మీ అభిమానానికి కృతజ్ఞతలు. భావి తరాల గురించి ప్రస్తావించారు కనుక:
మా ఊరు, రావినూతల, వెళ్ళినపుడల్లా, హైస్కూలు కెళ్ళడం, టీచర్లని కలవడం, పిల్లలనుద్దేశించి ప్రసంగించడం, నా పర్యటనలో ఓ ముఖ్యమైన నాకు చాలా ఇష్టమైన భాగం. నేను ఇండియా వెళ్ళి మొన్ననే తిరిగివచ్చాను. ఆ అనుభవం గురించి, చదువుకి సంబంధించి, ఓ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.
1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.
మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]
మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.
వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.
మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.
శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.
రమ గారికి,
మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.
బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.
జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.
[2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.
మీరు సాహిత్యరంగం లోపలి వారు కారు గనక, మీకు “వైతాళికులు” పుస్తకం లోని కవయిత్రులని గురించి తెలియదన్నారు. బైరాగి గురించి ఎలా మాట్లాడ గలిగేరో..రేవతీదేవి గురించి ఎలా మాట్లాడ గలిగేరో….అలాగే వైతాళికులు లోని కవయిత్రులని గురించి కూడా మీరు మాట్లాడగలరు. చైతన్యం కల్గిన పాఠకులు గనక. కాకుంటే అలా మాట్లాడాలని అనుకోవాలి ముందు.
చాలా మందికి చావలి బంగారమ్మ గారి పేరు పరిచయం కాక పోయినా..ఆమె రాసిన బహు చక్కని కవిత్వం తెలియక పోయినా…అది సాహిత్య విమర్శకుల పొరపాటే !! దేవులపల్లి వెంకట క్రిష్ణశాస్త్రి గారి తో సరిసమానమైన ధీటైన గేయాలు రాసినవారు బంగారమ్మ గారు…”వైతాళికులు” లో!! మరి ఎంతమందికి ఆవిడ రాసిన గేయాలతో పరిచయం ఉందివాళ?? ఆమె కవితల విడి సంపుటి గురించిన ఊసైనా ఎవరికి తెలుసు?? వాటిలోని అందాలని విశ్లేషించిన వారేరీ?? పురుషుల చేతి లో ఒక అస్త్రంగా పనిచేసిన “విమర్శ” ఇలా ఎందరి స్త్రీల అద్భుత కల్పనా ప్రపంచాలని చిన్న చూపు చూసిందో తెలిసినప్పుడు కదా..విమర్శనా రంగం..ఎంత సంకుచితత్వం తో ప్రవర్తించిందీ స్పష్టపడేదీ??
మంచి కల్పనని దర్శించవచ్చు…అందుకు మన మనసు కిటికీలు తెరుచుకోవాలి …ఏ భేద భావమూ అడ్డురాకుండా !!
smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.
“వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.
Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!
ముస్లిం అస్తిత్వంతో స్మైల్ ముందుమాటలు రాసిన పుస్తకాలలో కొన్నిటివయినా పేర్లివ్వమని మనవి. వాటిని చదివి పాఠకులు ఆయనలో వచ్చిన మార్పు మంచికో చెడుకో, కొంతవరకైనా బేరీజు వేసుకునే వీలుంటుంది.
ఫెమినిజం ప్రస్తావనలో బాబ్జీలు గారన్న పై మాటలు నన్ను కొన్నాళ్ళు వెంటాడాయి – ఎవరీ లూషన్, ఏమా కథ? అని. Lution, Lotion, Lushan, లాంటి పేర్లతో ప్రయత్నించాను గాని ఫలితం లేదు..
నాలుగయిదు రోజులుగా అమితమైన చలి మూలాన ఇంట్లో బందీనై, పుస్తకాలు తిరగేస్తుంటే, గుడిపాటి కిటికీ (సాహితీమూర్తుల తేజోరేఖలు) కనిపించింది. దాంట్లోని ఒక వ్యాసం, “చైనా అంతరాత్మ లూషన్”! హమ్మయ్య అనుకున్నాను.
“సాహిత్యకారులకు చైనా పేరు చెప్పగానే లూషన్ స్ఫురణకొస్తారు. లూషన్ రచనలని చాలావరకు తెలుగులో చదువుకున్నాం. మనకు రష్యన్ సాహిత్యం తర్వాత విస్తృతంగా తెలుగులోకి అనువాదమైంది చైనా సాహిత్యం.”
అన్న ప్రారంభం చదివి, కనీసం పేరయినా తెలియనందుకు సిగ్గేసిందనుకోండి. ఈ లూషన్ చైనాలో బాగా పేరున్నవాడట. ఇబ్సెన్ నాటకం, A Dollhouse వచ్చిన తర్వాత సంచలనమైన వ్యాసం, “What will Happen after Nora Leaves Home?” రాశాడట.
ఇక్కడ ఆయన రచనలు అంత సులభంగా దొరికేటట్లు లేవు. విజయవాడలో జరగబోయే పుస్తకాల పండగలో దొరుకుతాయేమో చూడాలి. బాబ్జీలు గారికి కృతజ్ఞతలతొ,
స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!
స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:
“… రెప్పలు మూయని కళ్ళు వెయ్యి చావులు శపించాయో.
హాయి హాయిగా వున్న గాలికి, పల్చ పల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరు హోరుగా వున్న సముద్రానికి, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికి తెలిసి వుండాలి.
తెలియకపోయీ వుండాలి.”
చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:
And that inverted Bowl we call The Sky,
Whereunder crawling coop’t we live and die,
Lift not thy hands to It for help – for It
Rolls impotently on as Thou or I.
2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.
చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 6:58 am
తహ తహ గారికి,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. భావి తరాల గురించి ప్రస్తావించారు కనుక:
మా ఊరు, రావినూతల, వెళ్ళినపుడల్లా, హైస్కూలు కెళ్ళడం, టీచర్లని కలవడం, పిల్లలనుద్దేశించి ప్రసంగించడం, నా పర్యటనలో ఓ ముఖ్యమైన నాకు చాలా ఇష్టమైన భాగం. నేను ఇండియా వెళ్ళి మొన్ననే తిరిగివచ్చాను. ఆ అనుభవం గురించి, చదువుకి సంబంధించి, ఓ వ్యాసం రాయడానికి ప్రయత్నిస్తాను.
కొడవళ్ళ హనుమంతరావు
స్మైల్ – ఓ జ్ఞాపిక గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 6:44 am
మోహన గారికి,
1985లో వడ్డెర చండీదాస్ “ప్రియమైన మో” అని సంబోధిస్తూ ఉత్తరం రాయడంతో వేగుంట మోహన ప్రసాద్ కేవలం ‘మో’ గా స్థిరపడిపొయ్యాడు. తెలుగు, పాశ్చాత్య సాహిత్యాలని లోతుగా అధ్యయనం చేసిన కవి. మొదటి కవితా సంపుటి, చితి-చింత, తోనే పేరు తెచ్చుకున్నాడు. ఇతర దేశాల కవులని “కరచాలనం” వ్యాసాల ద్వారా తెలుగువాళ్ళకి పరిచయం చేశాడు. ఇంకా చాలా రాశాడు. పోయిన సంచికలోనే ఆయన “నిరాకారుడు” కవితని వేలూరి చవకరకం జిన్ అండ్ టానిక్ గా అభివర్ణిస్తే నేను మంచి కవితగా సమర్థించాను.
మో కి విమర్శకులు ఎక్కువే. కాని, “ఈ కవిత్వ కషాయం వికటిస్తుంది,” అని విమర్శించినాయనే “నిరంతర ‘మో’హనరాగం” ఆలాపించే ఈ కవి మన మధ్యనే ఉన్నందుకు గర్వపడాలనడం గమనార్హం. [1]
కొడవళ్ళ హనుమంతరావు
[1] “వ్యాసాలు, ద్వేషాలు,” సౌభాగ్య. 2004.
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 6:14 am
సూర్యుడు గారికి,
మీ వ్యాఖ్య చదివి, హమ్మయ్య, ఒక్కరైనా నా వ్యాసం చదివారు, శ్రమ నిరర్థకం కాలేదు, అన్న సంతోషం కలిగింది.
వాస్తవానికి, నేనీ వ్యాసం ముగించి, గత శతాబ్దంలో గణితశాస్త్రంలో వచ్చిన మూడు విపత్తులని సగటు పాఠకునికి వివరించడంలో విఫలమయ్యాననే నాకు నేను బేరీజు వేసుకున్నాను. మరీ మిక్కిలి అమూర్త (abstract) విషయాలని వివరించడంలో కలిగే చిక్కులు నాకెక్కువే ఎదురయ్యాయి. అయినా దీని వలన కొంత మేలు జరిగిందనీ, ముందు ముందు మీలాంటి వారెవరైనా ఇంకా సరళంగా చెప్పగలరనీ ఆశ.
మీరు ప్రస్తావించిన పుస్తకం నేను చదవలేదు కాని చదవదగ్గదిలా ఉంది. అందరూ మీరిచ్చిన లింకులోని పరిచయం అన్నా చదువుతారని ఆశిస్తాను. నేనీ వ్యాసం రాసే సమయంలోనే, గణితంలో నోబెల్ బహుమతి లేదని తెలిసి ఒకరు నా ముందర విస్మయపడితే, ఆమాత్రం తెలియని ఇంజనీర్లు ఉన్నారా అనుకొని అవాక్కయ్యాను.
కొడవళ్ళ హనుమంతరావు
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
01/27/2009 5:42 am
అరుణ గారికి,
శిలాలోలిత పుస్తకంలో రేవతీదేవి ఇంటి పేరివ్వనందున నేనూ దానిని ప్రస్తావించలేదు. కాని మీరన్న విన్నకోట ఆవిడ పుట్టింటి పేరూ కాదు, మెట్టింటి పేరూ కాదు – పుస్తకాన్ని అంకితం చేసింది తండ్రి యన్. సి. రాజారెడ్డి గారికి; భర్త డి. రఘురామిరెడ్డి. ఈ మధ్యనే నిడదవోలు మాలతి గారు మన దృష్టికి తెచ్చిన ఒక పుస్తకం [1] లో ఆవిడని నిడుమానూరి రేవతీదేవి గా పరిచయం చేశారు.
రమ గారికి,
మీ అభిశంసనా పూరక ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. రచ్చబండలో అప్పట్లో కాస్త ఎక్కువగానే వాదోపవాదాలు చేసి ఘర్షణ పడేవాణ్ణి. వాటిల్లో ఒకదానిని, వ్యాసంగా రాసి మాకు పంపగూడదా అని వేలూరి, కొలిచాల అడిగితే హడావిడిగా పంపిన రచన ఇది. నాలాంటి పాఠకులు రాయగలరేమో కాని, సాహిత్యంలో కొంత సాధికారికతగలవాళ్ళు రాస్తేగాని ఈ కవయిత్రులకి న్యాయం జరగదు.
బంగారమ్మని ప్రస్తావించారు కనుక ఓ ముచ్చట చెప్తాను. ముద్దుకృష్ణ మూలంగా ఆవిడ పేరు తెలుసు కాని, ఈ వ్యాసం రాసేముందర నేనావిడ కవిత్వాన్ని అంతగా పట్టించుకోలేదు, వెల్చేరు గారి Hibiscus చూసింతర్వాతే నాకావిడ మీద ఆసక్తి కలిగింది. దాంట్లోనే ఉన్న My Brother మూలం వెంటనే దొరకలేదు. తర్వాత కొన్నాళ్ళకి జనవరి 2006లో శేషశాయి గారు ఆవిడ కవితా సంచికని ఆంధ్రభారతిలో పెట్టి రచ్చబండలో చెప్పారు. అందుమూలంగానే ఆవిడ కొంపెల్ల జనార్దనరావు సోదరి (అక్కో చెల్లెలో ఎందుకు చెప్పరు?!) అని తెలిసింది. అప్పుడు మా ఆవిడ నన్నడిగింది – “మరి శ్రీశ్రీ అనంతంలో ఆ విషయం చెప్పలేదా?” అని. “జనార్దనరావు జ్ఞాపకాలు” అంటూ శ్రీశ్రీ చాలానే రాశాడు కాని ఈ విషయం చెప్పిన గుర్తులేదు.
జ్ఞాపకాలంటే, ఆచంట జానకిరామ్ [2] కొంపెల్ల జనార్దనరావు స్వగ్రామం, అమలాపురం దగ్గర గంగలకుర్రు వెళ్ళి, ఆ ఊరిని వర్ణించి బంగారమ్మ కొత్తగా రాసిన “నీడ” (Hibiscus on the Lake) ఆవిడ చదివితే విని పరవశించడం గుర్తొస్తుంది. ఆవిడ జనార్దనరావుకి అక్క అన్నారు ఆచంట. My Brother కి మూలం “మా అన్న.” పేరుకి తగ్గ కవయిత్రి బంగారమ్మ.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “Women Writing in India: 600 BC To the Present,” Volume II: The 20th Century. Edited by Susie Tharu and K. Lalita. Oxford India Paperbacks, 1993.
[2] ఆచంట జానకిరామ్ “సాగుతున్న యాత్ర.” దీనిని “నా స్మృతిపథంలో” తో కలిపి జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు వారు 2008లో ప్రచురించారు. పేజీలు 230-231.
శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama అభిప్రాయం:
01/19/2009 4:39 am
హనుమంతరావు గారూ !!
మీరు సాహిత్యరంగం లోపలి వారు కారు గనక, మీకు “వైతాళికులు” పుస్తకం లోని కవయిత్రులని గురించి తెలియదన్నారు. బైరాగి గురించి ఎలా మాట్లాడ గలిగేరో..రేవతీదేవి గురించి ఎలా మాట్లాడ గలిగేరో….అలాగే వైతాళికులు లోని కవయిత్రులని గురించి కూడా మీరు మాట్లాడగలరు. చైతన్యం కల్గిన పాఠకులు గనక. కాకుంటే అలా మాట్లాడాలని అనుకోవాలి ముందు.
చాలా మందికి చావలి బంగారమ్మ గారి పేరు పరిచయం కాక పోయినా..ఆమె రాసిన బహు చక్కని కవిత్వం తెలియక పోయినా…అది సాహిత్య విమర్శకుల పొరపాటే !! దేవులపల్లి వెంకట క్రిష్ణశాస్త్రి గారి తో సరిసమానమైన ధీటైన గేయాలు రాసినవారు బంగారమ్మ గారు…”వైతాళికులు” లో!! మరి ఎంతమందికి ఆవిడ రాసిన గేయాలతో పరిచయం ఉందివాళ?? ఆమె కవితల విడి సంపుటి గురించిన ఊసైనా ఎవరికి తెలుసు?? వాటిలోని అందాలని విశ్లేషించిన వారేరీ?? పురుషుల చేతి లో ఒక అస్త్రంగా పనిచేసిన “విమర్శ” ఇలా ఎందరి స్త్రీల అద్భుత కల్పనా ప్రపంచాలని చిన్న చూపు చూసిందో తెలిసినప్పుడు కదా..విమర్శనా రంగం..ఎంత సంకుచితత్వం తో ప్రవర్తించిందీ స్పష్టపడేదీ??
మంచి కల్పనని దర్శించవచ్చు…అందుకు మన మనసు కిటికీలు తెరుచుకోవాలి …ఏ భేద భావమూ అడ్డురాకుండా !!
రమ.
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి rama అభిప్రాయం:
12/30/2008 10:30 pm
తప్పకుండా హనుమంతరావు గారూ !
smile “గౌరవ సంపాదకత్వం” వహించిన “వతన్” ముస్లిం కథలు…అలాగే “అజాఁ” అన్న గుజరాత్_ముస్లిం కవిత్వం కి 23/9/2002 న,రాజమండ్రి నించి స్మయిల్ రాసిన ముందుమాట చదవండి.
“వీళ్ళేం ‘దండోరా’ లు వేయించుకుంటారు. వీళ్ళేం వీధుల్లోకి వచ్చి ఊరేగింపులు జరుపుతారు అంటూ, … బ్రాహ్మణుల మీద…వాళ్ళని soft target చేయడం చాలా తేలిక అన్న సానుభూతితో మాట్లాడిన smile ‘వతన్’కి ఖాజా రాసిన దాన్ని (ఆ పుస్తకానికి “గౌరవసంపాదకుని”గా ఖాజా రాతల్లోని) బ్రాహ్మణ నిందని ఒప్పుకోవడంతో పాటు, తానుగా ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని రాసిన దాన్లో అయితే ఖాజాని మించి ‘అగ్రవర్ణాల’పై కోపం చూపించే దిశగా కదలడాన్ని గమనించవచ్చు.
Gujarat riots గానీ …మొన్న తాజ్..నారిమన్ హౌస్ ల మీద ముస్లిం terrorists దాడి గాని ఎవరూ మెచ్చగలిగినవి కాకపోయినా, గుజ్రాత్ హింస మీద అచ్చులో వచ్చినన్ని పుస్తకాలు terrorists హింసని వ్యతిరేకిస్తూ ఒక్క పుస్తకమూ కనీసం తెలుగులో వీళ్ళెవ్వరూ ప్రచురించకపోవడం కూడా మనం గమనించవలసిన విషయాలే !!
రమ.
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/30/2008 7:50 am
రమ గారికి,
ముస్లిం అస్తిత్వంతో స్మైల్ ముందుమాటలు రాసిన పుస్తకాలలో కొన్నిటివయినా పేర్లివ్వమని మనవి. వాటిని చదివి పాఠకులు ఆయనలో వచ్చిన మార్పు మంచికో చెడుకో, కొంతవరకైనా బేరీజు వేసుకునే వీలుంటుంది.
కొడవళ్ళ హనుమంతరావు
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/22/2008 6:59 pm
చెప్పడం మరిచాను. లూషన్ అంటే Lu Xun.
A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/22/2008 5:21 pm
“లూషన్ చెప్పింది అక్షరలక్షలు కదా?”
ఫెమినిజం ప్రస్తావనలో బాబ్జీలు గారన్న పై మాటలు నన్ను కొన్నాళ్ళు వెంటాడాయి – ఎవరీ లూషన్, ఏమా కథ? అని. Lution, Lotion, Lushan, లాంటి పేర్లతో ప్రయత్నించాను గాని ఫలితం లేదు..
నాలుగయిదు రోజులుగా అమితమైన చలి మూలాన ఇంట్లో బందీనై, పుస్తకాలు తిరగేస్తుంటే, గుడిపాటి కిటికీ (సాహితీమూర్తుల తేజోరేఖలు) కనిపించింది. దాంట్లోని ఒక వ్యాసం, “చైనా అంతరాత్మ లూషన్”! హమ్మయ్య అనుకున్నాను.
“సాహిత్యకారులకు చైనా పేరు చెప్పగానే లూషన్ స్ఫురణకొస్తారు. లూషన్ రచనలని చాలావరకు తెలుగులో చదువుకున్నాం. మనకు రష్యన్ సాహిత్యం తర్వాత విస్తృతంగా తెలుగులోకి అనువాదమైంది చైనా సాహిత్యం.”
అన్న ప్రారంభం చదివి, కనీసం పేరయినా తెలియనందుకు సిగ్గేసిందనుకోండి. ఈ లూషన్ చైనాలో బాగా పేరున్నవాడట. ఇబ్సెన్ నాటకం, A Dollhouse వచ్చిన తర్వాత సంచలనమైన వ్యాసం, “What will Happen after Nora Leaves Home?” రాశాడట.
ఇక్కడ ఆయన రచనలు అంత సులభంగా దొరికేటట్లు లేవు. విజయవాడలో జరగబోయే పుస్తకాల పండగలో దొరుకుతాయేమో చూడాలి. బాబ్జీలు గారికి కృతజ్ఞతలతొ,
కొడవళ్ళ హనుమంతరావు
స్మైల్ ఒఖడే… ఇహ లేడు! గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
12/09/2008 10:43 pm
ఖాళీ సీసాల స్మైల్
స్మైల్ చనిపోయారంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ “ఖాళీ సీసాలు” చదివాను. అది స్మైల్ రాయడం మొదలెట్టిన ఒకటి రెండేళ్ల లోపునే, 1965లో రాసిన కథ. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్ళు నిండిన సందర్భంగా, సాహిత్య అకాడెమీ (వాకాటి, వేదగిరి) కూర్చిన “బంగారు కథలు” లో పొందుపరచిన కథ. బెడ్ టైమ్ రీడింగ్ కి పనికిరాని కథ!
స్మైల్ కవిత్వం ఏమీ నేను చదవలేదు కాని, ఆ కథ ముగింపు:
చదివిన వెంటనే రెండేళ్ళ క్రితం ఓ సైన్సు వ్యాసంలో చూసిన ఒమర్ ఖయ్యాం కవిత గుర్తొచ్చింది:
2006లో ఇండియా వెళ్ళినప్పుడు, అప్పుడే మో, స్మైల్ ఇరువురి సంపాదకత్వాన వెలువడిన “కొమ్మలు రెమ్మలు” చూశాను. “ప్రపంచీకరణ, వాణిజ్యీకరణలకు బలయిపోతున్న ఆంధ్రదేశపు యువతీయువకులకు వారి తెలుగు నేలలో మొలిచిన మహా వృక్షాలనీ, వాటి కొమ్మల్నీ రెమ్మల్నీ పిందెల్నీ పువ్వుల్నీ కాయల్నీ,” పరిచయం చేసే పుస్తకం. స్మైల్ కొమ్మని కూడా వారి మిత్రులు మిగిలిన వాళ్ళకి అందుబాటులోకి తెస్తారని ఆశిద్దాం.
చివరగా, పాశ్చాత్య పత్రికల్లో లాగా మరణ వార్తలో వయసు ఇవ్వడం మనకు ఆనవాయితీ కాదు లాగుంది. స్మైల్ మరణం గురించి నాలుగయిదు చోట్ల చదివాను. ఎక్కడా ఆయన వయసు ఇవ్వలేదు. “బంగారు కథలు” ప్రకారం స్మైల్ పుట్టింది 1942లో. పండు వయసు రాకమునుపే ముగిసిన జీవితం.
కొడవళ్ళ హనుమంతరావు.