అమెరికా జీవితాన్ని చూశాక రాజారావు empty గా ఫీలవడం సహజమే గాని, వివాహం చేసుకోవడం కొంచెం అసహజంగానే వుందనిపించింది. ఇవాళ India లో old age homes (డబ్బుండాలే గానీ) ఎంత సౌకర్యంగా , హాయిగా ఉంటున్నాయో ఒకసారి వచ్చి చూడండి. అంటే , పిల్లలు విదేశాల్లో ఉన్న parents అందరూ homesలో చేరాలని నా ఉద్దేశం కాదు. తోడు కావాలంటే, పెళ్ళే అక్కర్లేదని నా ఉద్డేశం. Hyd లోని Bombay Highway లో ఒక homeలో ఎంతో మంది retired doctors, class 1 Govt servants, హాయిగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్లో చాలా మంది విదేశాల్లోనే ఉన్నారు. 24 గంటలూ doctors availability, good library, big garden (I ‘ve seen old people staying in the home are cultivating vegetables, and flowers for the home. We live nearby this home) good friends, bank nearby ….! (mobile Andhra Bank ATM comes to the home every week) పిల్లలు దూరాన ఉన్నప్పుడు, వాళ్ళతో ఉండడం కుదరక , ఒంటరిగా కుమిలేకంటే, చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఇలాంటి ఆశ్రమాల్లో ఉండటం హాయి. తీరిక లేని యవ్వనంలో, చేయలేని పనులెన్నో ఈ వయసులో చేయవచ్చు. హరి తల్లే అయితే 60+ వయసులో ఈ పని చేయగలదా? పిల్లల కోసం, అన్ని త్యాగాలు చేసిన రాజారావుకి చివరికి ఈ పెళ్ళి వల్ల మిగిలినదేమిట్ట? వాళ్ళ నిష్టూరాలు, చీదరింపులూ! పిల్లల్ని ప్రేమిం చడం తల్లి దండ్రులు మానరని రాజారావే చెప్పాడు. ఇటువంటి నిర్నయాలు తీసుకునే ముందు పిల్లలు తనను కాదనుకున్నా , పరవాలేదనుకోగలిగే గుండె నిబ్బరంఉండాలి మరి.
రాజారావు ఉత్తరంలో ఆయన వ్యధ బాగా వర్ణించారు. కానీ, ముగింపు నిజంగానే దాసరి నారాయణ రావు సినిమా లాగానే వుందండీ!
మొదటగా మీకు నా అభినందనలు. ఎందుకంటారా…? తేనెతుట్టెను కదిపి, తేనెటీగల బారిన పడ్డ వారికి తేనె పూసే ప్రయత్నం చేసినందుకు. (అయ్యయ్యో ఇది విమర్శ కాదు.) ఇక నాకు ఇంకా బాగా నచ్చిన విషయం మీ స్పాంటేనిటి(అంటే అర్థం సమయస్పూర్తి అనే కదా !?). మీ ఊరగాయ ఉదాహరణ చాలా చాలా ‘లాజికల్’గా ఉందండి. కానీ మీకులాగ తేనెతుట్టే కదిపే సాహసం చేయలెకపొతున్నను….ఎందుకంటే నాకు తేనెటీగలంటే చచ్చేంతభయం.
..
చివరగా నాకు నచ్చిన వాఖ్యం(దీని అవసరం ఎంతైనా ఉందిక్కడ!):
ఈ కవితను చదవగానే, ప్రత్యేకముగా చివరి పంక్తులను,
ఎందుకో నాకు విల్లియం వర్డ్స్వర్త్ వ్రాసిన క్రింది పద్యము
జ్ఞాపకానికి వచ్చింది. చాల మంది ఈ పద్యాన్ని బడిలో
చదివే ఉంటారు. ఆ పద్యము –
She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love:
A violet by a mossy stone
Half hidden from the eye!
Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
మోహన
అరణ్య కవితలు
గురించి కవిత్వానికి తర్కం అవసరం లేదా? « వికటకవి అభిప్రాయం:
09/10/2007
12:58 pm
[…]అగ్నికి ఆజ్యం తోడైనట్లు, చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివాక ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని ఆత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా! కవిత్వానికి తర్కం అవసరం లేదా? […]
నా అభిప్రాయాన్ని తెలుపుకునే అవకాశం ఉన్నది కనుక ఇక్కడ చెప్పటం జరిగింది. అదేదో తేనెతుట్టె కదల్చడం అని ఊహించలేదు. సరే! మీ సలహాననుసరించి మీరు సూచించిన పుస్తకాలలో చదవనివి చదవటానికి ప్రయత్నిస్తాను. కానీ నేను చేసినది కేవలం అభిప్రాయమం తెలుపడమే! పూర్తి స్థాయి విమర్శ కాదు. అలా విమర్శ చేసి ఉంటే సవివరంగా అన్నీ విడమర్చి ఉండేవాడిని. అభిప్రాయ విస్తరణ భీతి వల్ల కొద్దిగానే చెప్పవల్సి వచ్చింది.
నేను మీ ఇంటికి వచ్చినపుడు మీరేదో తెలుగువాడని మీ ఇంట్లో ఆవకాయ వేసి భోజనం పెట్టారు.. ఎందుకనో అది నాకు నచ్చలేదు. నా అభిప్రాయం తెల్సుకుందామని మీరు ఎలా ఉంది అని అడిగితే నిర్మొహమాటంగా బాలేదని చెప్పాను. అయితే అక్కడితో ఆగకుండా నాకు కనిపించిన లోపాలూ చెప్పాను. పాతగా ఉందనో, నూనె ఎండిపోయిందనో, కారం లేదనో, ఇంకేదో లేదనో చెప్పాను. దానికి మీరు, నేను ఏమీ చేయలేం. మీకు నచ్చినా అది నా జిహ్వకు నచ్చలేదు. ఇప్పుడు అర్గెంటుగా ‘ఆవకాయ చేయడం ఎలా?’, “నేటికాలంలో ఆవకాయ తీరుతెన్నులూ” అన్న పుస్తకాలిచ్చి చదవమంటే అవి చదివినా నా నోటికి రుచి కొత్తగా పుట్టి మీ ఆవకాయను ఓహో అనలేం కదా. (ఆ పుస్తక రచయితల్ని అవహేళన చేయడం నా ఉద్దేశ్యం కాదు. నా భావాన్ని వివరించడమే నేను చేస్తున్నది.) నేను ఎంతో ఇష్టంతో కొన్ని యేళ్ళుగా ఆవకాయ తింటున్న నా అనుభవం మీరు కాదనలేనిది.
ఒక కవిగా విమర్శో అభిప్రాయమో యుక్తం అనుకుంటే స్వీకరించండి. లేదంటే మీ ఇష్టం. ఇక కొంత మంది అభిప్రాయాల్లో చెప్పినట్లు వారు సూచించినవన్నీ నేను చదవాక కానీ అభిప్రాయాలు వ్రాయకూడదంటే మీకు విమర్శకులు దొరకడం కష్టమే మరి!
ఇక ఈ కవిత(ల)లో నేను వెతికింది లాజిక్కు కాదు. ఒక అందమైన భావ చిత్రణ, దాన్ని నూతనంగా ఆవిష్కరించడం. అదేమంత గొంతెమ్మ కోరిక కాదనుకుంటా. ఇక్కడే ఉన్న రవిశంకర్ గారి కవితలో నాకు కనిపించింది అదే. అదే, మనసును స్పందింపజేసి ఒక క్షణ కాలమన్నా ఆహా అనిపించేట్టు చేసింది. అలా చేయనిది కూడా కవిత్వమే అనమంటే, నేను అనలేను. భావ చిత్రణలో లాజిక్కు ఉందా అంటే భౌతిక శాస్త్ర రీత్యా లేదు. చెట్టుకు పూలదోసిళ్ళు అంటే ఏ బయాలజీ ఒప్పుకోదు. కానీ దానికి స్పందించే మనసు, సృజనాత్మకత పెద్ద పీట వేస్తాయి. దానికి కవిత్వం అని పేరు పెడుతుంటాయి. కవిత్వం అంటే ఇది అని నిర్దిష్టంగా ఎవరూ చెప్పలేకపోయినా రసజ్ఞత కలిగిన మనసనే హంస రాసిన దాంట్లో కవిత్వాన్ని వేరు చేసి చూసి ఆనందిస్తుంది. అది నాలుగు పాదాల్లో ఉందా? ఛందస్సులో ఉందా? మాదిగనో బ్రాహ్మణుడినో తిట్టిందా అనో మన వాదానికి సరిపోయిందా అనే అసంబధ్ధపు శషభిషల రంగు కళ్ళ్జోళ్ళలో చూడటం స్పందించే మనసుకు అనవసరం.
కవిగారూ, మీ కవితలో కొత్తగా చెప్పింది ఏమిటి? కిరణాలు అలల మీద పడడమా? ‘ఆకుల్లో దూరి… ‘ ఆ వాక్యంలో కొత్తదనం ఏది? ఆ వాడుక ఎన్నో సార్లు వాడబడిందే కదా. మీరు కొత్త విషయాన్నీ చెప్పలేదు, కొత్తగనూ చెప్పలేదు. అలాగే గులకరాళ్ళు. ఎంత పాతబడిపోయింది. మీరు ఒక విషయం మాత్రమే చెప్పారు. అడవిలో నీళ్ళు కనపడ్డాయి అన్నారు. అందులోకొత్తదనం ఏముంది? అందరికీ తెలిసినదే కదా. తప్పిపోవాలనుంది అన్నారు. ఆ భావాన్ని మీ అంతగా పాఠకుడు స్పందిస్తూ అనుకునేలా మీరు ఏం చేశారు? మొదటగా చదివినపుడు ఆ వాక్యాల ముందుభాగం పొరపాటున పడలేదేమో అని అనుకున్నాను. ఇక పూలు అన్నారు. పూస్తాయి, రాలిపోతాయి. నిజమే! మిరు చెప్పిన కవితలో అక్షరాలా నిజం ఉంది. కవిత్వం ఏది? ఏతావాతా మీ ‘కవిత’లో చాలా( information) విషయాలున్నాయి. (సీరియెస్ చర్చలో కాస్త సరదగా మాత్రమే వాడాను. వాతావరణం చల్లబరచడానికి)
మిగిలినవారిలో ఒకొక్కరూ ఎవరికి తోచింది వారికి వ్రాశారు. అది వారిష్టం. కానీ నేను వ్రాసిమనది పూర్తిగా చదివితే భాష కు అధోగతి ఎందుకు పడుతోందో నేను వ్రాసింది స్పష్టమయ్యేది. ఈనాడు కవిత్వం చదివేవాళ్ళు మన యువతరంలో ఎంతమందుంటారు? అందుకు కారణాలెన్నో ఉన్నా.. కవిత్వం అద్భుతంగా ఉంటుందని 80 శాతం మంది అనుకోకపోవడం కాదూ ఒక ముఖ్య కారణం? బెంగాలీ వంటి భాషలు ఆయా ప్రాంతాల్లో నిత్య నూతనంగా ఉండటానికి జనులు పుస్తకాలు, కవితలూ చదవటం కాదూ ముఖ్య కారణం? మన భాషలో కవిత్వం వ్రాస్తే చదివేవాళ్ళు ఎంతమందో మనకు తెలియదూ. అందుకు కవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ మంచి కవిత్వం రావడానికి తలో చెయ్యి వేయాలన్నదే నా భావన. విమర్శకులు, కవులు ఇలా అందరూ. అది తప్పని అనేవారు ఉండరనుకుంటా.
అనవసరంగా నాకు లేని భావాలను ఆపాదించి మరీ కొంతమంది మాట్లాడినా.. నాకు లేనప్పుడు ఉలకను. అయితే, సహృదయంతో ఆలోచించి, మంచి కవిత్వం వ్రాస్తూ తద్వారా మన భాషా గౌరవాన్ని ఇనుమడించుదాం. సుబ్రహ్మణ్యం గారూ కొత్త ఆవకాయ పెట్టండి. క్షణాల్లో మీ ఇంటికి వస్తా! తిండి గురించి వ్రాసేదే కవిత్వం అని నా భావన కాదని వేరే చెప్పక్కరలేదనుకుంటా. ‘కవితాత్మకత’ ఉన్న వచనం కూడా ఆనందంగానే చదువుతా. కవి గారికి నాఆక్రందన అర్ధం అవుతుందని ఆశిస్తా..
I have been following the ongoing debate over Sri.Mula Subramanyam’s poem “Aranya Kavitalu” .
Though it is not easy to define poetry leaving no room for controversy ,I think it is fairly established that a poem should communicate at least a measure of the poet’s creative imagination of which it has been born even on the first reading.It is useful to recall what T.S.Eliot said of poetry in this context,and that is,that poetry isenjoyed even before it is understood.This enjoyment results from the suggestive power of the mataphorical language used in the poem ,the pleasing pictures it evokes,the captivating rhythms it generates,and above all,the haunting feeling it engenders.To what extent has this function been fulfilled by a poem should only be a matter of concern in a literary debate,and nothing else.
I should say in all good faith that all those who have so far participated in the present debate seem to be well read ,capable of a logical and sustained argument.But it is to be remembered by all of us we can disagree without being disagreeable.The tenor and texture and force of an argument in a literary debate should only be,yes,should only be literary in character.We can make it a very pleasant ,infornative and memorable debate by avoiding saying personal things which tend to hurt the feelings of any of the participants.
Madhusvaram గారి ప్రశంసకు ధన్యవాదం. వెబ్ పత్రికకు ఉన్న ఆడియో తదితర సదుపాయాలను ఉపయోగించుకుని ఇటువంటి వ్యాసాలను రాస్తే అర్థం చేసుకోవడం సులువు. ఈ విషయంలో సంపాదకవర్గంవారు తీసుకున్న శ్రద్ధా, వారు పడిన శ్రమా కూడా చెప్పుకోదగ్గవే. చదివేవారికి తగినంత ఆసక్తి ఉన్నట్టయితే సంగీతాన్ని పరిచయం చేసే మరిన్ని వ్యాసాలను రాయవచ్చు.
ఈ వ్యాసం ఔత్సాహిక కళాకారులందరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు చాల అద్భుతంగా విపులీకరించారు. రాగాలకు సంబందించి సినిమా పాటలు సేకరించటం , మళ్లీ వాటికి సంబందించిన శాస్త్రీయ సంగీత కీర్తనలు సేకరించి అన్నింటిని ఒక దగ్గర కూర్చి ఒక వ్యాసం లో రాయటం ఇది చదువుతున్నంత సులభం కాదు. ఒక సంగీత కళాకారుడిగా నాకు తెలుసు ఇది చాల శ్రమతో కూడిన పని . రోహిణిప్రసాద్ గారు అభినందనీయులు .
ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.
“కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”
మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.
కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.
“ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?
ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….
చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.
ఒంటరి విహంగం గురించి Sujatha Srinivas అభిప్రాయం:
09/11/2007 2:55 am
అమెరికా జీవితాన్ని చూశాక రాజారావు empty గా ఫీలవడం సహజమే గాని, వివాహం చేసుకోవడం కొంచెం అసహజంగానే వుందనిపించింది. ఇవాళ India లో old age homes (డబ్బుండాలే గానీ) ఎంత సౌకర్యంగా , హాయిగా ఉంటున్నాయో ఒకసారి వచ్చి చూడండి. అంటే , పిల్లలు విదేశాల్లో ఉన్న parents అందరూ homesలో చేరాలని నా ఉద్దేశం కాదు. తోడు కావాలంటే, పెళ్ళే అక్కర్లేదని నా ఉద్డేశం. Hyd లోని Bombay Highway లో ఒక homeలో ఎంతో మంది retired doctors, class 1 Govt servants, హాయిగా ఉన్నారు. వాళ్ళ పిల్లల్లో చాలా మంది విదేశాల్లోనే ఉన్నారు. 24 గంటలూ doctors availability, good library, big garden (I ‘ve seen old people staying in the home are cultivating vegetables, and flowers for the home. We live nearby this home) good friends, bank nearby ….! (mobile Andhra Bank ATM comes to the home every week) పిల్లలు దూరాన ఉన్నప్పుడు, వాళ్ళతో ఉండడం కుదరక , ఒంటరిగా కుమిలేకంటే, చేతిలో డబ్బు ఉన్నప్పుడు, ఇలాంటి ఆశ్రమాల్లో ఉండటం హాయి. తీరిక లేని యవ్వనంలో, చేయలేని పనులెన్నో ఈ వయసులో చేయవచ్చు. హరి తల్లే అయితే 60+ వయసులో ఈ పని చేయగలదా? పిల్లల కోసం, అన్ని త్యాగాలు చేసిన రాజారావుకి చివరికి ఈ పెళ్ళి వల్ల మిగిలినదేమిట్ట? వాళ్ళ నిష్టూరాలు, చీదరింపులూ! పిల్లల్ని ప్రేమిం చడం తల్లి దండ్రులు మానరని రాజారావే చెప్పాడు. ఇటువంటి నిర్నయాలు తీసుకునే ముందు పిల్లలు తనను కాదనుకున్నా , పరవాలేదనుకోగలిగే గుండె నిబ్బరంఉండాలి మరి.
రాజారావు ఉత్తరంలో ఆయన వ్యధ బాగా వర్ణించారు. కానీ, ముగింపు నిజంగానే దాసరి నారాయణ రావు సినిమా లాగానే వుందండీ!
అరణ్య కవితలు గురించి ప్రవీణ్ కుమార్ అభిప్రాయం:
09/10/2007 10:07 pm
కృష్ణ గారు,
మొదటగా మీకు నా అభినందనలు. ఎందుకంటారా…? తేనెతుట్టెను కదిపి, తేనెటీగల బారిన పడ్డ వారికి తేనె పూసే ప్రయత్నం చేసినందుకు. (అయ్యయ్యో ఇది విమర్శ కాదు.) ఇక నాకు ఇంకా బాగా నచ్చిన విషయం మీ స్పాంటేనిటి(అంటే అర్థం సమయస్పూర్తి అనే కదా !?). మీ ఊరగాయ ఉదాహరణ చాలా చాలా ‘లాజికల్’గా ఉందండి. కానీ మీకులాగ తేనెతుట్టే కదిపే సాహసం చేయలెకపొతున్నను….ఎందుకంటే నాకు తేనెటీగలంటే చచ్చేంతభయం.
..
చివరగా నాకు నచ్చిన వాఖ్యం(దీని అవసరం ఎంతైనా ఉందిక్కడ!):
“నొప్పించక తానొప్పక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతీ”.
ఉంటాను..
మీ భాగ్యనగరం బ్యాచిలర్ ‘నంద
అరణ్య కవితలు గురించి J K Mohana Rao అభిప్రాయం:
09/10/2007 4:55 pm
ఈ కవితను చదవగానే, ప్రత్యేకముగా చివరి పంక్తులను,
ఎందుకో నాకు విల్లియం వర్డ్స్వర్త్ వ్రాసిన క్రింది పద్యము
జ్ఞాపకానికి వచ్చింది. చాల మంది ఈ పద్యాన్ని బడిలో
చదివే ఉంటారు. ఆ పద్యము –
She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love:
A violet by a mossy stone
Half hidden from the eye!
Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
మోహన
అరణ్య కవితలు గురించి కవిత్వానికి తర్కం అవసరం లేదా? « వికటకవి అభిప్రాయం:
09/10/2007 12:58 pm
[…]అగ్నికి ఆజ్యం తోడైనట్లు, చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివాక ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని ఆత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా!
కవిత్వానికి తర్కం అవసరం లేదా? […]
అరణ్య కవితలు గురించి krishna అభిప్రాయం:
09/09/2007 3:26 pm
నా అభిప్రాయాన్ని తెలుపుకునే అవకాశం ఉన్నది కనుక ఇక్కడ చెప్పటం జరిగింది. అదేదో తేనెతుట్టె కదల్చడం అని ఊహించలేదు. సరే! మీ సలహాననుసరించి మీరు సూచించిన పుస్తకాలలో చదవనివి చదవటానికి ప్రయత్నిస్తాను. కానీ నేను చేసినది కేవలం అభిప్రాయమం తెలుపడమే! పూర్తి స్థాయి విమర్శ కాదు. అలా విమర్శ చేసి ఉంటే సవివరంగా అన్నీ విడమర్చి ఉండేవాడిని. అభిప్రాయ విస్తరణ భీతి వల్ల కొద్దిగానే చెప్పవల్సి వచ్చింది.
నేను మీ ఇంటికి వచ్చినపుడు మీరేదో తెలుగువాడని మీ ఇంట్లో ఆవకాయ వేసి భోజనం పెట్టారు.. ఎందుకనో అది నాకు నచ్చలేదు. నా అభిప్రాయం తెల్సుకుందామని మీరు ఎలా ఉంది అని అడిగితే నిర్మొహమాటంగా బాలేదని చెప్పాను. అయితే అక్కడితో ఆగకుండా నాకు కనిపించిన లోపాలూ చెప్పాను. పాతగా ఉందనో, నూనె ఎండిపోయిందనో, కారం లేదనో, ఇంకేదో లేదనో చెప్పాను. దానికి మీరు, నేను ఏమీ చేయలేం. మీకు నచ్చినా అది నా జిహ్వకు నచ్చలేదు. ఇప్పుడు అర్గెంటుగా ‘ఆవకాయ చేయడం ఎలా?’, “నేటికాలంలో ఆవకాయ తీరుతెన్నులూ” అన్న పుస్తకాలిచ్చి చదవమంటే అవి చదివినా నా నోటికి రుచి కొత్తగా పుట్టి మీ ఆవకాయను ఓహో అనలేం కదా. (ఆ పుస్తక రచయితల్ని అవహేళన చేయడం నా ఉద్దేశ్యం కాదు. నా భావాన్ని వివరించడమే నేను చేస్తున్నది.) నేను ఎంతో ఇష్టంతో కొన్ని యేళ్ళుగా ఆవకాయ తింటున్న నా అనుభవం మీరు కాదనలేనిది.
ఒక కవిగా విమర్శో అభిప్రాయమో యుక్తం అనుకుంటే స్వీకరించండి. లేదంటే మీ ఇష్టం. ఇక కొంత మంది అభిప్రాయాల్లో చెప్పినట్లు వారు సూచించినవన్నీ నేను చదవాక కానీ అభిప్రాయాలు వ్రాయకూడదంటే మీకు విమర్శకులు దొరకడం కష్టమే మరి!
ఇక ఈ కవిత(ల)లో నేను వెతికింది లాజిక్కు కాదు. ఒక అందమైన భావ చిత్రణ, దాన్ని నూతనంగా ఆవిష్కరించడం. అదేమంత గొంతెమ్మ కోరిక కాదనుకుంటా. ఇక్కడే ఉన్న రవిశంకర్ గారి కవితలో నాకు కనిపించింది అదే. అదే, మనసును స్పందింపజేసి ఒక క్షణ కాలమన్నా ఆహా అనిపించేట్టు చేసింది. అలా చేయనిది కూడా కవిత్వమే అనమంటే, నేను అనలేను. భావ చిత్రణలో లాజిక్కు ఉందా అంటే భౌతిక శాస్త్ర రీత్యా లేదు. చెట్టుకు పూలదోసిళ్ళు అంటే ఏ బయాలజీ ఒప్పుకోదు. కానీ దానికి స్పందించే మనసు, సృజనాత్మకత పెద్ద పీట వేస్తాయి. దానికి కవిత్వం అని పేరు పెడుతుంటాయి. కవిత్వం అంటే ఇది అని నిర్దిష్టంగా ఎవరూ చెప్పలేకపోయినా రసజ్ఞత కలిగిన మనసనే హంస రాసిన దాంట్లో కవిత్వాన్ని వేరు చేసి చూసి ఆనందిస్తుంది. అది నాలుగు పాదాల్లో ఉందా? ఛందస్సులో ఉందా? మాదిగనో బ్రాహ్మణుడినో తిట్టిందా అనో మన వాదానికి సరిపోయిందా అనే అసంబధ్ధపు శషభిషల రంగు కళ్ళ్జోళ్ళలో చూడటం స్పందించే మనసుకు అనవసరం.
కవిగారూ, మీ కవితలో కొత్తగా చెప్పింది ఏమిటి? కిరణాలు అలల మీద పడడమా? ‘ఆకుల్లో దూరి… ‘ ఆ వాక్యంలో కొత్తదనం ఏది? ఆ వాడుక ఎన్నో సార్లు వాడబడిందే కదా. మీరు కొత్త విషయాన్నీ చెప్పలేదు, కొత్తగనూ చెప్పలేదు. అలాగే గులకరాళ్ళు. ఎంత పాతబడిపోయింది. మీరు ఒక విషయం మాత్రమే చెప్పారు. అడవిలో నీళ్ళు కనపడ్డాయి అన్నారు. అందులోకొత్తదనం ఏముంది? అందరికీ తెలిసినదే కదా. తప్పిపోవాలనుంది అన్నారు. ఆ భావాన్ని మీ అంతగా పాఠకుడు స్పందిస్తూ అనుకునేలా మీరు ఏం చేశారు? మొదటగా చదివినపుడు ఆ వాక్యాల ముందుభాగం పొరపాటున పడలేదేమో అని అనుకున్నాను. ఇక పూలు అన్నారు. పూస్తాయి, రాలిపోతాయి. నిజమే! మిరు చెప్పిన కవితలో అక్షరాలా నిజం ఉంది. కవిత్వం ఏది? ఏతావాతా మీ ‘కవిత’లో చాలా( information) విషయాలున్నాయి. (సీరియెస్ చర్చలో కాస్త సరదగా మాత్రమే వాడాను. వాతావరణం చల్లబరచడానికి)
మిగిలినవారిలో ఒకొక్కరూ ఎవరికి తోచింది వారికి వ్రాశారు. అది వారిష్టం. కానీ నేను వ్రాసిమనది పూర్తిగా చదివితే భాష కు అధోగతి ఎందుకు పడుతోందో నేను వ్రాసింది స్పష్టమయ్యేది. ఈనాడు కవిత్వం చదివేవాళ్ళు మన యువతరంలో ఎంతమందుంటారు? అందుకు కారణాలెన్నో ఉన్నా.. కవిత్వం అద్భుతంగా ఉంటుందని 80 శాతం మంది అనుకోకపోవడం కాదూ ఒక ముఖ్య కారణం? బెంగాలీ వంటి భాషలు ఆయా ప్రాంతాల్లో నిత్య నూతనంగా ఉండటానికి జనులు పుస్తకాలు, కవితలూ చదవటం కాదూ ముఖ్య కారణం? మన భాషలో కవిత్వం వ్రాస్తే చదివేవాళ్ళు ఎంతమందో మనకు తెలియదూ. అందుకు కవిత్వం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అందరూ మంచి కవిత్వం రావడానికి తలో చెయ్యి వేయాలన్నదే నా భావన. విమర్శకులు, కవులు ఇలా అందరూ. అది తప్పని అనేవారు ఉండరనుకుంటా.
అనవసరంగా నాకు లేని భావాలను ఆపాదించి మరీ కొంతమంది మాట్లాడినా.. నాకు లేనప్పుడు ఉలకను. అయితే, సహృదయంతో ఆలోచించి, మంచి కవిత్వం వ్రాస్తూ తద్వారా మన భాషా గౌరవాన్ని ఇనుమడించుదాం. సుబ్రహ్మణ్యం గారూ కొత్త ఆవకాయ పెట్టండి. క్షణాల్లో మీ ఇంటికి వస్తా! తిండి గురించి వ్రాసేదే కవిత్వం అని నా భావన కాదని వేరే చెప్పక్కరలేదనుకుంటా. ‘కవితాత్మకత’ ఉన్న వచనం కూడా ఆనందంగానే చదువుతా. కవి గారికి నాఆక్రందన అర్ధం అవుతుందని ఆశిస్తా..
అరణ్య కవితలు గురించి C.S.Rao అభిప్రాయం:
09/08/2007 10:05 pm
I have been following the ongoing debate over Sri.Mula Subramanyam’s poem “Aranya Kavitalu” .
Though it is not easy to define poetry leaving no room for controversy ,I think it is fairly established that a poem should communicate at least a measure of the poet’s creative imagination of which it has been born even on the first reading.It is useful to recall what T.S.Eliot said of poetry in this context,and that is,that poetry isenjoyed even before it is understood.This enjoyment results from the suggestive power of the mataphorical language used in the poem ,the pleasing pictures it evokes,the captivating rhythms it generates,and above all,the haunting feeling it engenders.To what extent has this function been fulfilled by a poem should only be a matter of concern in a literary debate,and nothing else.
I should say in all good faith that all those who have so far participated in the present debate seem to be well read ,capable of a logical and sustained argument.But it is to be remembered by all of us we can disagree without being disagreeable.The tenor and texture and force of an argument in a literary debate should only be,yes,should only be literary in character.We can make it a very pleasant ,infornative and memorable debate by avoiding saying personal things which tend to hurt the feelings of any of the participants.
కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
09/08/2007 5:34 am
Madhusvaram గారి ప్రశంసకు ధన్యవాదం. వెబ్ పత్రికకు ఉన్న ఆడియో తదితర సదుపాయాలను ఉపయోగించుకుని ఇటువంటి వ్యాసాలను రాస్తే అర్థం చేసుకోవడం సులువు. ఈ విషయంలో సంపాదకవర్గంవారు తీసుకున్న శ్రద్ధా, వారు పడిన శ్రమా కూడా చెప్పుకోదగ్గవే. చదివేవారికి తగినంత ఆసక్తి ఉన్నట్టయితే సంగీతాన్ని పరిచయం చేసే మరిన్ని వ్యాసాలను రాయవచ్చు.
గాయక గంభీరుడు ఉస్తాద్ అమీర్ ఖాన్ గురించి madhuraswaram అభిప్రాయం:
09/07/2007 11:59 pm
అద్భుతం రోహిణి ప్రసాద్ గారు. సి.ఎస్ . రావు గారితో నేను పూర్తి గా ఏకీభవిస్తున్నాను.
కీబోర్డ్ మీద రాగాలు గురించి madhuraswaram అభిప్రాయం:
09/07/2007 11:41 pm
శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారికి
ఈ వ్యాసం ఔత్సాహిక కళాకారులందరికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ప్రసాద్ గారు చాల అద్భుతంగా విపులీకరించారు. రాగాలకు సంబందించి సినిమా పాటలు సేకరించటం , మళ్లీ వాటికి సంబందించిన శాస్త్రీయ సంగీత కీర్తనలు సేకరించి అన్నింటిని ఒక దగ్గర కూర్చి ఒక వ్యాసం లో రాయటం ఇది చదువుతున్నంత సులభం కాదు. ఒక సంగీత కళాకారుడిగా నాకు తెలుసు ఇది చాల శ్రమతో కూడిన పని . రోహిణిప్రసాద్ గారు అభినందనీయులు .
అరణ్య కవితలు గురించి Alok అభిప్రాయం:
09/07/2007 10:42 pm
ఓహో మీరు క్రిష్న గారు కాదా? కానీ మీరిద్దరూ గుంటూరు శేషేంద్రశర్మ గారినే ఉటంకిస్తారా? “వాక్యాలన్నిటినీ ఒకే పేరాలో వ్రాయకుండా విరిచేసి నాలుగో ఐదో పంక్తుల కట్టలు కొన్ని చదవడానికి పడేశారు. అలా నింపడమేనా కవిత్వం అంటే? ” అని క్రిష్న గారంటే “అసంపూర్తిగా వదిలేసిన వాక్యం వచనం కాకుండా, కవిత్వం అయిపోతుందా” అని మీరడిగారు. ఇద్దరి వాదనలూ అర్ధరూపాయి గాదు రెండు పావలాలన్నట్టే వుంది !! సర్లేండి మీరిద్దరూ ఒకటా వేరా అన్నది దండగమారి విషయం.
“కవిత్వానికి లాజిక్కు అక్కరలేదా? ”
మీలాంటి లోతైన అధ్యయనశీలి కం పాఠకుడు ఇట్టాంటి ఉబుసుపోని ప్రశ్న వెయ్యడం విచారకరం. లాజిక్కు లేనిదంతా కవిత్వమా అన్న ప్రశ్నలో మీ భోళాతనం, నేటి తెలుగు సాహిత్య పాఠకుని దివాలాతనం కనపడుతోంది. సంతా సింగు బంతాసింగు జోకుల్ని కూడా అద్భుతమైన కవిత్వం అనే మరో తరం త్వరలోనే పుట్టుకొచ్చే సూచనలు కనపడుతున్నాయ్.
కవిత్వానికి లాజిక్కు బద్ధశతృవు. సృజనాత్మకతకు లాజిక్కే పునాదైతే క్రిష్న గారు ఇక్కడే వున్న రవిశంకర్ గారి కవితలో “అద్భుతమైన చిత్రా”న్ని ఎట్లా చూడగలిగారో లాజికల్ గా చెప్పమనండి. పూలదోసిళ్లతో చెట్లు నీళ్ళు పట్టుకోడమేవిటి? చలిగాలి మనసుని కోయడమేవిటని కవిగారు వచ్చి లాజికల్ గా వివరించనివ్వండి. ఇంత లాజికల్ సర్కసూ జరిగాక కవిలోనూ, పాఠకునిలోనూ సున్నితత్త్వం, సృజన బతికుంటుందో లేదో మీరొచ్చి చెప్పండి.
“ఇందువల్లే మన భాషకి అధోగతి పడుతోంది” అని క్రిష్న గారు అసంబధ్ధంగా బాధ పడగాలేంది నేనేసిన ప్రస్న ఎట్లా అసంబద్ధం మాబా గారూ? ఈ కవితలో కవెక్కడా భాషని చట్టుబండలు కానివ్వలేదే? ఇక్కడెవరో “అల్లాష్టకం” అని రాస్తే గౌ. సంపాదకులు గారు దాన్ని కవిత్వం కింద జమకట్టారు. ఆ అల్లాష్టకం కంటే ఈ కవితేమీ ఘోరంగా లేదే? మరి క్రిష్న గారు సడెన్ గా భాష గురించి కిందా మీదా పడ్డం అవసరమేనా? సంబద్ధమేనా?
ముందు వీటికి సూటిగా ఇద్దరూ కూడబలుక్కుని సమాధానాలివ్వండి. సెలయేటి అలల గురించి చెప్పడం ఆనక….
చివరగా, రాగాల గురించి తెల్సుకొన్నవారు సంగీతాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలరు. పాడాలని వుంది కార్యక్రమంలో పాల్గొన్న 10 ఏండ్ల పాపకు కూడా ఈ సంగతి తెల్సును.