ముఖము దరహాసమును, చంద్రుడు వెన్నెలను విరియింపజేయటం లోకసహజం. కవి ఆ రెండింటిని కలగలిపి రూపకాన్ని సాధింపజూచినందువల్ల “రమ్యమైన ముఖమనెడి చంద్రునియొక్క దరహాసము” అన్న ఉత్తరోత్తరాన్వయాన్ని పద్యం ఉపక్రమణికలోనే మర్చిపోయాడు. రుచిర = రమ్యమైన, ఆనన = ముఖమనెడి, అబ్జ = చంద్రుని (రుచిరాననాబ్జ), దరహాస = చిరునవ్వు అనెడి, విలాస = లీలయొక్క, వికాస = వికసనముచే, భాసి = భాసమానుడైన, నీహారకర+అతిభాతి = చంద్రునియొక్క విశదప్రకాశముచే – అని అర్థాన్వయం. దీనికి తాత్పర్యం ఏమిటి? ముఖచంద్రదరహాసము అంటే ముఖ-దరహాసము, చంద్ర-దరహాసము అని రెండువిధాలుగా అన్వయిస్తున్నాడు. ఆ ప్రయత్నం వల్ల కల్పన స్వసమర్థకం కాలేకపోయింది. “ఆ రుచిరాననా(…) దరహాసవిలాసవికాసభాసి నీ,హారకరాతిభాతి” అని కాని, “ఆ రుచిరాననాబ్జ దరహాసవిలాసవికాస (…) అతిభాతి” అని కాని వ్రాసివుంటే అర్థం సరిపోయేది. ఇటు ‘అబ్జ’శబ్దాన్ని, అటు ‘నీహారకర’ శబ్దాన్ని ప్రయోగించటం వల్ల అన్వయం తప్పింది. రుచిరానన అయిన పార్వతీదేవి యొక్క దరహాసలీలచే వికాసమును పొంది భాసమానుడైన చంద్రుని వెన్నెలకు (మించిన) అతిభాతిన్ = అధికమైన కాంతిలో – అని ఎట్లాగో సరిపెట్టుకోవటం వీలుకాకపోయింది. ముఖాబ్జమన్న రూపకాన్ని చెప్పిన తర్వాత అదనంగా “భాసి (?) – నీ,హారకర – అతిభాతి” అన్నందువల్ల ప్రారంభంలోనే పద్యశిల్పం భగ్నమైపోయింది. ముఖచంద్రునియొక్క దరహాసమే వెన్నెల అని మర్చిపోయాడు.
పరమేశ్వరునికి “అమలాంగశరీరతుషారదీప్తికాం, తోరునగంబు” అన్న వ్యపదేశం ఎంత కృతకంగా ఉన్నదో చూడండి. ‘అమలాంగ’ శబ్దానికి ‘పరమశివు’ డనే అర్థంలో రూఢి లేదు. దానికి శిల్పశాస్త్రములో చెప్పబడిన అవయవప్రమాణసిద్ధమైన సౌష్ఠవమును కలిగినందువల్ల ‘దోషరహితాంగుడు’ అనే కాని, ‘తెల్లనివాడైన శివుడు’ అన్న ప్రసిద్ధి లేదు. వ్యుత్పత్తిని బట్టి ‘అమల+అంగ = స్వచ్ఛములైన (తెల్లని) కరచరణాద్యంగములు కలవాడు; అమలాంగుడు = శివుడు’ అని మనము చెప్పుకొన్నా, ‘అమలాంగశరీరము’ అన్న సమాసంలోని అంగ-శరీరముల పారస్పరికత (తెల్లని శరీరాంగములు కలవాని శరీరము) పదౌచిత్యము పట్ల కవియొక్క శ్రద్దధానత లేమిని సూచిస్తున్నది. అయశ్చంద్రసూర్యాదులు, వాటి పర్యాయపదాలు ‘కాంత’ శబ్దంతో సమసించినప్పటి అయస్కాంత చంద్రకాంత సూర్యకాంతములలోని ‘కాంత’ శబ్దానికి ‘ఱాయి” అన్న అర్థం ఏర్పడటం కారణంగా “చంద్రకాంతము” అనటానికి “తుషారదీప్తికాంతము” అనటం వ్యాకరణసాధ్యమే కాని, చంద్రునికి ‘తుషారకిరణుడు’ అనే కాని, ‘తుషారదీప్తి’ (మంచువెలుగు) అన్న వ్యవహారం లేకపోవటంవల్ల అది కావ్యదోషప్రకరణంలో చెప్పబడే ‘నేయార్థము’ అనే దోషం. ఏదో కల్పన నిమిత్తం సరిపెట్టుకోవలసినదే కాని, ‘పాలరాతితోడి కొండ’ ఒకటుండటం లోకసిద్ధమేనా? అని కవికి తోచలేదు.
పరమేశ్వరునికి సాత్త్వికభావోదయం ఎప్పుడు కలిగింది? “మదనపరవశయై యున్న పార్వతి ముఖాలంకారంబు”ను చూసినప్పుడు (5-42). ఆమె ముఖమునందు అభివ్యక్తమైన మన్మథపారవశ్యభావాన్ని కనుగొని ఆయన అంతఃకరణ ఆమెయందు సుముఖమైనదని ప్రతీయమానం. ఆ సూచన ‘అలంకారము’ అన్న ఆ బాహ్యచిహ్నంలో లేదు. రమ్యమైన ఆమె ముఖచంద్రదరహాసప్రకాశంలో మునిగి, వెన్నెలలో పాలరాతికొండ ద్రవిస్తున్నట్లుగా ఆయన శరీరమంతటా స్వేదం వెల్లివిరిసింది. అది హిమవత్పర్వతాన్ని ఆకాశగంగ కప్పివేసినట్లుగా ఊహింపబడింది. ఆ హిమవంతుడు పార్వతికి తండ్రి అని, ఆ ఆకాశగంగ పరమేశ్వరునికి భార్య అని; ఆ ఆకాశగంగ ఆయన జటాజూటంలోనిదే కదా! అని, ఆయన ఉన్నదే నీహారపర్వతసీమపైని కాగా నీహారకరాతిభాతి అన్న ప్రయోగానికి ప్రయోజనం ఏమిటని – సందేహపరంపర కలిగితే, అది రామాయణంలో పిడకలవేట వంటిదే అనుకొని, ప్రస్తుతానికి విడిచివేద్దాము.
శరీరమనే పాలరాతికొండ ఎప్పుడు పొల్పారింది? “ఆ … నీహారకరాతిభాతి”లో (సప్తమి); లేక, “ఆ … నీహారకరాతిభాతి”చే (తృతీయ) – పరమేశ్వరుని మనస్సు పారవశ్యాన్ని పొందినప్పుడు. “పరమేశ్వరుని మనస్సు సైతం పారవశ్యాన్ని పొందినప్పుడు” అన్న మాట పద్యంలో లేదు. అసలు హిమాచలాన్ని అమరాధిపవాహిని “పర్వి”, కప్పివేసినప్పుడు “పొల్పారటం” ఎందుకుంటుంది?
ఘర్మజలం పొంగినది పార్వతీముఖదర్శనపారవశ్యంలో ఉన్న పరమేశ్వరుని శరీరం నుంచి. చంద్రకాంతోరునగంబు నుంచి కాదు. చంద్రకాంతోరునగానికి ఘర్మజలోల్బణం ఉండదు. అయితే పద్యంలో, “అమలాంగశరీరతుషారదీప్తికాంతోరునగంబు సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి” అనే ఉన్నది. సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది శరీరమనే చంద్రకాంతోరునగం నుంచి అని అన్వయం. ఈ సమాసం ‘సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది చంద్రకాంతోరునగం వంటి శరీరం నుంచి’ – అన్న సరియైన అన్వయాన్ని పరిహరిస్తున్నది. మళ్ళీ అమరాధిపవాహిని హిమనగాన్ని కప్పినట్లుగా పొల్పారినది శరీరం కాదు. శరీరమనెడి చంద్రకాంతోరునగం. ఎక్కడికక్కడ పదాలను తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని అన్వయించుకోవాలి. అన్వయమే లేనప్పుడు అలంకారాల చర్చ నిరాధారం అవుతుంది.
శరీరము నుండి కలిగే స్వేదరూపజలోద్గమం రతి వలన, ఘర్మము (వేడి) వలన, శ్రమము (అలయిక) వలన కలుగుతుందని లక్షణం. ఇతరకారణాలు కూడా ఉన్నాయి. సమ్మద రసము అంటే ఆనందరసం. వేదాంతశాస్త్రంలోనూ, అలంకారశాస్త్రంలోనూ అది మనుష్యానందం మొదలుకొని హిరణ్యగర్భానందం వరకు గల ప్రతిబింబానందాలకు బింబభూతమైన పరబ్రహ్మము యొక్క అనుభవము వలన కలిగే ఆనందరసం. అది గ్రీష్మకాలపు తాపాతిశయం వలన కలిగే ఘర్మజలం వంటిది కాదు. అందువల్ల ‘స్వేదము’ అన్న ఆలంకారికరూఢమైన పరిభాషాపదం (స్విద్యతే అనేన అఙ్గ మితి స్వేదః – దీనిచే మేను చెమర్చుతుంది కాబట్టి స్వేదము) తప్ప జిఘర్తీతి ఘర్మః – మాడ్చివేసే వేసవికాలపు ఎండలో కారే చెమట అన్న అర్థాన్ని కలిగిన పదం అక్కడ అనుచితమే అవుతుంది. సమ్మదరసం ఉన్నప్పుడు ఘర్మజలానికి స్థానం ఉండదు. పైగా నీహారకరాతిభాతి వల్ల ఘర్మజలం అసలే ఉద్గమింపదు.
ఇక రసభావాల చిత్రణ విషయం. ఇప్పటికే లేఖ పెద్దదైనందున కేవలం సూచించి, వదిలివేయక తప్పటంలేదు. కొద్దిసేపు క్రితం (5-38)లో కావ్యనాయిక పార్వతికి స్వేదోదయాన్ని వర్ణించాడు. దాదాపు అదే రకమైన భావంతో మళ్ళీ ఇప్పుడు నాయకునికి స్వేదోదయాన్ని చెప్పాడు. అదీ మరచి, (5-45)లో మళ్ళీ వెంటనే రోమాంచము, కంపము అన్న సాత్త్వికభావాలను అపక్రమంలో నాయకుని యందు చిత్రించాడు. పార్వతికి మేను చెమర్చినప్పుడు చిత్రింపబడిన రాగాతిశయం, భావదీప్తి పరమేశ్వరునికి స్వేదోద్గమం ఒళ్ళంతా కప్పివేసినట్లుగా (ముచ్చెమటలు పట్టినట్లుగా) చిత్రింపబడటంలో ఔచిత్యం లేదని కవి ఊహింపలేదు. ఏకకావ్యంలో నాయికానాయకులు ఇద్దరికీ రూపసామ్యోదిత సాత్త్వికభావాలను కాలాంతరసంక్రమితాలుగా వర్ణించటంలో ఉన్న విసంగతి కూడా కవి దృష్టికి రాలేదు.
మాన్యమిత్రులు మన్నించాలి. ఎన్ని విధాల చూచినా ఇందులో ఉత్తరోత్తరాన్వయంతోడి స్పష్టమైన అర్థస్ఫురణ కాని, సుభగమైన రసప్రతీతి కాని కనబడటం లేదు. ప్రాచీనుడైన మహాకవి రచన కాబట్టి సరసులు నెరసులను పట్టించుకోకుండా ఎక్కడికక్కడ సరిపెట్టుకొంటూ ముందుకుపోవాలి.
Thanks Uma Kaundinya garu! The original isn’t relevant any more. 🙂
Actually, it was Tin House which published that story for the first time, I believe, as per the details on the copyright page. Anyways, I can not think of reaching that particular issue here in India… 🙂
అద్భుతంగా ఉందండి. మా తెలుగు తల్లికీ అనే పాటనీ, జయ జయ ప్రియ భారత జనయిత్రి అనే దాన్నీ, వ్యాస భాగవతాన్ని, వాల్మీకి రామాయణాన్నీ, వ్యాస భాగవతాన్నీ కూడా ఇలా తయారుచేయండి. పనిలోపనిగా కవిత్రయం రాసిన భారతాన్ని కుడా. మనకున్న జాతీయ పక్షి నెమలినీ, అలా దేశనికి సంబంధించిన మిగతా వాటినీ కూడా “దయచేసి” వె-హెక్-కిరించండి. మిగతా తెలుగువాళ్ళందరూ బా-హెక్-గా మెచ్చుకుంటారు, ఇక్కడ పాఠకులు మెచ్చుకున్నట్టే. పనిలో పనిగా ఇక్కడ వాడినట్టే, శాస్త్రి, అవధాన్లు, వెంకటేశ్వర్లు అనే బ్రహ్మణ పదాలు బాగా వాడండి. మన కుల గజ్జిని బాగా గోకవచ్చు. అప్పుడు మిగతా కులస్థులందరూ అబ్బో, ఓహో ఆహో అని మిమ్మల్ని ఆకాశనికెత్తేస్తారు. అది ఎంఅతటి గౌరవమో మళ్ళీ చెప్పక్కర్లేదు.ఇవన్నీ ఒక పుస్తకంగా వేస్తే తెలుగువాళ్లందరూ – మనం శుద్ధ వెధవాయిలం కనకే – వెకిలిగా నవ్వుకుంటూ అవన్నీ కొనుక్కుని మిమ్మల్ని నోబుల్ బహుమతికి ఎంపిక చెస్తారు. అలా వచ్చిన డబ్బులతో కోకో కోలాలు తాగుతూ ఎన్-హెక్-క్కా రిటైరైపోవచ్చు.
తమిళ తంబిల దగ్గిర ఎం.జి.ఆర్ గురించీ, అన్నా దురై గురించీ, వాళ్ళ కవి తిరునక్కరసు గురించి కూడా రాయగలరా? అది తమిళ తంబిల దగ్గిరకి తీసుకెళ్ళండి. వెళ్ళేముందు ఓ తలగడ పట్టుకెళ్ళండి కూడా. వాళ్ళు పేడ నీళ్ళు మొహం మీద జల్లి పళ్ళు రాలగొడితే కాచుకోవడానికి.
ఇదే మనకున్న దౌర్భాగ్యం. మన వాళ్లని, మన కున్న విలువల్నీ మనమే కాపాడుకోలేము. నాలుగు ఇంగ్లీషు పుస్తకాలు చదగానే మనం పోతన పురాణాన్ని అడ్డం పెట్టుకుని వెక్కిరించడానికి తయారు. సిగ్గుపడవల్సిన విషయం. మరి Jordan Bass ని Jord-AN b-ASS లా విడగొట్టుకోవచ్చు కదా? Then all capitals added together makes better words too. Yup why not?
మొదటి సంగతి: ‘అనుక్త మన్యతో గ్రాహ్యమ్’ అన్నట్లు కాళిదాస కుమారసంభవాన్ని ముందుంచుకొని చదివితే గాని ఈ పద్యార్థం బోధపడదు. కాళిదాసు వర్ణించినది పార్వతీ మనోజ్ఞతనువుపై చిలికిన తొలకరి జలకణాల స్థితిగతులను. ఆ కల్పనలోని సౌందర్యాతిశయం, అభినవత్వం, భావధ్వని, ప్రతిపదాన్ని ఆచితూచి ఎన్నుకొన్నప్పటి పరికరాలంకారపు దివ్యశోభ – వ్యాఖ్యాతల మనస్సులనే గాక మహాలంకారికుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ గంభీరిమను వివరించేందుకు దానిపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు వెలిశాయి. అనర్ఘమైన శ్లోకం అది.
తెలుగు కవి రూపిస్తున్నది అడరు నవాంబుధారలను. అంటే, వర్షర్తువేళ క్రమక్రమంగా విజృంభిస్తున్న నవాంబుధారల స్వస్థితిని. ఎంత నవంనవములైనప్పటికీ అతిశయిస్తున్నవి అంబువుల “ధారలు” కనుకనే అవి జటాటవిలో “విభ్రమించటం” (తిరుగుళ్ళు పడటం) సంభవించింది. తొలుకారు నాటి నీటిచుక్కలైతే జటాటవిలో విభ్రమించే అవకాశమే ఉండేది కాదు. బిందువులకు విభ్రమించటం ఉండదు. జలధారలు కాబట్టే విభ్రమణాన్ని పొందాయి. ఎట్లా పొందాయి? అంటే, పరమేశ్వరుని వలె పార్వతీదేవి కూడా కేశపాశాన్ని కపర్దజటాజూటోపమంగా బంధించి ఉన్నందువల్ల ఆ మహాజటాటవిలో అంబుధారలు చిక్కుకొని కేశావర్తాల వెంబడిని తిరుగుళ్ళుపడవలసివచ్చిందని భావం. దట్టమైన చుట్టుకురులకోసం పాపం పార్వతికి సైతం జటాటవిని కల్పింపవలసివచ్చింది. అంతకు ముందు పద్యంలోనే (6-108) పార్వతి అందమైన జడలపై తొలకరి నీటిబిందువులు ముత్యాల సేసల వలె మనోహరంగా ఉండటాన్ని వర్ణించాడు. అంతలోనే ఆ సంగతిని మర్చిపోయి, లేనిపోని జటాటవిని తెచ్చిపెట్టుకోవటం వల్ల – ఆ జటాటవిలో విభ్రమింపవలసివచ్చిన “అడరు నవాంబుధార”లను తెచ్చిపెట్టుకొని తబ్బిబ్బయ్యాడు. అంతకు క్రితమే నెఱిజడలతో ఉన్న పార్వతీదేవి అంతలోనే వేణీబంధకపర్దిని అయినప్పటికీ, అది సమున్నద్ధశిఖండకం కాక, ఆవర్తాకారంలో కుంభీబంధసంయుక్తమై సముల్లేఖ్యంగా ఉన్నప్పటికీ – దానికి జటాటవితో తాద్రూప్యం సరికాదని చూసుకోలేదు. అననురూపమైన ఆ జటాటవిలో వర్షానవాంబుధారలు విభ్రమిస్తుండటం పార్వతీ కేశవర్ణనకు శోభాహేతువు కాదని కవి గ్రహింపలేదు.
అంబుధారలు “వెల్వడి, చనుదెంచి” అంటే, పార్వతీజటాటవిలో విభ్రమించి విభ్రమించి, అక్కడినుంచి బైటపడి వచ్చి – అన్నమాట. “వెల్వడి” అంటే సరిపోయేది. “వెల్వడి, చనుదెంచటం” ఎందుకు? వెల్వడిన తర్వాత ఎక్కడికి చనుదెంచినట్లు? పోనీ, ఫాలాగ్రసీమకో ఎక్కడికో అక్కడికి చనుదెంచిన తర్వాత, “రాలుగొనటం” ఎట్లా సాధ్యమైంది? ‘రాలుగొను’ అన్న ఆ విచిత్రమైన ధాత్వర్థానికి కవి అనుకొన్న భావం ఏమిటో కవికే తెలియాలి. ఎంత సూర్యరాయ నిఘంటువు సర్దిచెప్పినా, ‘గళితమై, క్రిందికి జాఱి’ అన్న అర్థంలో ‘రాలు’ ధాతువుపై క్త్వార్థకమైన ‘కొను’ ధాతువు చేరి ‘రాలుగొని’ అని స్వార్థంలో రూపం ఎట్లా ఏర్పడుతుంది? నీళ్ళకు ‘రాలటం’ ఉండదు కనుక జలధారలకు ‘రాలుగొను’ అన్న భావార్థక స్వతంత్రక్రియాకల్పన సార్థకం కాదు. ఆముక్తమాల్యద (4-82) లో “నవమేఘపృథుకములకు రాలె నొయ్యన వడగండ్లు పాలపండ్లు” అన్నప్పుడు అక్కడ శిశువులకు పండ్లు రాలటమూ ఉన్నది; మేఘాల నుంచి వడగండ్లు రాలటమూ ఉన్నది. అది సార్థకమైన ప్రయోగం. ప్రకృతపద్యంలోని నీటిధారలు ‘రాలుగొనటం’ వ్యర్థకల్పితమని గ్రహించాలి. అందుకే దానికి ప్రయోగాంతరాలు దొరకవు.
కేశబంధం నుంచి (ఫాలస్థలికి కాబోలు) వెల్వడి, (అక్కడినుంచి) చనుదెంచి, రాలుగొంటూ – అంటే, రాలుకుంటూ (క్రిందికి జారుతూ) వచ్చిన జలధారలు కనురెప్పలపై పడి, ఆ పక్ష్మములు (కనురెప్పలు) పక్ష్మలములు (దట్టమైన వెంట్రుకలు కలవి) కావటంవల్ల “వెడ నిల్చి” = కొద్దిసేపు నిలిచిపోయాయన్నమాట. నిలిచినవి ప్రథమోదబిందువులు కాదని, అడరు నవాంబు“ధార”లని అంతలోనే కవి మర్చిపోయాడు. కాళిదాసు వర్ణనలో “ఉదబిందువు-లు” అని బహువచనం ఉన్నది కాబట్టి వాటికి అవిరళత్వం చెప్పబడిన మాట నిజమే. ఎంత అవిరళములైనా, అవి నీటిచుక్కలు. “అడరు నవాంబుధారలు” కావు. ఎంత దట్టమైన కనురెప్ప అయినా, ప్రథమోదబిందువులకు వలె అంబు“ధార”లకు ఆ రెప్పపై నిలుకడ ఎలా సాధ్యమని తెలుగు కవికి తోచలేదు. ‘స్థితాః క్షణం పక్ష్మసు’ అన్నది ‘పక్ష్మములన్ వెడ నిల్చి’ అని తెలుగయింది కాని, అది ఉదబిందువులకు అనువర్తించినట్లుగా అంబుధారలకు వర్తింపదు. “ధార” అన్న తర్వాత, అవిచ్ఛిన్నగతి మూలాన “నిలుకడ”కు వీలుండదు కదా.
‘తాడితాధరాః’ అన్న కర్మవాక్యం తెలుగులో ‘మోవిపై పడి’ అయింది. మోవిపై పడిన ధారలు ఏమైనాయో తెలుగు కవి చెప్పకపోవటం వల్ల – క్రిందిపెదవి యొక్క స్వాభావికమృదుత్వం వ్యంజింపబడిన సంగతి శ్లోకాన్ని చదవనివాళ్ళకు తెలియదు. అధ్యాహారవిషయస్ఫురణ కలుగదు. పయోధరముల ఉత్సేధం (ఉన్నతి, కాఠిన్యము), వాటిపై ఉదబిందువుల నిపాతం, తత్ఫలితంగా ఉదబిందువులు చూర్ణితాలు కావటం అన్న కాళిదాసు శ్లోకంలోని అద్భుతావహమైన పరిణామక్రమమంతా తెలుగులో “మోవిపైఁ బడి”, “కుచఘట్టనన్” అన్న కరుకు మాటలతో కుప్పకూలిపోయింది. ఆ కుచఘట్టన వలన – అంటే, స్తనములతోడి ఒరపిడి వలన ఆ అంబుధారలు చెదరి = చెల్లాచెదరై(నందువల్ల); పాఱి = పరువులెత్తి లేదా పునఃప్రవాహగతిని పొంది; రయంబునన్ = వేగంగా (?); ముత్తరంగలన్ = మూడు వళులనెడి విషమరేఖలయందు (తత్తన్మధ్యములందు); మడుగులువాఱి = నిమ్నోన్నతములందు చిక్కినవైనందున మడుగులు కట్టి (?) – అని భావం. ఒక్క వాక్యశకలంలో ఇన్ని అన్వయింపని వ్యర్థపదాలెందుకు?
కొందరు విమర్శకులు “నాభికిన్ + ఎడము + ఆనక + చొచ్చెను” అని పదచ్ఛేదం చేయటం సరికాదు. ఆ పక్షాన యతిభంగం. కొందరు వ్యాఖ్యాతలు “నాభికిన్ + ఎడ + మానక = చోటువిడువక” అని వ్రాసిన అర్థం కూడా సరిపడదు. నాభికి చోటువిడువకపోవటం ఏమిటి? దానికి ‘స్తనముల రాపుచే చెదరి, ప్రవహించి, మూడు వళులందు మడుగులుగా నయి, నాభియందు సంపూర్ణముగా ప్రవేశించెను’ – అని ముద్రితప్రతులలో ఉన్న తాత్పర్యం ఎట్లా సరిపడుతుంది? ‘మడుగు కట్టిన నీటికి’ అన్న అర్థంలో ‘మడుగులు వాఱటం’ అన్న క్రియారూపం ఎట్లా ఏర్పడుతుంది? “మడుగులుగా” అయిన తర్వాత, మళ్ళీ పాఱే ప్రవాహగతి ఎట్లా సిద్ధిస్తుంది? “చోటు విడువక”, “సంపూర్ణముగా ప్రవేశించటం” ఏమిటి? ఇన్ని వ్యర్థపదాలకు అర్థం ఎట్లా పొందుపడుతుంది?
అక్కడ నిజానికి, “నాభి + కెడ + మానక” అని చదువుకోవాలి. “కెడ” అంటే పార్శ్వసంగతి. “చెదరి తోఁ బఱతెంచు చెందమ్మిఱేకులు గెడగొని మొగుపుఁ గెంగేలు గాఁగ” అని కుమారసంభవం (9-72) లోనిదే మరొక ప్రయోగం. జలధారలు వళుల వద్ద మడుగులు కట్టి ఆగిపోక, నాభి వైపునకు సైతం పరువులువారటం మానక – అని కవిహృదయం.
నీటిచుక్కల నాభీప్రవేశాన్ని అభివర్ణించటం నాభియొక్క లోతును సూచించటానికి – అన్నది భావ్యమే. వళులలోనికి జారిన ఉదబిందువులు “చిరేణ” = నెమ్మది నెమ్మదిగా పొక్కిలిని చేరాయని మాత్రమే కాళిదాసు. “మానక చొచ్చెను” అన్నప్పుడు అంబుధారల ప్రవాహగతి అవిచ్ఛిన్నంగా కొనసాగి, శ్లోకభావం భగ్నమైపోయింది. ‘చేరెను’ అనక, “చొచ్చెను” అన్నందువల్ల, అంబుధారలు నాభిలోనికి ప్రవేశించి అంతర్ధానమైపోయినట్లు ఊహింపవలసివస్తుంది. అది నాభియొక్క ప్రకరణోచితమైన గంభీరిమకు తగని పదసంగతి. ఆ విధంగా జటారణ్యంలోనుంచి వెలువడి, చనుదెంచి, రాలుగొని, దట్టమైన కనురెప్పలపైని ఆగి, కుచఘట్టన మూలాన చెల్లాచెదరైన నవాంబుధారలు వళుల వద్ద మడుగులు కట్టి, ఆ మడుగులు మళ్ళీ ప్రవాహగతిని మానక నాభికి అభిముఖంగా పరుగులుతీసి, ఆ నాభియందు చొరబడటం ప్రకృతిసహజం కాదని, కవితాత్మకం అసలే కాదని, నాయికాసౌందర్యవర్ణనలో అనౌచిత్యాపాదకమని కవికి తోచలేదు.
అద్భుతావహమైన కాళిదాసు శ్లోకానికి అసమర్థమైన అనువాదం ఇది. ఇందులో ఏ అలంకారమూ లేదు. శ్లేష అసలే పొందుపడదు. స్వభావోక్తికి తావులేదు. పరికరం పద్యం మొదట్లోనే భగ్నమైపోయింది.
పెద్దలు ఈ మాటను అంటున్నందుకు మన్నించాలి. పూర్వకవుల పద్యాలలో ఈ విధంగా ఇన్ని సరిపెట్టుకోవలసిన అన్వయదోషాలు కనబడేది మచ్చుకు ఒకటి కూడా ఉండదు.
తెరచాటు-వులు: 1. ఆదిన గురించి ఎ ఎస్ మూర్తి అభిప్రాయం:
02/04/2017 1:55 pm
అభిప్రాయాల్లేవ్, ఎవరికీ ఏమీ తెలియదేమో, నాకు మాత్రం కొంచం తెలుసు
ఉదాహరణములు – 1 గురించి మోహన అభిప్రాయం:
02/04/2017 1:40 pm
2012లో గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు శ్రీప్రభాకరోదాహరణమును వ్రాసినారని శ్రీ వేటూరి ఆనందమూర్తిగారు తెలియబఱచినారు. విధేయుడు – మోహన
గులకరాళ్ళు గురించి ఎ ఎస్ మూర్తి అభిప్రాయం:
02/04/2017 1:01 pm
నీట మునిగిన నల్ల బాతు గుండె
లోలోపలి పొరల్లోకి వెతుకుతోంది
కాసేపు ఊపిరాడలేదు
అందుకేమో ఏమో
నాకు నచ్చిన పద్యం: కవిరాజశిఖామణి కవిత్వశక్తి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
02/04/2017 12:56 pm
ముఖము దరహాసమును, చంద్రుడు వెన్నెలను విరియింపజేయటం లోకసహజం. కవి ఆ రెండింటిని కలగలిపి రూపకాన్ని సాధింపజూచినందువల్ల “రమ్యమైన ముఖమనెడి చంద్రునియొక్క దరహాసము” అన్న ఉత్తరోత్తరాన్వయాన్ని పద్యం ఉపక్రమణికలోనే మర్చిపోయాడు. రుచిర = రమ్యమైన, ఆనన = ముఖమనెడి, అబ్జ = చంద్రుని (రుచిరాననాబ్జ), దరహాస = చిరునవ్వు అనెడి, విలాస = లీలయొక్క, వికాస = వికసనముచే, భాసి = భాసమానుడైన, నీహారకర+అతిభాతి = చంద్రునియొక్క విశదప్రకాశముచే – అని అర్థాన్వయం. దీనికి తాత్పర్యం ఏమిటి? ముఖచంద్రదరహాసము అంటే ముఖ-దరహాసము, చంద్ర-దరహాసము అని రెండువిధాలుగా అన్వయిస్తున్నాడు. ఆ ప్రయత్నం వల్ల కల్పన స్వసమర్థకం కాలేకపోయింది. “ఆ రుచిరాననా(…) దరహాసవిలాసవికాసభాసి నీ,హారకరాతిభాతి” అని కాని, “ఆ రుచిరాననాబ్జ దరహాసవిలాసవికాస (…) అతిభాతి” అని కాని వ్రాసివుంటే అర్థం సరిపోయేది. ఇటు ‘అబ్జ’శబ్దాన్ని, అటు ‘నీహారకర’ శబ్దాన్ని ప్రయోగించటం వల్ల అన్వయం తప్పింది. రుచిరానన అయిన పార్వతీదేవి యొక్క దరహాసలీలచే వికాసమును పొంది భాసమానుడైన చంద్రుని వెన్నెలకు (మించిన) అతిభాతిన్ = అధికమైన కాంతిలో – అని ఎట్లాగో సరిపెట్టుకోవటం వీలుకాకపోయింది. ముఖాబ్జమన్న రూపకాన్ని చెప్పిన తర్వాత అదనంగా “భాసి (?) – నీ,హారకర – అతిభాతి” అన్నందువల్ల ప్రారంభంలోనే పద్యశిల్పం భగ్నమైపోయింది. ముఖచంద్రునియొక్క దరహాసమే వెన్నెల అని మర్చిపోయాడు.
పరమేశ్వరునికి “అమలాంగశరీరతుషారదీప్తికాం, తోరునగంబు” అన్న వ్యపదేశం ఎంత కృతకంగా ఉన్నదో చూడండి. ‘అమలాంగ’ శబ్దానికి ‘పరమశివు’ డనే అర్థంలో రూఢి లేదు. దానికి శిల్పశాస్త్రములో చెప్పబడిన అవయవప్రమాణసిద్ధమైన సౌష్ఠవమును కలిగినందువల్ల ‘దోషరహితాంగుడు’ అనే కాని, ‘తెల్లనివాడైన శివుడు’ అన్న ప్రసిద్ధి లేదు. వ్యుత్పత్తిని బట్టి ‘అమల+అంగ = స్వచ్ఛములైన (తెల్లని) కరచరణాద్యంగములు కలవాడు; అమలాంగుడు = శివుడు’ అని మనము చెప్పుకొన్నా, ‘అమలాంగశరీరము’ అన్న సమాసంలోని అంగ-శరీరముల పారస్పరికత (తెల్లని శరీరాంగములు కలవాని శరీరము) పదౌచిత్యము పట్ల కవియొక్క శ్రద్దధానత లేమిని సూచిస్తున్నది. అయశ్చంద్రసూర్యాదులు, వాటి పర్యాయపదాలు ‘కాంత’ శబ్దంతో సమసించినప్పటి అయస్కాంత చంద్రకాంత సూర్యకాంతములలోని ‘కాంత’ శబ్దానికి ‘ఱాయి” అన్న అర్థం ఏర్పడటం కారణంగా “చంద్రకాంతము” అనటానికి “తుషారదీప్తికాంతము” అనటం వ్యాకరణసాధ్యమే కాని, చంద్రునికి ‘తుషారకిరణుడు’ అనే కాని, ‘తుషారదీప్తి’ (మంచువెలుగు) అన్న వ్యవహారం లేకపోవటంవల్ల అది కావ్యదోషప్రకరణంలో చెప్పబడే ‘నేయార్థము’ అనే దోషం. ఏదో కల్పన నిమిత్తం సరిపెట్టుకోవలసినదే కాని, ‘పాలరాతితోడి కొండ’ ఒకటుండటం లోకసిద్ధమేనా? అని కవికి తోచలేదు.
పరమేశ్వరునికి సాత్త్వికభావోదయం ఎప్పుడు కలిగింది? “మదనపరవశయై యున్న పార్వతి ముఖాలంకారంబు”ను చూసినప్పుడు (5-42). ఆమె ముఖమునందు అభివ్యక్తమైన మన్మథపారవశ్యభావాన్ని కనుగొని ఆయన అంతఃకరణ ఆమెయందు సుముఖమైనదని ప్రతీయమానం. ఆ సూచన ‘అలంకారము’ అన్న ఆ బాహ్యచిహ్నంలో లేదు. రమ్యమైన ఆమె ముఖచంద్రదరహాసప్రకాశంలో మునిగి, వెన్నెలలో పాలరాతికొండ ద్రవిస్తున్నట్లుగా ఆయన శరీరమంతటా స్వేదం వెల్లివిరిసింది. అది హిమవత్పర్వతాన్ని ఆకాశగంగ కప్పివేసినట్లుగా ఊహింపబడింది. ఆ హిమవంతుడు పార్వతికి తండ్రి అని, ఆ ఆకాశగంగ పరమేశ్వరునికి భార్య అని; ఆ ఆకాశగంగ ఆయన జటాజూటంలోనిదే కదా! అని, ఆయన ఉన్నదే నీహారపర్వతసీమపైని కాగా నీహారకరాతిభాతి అన్న ప్రయోగానికి ప్రయోజనం ఏమిటని – సందేహపరంపర కలిగితే, అది రామాయణంలో పిడకలవేట వంటిదే అనుకొని, ప్రస్తుతానికి విడిచివేద్దాము.
శరీరమనే పాలరాతికొండ ఎప్పుడు పొల్పారింది? “ఆ … నీహారకరాతిభాతి”లో (సప్తమి); లేక, “ఆ … నీహారకరాతిభాతి”చే (తృతీయ) – పరమేశ్వరుని మనస్సు పారవశ్యాన్ని పొందినప్పుడు. “పరమేశ్వరుని మనస్సు సైతం పారవశ్యాన్ని పొందినప్పుడు” అన్న మాట పద్యంలో లేదు. అసలు హిమాచలాన్ని అమరాధిపవాహిని “పర్వి”, కప్పివేసినప్పుడు “పొల్పారటం” ఎందుకుంటుంది?
ఘర్మజలం పొంగినది పార్వతీముఖదర్శనపారవశ్యంలో ఉన్న పరమేశ్వరుని శరీరం నుంచి. చంద్రకాంతోరునగంబు నుంచి కాదు. చంద్రకాంతోరునగానికి ఘర్మజలోల్బణం ఉండదు. అయితే పద్యంలో, “అమలాంగశరీరతుషారదీప్తికాంతోరునగంబు సమ్మదరసోత్కటఘర్మజలంబు పర్వి” అనే ఉన్నది. సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది శరీరమనే చంద్రకాంతోరునగం నుంచి అని అన్వయం. ఈ సమాసం ‘సమ్మదరసోత్కటఘర్మజలం పర్వినది చంద్రకాంతోరునగం వంటి శరీరం నుంచి’ – అన్న సరియైన అన్వయాన్ని పరిహరిస్తున్నది. మళ్ళీ అమరాధిపవాహిని హిమనగాన్ని కప్పినట్లుగా పొల్పారినది శరీరం కాదు. శరీరమనెడి చంద్రకాంతోరునగం. ఎక్కడికక్కడ పదాలను తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అని అన్వయించుకోవాలి. అన్వయమే లేనప్పుడు అలంకారాల చర్చ నిరాధారం అవుతుంది.
శరీరము నుండి కలిగే స్వేదరూపజలోద్గమం రతి వలన, ఘర్మము (వేడి) వలన, శ్రమము (అలయిక) వలన కలుగుతుందని లక్షణం. ఇతరకారణాలు కూడా ఉన్నాయి. సమ్మద రసము అంటే ఆనందరసం. వేదాంతశాస్త్రంలోనూ, అలంకారశాస్త్రంలోనూ అది మనుష్యానందం మొదలుకొని హిరణ్యగర్భానందం వరకు గల ప్రతిబింబానందాలకు బింబభూతమైన పరబ్రహ్మము యొక్క అనుభవము వలన కలిగే ఆనందరసం. అది గ్రీష్మకాలపు తాపాతిశయం వలన కలిగే ఘర్మజలం వంటిది కాదు. అందువల్ల ‘స్వేదము’ అన్న ఆలంకారికరూఢమైన పరిభాషాపదం (స్విద్యతే అనేన అఙ్గ మితి స్వేదః – దీనిచే మేను చెమర్చుతుంది కాబట్టి స్వేదము) తప్ప జిఘర్తీతి ఘర్మః – మాడ్చివేసే వేసవికాలపు ఎండలో కారే చెమట అన్న అర్థాన్ని కలిగిన పదం అక్కడ అనుచితమే అవుతుంది. సమ్మదరసం ఉన్నప్పుడు ఘర్మజలానికి స్థానం ఉండదు. పైగా నీహారకరాతిభాతి వల్ల ఘర్మజలం అసలే ఉద్గమింపదు.
ఇక రసభావాల చిత్రణ విషయం. ఇప్పటికే లేఖ పెద్దదైనందున కేవలం సూచించి, వదిలివేయక తప్పటంలేదు. కొద్దిసేపు క్రితం (5-38)లో కావ్యనాయిక పార్వతికి స్వేదోదయాన్ని వర్ణించాడు. దాదాపు అదే రకమైన భావంతో మళ్ళీ ఇప్పుడు నాయకునికి స్వేదోదయాన్ని చెప్పాడు. అదీ మరచి, (5-45)లో మళ్ళీ వెంటనే రోమాంచము, కంపము అన్న సాత్త్వికభావాలను అపక్రమంలో నాయకుని యందు చిత్రించాడు. పార్వతికి మేను చెమర్చినప్పుడు చిత్రింపబడిన రాగాతిశయం, భావదీప్తి పరమేశ్వరునికి స్వేదోద్గమం ఒళ్ళంతా కప్పివేసినట్లుగా (ముచ్చెమటలు పట్టినట్లుగా) చిత్రింపబడటంలో ఔచిత్యం లేదని కవి ఊహింపలేదు. ఏకకావ్యంలో నాయికానాయకులు ఇద్దరికీ రూపసామ్యోదిత సాత్త్వికభావాలను కాలాంతరసంక్రమితాలుగా వర్ణించటంలో ఉన్న విసంగతి కూడా కవి దృష్టికి రాలేదు.
మాన్యమిత్రులు మన్నించాలి. ఎన్ని విధాల చూచినా ఇందులో ఉత్తరోత్తరాన్వయంతోడి స్పష్టమైన అర్థస్ఫురణ కాని, సుభగమైన రసప్రతీతి కాని కనబడటం లేదు. ప్రాచీనుడైన మహాకవి రచన కాబట్టి సరసులు నెరసులను పట్టించుకోకుండా ఎక్కడికక్కడ సరిపెట్టుకొంటూ ముందుకుపోవాలి.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి ఎ ఎస్ మూర్తి అభిప్రాయం:
02/04/2017 12:48 pm
తెలుగువాడు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసేడు(రు)
నాయం హంతి న హన్యతే గురించి ఎ ఎస్ మూర్తి అభిప్రాయం:
02/04/2017 12:41 pm
కథ బావుంది, శ్యామలరావు రావు గారి ఆఖరి వాక్యం సరదాగా అనిపించింది
గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి రమణమూర్తి అభిప్రాయం:
02/04/2017 11:44 am
Thanks Uma Kaundinya garu! The original isn’t relevant any more. 🙂
Actually, it was Tin House which published that story for the first time, I believe, as per the details on the copyright page. Anyways, I can not think of reaching that particular issue here in India… 🙂
గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి తెలుగువాడు అభిప్రాయం:
02/04/2017 11:32 am
అద్భుతంగా ఉందండి. మా తెలుగు తల్లికీ అనే పాటనీ, జయ జయ ప్రియ భారత జనయిత్రి అనే దాన్నీ, వ్యాస భాగవతాన్ని, వాల్మీకి రామాయణాన్నీ, వ్యాస భాగవతాన్నీ కూడా ఇలా తయారుచేయండి. పనిలోపనిగా కవిత్రయం రాసిన భారతాన్ని కుడా. మనకున్న జాతీయ పక్షి నెమలినీ, అలా దేశనికి సంబంధించిన మిగతా వాటినీ కూడా “దయచేసి” వె-హెక్-కిరించండి. మిగతా తెలుగువాళ్ళందరూ బా-హెక్-గా మెచ్చుకుంటారు, ఇక్కడ పాఠకులు మెచ్చుకున్నట్టే. పనిలో పనిగా ఇక్కడ వాడినట్టే, శాస్త్రి, అవధాన్లు, వెంకటేశ్వర్లు అనే బ్రహ్మణ పదాలు బాగా వాడండి. మన కుల గజ్జిని బాగా గోకవచ్చు. అప్పుడు మిగతా కులస్థులందరూ అబ్బో, ఓహో ఆహో అని మిమ్మల్ని ఆకాశనికెత్తేస్తారు. అది ఎంఅతటి గౌరవమో మళ్ళీ చెప్పక్కర్లేదు.ఇవన్నీ ఒక పుస్తకంగా వేస్తే తెలుగువాళ్లందరూ – మనం శుద్ధ వెధవాయిలం కనకే – వెకిలిగా నవ్వుకుంటూ అవన్నీ కొనుక్కుని మిమ్మల్ని నోబుల్ బహుమతికి ఎంపిక చెస్తారు. అలా వచ్చిన డబ్బులతో కోకో కోలాలు తాగుతూ ఎన్-హెక్-క్కా రిటైరైపోవచ్చు.
తమిళ తంబిల దగ్గిర ఎం.జి.ఆర్ గురించీ, అన్నా దురై గురించీ, వాళ్ళ కవి తిరునక్కరసు గురించి కూడా రాయగలరా? అది తమిళ తంబిల దగ్గిరకి తీసుకెళ్ళండి. వెళ్ళేముందు ఓ తలగడ పట్టుకెళ్ళండి కూడా. వాళ్ళు పేడ నీళ్ళు మొహం మీద జల్లి పళ్ళు రాలగొడితే కాచుకోవడానికి.
ఇదే మనకున్న దౌర్భాగ్యం. మన వాళ్లని, మన కున్న విలువల్నీ మనమే కాపాడుకోలేము. నాలుగు ఇంగ్లీషు పుస్తకాలు చదగానే మనం పోతన పురాణాన్ని అడ్డం పెట్టుకుని వెక్కిరించడానికి తయారు. సిగ్గుపడవల్సిన విషయం. మరి Jordan Bass ని Jord-AN b-ASS లా విడగొట్టుకోవచ్చు కదా? Then all capitals added together makes better words too. Yup why not?
సుప్తశిల – నాటక పుస్తకం గురించి k dada kalandar అభిప్రాయం:
02/04/2017 4:01 am
i want to download all e books. but it not open at least to read. please check it once and give as PDF file as early as possible.
నాకు నచ్చిన పద్యం: నన్నెచోడుని వర్ష విన్యాసం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
02/03/2017 12:04 pm
మొదటి సంగతి: ‘అనుక్త మన్యతో గ్రాహ్యమ్’ అన్నట్లు కాళిదాస కుమారసంభవాన్ని ముందుంచుకొని చదివితే గాని ఈ పద్యార్థం బోధపడదు. కాళిదాసు వర్ణించినది పార్వతీ మనోజ్ఞతనువుపై చిలికిన తొలకరి జలకణాల స్థితిగతులను. ఆ కల్పనలోని సౌందర్యాతిశయం, అభినవత్వం, భావధ్వని, ప్రతిపదాన్ని ఆచితూచి ఎన్నుకొన్నప్పటి పరికరాలంకారపు దివ్యశోభ – వ్యాఖ్యాతల మనస్సులనే గాక మహాలంకారికుల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ గంభీరిమను వివరించేందుకు దానిపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు వెలిశాయి. అనర్ఘమైన శ్లోకం అది.
తెలుగు కవి రూపిస్తున్నది అడరు నవాంబుధారలను. అంటే, వర్షర్తువేళ క్రమక్రమంగా విజృంభిస్తున్న నవాంబుధారల స్వస్థితిని. ఎంత నవంనవములైనప్పటికీ అతిశయిస్తున్నవి అంబువుల “ధారలు” కనుకనే అవి జటాటవిలో “విభ్రమించటం” (తిరుగుళ్ళు పడటం) సంభవించింది. తొలుకారు నాటి నీటిచుక్కలైతే జటాటవిలో విభ్రమించే అవకాశమే ఉండేది కాదు. బిందువులకు విభ్రమించటం ఉండదు. జలధారలు కాబట్టే విభ్రమణాన్ని పొందాయి. ఎట్లా పొందాయి? అంటే, పరమేశ్వరుని వలె పార్వతీదేవి కూడా కేశపాశాన్ని కపర్దజటాజూటోపమంగా బంధించి ఉన్నందువల్ల ఆ మహాజటాటవిలో అంబుధారలు చిక్కుకొని కేశావర్తాల వెంబడిని తిరుగుళ్ళుపడవలసివచ్చిందని భావం. దట్టమైన చుట్టుకురులకోసం పాపం పార్వతికి సైతం జటాటవిని కల్పింపవలసివచ్చింది. అంతకు ముందు పద్యంలోనే (6-108) పార్వతి అందమైన జడలపై తొలకరి నీటిబిందువులు ముత్యాల సేసల వలె మనోహరంగా ఉండటాన్ని వర్ణించాడు. అంతలోనే ఆ సంగతిని మర్చిపోయి, లేనిపోని జటాటవిని తెచ్చిపెట్టుకోవటం వల్ల – ఆ జటాటవిలో విభ్రమింపవలసివచ్చిన “అడరు నవాంబుధార”లను తెచ్చిపెట్టుకొని తబ్బిబ్బయ్యాడు. అంతకు క్రితమే నెఱిజడలతో ఉన్న పార్వతీదేవి అంతలోనే వేణీబంధకపర్దిని అయినప్పటికీ, అది సమున్నద్ధశిఖండకం కాక, ఆవర్తాకారంలో కుంభీబంధసంయుక్తమై సముల్లేఖ్యంగా ఉన్నప్పటికీ – దానికి జటాటవితో తాద్రూప్యం సరికాదని చూసుకోలేదు. అననురూపమైన ఆ జటాటవిలో వర్షానవాంబుధారలు విభ్రమిస్తుండటం పార్వతీ కేశవర్ణనకు శోభాహేతువు కాదని కవి గ్రహింపలేదు.
అంబుధారలు “వెల్వడి, చనుదెంచి” అంటే, పార్వతీజటాటవిలో విభ్రమించి విభ్రమించి, అక్కడినుంచి బైటపడి వచ్చి – అన్నమాట. “వెల్వడి” అంటే సరిపోయేది. “వెల్వడి, చనుదెంచటం” ఎందుకు? వెల్వడిన తర్వాత ఎక్కడికి చనుదెంచినట్లు? పోనీ, ఫాలాగ్రసీమకో ఎక్కడికో అక్కడికి చనుదెంచిన తర్వాత, “రాలుగొనటం” ఎట్లా సాధ్యమైంది? ‘రాలుగొను’ అన్న ఆ విచిత్రమైన ధాత్వర్థానికి కవి అనుకొన్న భావం ఏమిటో కవికే తెలియాలి. ఎంత సూర్యరాయ నిఘంటువు సర్దిచెప్పినా, ‘గళితమై, క్రిందికి జాఱి’ అన్న అర్థంలో ‘రాలు’ ధాతువుపై క్త్వార్థకమైన ‘కొను’ ధాతువు చేరి ‘రాలుగొని’ అని స్వార్థంలో రూపం ఎట్లా ఏర్పడుతుంది? నీళ్ళకు ‘రాలటం’ ఉండదు కనుక జలధారలకు ‘రాలుగొను’ అన్న భావార్థక స్వతంత్రక్రియాకల్పన సార్థకం కాదు. ఆముక్తమాల్యద (4-82) లో “నవమేఘపృథుకములకు రాలె నొయ్యన వడగండ్లు పాలపండ్లు” అన్నప్పుడు అక్కడ శిశువులకు పండ్లు రాలటమూ ఉన్నది; మేఘాల నుంచి వడగండ్లు రాలటమూ ఉన్నది. అది సార్థకమైన ప్రయోగం. ప్రకృతపద్యంలోని నీటిధారలు ‘రాలుగొనటం’ వ్యర్థకల్పితమని గ్రహించాలి. అందుకే దానికి ప్రయోగాంతరాలు దొరకవు.
కేశబంధం నుంచి (ఫాలస్థలికి కాబోలు) వెల్వడి, (అక్కడినుంచి) చనుదెంచి, రాలుగొంటూ – అంటే, రాలుకుంటూ (క్రిందికి జారుతూ) వచ్చిన జలధారలు కనురెప్పలపై పడి, ఆ పక్ష్మములు (కనురెప్పలు) పక్ష్మలములు (దట్టమైన వెంట్రుకలు కలవి) కావటంవల్ల “వెడ నిల్చి” = కొద్దిసేపు నిలిచిపోయాయన్నమాట. నిలిచినవి ప్రథమోదబిందువులు కాదని, అడరు నవాంబు“ధార”లని అంతలోనే కవి మర్చిపోయాడు. కాళిదాసు వర్ణనలో “ఉదబిందువు-లు” అని బహువచనం ఉన్నది కాబట్టి వాటికి అవిరళత్వం చెప్పబడిన మాట నిజమే. ఎంత అవిరళములైనా, అవి నీటిచుక్కలు. “అడరు నవాంబుధారలు” కావు. ఎంత దట్టమైన కనురెప్ప అయినా, ప్రథమోదబిందువులకు వలె అంబు“ధార”లకు ఆ రెప్పపై నిలుకడ ఎలా సాధ్యమని తెలుగు కవికి తోచలేదు. ‘స్థితాః క్షణం పక్ష్మసు’ అన్నది ‘పక్ష్మములన్ వెడ నిల్చి’ అని తెలుగయింది కాని, అది ఉదబిందువులకు అనువర్తించినట్లుగా అంబుధారలకు వర్తింపదు. “ధార” అన్న తర్వాత, అవిచ్ఛిన్నగతి మూలాన “నిలుకడ”కు వీలుండదు కదా.
‘తాడితాధరాః’ అన్న కర్మవాక్యం తెలుగులో ‘మోవిపై పడి’ అయింది. మోవిపై పడిన ధారలు ఏమైనాయో తెలుగు కవి చెప్పకపోవటం వల్ల – క్రిందిపెదవి యొక్క స్వాభావికమృదుత్వం వ్యంజింపబడిన సంగతి శ్లోకాన్ని చదవనివాళ్ళకు తెలియదు. అధ్యాహారవిషయస్ఫురణ కలుగదు. పయోధరముల ఉత్సేధం (ఉన్నతి, కాఠిన్యము), వాటిపై ఉదబిందువుల నిపాతం, తత్ఫలితంగా ఉదబిందువులు చూర్ణితాలు కావటం అన్న కాళిదాసు శ్లోకంలోని అద్భుతావహమైన పరిణామక్రమమంతా తెలుగులో “మోవిపైఁ బడి”, “కుచఘట్టనన్” అన్న కరుకు మాటలతో కుప్పకూలిపోయింది. ఆ కుచఘట్టన వలన – అంటే, స్తనములతోడి ఒరపిడి వలన ఆ అంబుధారలు చెదరి = చెల్లాచెదరై(నందువల్ల); పాఱి = పరువులెత్తి లేదా పునఃప్రవాహగతిని పొంది; రయంబునన్ = వేగంగా (?); ముత్తరంగలన్ = మూడు వళులనెడి విషమరేఖలయందు (తత్తన్మధ్యములందు); మడుగులువాఱి = నిమ్నోన్నతములందు చిక్కినవైనందున మడుగులు కట్టి (?) – అని భావం. ఒక్క వాక్యశకలంలో ఇన్ని అన్వయింపని వ్యర్థపదాలెందుకు?
కొందరు విమర్శకులు “నాభికిన్ + ఎడము + ఆనక + చొచ్చెను” అని పదచ్ఛేదం చేయటం సరికాదు. ఆ పక్షాన యతిభంగం. కొందరు వ్యాఖ్యాతలు “నాభికిన్ + ఎడ + మానక = చోటువిడువక” అని వ్రాసిన అర్థం కూడా సరిపడదు. నాభికి చోటువిడువకపోవటం ఏమిటి? దానికి ‘స్తనముల రాపుచే చెదరి, ప్రవహించి, మూడు వళులందు మడుగులుగా నయి, నాభియందు సంపూర్ణముగా ప్రవేశించెను’ – అని ముద్రితప్రతులలో ఉన్న తాత్పర్యం ఎట్లా సరిపడుతుంది? ‘మడుగు కట్టిన నీటికి’ అన్న అర్థంలో ‘మడుగులు వాఱటం’ అన్న క్రియారూపం ఎట్లా ఏర్పడుతుంది? “మడుగులుగా” అయిన తర్వాత, మళ్ళీ పాఱే ప్రవాహగతి ఎట్లా సిద్ధిస్తుంది? “చోటు విడువక”, “సంపూర్ణముగా ప్రవేశించటం” ఏమిటి? ఇన్ని వ్యర్థపదాలకు అర్థం ఎట్లా పొందుపడుతుంది?
అక్కడ నిజానికి, “నాభి + కెడ + మానక” అని చదువుకోవాలి. “కెడ” అంటే పార్శ్వసంగతి. “చెదరి తోఁ బఱతెంచు చెందమ్మిఱేకులు గెడగొని మొగుపుఁ గెంగేలు గాఁగ” అని కుమారసంభవం (9-72) లోనిదే మరొక ప్రయోగం. జలధారలు వళుల వద్ద మడుగులు కట్టి ఆగిపోక, నాభి వైపునకు సైతం పరువులువారటం మానక – అని కవిహృదయం.
నీటిచుక్కల నాభీప్రవేశాన్ని అభివర్ణించటం నాభియొక్క లోతును సూచించటానికి – అన్నది భావ్యమే. వళులలోనికి జారిన ఉదబిందువులు “చిరేణ” = నెమ్మది నెమ్మదిగా పొక్కిలిని చేరాయని మాత్రమే కాళిదాసు. “మానక చొచ్చెను” అన్నప్పుడు అంబుధారల ప్రవాహగతి అవిచ్ఛిన్నంగా కొనసాగి, శ్లోకభావం భగ్నమైపోయింది. ‘చేరెను’ అనక, “చొచ్చెను” అన్నందువల్ల, అంబుధారలు నాభిలోనికి ప్రవేశించి అంతర్ధానమైపోయినట్లు ఊహింపవలసివస్తుంది. అది నాభియొక్క ప్రకరణోచితమైన గంభీరిమకు తగని పదసంగతి. ఆ విధంగా జటారణ్యంలోనుంచి వెలువడి, చనుదెంచి, రాలుగొని, దట్టమైన కనురెప్పలపైని ఆగి, కుచఘట్టన మూలాన చెల్లాచెదరైన నవాంబుధారలు వళుల వద్ద మడుగులు కట్టి, ఆ మడుగులు మళ్ళీ ప్రవాహగతిని మానక నాభికి అభిముఖంగా పరుగులుతీసి, ఆ నాభియందు చొరబడటం ప్రకృతిసహజం కాదని, కవితాత్మకం అసలే కాదని, నాయికాసౌందర్యవర్ణనలో అనౌచిత్యాపాదకమని కవికి తోచలేదు.
అద్భుతావహమైన కాళిదాసు శ్లోకానికి అసమర్థమైన అనువాదం ఇది. ఇందులో ఏ అలంకారమూ లేదు. శ్లేష అసలే పొందుపడదు. స్వభావోక్తికి తావులేదు. పరికరం పద్యం మొదట్లోనే భగ్నమైపోయింది.
పెద్దలు ఈ మాటను అంటున్నందుకు మన్నించాలి. పూర్వకవుల పద్యాలలో ఈ విధంగా ఇన్ని సరిపెట్టుకోవలసిన అన్వయదోషాలు కనబడేది మచ్చుకు ఒకటి కూడా ఉండదు.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు