గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!
“చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”
“మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?”
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారూ, లైబ్నిజ్ పేరిట ఉన్న పురస్కారాల గురించి నాకు తెలియని వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఒక్క విషయం: బ్రతుకుతెరువు కోసం లైబ్నిజ్ నానా కష్టాలు పడ్డట్లు నేను వర్ణిస్తే అది నాతప్పే. జీవితాంతమూ రాజుల పంచన బ్రతికిన లైబ్నిజ్ జీవనోపాధికి రాజుల వంశ చరిత్ర రాయవలసి వచ్చినా, బ్రతుకు బాగానే గడిచింది.
బెర్ట్రాండ్ రస్సెల్ ఎత్తుకోవడమే లైబ్నిజ్ సార్వజనిక జీనియసే కాని స్పినోజా లాగా ఉదాత్తమైన జీవితం గడిపిన వాడు కాదని ఎద్దేవా చేశాడు! లైబ్నిజ్ చనిపోయినప్పుడు సంక్రమించిన ఆస్తి చూసి మేనల్లుడి భార్య తన్మయంతో మూర్ఛపోయిందట. ఆసక్తి కలవాళ్ళు “The Courtier and the Heretic: Leibnitz, Spinoza, and the Fate of God in the Modern World,” by Matthew Stewart చదవచ్చు.
రాజాశంకర్ గారూ, నిజం చెప్పాలంటే, ఈ వ్యాసం తలపెట్టేముందర నాకూ లైబ్నిజ్ గురించి తెలిసింది చాలా తక్కువ. వ్యాసం పంపే గడువు దాటిపోయిందని ఓ రోజు పనికి సెలవు పెడితే, తోటి పనివాళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నావా? అన్నారు. లేదు, లైబ్నిజ్ మీద వ్యాసం పూర్తిచెయ్యాలి, గడువు దాటిపోయిందన్నాను. లైబ్నిజ్ ఎవరు? ఆయనకూ కంప్యూటర్లకూ సంబంధమేమిటి? ఇంగ్లీషులోకి అనువదిస్తే మేమూ చదువుతామే అన్నారు. సైన్సు వాళ్ళకి ముందుచూపే కాని వెనుకచూపు తక్కువ.
మీరన్న (నేనూ అలా స్ఫురించి ఉండొచ్చు) – 12వ శతాబ్దం తర్వాత, అంటే భాస్కరుడి తర్వాత, మన దేశంలతోమధ్య యుగాల్లో చెప్పుకోదగ్గ గణిత శాస్త్రవేత్తలు రాలేదు, అన్నదాన్ని సవరించాలి. అంత పెద్ద దేశంలో కనీసం ఒక మూలన, కేరళలో, గొప్పవాళ్ళు కొందరుద్భవించారు. వాళ్ళలో మాధవుడు (1340-1425) చెప్పుకోదగ్గవాడు. కలన గణితానికి న్యూటన్ కన్నా, లైబ్నిజ్ కన్నా రెండు మూడు వందల ఏళ్ళ ముందరే బీజాలు వేశాడు. అయితే అవి వెలుగులోకి రాలేదు. అమర్త్య కుమార్ దత్త రాసిన Mathematics in Ancient India వ్యాసాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి..
లక్ష్మన్న గారు తెలుగులో సైన్సుకి సంబంధించిన నవలలు, కథలు తక్కువన్నారు. నిజమే. సైన్సు, సాహిత్యం కలవకుండా మన సైంటిస్టులూ సాహితీకారులూ తగిన శ్రద్ధ తీసుకుంటారనిపిస్తుంది. “ఆమె కన్నులలో ననంతాంబరంపు నీలినీడలు కలవు,” అంటే ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకొని ప్రేమిస్తుందనుకుంటాం కాని, “విపర్య సిద్ధాంతాన్నెరిగిన మిలమిల లాడే కన్నులు గలదానా, ఈ సంఖ్య ఏదో చెప్పగలవా?” అంటే భ్రుకుటి ముడి వేస్తుందని మనకి భయం. అయితే ఆర్యభట్టు బీజగణితం లోని విపర్యం గురించి అలాగే బోధిస్తాడు. “ఎక్కడ బయలుదేరాం మనం? కడ కెక్కడ చేరాం మనం?” అన్నాడు బైరాగి.
అలాగని అసలు సైన్సు ప్రస్తావనే లేదనను. వాస్తవానికి నా వ్యాసాన్ని ముందర ఇలా మొదలెట్టాను:
“తెలుగు సాహితీవేత్తల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు రాసిన ఉత్తమ నవల “అతడు-ఆమె.” ఆ నవల మూడో భాగం లో శాంతం గారి అమ్మాయి సుభకి ఇంట్లో అమ్మా నాన్నలిద్దరూ రాజకీయాల్లో ఉండటాన ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ప్రేమలోపడే వయసు కూడాను. అవి క్విట్టిండియా ఉద్యమరోజులు. అమరవీరులనందరినీ స్మరించుకుంటూ, తనుగూడా మద్రాసులో మెరికల్లాంటి నలుగురు తెలుగు అమ్మాయిలని తీసుకొని అహింసాయుతంగా తెల్లవాణ్ణి భయపెట్టి పారద్రోలే సాహసమేదన్నా చెయ్యాలనే కోరిక సుభకి గాఢంగా కలుగుతుంది. మనుషులెవరూ లేనప్పుడు ఏదన్నా వంతెనని పేల్చేయ్యాలని నిర్ణయించుకుంటుంది.
వంతెనని పేల్చడమంటే మాటలా? దానికి కావాల్సిన ప్రేలుడు మందు సేకరించడానికి, సివిలింజనీరయిన జనార్దనాన్ని పాత వంతెనలు కూల్చి కొత్తవాటిని ఎలా కడతారు? అని నర్మగర్భంగా అడుగుతుంది. సుభని ప్రేమిస్తున్న జనార్దనం, తన పని గురించి ఆవిడ అన్ని వివరాలు అడుగుతున్నందుకు పొంగిపోయి, వివరాలు చెప్తాడు. కాని పెద్ద పెద్ద కాంగ్రెసు నాయకులు తమ కూతుర్ని వారాలు చెప్పుకొని పైకొచ్చి గవర్నమెంటుద్యోగం చేసుకునే తనకిస్తారా అని సందేహిస్తాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, తన బ్రిడ్జీలున్నాయని సరిపుచ్చుకుంటాడు. ఓ వర్తుల పరిధి లేని డెక్ వైశాల్యం ఎలా కనుక్కోవాలా అని, ఓ క్షణం పాటు తెలియక తికమకపడి, ప్రేమలో పడి మరిచిపోయాను గాని, ఏముంది, సింప్సన్స్ ఫార్ములా పెట్టి కొట్టడమే అని వెంటనే తేరుకుంటాడు.
“జామెట్రీ కాలెక్యులస్ / అక్కయ్యకి రెండో కానుపు / తమ్ముడికి మోకాలివాపు / … / గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యల” నుండి దూరంగా “ఒకరి నడుం ఒకరు చుట్టి / ఉల్లాసంగా తిరుగుదాం,” స్వేచ్ఛగా విహరిద్దాం అన్న కవులున్నారు కాని, ప్రేమ ఫలించకపోతేనేమాయె, నా వంతెనలూ, నా కాలెక్యులస్ ఫార్ములాలు ఉన్నాయన్న కథానాయకులు అరుదు. ఏకంగా ఇంటెగ్రల్ కాలెక్యులస్కి ఓ పేజీ కేటాయించిన సాహితీ రచన బహుశా మన భాషలోనూ మరే భాషలోనూ కూడా లేదనుకుంటాను.”
వ్యాసం దారి తప్పుతుందేమోనని తొలగించాల్సొచ్చింది. ఈ అభిప్రాయం నా వ్యాసంలాగే చాంతాడంతయింది. ఇక ముగిస్తాను.
KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.
“అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణసోమా!
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!
…
చెప్పొచ్చిందేమిటంటే
చెప్పడనికేమీ లేదని!
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం.
ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?
అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఎమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో
నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:
“పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావుకదూ నువ్వు?”
అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.
సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.
భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది – ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది – దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)
సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు – “Myths about Gravity and Tides” – చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:
“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
మనోహరమైన సంగీతం వినిపిస్తూ
ప్రయాణించు శశీ ప్రయాణించు.
…
ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలిదాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే.”
బళ్ళో చదువుకున్న రోజులు, కాలేజీ రోజులు, బోంబే ఉద్యోగపు రోజులూ గుర్తొచ్చాయి.
రెండు మూడేళ్ళ కొకసారి మాఊరు, రావినూతల, వెళ్ళినప్పుడల్లా మాహైస్కూలు కెళ్తాను. పాతవిద్యార్థి వచ్చాడని సంతోషంతో మాష్టార్లు పిల్లల్తో బయట సమావేశం ఏర్పాటుచేసి నన్ను ప్రసంగించమంటారు.
క్రింద కూర్చున్న పిల్లలని చూస్తే నా చిన్నతనం గుర్తొచ్చి, రెండు తేడాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి:
ఒకటి అల్పమయింది: ఇప్పుడు దాదాపు పిల్లలందరూ చెప్పులేసుకొని ఉన్నారు. అప్పట్లో చెప్పులేసుకొని వచ్చేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు.
రెండోది అతిముఖ్యమయింది: ఇప్పుడ సగంమంది విద్యార్థులు అమ్మాయిలు. అప్పట్లో పైతరగతులకి వెళ్ళే కొలదీ అమ్మాయిలు పలచబడేవాళ్ళు.
ఇంజనీరింగ్ కాలేజీలోనయితే కొన్ని సీనియర్ల బ్యాచ్ లలో అసలు అమ్మాయిలే లేరు! రోజులు మారాయి. కట్నకానుకలు, లాంఛనాలలో మాత్రం పెద్దగా మార్పు లేదు.
దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి ఉద్యోగం కోసం బోంబే వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మహా నగరంలో జీవితం తలుచుకొని భయమేసింది – అప్పటిదాకా పల్లెటూరునీ హాస్టళ్ళనీ దాటి బయటక ఉండకపోవడాన. పాత కాలేజీమిత్రులుంటారని IIT కెళ్తే కొందరు కొత్త మిత్రులయ్యారు, తర్వాత సహోద్యోగులయ్యారు – హంస, OVG, నరసింహ – ఫిజిక్సు వాళ్ళు, ఎప్పుడూ పగలబడి నవ్వేవాళ్ళు. వాళ్ళ బృందంలో TIFRలో PhD చేస్తున్న లక్ష్మన్న గూడా ఒకరు. TIFR తీసుకెళ్ళేవాళ్ళు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, బ్రహ్మాండమైన మెస్సు! ఒకవైపు Indian Breakfast మరోవైపు Western Breakfast అని చెప్పేవాళ్ళు – Corn Flakes ని వర్ణించేవాళ్ళు.
ఇలా రాస్తుంటే, నా కాలేజీ మిత్రుడు, కన్నెగంటి చంద్ర రాసిన ”జ్ఞాపకం చాలు నాకు” గుర్తొస్తోంది:
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు కేవలం ఆసక్తితో కంప్యూటర్ భాషలు నేర్చుకున్నారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే! ముందు ముందు అవసరం కలిగినప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో నేను చదవదగ్గ పుస్తకాల పేర్లివ్వలేదు. నాకు అమితంగా నచ్చిన పుస్తకాలు రెండు:
1. కంప్యూటింగ్ పూర్వాపరాలకు సంబంధించి Martin Davis రాసిన “The Universal Computer: The Road from Leibniz to Turing.”. గత యాభై అరవై ఏళ్ళలో కంప్యూటర్లు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందాయి. అందుకు అభినందించాల్సింది నిస్సందేహంగా కంప్యూటర్ ఇంజనీర్లనే. కాని అప్పటి హాలునిండే కంప్యూటర్ల నుండి ఇవాళ్టి సెల్ ఫోనూ, లాప్ టాపూ, సూపర్ కంప్యుటర్ దాకా, అన్నిటికీ ఆధారం ఒకేరకమైన మూలసూత్రాలే! వాటిని కనుక్కోడానికి మూడొందల సంవత్సరాలు పట్టింది. ఆ సూత్రాలని కనుగొన్న వాళ్ళు ముఖ్యంగా ఇంజనీర్లు కాదు, తార్కికులు! వాళ్ళ జీవిత కథల్నీ, ఆలోచనలనీ కలిపి రాసిన పుస్తకం ఇది. దీనిలో వట్టి కథలయినా ఉత్కంఠతో చదివిస్తాయి. వాళ్ళ ఆలోచనలని అర్థం చేసుకుంటే కంప్యుటర్ లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది; అమూర్తపుటాలోచన (abstract thought) మీద గౌరవం పెరుగుతుంది.
2. సాధ్యాసాధ్యాల గురించి David Harel రాసిన “Computers Ltd. What They Really Can’t Do,” చదవదగ్గది. 1984లో TIME పత్రికలో వచ్చిన ఒక కవర్ స్టోరీ లో్ “కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో సాధ్యం కానిది లేదు,” అన్నది చదివి, సామాన్య ప్రజానీకంలో ఉన్న అపోహలని తొలగించడానికి రాసిన పుస్తకం.
వీళ్ళిద్దరూ లెక్కలు, కంప్యూటర్ సైన్సుల్లో ప్రపంచప్రసిద్ధిగాంచిన ప్రొఫెసర్లూ, శాస్త్రవేత్తలూ. “మనకున్న విజ్ఞానాన్ని కాస్తో కూస్తో సామాన్య జనానికి చేరువగా తీసుకొచ్చి అజ్ఞానపు చీకటిని తొలగించడం మన బాధ్యత,” అనే ఆలోచన పాశ్చాత్య శాస్త్రవేత్తల్లో అతిసామాన్యం గానూ, మన “పుణ్యభూమి”లో పుట్టిన శాస్త్రవేత్తల్లో అపురూపంగానూ కనిపించడం విశేషం.
నేను ఉహా(కాల్పనిక)రచనలు గా పేర్కొన్నవి మనం ఎన్నో ఏళ్ళుగా ఆదరిస్తూ వచ్చిన జానపద కధలు, భేతాళ కధలు, తాంత్రిక కధలు వగైరాలు.
ఇకపోతే, ప్రత్యక్షముగా ఒక ప్రాంత ప్రజలతో గడపకపోయినా, ఎందరో పాశ్చాత్యులు మన భాషని, సంస్కృతిని అర్ధం చేసుకొని మనకు సంబంధిత గ్రంధాలెన్నో రచించారు, అనువదించారు. నాకు తెలిసి బుద్ధుడు, బౌద్దమతం, తాంత్రిక బౌద్దం పైన మన వాళ్ళ పుస్తకాలకంటే, విదేశీయులు రాసినవే ఎక్కువ.
ఇకపోతే, సి.పి.బ్రౌన్ గారు తన నిఘంటువులో ఉదహరించిన ప్రతి పదం యొక్క ప్రయోగం ప్రత్యక్షంగా చూసి ఉంటాడంటారా? ఆయన సంగ్రహ పరచిన సామెతలు అంతే. ఆయన చదివిన ఇతర పుస్తకాల ప్రభావం ఉండదంటారా? ఇది మరో పద్ధతి, మనకు తెలియని విషయాలపై పరిశోధించి రాయటంలో.
ఇంకాస్త మీరన్నదానికి దగ్గరగా ఉండే ఉదాహరణలంటే, అంగారకుడి మీద జీవం ఉండొచ్చు అన్న విషయాన్ని తీసుకొని గ్రహాంతరవాసులపై కోకొల్లలుగా వచ్చిన రచనలు, సినిమాలు. చాలా వరకు ప్రాచుర్యం పొందాయి. ఎవరు చూసారు అక్కడి మనుషులు, వాళ్ళ వేషభాషలు (అసలంటూ ఉనా కూడా)?
“డబ్బు ( money) ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల కలిగే అనుభవమే సుఖం ఇది … “మ్లేఛ్ఛభావన” … పాశ్చాత్యభావన.
నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది; … ఇదీ సనాతనమైన భారతీయ భావన.”
పుట్టుకతోనే నిర్ణయించిన పనిని చెయ్యడం మన ధర్మం. కాదంటే అది నేరం, పాపం. అదీ కొన్ని వందల ఏళ్ళగా భారతీయ సామాజిక జీవిత వాస్తవం. దాని ఫలితంగా కళ్ళముందే ఉన్న కఠోర జీవితాన్ని కాస్తయినా గ్రహించకుండా , “ఓహో, జీవితం గురించి ఎంత సనాతనమైన గొప్ప భావన మనది,” అని రాస్తే నమ్మేదెవరు? నిజ జీవితాలకి కాస్తన్నా విలువనిచ్చేవాళ్ళు మాత్రం కాదు. తగుదునమ్మా అని పాశ్చాత్య చింతన గురించి కించిత్ అవగాహన గూడా లేని పోలికలతో బడాయిలు!
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను – పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది – ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.
ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.
కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.
నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ. కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.
ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.
కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు – కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.
“విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!
సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ, అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.
దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.
చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.
శ్రీనివాస్ గారిచ్చిన స్త్రీల, పేదల, రోగుల గురించి రాయడానికి సంబంధించిన పోలిక ఈ సందర్భంలో సమంజసంగా లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది. అమెరికా జీవితం గురించి అలాంటి ప్రత్యక్షానుభవం అమెరికాలో ఉంటే తప్ప అసాధ్యం.
“ఇంటర్నెట్ తోనూ, ఈమాట తోనూ, ఇరవై నాలుగ్గంటలూ ప్రసారమయ్యే టీవీ షోల తోనూ వేరే వాళ్ళ జీవితం గురించి తెలుసుకోలేమా? సృజనాత్మక సాహిత్యం సృష్టించలేమా?” అంటే ఎక్కడో కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి: సాహిత్యం జీవితవృక్షాన పూసే పువ్వు అనే ఉపమానం వాస్తవమనుకుంటే, సాహిత్యాన్నించి సాహిత్యం పుట్టడం, పువ్వునుంచి పువ్వు పుట్టడం లాంటిది – అసంభవం.
అసాధ్యం, అసంభవం అన్నవి పెద్ద మాటలనుకోండి. ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.
కాని లక్ష్మన్న గారితో నేను కొంతవరకే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నివాసాంధ్రులు ఎన్నిసార్లు ఇక్కడకొచ్చి వెళ్ళినా అమెరికాలోని తెలుగు జీవితం అర్థంచేసుకోలేరన్నారు. జీవితం, తెలుగు వాళ్ళదే అయినా, చాలా విశాలమయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకయినా అది అర్థమయ్యేది అసంపూర్తిగానే.
రెండు మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చినవాళ్ళు, తాము చూసి అనుభవించినంతలో అర్థం చేసుకొని రచనలు చెయ్యొచ్చు.
మొన్నో కథ చదివాను: అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా – మీగడలతో భోజనం, తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం – చేసుకుంటున్నారో, ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి, ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు.
అలాంటి కథలు విలువయినవే; నిజానికి చుట్టపుచూపుగా వచ్చిన నివాసాంధ్రులే అవి మిన్నగా రాయగలరేమోమో. అవి చదివి, అక్కడ కంటే ఇక్కడే మన సంస్కృతి గురించి ఎక్కువ పట్టించుకుంటూన్నామని సంబరపడొచ్చు; లేదా, పెరిగిన ఆర్థిక స్తోమతుతో పాటు పెరగకూడనవేవో మనలో పెరుగుతున్నాయని విచారించనూ వచ్చు – చదివే వారి దృష్టిని బట్టి.
అక్షరం పరమం పదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/02/2008 9:04 pm
సంద్రాలూ, శ్రీఫాంట్లూ
గలగల పారే గోదారిలా సవ్వడి చేస్తూ సాగిన సంద్రాలు సంభాషణల్లో నుండి హఠాత్తుగా ఫ్లాపీలూ, సీడీలూ, పిడియఫ్ ల గందరగోళంలో పడి సజీవంగా సాగుతున్న కథ కాస్తా నిర్జీవమైన సాంకేతిక వ్యాసంగా మారిపోయింది!
“చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా బట్టీపట్టిన గీతం పాడుకోవాలనిపిస్తోంది. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు, … చక్రవర్తి అశోకుడేడీ, … జగద్గురు శంకరుండేడీ”. నిరుడుకురిసిన హిమ సమూహములని వదిలిపెట్టి, పద పదమంటూ ముందుకు తోసుకుపోయాడు శ్రీశ్రీ మరోప్రపంచానికి.”
“మహాప్రస్థానం” ముందో “ఏవి తల్లీ!” ముందో నాకు గుర్తు లేదు కాని,
“చక్రవర్తి అశోకుడెచ్చట?
జగద్గురు శంకరుండెచ్చట?
ఏవి తల్లీ! నిరుడు కురిసిన
హిమ సమూహములు?”
మాత్రం కలకాలం నిలిచే కవిత.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్నిట్జ్ స్వప్నం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
04/27/2008 10:29 am
ఫిలాసఫీ, సైన్సూ, సాహిత్యం
నా వ్యాసాలని మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారూ, లైబ్నిజ్ పేరిట ఉన్న పురస్కారాల గురించి నాకు తెలియని వివరాలు తెలిపినందుకు కృతజ్ఞతలు. ఒక్క విషయం: బ్రతుకుతెరువు కోసం లైబ్నిజ్ నానా కష్టాలు పడ్డట్లు నేను వర్ణిస్తే అది నాతప్పే. జీవితాంతమూ రాజుల పంచన బ్రతికిన లైబ్నిజ్ జీవనోపాధికి రాజుల వంశ చరిత్ర రాయవలసి వచ్చినా, బ్రతుకు బాగానే గడిచింది.
బెర్ట్రాండ్ రస్సెల్ ఎత్తుకోవడమే లైబ్నిజ్ సార్వజనిక జీనియసే కాని స్పినోజా లాగా ఉదాత్తమైన జీవితం గడిపిన వాడు కాదని ఎద్దేవా చేశాడు! లైబ్నిజ్ చనిపోయినప్పుడు సంక్రమించిన ఆస్తి చూసి మేనల్లుడి భార్య తన్మయంతో మూర్ఛపోయిందట. ఆసక్తి కలవాళ్ళు “The Courtier and the Heretic: Leibnitz, Spinoza, and the Fate of God in the Modern World,” by Matthew Stewart చదవచ్చు.
రాజాశంకర్ గారూ, నిజం చెప్పాలంటే, ఈ వ్యాసం తలపెట్టేముందర నాకూ లైబ్నిజ్ గురించి తెలిసింది చాలా తక్కువ. వ్యాసం పంపే గడువు దాటిపోయిందని ఓ రోజు పనికి సెలవు పెడితే, తోటి పనివాళ్ళు ఎక్కడికన్నా వెళుతున్నావా? అన్నారు. లేదు, లైబ్నిజ్ మీద వ్యాసం పూర్తిచెయ్యాలి, గడువు దాటిపోయిందన్నాను. లైబ్నిజ్ ఎవరు? ఆయనకూ కంప్యూటర్లకూ సంబంధమేమిటి? ఇంగ్లీషులోకి అనువదిస్తే మేమూ చదువుతామే అన్నారు. సైన్సు వాళ్ళకి ముందుచూపే కాని వెనుకచూపు తక్కువ.
మీరన్న (నేనూ అలా స్ఫురించి ఉండొచ్చు) – 12వ శతాబ్దం తర్వాత, అంటే భాస్కరుడి తర్వాత, మన దేశంలతోమధ్య యుగాల్లో చెప్పుకోదగ్గ గణిత శాస్త్రవేత్తలు రాలేదు, అన్నదాన్ని సవరించాలి. అంత పెద్ద దేశంలో కనీసం ఒక మూలన, కేరళలో, గొప్పవాళ్ళు కొందరుద్భవించారు. వాళ్ళలో మాధవుడు (1340-1425) చెప్పుకోదగ్గవాడు. కలన గణితానికి న్యూటన్ కన్నా, లైబ్నిజ్ కన్నా రెండు మూడు వందల ఏళ్ళ ముందరే బీజాలు వేశాడు. అయితే అవి వెలుగులోకి రాలేదు. అమర్త్య కుమార్ దత్త రాసిన Mathematics in Ancient India వ్యాసాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి..
లక్ష్మన్న గారు తెలుగులో సైన్సుకి సంబంధించిన నవలలు, కథలు తక్కువన్నారు. నిజమే. సైన్సు, సాహిత్యం కలవకుండా మన సైంటిస్టులూ సాహితీకారులూ తగిన శ్రద్ధ తీసుకుంటారనిపిస్తుంది. “ఆమె కన్నులలో ననంతాంబరంపు నీలినీడలు కలవు,” అంటే ఆమె ముసిముసి నవ్వులు నవ్వుకొని ప్రేమిస్తుందనుకుంటాం కాని, “విపర్య సిద్ధాంతాన్నెరిగిన మిలమిల లాడే కన్నులు గలదానా, ఈ సంఖ్య ఏదో చెప్పగలవా?” అంటే భ్రుకుటి ముడి వేస్తుందని మనకి భయం. అయితే ఆర్యభట్టు బీజగణితం లోని విపర్యం గురించి అలాగే బోధిస్తాడు. “ఎక్కడ బయలుదేరాం మనం? కడ కెక్కడ చేరాం మనం?” అన్నాడు బైరాగి.
అలాగని అసలు సైన్సు ప్రస్తావనే లేదనను. వాస్తవానికి నా వ్యాసాన్ని ముందర ఇలా మొదలెట్టాను:
“తెలుగు సాహితీవేత్తల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు రాసిన ఉత్తమ నవల “అతడు-ఆమె.” ఆ నవల మూడో భాగం లో శాంతం గారి అమ్మాయి సుభకి ఇంట్లో అమ్మా నాన్నలిద్దరూ రాజకీయాల్లో ఉండటాన ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఎక్కువ. ప్రేమలోపడే వయసు కూడాను. అవి క్విట్టిండియా ఉద్యమరోజులు. అమరవీరులనందరినీ స్మరించుకుంటూ, తనుగూడా మద్రాసులో మెరికల్లాంటి నలుగురు తెలుగు అమ్మాయిలని తీసుకొని అహింసాయుతంగా తెల్లవాణ్ణి భయపెట్టి పారద్రోలే సాహసమేదన్నా చెయ్యాలనే కోరిక సుభకి గాఢంగా కలుగుతుంది. మనుషులెవరూ లేనప్పుడు ఏదన్నా వంతెనని పేల్చేయ్యాలని నిర్ణయించుకుంటుంది.
వంతెనని పేల్చడమంటే మాటలా? దానికి కావాల్సిన ప్రేలుడు మందు సేకరించడానికి, సివిలింజనీరయిన జనార్దనాన్ని పాత వంతెనలు కూల్చి కొత్తవాటిని ఎలా కడతారు? అని నర్మగర్భంగా అడుగుతుంది. సుభని ప్రేమిస్తున్న జనార్దనం, తన పని గురించి ఆవిడ అన్ని వివరాలు అడుగుతున్నందుకు పొంగిపోయి, వివరాలు చెప్తాడు. కాని పెద్ద పెద్ద కాంగ్రెసు నాయకులు తమ కూతుర్ని వారాలు చెప్పుకొని పైకొచ్చి గవర్నమెంటుద్యోగం చేసుకునే తనకిస్తారా అని సందేహిస్తాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, తన బ్రిడ్జీలున్నాయని సరిపుచ్చుకుంటాడు. ఓ వర్తుల పరిధి లేని డెక్ వైశాల్యం ఎలా కనుక్కోవాలా అని, ఓ క్షణం పాటు తెలియక తికమకపడి, ప్రేమలో పడి మరిచిపోయాను గాని, ఏముంది, సింప్సన్స్ ఫార్ములా పెట్టి కొట్టడమే అని వెంటనే తేరుకుంటాడు.
“జామెట్రీ కాలెక్యులస్ / అక్కయ్యకి రెండో కానుపు / తమ్ముడికి మోకాలివాపు / … / గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యల” నుండి దూరంగా “ఒకరి నడుం ఒకరు చుట్టి / ఉల్లాసంగా తిరుగుదాం,” స్వేచ్ఛగా విహరిద్దాం అన్న కవులున్నారు కాని, ప్రేమ ఫలించకపోతేనేమాయె, నా వంతెనలూ, నా కాలెక్యులస్ ఫార్ములాలు ఉన్నాయన్న కథానాయకులు అరుదు. ఏకంగా ఇంటెగ్రల్ కాలెక్యులస్కి ఓ పేజీ కేటాయించిన సాహితీ రచన బహుశా మన భాషలోనూ మరే భాషలోనూ కూడా లేదనుకుంటాను.”
వ్యాసం దారి తప్పుతుందేమోనని తొలగించాల్సొచ్చింది. ఈ అభిప్రాయం నా వ్యాసంలాగే చాంతాడంతయింది. ఇక ముగిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
03/22/2008 9:45 pm
వెన్నెల, వెర్రి
KS హరీష్ కుమార్ గారి అభిప్రాయం చదివితే చంద్రుడికో నూలు పోగని శ్రీశ్రీ సమర్పించిన దారంలాంటి తేలికైన దీర్ఘమైన కవిత “శరచ్చంద్రిక” గుర్తొచ్చింది.
“అందుచేత ఓ చందమామా!
అందమైన ఓ పూర్ణసోమా!
సముద్రం మీదా అరణ్యం మీదా
సమానంగా ప్రకాశించే సౌందర్యాభిరామా!
…
చెప్పొచ్చిందేమిటంటే
చెప్పడనికేమీ లేదని!
అంతమందికీ అన్నీ తెలుసు
అదే మన అజ్ఞానం.
ఎవడో చెబితే వినే రోజులు
ఏనాడో వెళ్ళిపోయాయి
ఇంకా ఏదో చెప్పాలని
ఎందుకీ ఉబలాటం?
అసలు నిజం ఏమిటంటే
ఎవడికీ ఎమీ తెలియదు
ఇలా ఎందుకొచ్చామో
ఇక్కడెంత సేపుంటామో
ఇక్కడనుంచి వెళ్ళేదెక్కడికో
ఎల్లుండి ఏ తమాషా జరుగుతుందో
ఎవ్వడూ చెప్పలేడంటే నమ్మండి.
చెబితేమాత్రం నమ్మకండి.”
నిరాశగా కాస్సేపు మాట్లాడి, మరో వైపు నుంచి చూస్తే వెలుగు కనబడుతుందంటూ:
“పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలూ
మహాకాశ వాతావరణంలోని
మర్మాలూ తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే
ఖరారుగా వస్తాంలే
అప్పుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావుకదూ నువ్వు?”
అని జోస్యం చెప్పి, మానవుడి progress report చదివాడు.
సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమ్మీద వచ్చే సముద్రాల ఆటుపోట్ల గురించి లోతుగా తెలియాలంటే కష్టమేకాని స్థూలంగా అర్థం చేసుకోవడం సులభమే. చంద్రునికి అభిముఖంగా ఉన్న భూమి ఉపరితలంపై ఒక బిందువు A, దానికి ఎదురుగా భూమ్మీద అవతలివైపు B, భూకేంద్రం C అనుకోండి. చంద్రుడు భూకేంద్రం C కన్నా A ని ఎక్కువ గానూ B ని తక్కువగానూ ఆకర్షిస్తాడు — దూరాల్లో ఉన్న తేడా బట్టి. అందుమూలంగా A, B రెండూ కూడా కేంద్రానికి దూరంగా వెళ్తాయి. కాని అవి భూమిలో భాగం కావడాన, భూమి సాగినట్లవుతుంది. దాని ప్రభావమే సముద్రాల్లో ఆటుపోట్లు.
భూగోళం చాలా పెద్దది కావడాన చంద్రుడికీ A, B, C లకీ మధ్య ఉన్న దూరాల్లో చెప్పుకోదగ్గ తేడా ఉంది – ఆ తేడానే ఆటుపోట్లకి కి కారణం. భూమితో పోలిస్తే మాఊరి చెరువు చాలా చిన్నది – దానిపై అన్ని బిందువులూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చెరువుపై చంద్రుడి ప్రభావం ఉండదు. అలాగే మన శరీరంలో ఎక్కువ వున్నది నీళ్ళే అయినా శరీరంలోని అన్నిభాగాలూ చంద్రుడికి సమానదూరంలో ఉండటాన చంద్రుడి ప్రభావం మనపై ఉండదు. (ముఖం పాదాలకన్నా దగ్గర ఉంటుంది కాని, మనిషి పొడవు భూమితో చంద్రునితో పోలిస్తే అతి తక్కువగా ఉంటుంది కనుక ఆ తేడాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.)
సమీకరణాలంటే భయం లేని వాళ్ళు ఈ “The Physics Teacher” పేపరు – “Myths about Gravity and Tides” – చదివి వివరాలు తెలుసుకోవచ్చు. అయితే వెన్నెల ప్రభావాన్ని సమీకరణాలతో అంచనా వెయ్యలేం. అందుకు కవిత్వమే సాక్ష్యం:
“వెళ్ళు జాబిల్లీ వెళ్ళు
వినిర్మలమైన నీ వెన్నెల కురిపిస్తూ
మనోహరమైన సంగీతం వినిపిస్తూ
ప్రయాణించు శశీ ప్రయాణించు.
…
ఇదిగో జాబిల్లీ నువ్వు
సముద్రం మీద సంతకం చేసేటప్పుడు
గాలిదాన్ని చెరిపెయ్యకుండా
కాలమే కాపలా కాస్తుందిలే.”
కొడవళ్ళ హనుమంతరావు
చెప్పులు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
02/25/2008 10:57 pm
చెప్పులు, చదువులు, కొన్ని తీపి గుర్తులు
బళ్ళో చదువుకున్న రోజులు, కాలేజీ రోజులు, బోంబే ఉద్యోగపు రోజులూ గుర్తొచ్చాయి.
రెండు మూడేళ్ళ కొకసారి మాఊరు, రావినూతల, వెళ్ళినప్పుడల్లా మాహైస్కూలు కెళ్తాను. పాతవిద్యార్థి వచ్చాడని సంతోషంతో మాష్టార్లు పిల్లల్తో బయట సమావేశం ఏర్పాటుచేసి నన్ను ప్రసంగించమంటారు.
క్రింద కూర్చున్న పిల్లలని చూస్తే నా చిన్నతనం గుర్తొచ్చి, రెండు తేడాలు కొట్టొచ్చినట్లు కనబడతాయి:
ఒకటి అల్పమయింది: ఇప్పుడు దాదాపు పిల్లలందరూ చెప్పులేసుకొని ఉన్నారు. అప్పట్లో చెప్పులేసుకొని వచ్చేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు.
రెండోది అతిముఖ్యమయింది: ఇప్పుడ సగంమంది విద్యార్థులు అమ్మాయిలు. అప్పట్లో పైతరగతులకి వెళ్ళే కొలదీ అమ్మాయిలు పలచబడేవాళ్ళు.
ఇంజనీరింగ్ కాలేజీలోనయితే కొన్ని సీనియర్ల బ్యాచ్ లలో అసలు అమ్మాయిలే లేరు! రోజులు మారాయి. కట్నకానుకలు, లాంఛనాలలో మాత్రం పెద్దగా మార్పు లేదు.
దాదాపు పాతికేళ్ళ క్రితం మొదటి ఉద్యోగం కోసం బోంబే వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ మహా నగరంలో జీవితం తలుచుకొని భయమేసింది – అప్పటిదాకా పల్లెటూరునీ హాస్టళ్ళనీ దాటి బయటక ఉండకపోవడాన. పాత కాలేజీమిత్రులుంటారని IIT కెళ్తే కొందరు కొత్త మిత్రులయ్యారు, తర్వాత సహోద్యోగులయ్యారు – హంస, OVG, నరసింహ – ఫిజిక్సు వాళ్ళు, ఎప్పుడూ పగలబడి నవ్వేవాళ్ళు. వాళ్ళ బృందంలో TIFRలో PhD చేస్తున్న లక్ష్మన్న గూడా ఒకరు. TIFR తీసుకెళ్ళేవాళ్ళు. గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, బ్రహ్మాండమైన మెస్సు! ఒకవైపు Indian Breakfast మరోవైపు Western Breakfast అని చెప్పేవాళ్ళు – Corn Flakes ని వర్ణించేవాళ్ళు.
ఇలా రాస్తుంటే, నా కాలేజీ మిత్రుడు, కన్నెగంటి చంద్ర రాసిన ”జ్ఞాపకం చాలు నాకు” గుర్తొస్తోంది:
”జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా రావు,
ఒకదాన్నొకటి తరుముకుంటూ వస్తాయి సముద్రపు కెరటాల్లా!
వస్తూనే వుంటాయి పెళ్ళికొచ్చే చుట్టాల్లా, తిరునాళ్ళకు జనాల్లా…
తీగలాగి డొంకంతా కదుపుతుంది…
మెదడు గనిని తవ్వితవ్వి జ్ఞాపకాల నిధులన్నీ బయటికి లాగుతుంది!
… ఎట్లా వచ్చాయో అట్లాగే వెళ్ళిపోయిన జ్ఞాపకాలకు
వీడ్కోలు పలికిన మనసంతా బెంగపడిపోయి బిక్కుబిక్కుమంటుంది
నీరంతా వెళ్ళిపోయిన ఏరులా…
చుట్టాలంతా వెళ్ళిపోయిన పెళ్ళివారిల్లులా…
జ్ఞాపకాలెప్పుడూ ఒంటరిగా పోవు, నా జీవితం సగాన్ని తీసుకునే పోతాయి!”
— వాన వెలిసిన సాయంత్రం కవితా సంపుటి.
ప్రసాద్ గారికి ధన్యవాదాలతో,
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
02/02/2008 7:58 pm
పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలపై రెండు పుస్తకాలు
వెంకటేశ్వర రావు గారూ,
మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీరు కేవలం ఆసక్తితో కంప్యూటర్ భాషలు నేర్చుకున్నారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే! ముందు ముందు అవసరం కలిగినప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో నేను చదవదగ్గ పుస్తకాల పేర్లివ్వలేదు. నాకు అమితంగా నచ్చిన పుస్తకాలు రెండు:
1. కంప్యూటింగ్ పూర్వాపరాలకు సంబంధించి Martin Davis రాసిన “The Universal Computer: The Road from Leibniz to Turing.”. గత యాభై అరవై ఏళ్ళలో కంప్యూటర్లు అనూహ్య రీతిలో అభివృద్ధి చెందాయి. అందుకు అభినందించాల్సింది నిస్సందేహంగా కంప్యూటర్ ఇంజనీర్లనే. కాని అప్పటి హాలునిండే కంప్యూటర్ల నుండి ఇవాళ్టి సెల్ ఫోనూ, లాప్ టాపూ, సూపర్ కంప్యుటర్ దాకా, అన్నిటికీ ఆధారం ఒకేరకమైన మూలసూత్రాలే! వాటిని కనుక్కోడానికి మూడొందల సంవత్సరాలు పట్టింది. ఆ సూత్రాలని కనుగొన్న వాళ్ళు ముఖ్యంగా ఇంజనీర్లు కాదు, తార్కికులు! వాళ్ళ జీవిత కథల్నీ, ఆలోచనలనీ కలిపి రాసిన పుస్తకం ఇది. దీనిలో వట్టి కథలయినా ఉత్కంఠతో చదివిస్తాయి. వాళ్ళ ఆలోచనలని అర్థం చేసుకుంటే కంప్యుటర్ లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది; అమూర్తపుటాలోచన (abstract thought) మీద గౌరవం పెరుగుతుంది.
2. సాధ్యాసాధ్యాల గురించి David Harel రాసిన “Computers Ltd. What They Really Can’t Do,” చదవదగ్గది. 1984లో TIME పత్రికలో వచ్చిన ఒక కవర్ స్టోరీ లో్ “కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో సాధ్యం కానిది లేదు,” అన్నది చదివి, సామాన్య ప్రజానీకంలో ఉన్న అపోహలని తొలగించడానికి రాసిన పుస్తకం.
వీళ్ళిద్దరూ లెక్కలు, కంప్యూటర్ సైన్సుల్లో ప్రపంచప్రసిద్ధిగాంచిన ప్రొఫెసర్లూ, శాస్త్రవేత్తలూ. “మనకున్న విజ్ఞానాన్ని కాస్తో కూస్తో సామాన్య జనానికి చేరువగా తీసుకొచ్చి అజ్ఞానపు చీకటిని తొలగించడం మన బాధ్యత,” అనే ఆలోచన పాశ్చాత్య శాస్త్రవేత్తల్లో అతిసామాన్యం గానూ, మన “పుణ్యభూమి”లో పుట్టిన శాస్త్రవేత్తల్లో అపురూపంగానూ కనిపించడం విశేషం.
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి వికటకవి అభిప్రాయం:
01/28/2008 2:01 pm
హనుమంతరావు గారు,
నేను ఉహా(కాల్పనిక)రచనలు గా పేర్కొన్నవి మనం ఎన్నో ఏళ్ళుగా ఆదరిస్తూ వచ్చిన జానపద కధలు, భేతాళ కధలు, తాంత్రిక కధలు వగైరాలు.
ఇకపోతే, ప్రత్యక్షముగా ఒక ప్రాంత ప్రజలతో గడపకపోయినా, ఎందరో పాశ్చాత్యులు మన భాషని, సంస్కృతిని అర్ధం చేసుకొని మనకు సంబంధిత గ్రంధాలెన్నో రచించారు, అనువదించారు. నాకు తెలిసి బుద్ధుడు, బౌద్దమతం, తాంత్రిక బౌద్దం పైన మన వాళ్ళ పుస్తకాలకంటే, విదేశీయులు రాసినవే ఎక్కువ.
ఇకపోతే, సి.పి.బ్రౌన్ గారు తన నిఘంటువులో ఉదహరించిన ప్రతి పదం యొక్క ప్రయోగం ప్రత్యక్షంగా చూసి ఉంటాడంటారా? ఆయన సంగ్రహ పరచిన సామెతలు అంతే. ఆయన చదివిన ఇతర పుస్తకాల ప్రభావం ఉండదంటారా? ఇది మరో పద్ధతి, మనకు తెలియని విషయాలపై పరిశోధించి రాయటంలో.
ఇంకాస్త మీరన్నదానికి దగ్గరగా ఉండే ఉదాహరణలంటే, అంగారకుడి మీద జీవం ఉండొచ్చు అన్న విషయాన్ని తీసుకొని గ్రహాంతరవాసులపై కోకొల్లలుగా వచ్చిన రచనలు, సినిమాలు. చాలా వరకు ప్రాచుర్యం పొందాయి. ఎవరు చూసారు అక్కడి మనుషులు, వాళ్ళ వేషభాషలు (అసలంటూ ఉనా కూడా)?
మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/26/2008 10:36 pm
“డబ్బు ( money) ఒక్కటి ఉంటే చాలు దానిని ఎలా సంపాయించినా సరే; మనస్సు ముచ్చటపడేవి తీర్చుకోగలగడం దాని ప్రయోజనం; అలా తీర్చుకోవడం వల్ల కలిగే అనుభవమే సుఖం ఇది … “మ్లేఛ్ఛభావన” … పాశ్చాత్యభావన.
నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది; … ఇదీ సనాతనమైన భారతీయ భావన.”
పుట్టుకతోనే నిర్ణయించిన పనిని చెయ్యడం మన ధర్మం. కాదంటే అది నేరం, పాపం. అదీ కొన్ని వందల ఏళ్ళగా భారతీయ సామాజిక జీవిత వాస్తవం. దాని ఫలితంగా కళ్ళముందే ఉన్న కఠోర జీవితాన్ని కాస్తయినా గ్రహించకుండా , “ఓహో, జీవితం గురించి ఎంత సనాతనమైన గొప్ప భావన మనది,” అని రాస్తే నమ్మేదెవరు? నిజ జీవితాలకి కాస్తన్నా విలువనిచ్చేవాళ్ళు మాత్రం కాదు. తగుదునమ్మా అని పాశ్చాత్య చింతన గురించి కించిత్ అవగాహన గూడా లేని పోలికలతో బడాయిలు!
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/26/2008 1:07 pm
వికటకవి గారూ,
ఆ సూత్రం ప్రవాసంలో ఉండి వచ్చినవాళ్ళకి వర్తించదని నేననలేదు. తప్పకుండా వర్తిస్తుంది. నిజానికి, నేను లక్ష్మన్న గారితో కొంతవరకే ఒప్పుకుంటాను అంటూ, ఆయన అన్నదాంట్లో నేను అంగీకరించని విషయమొకటుందని ఓ ఉదాహరణతో పాటు వివరించాను. (పేరివ్వడం మర్చిపోయాను – పి. సత్యవతి గారి “మంత్రనగరి”)
మరో ఉదాహరణ ఇచ్చి విరమిస్తాను. ఉన్నవ రాసిన “మాలపల్లి” కి ఇతివృత్తం పల్లెలో ఉండే ఓ దళిత కుటుంబం. ఉన్నవ దళితుడు కాడు; వాళ్ళ జీవితానికీ ఆయన జీవితానికీ చెప్పుకోదగ్గ తేడా ఉంది. అయినా గూడా వాళ్ళ జీవితం గురించిన ప్రత్యక్ష అనుభవం ఆయనకుంది – ఎందుకంటే వాళ్ళూ ఆయన ఉండే సమాజంలో భాగమే. ఎంత ఊహాశక్తి గల రచయిత అయినా తను వేరే సమాజంలో ఉంటూ “మాలపల్లి” లాంటిది రాయలేడు అని నా నమ్మకం. రాస్తే అది కత్తిమీదసాము లాగుంటుంది.
“మనం ఇంటర్నెట్ యుగంలో కొచ్చాం, ప్రపంచమంతా ఒక చిన్న కుటుంబం,” అంటే నేనొకటడుతాను. గత వంద సంవత్సారాలలో అనేక దేశాల్లో అనేక మార్పులొచ్చాయి. ప్రచార సౌకర్యాలలో ఊహించలేనంత మార్పులొచ్చాయి. కాస్త విద్యావంతులైన వాళ్ళకి వేరే దేశాల్లోని జీవితాల గురించి కొంతవరకైనా తెలుసుకోడానికి అవకాశం కలిగింది. కాని రచయితలెవరైనా కేవలం తమ ఊహా శక్తి నుపయోగించి తామెప్పుడన్నా నివసించిన దేశంలో కాక వేరే దేశంలో ఉన్న మనుషుల జీవితాలని ఇతివృత్తంగా తీసుకొని గొప్ప సాహిత్యం సృష్టించారా? సృష్టిస్తే, తెలుగులో కానీ ఇంగ్లీషులో కానీ, దయచేసి కొన్ని పేర్లివ్వండి.
కొడవళ్ళ హనుమంతరావు
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/12/2008 9:35 pm
వైజ్ఞానిక వ్యాసాల కథా కమామీషు
రాజాశంకర్ గారూ, శ్రీనివాస్ గారూ,
మీ ప్రోత్సాహనికి కృతజ్ఞతలు. మీరిచ్చిన కొన్ని సలహాలు పాటిస్తాను. మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో విభేదిస్తాను.
ఎందుకు రాయాలనిపించలేదో తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నానో వివరించి digress అయ్యానన్నారు రాజాశంకర్ గారు. “నరావతారం” కి పరిచయం రాస్తూ నార్ల విష్ణావతారాలవి రాసేవాళ్ళ మీద ఎందుకు విసుర్లు వెయ్యడం? పండిత పురస్కారం గురించి ప్రకటన చేస్తూ తమ్మినేని కవుల మీద ఎందుకు చురక వెయ్యడం? వాళ్ళ వాళ్ళ దృక్పధాన్ని బట్టి తమకి ముఖ్యమైన వాటి గురించి ప్రస్తావించారు. నేను మన భాషలో సైన్సుగా చలామణి అవుతున్న వాటిని చూసి కొంత “కడుపు మండి” నాలుగు మాటలు రాశాను. రాస్తున్నది పాపులర్ సైన్సు గురించి కాబట్టి అవి అసందర్భం కాదు. నిజానికి నాదృష్టిలో చాలా అవసరం. అలాగే ప్రేరణ కలిగించిన వాటిని ప్రస్తావించడం కూడా మామూలే.
కాని అందు మూలంగా అసలు విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే, అది తప్పే. ముందు ముందు ఎలాగూ లోతుగా వివరిస్తాను కనుక, అది సరిదిద్దుకునే అవకాశం వుంది.
నేను రాయాలనుకున్నదంతా ఒకే వ్యాసంలో వివరించడం సాధ్యం కాదు. ఖగోళ శాస్త్రం మీదా, కాలెండర్ మీదా మనకి వ్యాసాలు పరంపర గానే వచ్చాయి. అవి వచ్చింది వారపత్రికల్లో కాబట్టి గత వారం విషయం గుర్తుండటం సులభం కావొచ్చు. ఈమాట, రెండు నెలలకోసారయినా, ఇంటర్నెట్ పుణ్యమా అని పాత సంచిక పక్కనే ఉండటాన పాఠకులు దారితప్పరనే నా ఆశ. కాని శ్రీనివాస్ గారన్నట్లు, ప్రతి వ్యాసమూ సాధ్యమైనంతవరకు సమగ్రంగానూ సమైక్యంగానూ ఉండాలి. మొదటి వ్యాసం కాస్త కలగాపులగంగా వున్న మాట నిజమే. ఈ విషయంలో నేను జాగ్రత్తపడాలి.
ఇకపోతే ఈ వ్యాసాల్లో దొర్లే కవితల వలన ఉపయోగమేమిటి? పాఠకుల ఏకాగ్రతకు భంగం కావా? అన్నదానికి నా సమాధానం: కొడవటిగంటి కుటుంబరావు, “తెలుగులో ఏదన్నా వైజ్ఞానిక రచన, కథలాగా చక్కగా హృద్యంగా, ఆపబుద్ధి పుట్టకుండా రచించినది కంటపడితే పర్వం లాగుంటుంది,” అన్నాడు.
కాని పాత్రలు, సంభాషణలు, ప్రకృతి వర్ణనలూ లేకుండా కథలా హృద్యంగా నడిపించడం ఎలాగ? అందుకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నిస్తారు – కవిత, జీవిత చరిత్ర, పురాణ కథ, నవ్వుతెప్పించే సంఘటన, ఇలా ఏది చాతనయితే అది.
“విశ్వరూపం,” తెలుగు వైజ్ఞానిక సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలబడుతుందన్నాడు కొడవటిగంటి. నా ఉద్దేశంలో మైలురాయే కాదు, ఉత్తమ రచనకి గీటురాయి కూడాను. దాంట్లో, నండూరి, “సాధారణభాషలో సాపేక్షసిద్ధాంతం,” అధ్యాయాన్ని చార్లెస్ లాంబ్ పలుకులతో మొదలెట్టి, మధ్యలో కీట్సు ప్రేమగీతాన్నొకదాన్ని ఉటంకించి, షెల్లీ పద్యాన్ని పఠాభి తెనిగింపుతో సహా ఇచ్చి, పోతన భాగవతాన్నెలా మొదలెట్టాడో వివరించాడు! వాటికితోడు బాపూ కార్టూన్లు!
సాపేక్ష సిద్ధాంతం వివరించడానికి ఇవన్నీ అవసరమా అంటే, బహుశా కాదేమో! కాని అవన్నీ ఉంటే గాని హృద్యంగా ఉండదనీ, అవి వ్యాసాన్ని మళ్ళీ మళ్ళి చదివించేలా చేస్తాయనీ రచయిత ఉద్దేశం.
దీంట్లో ఏకాభిప్రాయం ఉండాలని లేదు. Feynman ఉపన్యాసాల్లో కవిత్వం ఎక్కడా కనిపించదు. కవిత్వం లేకుండా Brownowski ఉపన్యాసం ఉండదు. నాకు Brownowski అంటే చాలా ఇష్టం. మన ఇష్టాఇష్టాలు మన రచనల్లో వ్యక్తం అవతాయి.
చాలా మంది పేర్లని వాడాను. వారి ప్రజ్ఞా పాటవాలు నాకున్నాయనే అపోహ నాకేమాత్రమూ లేదు. వాస్తవం చెప్పాలంటే, పులిని చూచి నక్క వాతబెట్టుకున్న ట్లవుతుందేమోనన్న భయం కొంత వుంది. కాని, చుక్కలదాకా నిచ్చెనేస్తే చూరు దాకానన్నా చేరతాం, అన్నది మన సూక్తి.
కొడవళ్ళ హనుమంతరావు
ఎందుకు రాయాలో అందుకే చదవాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/12/2008 1:59 pm
శ్రీనివాస్ గారిచ్చిన స్త్రీల, పేదల, రోగుల గురించి రాయడానికి సంబంధించిన పోలిక ఈ సందర్భంలో సమంజసంగా లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి రాయడానికి వాళ్ళ జీవితంతో కావలసిన ప్రత్యక్షమైన అనుభవం వేరే వాళ్ళకుండే అవకాశం వుంది. అమెరికా జీవితం గురించి అలాంటి ప్రత్యక్షానుభవం అమెరికాలో ఉంటే తప్ప అసాధ్యం.
“ఇంటర్నెట్ తోనూ, ఈమాట తోనూ, ఇరవై నాలుగ్గంటలూ ప్రసారమయ్యే టీవీ షోల తోనూ వేరే వాళ్ళ జీవితం గురించి తెలుసుకోలేమా? సృజనాత్మక సాహిత్యం సృష్టించలేమా?” అంటే ఎక్కడో కొడవటిగంటి కుటుంబరావు అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి: సాహిత్యం జీవితవృక్షాన పూసే పువ్వు అనే ఉపమానం వాస్తవమనుకుంటే, సాహిత్యాన్నించి సాహిత్యం పుట్టడం, పువ్వునుంచి పువ్వు పుట్టడం లాంటిది – అసంభవం.
అసాధ్యం, అసంభవం అన్నవి పెద్ద మాటలనుకోండి. ఎక్కడన్నా మినహాయింపులుండొచ్చు.
కాని లక్ష్మన్న గారితో నేను కొంతవరకే ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆయన నివాసాంధ్రులు ఎన్నిసార్లు ఇక్కడకొచ్చి వెళ్ళినా అమెరికాలోని తెలుగు జీవితం అర్థంచేసుకోలేరన్నారు. జీవితం, తెలుగు వాళ్ళదే అయినా, చాలా విశాలమయింది. ఇక్కడ ఉన్న వాళ్ళకయినా అది అర్థమయ్యేది అసంపూర్తిగానే.
రెండు మూడు నెలలు వాళ్ళ పిల్లల్ని చూడటానికి వచ్చినవాళ్ళు, తాము చూసి అనుభవించినంతలో అర్థం చేసుకొని రచనలు చెయ్యొచ్చు.
మొన్నో కథ చదివాను: అమెరికాలో తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం ఎంత ఘనంగా – మీగడలతో భోజనం, తాంబూలంతో ఫాటు వెండిగిన్నె ప్రదానం – చేసుకుంటున్నారో, ఒకరింట్లో స్వామి వారొకరు యజ్ఞం ఎలా జరిపించారో చెప్పి, ఇండియాలో లక్ష వత్తుల నోము ఎవరూ చేస్తున్నట్లు లేరు; అది కూడా ఇక్కడ చూసే భాగ్యం కలుగుతుందేమో అన్నారు.
అలాంటి కథలు విలువయినవే; నిజానికి చుట్టపుచూపుగా వచ్చిన నివాసాంధ్రులే అవి మిన్నగా రాయగలరేమోమో. అవి చదివి, అక్కడ కంటే ఇక్కడే మన సంస్కృతి గురించి ఎక్కువ పట్టించుకుంటూన్నామని సంబరపడొచ్చు; లేదా, పెరిగిన ఆర్థిక స్తోమతుతో పాటు పెరగకూడనవేవో మనలో పెరుగుతున్నాయని విచారించనూ వచ్చు – చదివే వారి దృష్టిని బట్టి.
కొడవళ్ళ హనుమంతరావు