ఏదో పెద్ద రగడ నడిచింది. శ్రీశ్రీగారు సోమసుందర్గారిని విమర్శిస్తూ పద్యాలు ప్రకటించారు. అందులో ఒక దాని చివరి పాదం “రుచి తెలియని కండచీమ సుందరదోమా!” అని ఉంటుంది.
కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
11/15/2024 10:22 am
కృత్రిమ మేధ, నాడీ వలయాల పునర్జన్మ అంశాల మీద మంచి వ్యాసాన్నిచ్చిన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. 1985లో హైద్రాబాదులో ప్రొ. రాజ్ రెడ్డిగారి ఉపన్యాసం విన్నందున… వారినీ స్మరిస్తూ…
భవదీయుడు,
కె. కె. రామయ్య
Dabbala Rajagopal “Raj” Reddy is an Indian-American computer scientist and a winner of the Turing Award. He is one of the early pioneers of artificial intelligence and has served on the faculty of Stanford and Carnegie Mellon for over 50 years.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
11/14/2024 12:53 pm
ప్రతాప చంద్రశేఖర్ గారు,
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. అయితే, మీరు చెప్పిన అథర్వశీర్షం అన్నది అథర్వవేదంలో భాగం కాదండి.
మీరు చెప్పిన గణపతి అథర్వ శీర్షం అన్నదే శ్రీగణపత్యథర్వశీర్షోపనిషత్ అని కానీ గణపత్యుపనిషత్ అని పేరు పొందిన రచన చాలా అర్వాచీనం. దీని మీద పరిశోధన చేసిన అనిత రైనా థాపన్[1] ఇది 16వ శతాబ్దంలోనో 17వ శతాబ్దంలోనో రచించబడి ఉండవచ్చునని ఆధారాలతో వాదించారు.
[1] Anita Raina Thapan (1997). Understanding Gaṇpati. Manohar Publishers. p. 40. ISBN 978-81-7304-195-2.
గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు గురించి వికీ పేజీ మీరు చూడవచ్చు:
Ganapati Atharvaśīrṣa Wikipedia page
నమస్సులతో,
సురేశ్.
ట్వైలైట్ గురించి Chandrashekhar Pratapa అభిప్రాయం:
11/14/2024 5:14 am
అందమైన శైలి లో కనువిందు చేసిన నిర్వేదం!
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి Chandrashekhar Pratapa అభిప్రాయం:
11/14/2024 4:48 am
గణపతి అధర్వ శీర్షం గురించిన ప్రస్తావన కూడా అవసరం కదా
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి GANNEM VASU అభిప్రాయం:
11/13/2024 1:00 pm
ప్రవరుని స్వగతం పాఠం లోని పద్యాలు ఇది నా పదవ తరగతి లో కూడా ఉంది
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/13/2024 5:09 am
భక్తిసాహిత్యంలో అద్భుతమైన సాహిత్యం ఉండవచ్చును. ప్రతిశ్లోకంలోనూ తదాపి ప్రతిపాదంలోనూ కూడా సాహిత్యపువిలువలు బ్రహ్మాండంగా ఉండాలీ, ప్రత్యక్షరం రసరమ్యం కావాలీ అంటే అలా ఉంటే అద్భుతమే కాని మనం సమాహారంగా ఆసాహిత్యఖండికలోని రసరమ్యత వంటివి మాత్రమే స్వీకరించాలి. మైక్రోస్కోప్ క్రింద పెడితే అందమైన వస్తువులనేకం వికారంగా కనిపించవచ్చునండి.
ఇకపోతే భక్తి సాహిత్యం మనసా ఆస్వాదించి రమించవలసినదే కాని కేవలసాహిత్యపు విలువల తూకపురాళ్ళతో బేరీజు వేయదగినది కాదు తరచుగా.
పదాశ్రితానాం చ సమస్తచౌరం అన్న ఒక ప్రయోగం తీసుకుందాం. ఒక భక్తుడు ఈవాక్యం చదివి తన్మయత్వం చెందుతాడు. ఒక విమర్శకుడు ఏముంది ఈవాక్యంలో విశేషం అనుకోవచ్చును.
భగవంతుడు తన పాదాలను ఆశ్రయించినారి సమస్తాన్నీ దోచుకుంటాడట. ఏజీవుడైనా అహమిక ఉన్నంతకాలం ఇది నాది అది నాది అన్న లెక్కలనుండి దాటి బయటకు రాలేడు. వాడు నాది నాది అనుకొనేది సమస్తం భగవానుడు తీసివేసుకున్నాక ఆభక్తుడు నాది అనుకుందుకు గాను ఏదీ మిగలదు. తనది అన్నది ఉంటే దానితో బంధం. అటువంటిది లేకపోతే ఏబంధమూ లేదు కదా. ప్రాపంచికబంధరహితుడై భగవంతుడితో మాత్రమే సంబంధం కలిగి ఉంటాడు. వాడికి ఈస్థితి కలిగించాలనే అన్నీ ఆ భగవంతుడు లాగివేసుకుంటాడని ఈవాక్యం తాత్పర్యం. ఇదంతా స్ఫురించి భక్తుడు తాదాత్మ్యం చెందుతాడు. సాహిత్యవిమర్శకుడు ఏరసానుభూతినీ పొందడు. రసో వై సః అని మన సిధ్ధాంతం కదా. ఆ రససిధ్ధి కేసి అడుగువేయని వాడికి అంతా శుష్క భక్తి ప్రలాపమే.
ఇలాగు భక్తిభావన ఉన్నవారి దృక్కోణంలో ఇది సమున్నతమైన సాహిత్యమే. అసలు సాహిత్యం అంటే ఏమిటండీ? సహితమైనది సాహిత్యం. హితముతో కూడినది అని. ఏది హితము? భగవత్సంబంధి కన్నా హితమైనది ఉందా అని భక్తులు భావిస్తారు. కొందరు సామాజిక హితము వరకూ లెక్కలు వేస్తారు. కొందరు సాహిత్యప్రయోజనం వరకూ ఆలోచిస్తారు. ఇత్యాది.
ఆవంత్స సోమసుందర్ – గేయాలు, లఘుకవితలు గురించి Rao Vemuri అభిప్రాయం:
11/12/2024 8:53 pm
సోమసుందర్ గారి గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు.
తెలుగు వికీపీడియాలో ఆవంత్స సోమసుందర్
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
11/12/2024 6:46 pm
ఈ నా అభిప్రాయం మూలం గురించి. అనువాదాల గురించి కాదు. అది ఎవరు రాశారు లేదా పాడారు అన్న విషయం పక్కన వుంచి శ్లోకాల్ని మాత్రమే చూస్తే – వీటిలో వీటి కర్త భక్తిపారవశ్యం స్పష్టంగానే మనక్కనిపిస్తుంది. “చౌర్యం” అనే భావాన్ని తీసుకుని దాన్ని అన్ని శ్లోకాల్లోను అంతర్లీనంగా చొప్పించే ప్రయత్నం జరిగింది, అభినందనీయమే. “నవనీతచోరుడిగా”, “గోపీమానసచోరుడిగా” కృష్ణుడు ప్రసిద్ధుడే. మొదటిదాన్ని పాలు, మజ్జిగలకి ఇంకా కావాలంటే నెయ్యికి, రెండోదాన్ని రాధ, రుక్మిణి మొదలైన ప్రియులకీ భక్తులకీ పొడిగించటం సాధారణమే. అలాటి చోరుణ్ణి చీకటికొట్లలో బంధించటం – భక్తుల మనసుల్తో సహా – అనేది కూడ లోతైన భావనగా నాకు కనిపించదు. శబ్దప్రయోగాలూ ఏమంత చెప్పుకోదగ్గవి కావు.
కనుక నా సందేహం వీటిలో కవిత్వం వున్నదా అనేది. అంటే పైపైన కనిపించే విషయమేనా లేక ఆలోచనామృతమైన వ్యవహారం ఏమైనా వుందా అనేది. నాకలాటిది కనిపించలేదు. కనిపించినవారు ధన్యులు. అదేదో మిగిలిన వారితో కూడ పంచుకుంటే ఇంకా బాగుంటుంది.
భక్తిపురస్సరంగా వీటిని పాడుకుంటాం అంటే మంచిదే. కాని దీన్లో ఏదో అద్భుతసాహిత్యం వుందంటే ఒప్పుకోవటం కష్టం.
పాస్పోర్ట్ గురించి Ramesh అభిప్రాయం:
11/11/2024 10:22 am
“ఏవిటో, ఈ కథ ద్వారా ఏదన్నా చెప్పాలన్న ఉద్దేశ్యం ఉండి ఉంటే, నాకు అది అర్థం కాలేదు.”
— ditto—-
“దీని భావమేమి తిరుమలేశా ?”
—- ditto—-
ఏమిటో రచయిత్రి దేశభక్తి కథ చెప్పారేమో.
ఆవంత్స సోమసుందర్ – గేయాలు, లఘుకవితలు గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/11/2024 3:41 am
70ల మొదటి భాగంలో నేను రంపచోడవరంలో ఉండగా అక్కద రావాడ కృష్ణ అనే ఒక చిత్రకారులు ఉపాధ్యాయులుగా ఉండేవారు. అప్పట్లో యువకుడినైన నాతో చాలా అత్మీయంగా ఉండేవారు. (అక్కడ మానాన్నగారు ప్రధానోపాధ్యాయులు.)
కృష్ణగారికి సోమసుందర్గారంటే చాలా ఆరాధనా భావం ఉండేది (సోమసుందర్ ఎవరో అప్పట్లో నాకు తెలియదు). సోమసుందర్గారు చిన్నమ్మ వస్తోంది అని కాబోలు ఒక స్వీయ కవితాసంకలనం తెస్తున్నారని చాలా ఉత్సాహంగా చెప్పేవారు. అటువంటి కవితాసంకలనం సోమసుందర్గారు ప్రకటించారేమో తెలియదు.
అప్పట్లో శ్రీశ్రీగారికీ సోమసుందర్గారికీ ఏదో పెద్ద రగడ నడిచింది. శ్రీశ్రీగారు సోమసుందర్గారిని విమర్శిస్తూ పద్యాలు ప్రకటించారు. అందులో ఒక దాని చివరి పాదం “రుచి తెలియని కండచీమ సుందరదోమా!” అని ఉంటుంది.
సోమసుందర్గారి కవిత్వం నేను ఇంతవరకూ చదువలేదు.